అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లిలో టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
అనంతపురం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లిలో టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలకు ఎన్నికల సిబ్బంది సహకరిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలిపారు. మరోవైపు రామగిరి, బుక్కపట్నం, నల్లచెరువులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముందస్తు అరెస్ట్ల పేరుతో పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలను, కార్యకర్తలను నిర్బంధించారు. ఇక తలుకుల మండలంలో పోలింగ్ ప్రారంభం కాలేదు.