కామ్రేడ్‌ శ్రీరాముల అంతిమ యాత్ర | sriramulu anthima yatra in roddam | Sakshi
Sakshi News home page

కామ్రేడ్‌ శ్రీరాముల అంతిమ యాత్ర

Sep 24 2016 11:54 PM | Updated on Sep 4 2017 2:48 PM

కామ్రేడ్‌ శ్రీరాముల అంతిమ యాత్ర

కామ్రేడ్‌ శ్రీరాముల అంతిమ యాత్ర

ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేస్తూ మండల ప్రజల మన్ననలు పొందిన సీఐటీయూ మండల క్యారదర్శి శ్రీరాముల అంతిమయాత్రలో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రొద్దం : ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేస్తూ మండల ప్రజల మన్ననలు పొందిన సీఐటీయూ మండల క్యారదర్శి శ్రీరాముల అంతిమయాత్రలో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ నుంచి మండలంలోని పురవీధుల్లో శనివారం అంతిమ యాత్ర చేపట్టారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి రొద్దం నరసింహులు, మండల కన్వీనర్‌ బి.నారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మినారాయణరెడ్డి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ నరహరిప్రసాద్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్, నర్సింగరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాంభూపాల్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు హనుమంతరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్, జిల్లా కార్యదర్శి వెంకటేశులు, పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు శ్రీరాములు మతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మతుడి కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement