'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం' | ysr congress party to solve kolleru lake problem, says thota chandrasekhar | Sakshi
Sakshi News home page

'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం'

Apr 20 2014 1:53 PM | Updated on Aug 14 2018 4:21 PM

'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం' - Sakshi

'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం'

తమ పార్టీ అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏలూరు వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ హామీయిచ్చారు.

దెందులూరు: తమ పార్టీ అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏలూరు వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ హామీయిచ్చారు. కొల్లేరు ప్రజల జీవన గతులు మెరుగుపరిచేందుకే ఈ అంశాన్ని వైఎస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.

చంద్రబాబు వల్లే కొల్లేరు ప్రజలకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని గుడివాకలంక, పైడిచింతపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement