లేత‘చిరుత’లకు ఊతంగా.. | special training in schools | Sakshi
Sakshi News home page

లేత‘చిరుత’లకు ఊతంగా..

Dec 12 2016 10:44 PM | Updated on Sep 4 2017 10:33 PM

లేత‘చిరుత’లకు ఊతంగా..

లేత‘చిరుత’లకు ఊతంగా..

వర్తమాన ప్రపంచంలో మేటి క్రీడాతారలుగా వెలుగొందుతున్న వారిలో ప్రతిభ ముడి వజ్రం వంటిదైతే.. ప్రభుత్వాలో, వ్యక్తులో, సంస్థలో ప్రోత్సహించడం వల్లే అది విజయాల మెరుగులీనిందన్నది.. మోటారు వాహనం సరికొత్తదైనా ఇంధనం లేని పరుగిడలేదన్నంత యథార్థం.

  • ‘ఇండియన్‌ స్పీడ్‌ స్టార్‌’ ప్రాజెక్టు
  • పాఠశాల స్థాయి నుంచే ‘పరుగు మెరిక’లకు ప్రత్యేక శిక్షణ l
  • 2020, 2024 ఒలింపిక్స్‌లే లక్ష్యం
  • అమలాపురం :
    వర్తమాన ప్రపంచంలో మేటి క్రీడాతారలుగా వెలుగొందుతున్న వారిలో ప్రతిభ ముడి వజ్రం వంటిదైతే.. ప్రభుత్వాలో, వ్యక్తులో, సంస్థలో ప్రోత్సహించడం వల్లే అది విజయాల మెరుగులీనిందన్నది.. మోటారు వాహనం సరికొత్తదైనా ఇంధనం లేని పరుగిడలేదన్నంత యథార్థం. మానవవనరుల పరంగా శిఖరాగ్రాలన ఉన్న భారతదేశం క్రీడావిజయా ల పరంగా అగాధంలో ఉండడానికి కారణం పాటవం కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం కొరవడడమే. ఈ నేపథ్యంలోనే.. దశాదిశ లేని పాఠశాల స్థాయి క్రీడలకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ,  నేషనల్‌ యువ కో ఆపరేటివ్‌ సొసైటీ (ఎ¯ŒSవైసీఎస్‌) కలిసి కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఇండియ¯ŒS స్పీడ్‌ స్టార్‌ (ఐఎస్‌ఎస్‌)’ పథకం పరుగుల క్రీడకు ఓ వరం కానుంది. కనీస సదుపాయాలు లేకున్నా తమ ప్రతిభా పాటవాలతో రాణిస్తున్న పాఠశాల క్రీడాకారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దీనికి ఎంపికైతే రానున్న ఒలింపిక్స్‌లో ‘దౌడు’ తీసే సువర్ణావకాశం వారి తలుపు తట్టనుంది.
    అంచెలంచెలుగా దూసుకుపోయే అవకాశం..
    2020, 2024లలో జరిగే ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఐఎస్‌ఎస్‌ను తెరమీదకు తెచ్చింది. దీనిలో భాగంగా పరుగులో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసేందుకు తెరదీసింది. పాఠశాల స్థాయిలో, జో¯ŒS స్థాయిలో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచినవారిని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో ఉన్న 13 జోన్ల నుంచి అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో బాలబాలికలను విడిగా ఎంపిక చేస్తారు. వీరందరికీ ఈనెల 15న విశాఖ పోర్టు స్టేడియంలో నిర్వహించే ఐదు జిల్లాల (ఉభయ గోదావరులతోపాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) పరిధిలో పోటీలు నిర్వహిస్తారు. గెలిచినవారు త్వరలో బెంగళూరులో జరిగే సౌత్‌ జో¯ŒS పోటీల్లో పాల్గొంటారు. అక్కడ కూడా విజయం సాధించిన వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారికి 2020, 2024ల్లో జరిగే ఒలింపిక్స్‌ పోటీలకు శిక్షణ ఇస్తారు. అప్పటి వరకూ వారికి సాధనకు అయ్యే ఖర్చుతోపాటు, చదువు, ఇతర సౌకర్యాలను ఎ¯ŒSవైసీఎస్‌ చూసుకుంటుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వసంస్థ గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (గెయిల్‌) సహకారం అందిస్తోంది. ప్రస్తుతం మన జిల్లాలో జోనల్‌ గ్రిగ్‌ పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీల నుంచి 234 మందిని ఆయా విభాగాలకు ఎంపిక చేసి విశాఖలోని ఐదు జిల్లాల పోటీలకు పంపనున్నారు.
     
    అరుదైన అవకాశం 
    పాఠశాల క్రీడాకారులకు ఇది అరుదైన అవకాశం. జోనల్‌ స్థాయి పోటీలో విజేతలు జిల్లాస్థాయిలో నిలిచిపోతున్నారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేష¯ŒS ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ)లో జాతీయస్థాయి ఎంపిక వరకు మాత్రమే ఉంది. కాని ఇండియ¯ŒS స్పీడ్‌ స్టార్‌కు ఎంపికైతే ఏకంగా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశముంది. 
    – పప్పుల శ్రీరామచంద్రమూర్తి, ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, అమలాపురం 
     
    వివరాలు నమోదు చేయించాలి..
    జోనల్‌ గ్రిగ్‌ పోటీల్లో 100, 200, 400 మీటర్ల పరుగులో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన బాలబాలికలు విశాఖలో జరిగే ఐదు జిల్లాల పోటీల్లో పాల్గొనే అవకాశముంది. పాఠశాలల పీడీలు, పీఈటీలు  వివరాలు వెంటనే నమోదు చేయించుకోవాలి. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఇండియ¯ŒS స్పీడ్‌ స్టార్‌ ఒక సువర్ణావకాశం.
    – కె.రామకృష్ణ, ఎ¯ŒSవైసీఎస్‌ ఏరియా కో–ఆర్డినేటర్‌
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement