ఎరువుల గోదాముపై తూ.కో దాడులు | official attacks on fertilizers shops | Sakshi
Sakshi News home page

ఎరువుల గోదాముపై తూ.కో దాడులు

Nov 5 2016 10:17 PM | Updated on Oct 1 2018 6:38 PM

ఎరువుల గోదాముపై తూ.కో దాడులు - Sakshi

ఎరువుల గోదాముపై తూ.కో దాడులు

రాప్తాడు మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలోని అవంతి ఎరువుల గోదాముపై తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

అనంతపురం సెంట్రల్‌ : రాప్తాడు మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలోని అవంతి ఎరువుల గోదాముపై తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. జైకిసాన్‌ కంపెనీ చెందిన  20–20–0–13, 20–0–13 రకాల ఎరువులు బస్తాల్లో భారీగా తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి బస్తాలో ఐదు కిలోలు తక్కువ ఉన్నట్లు తనిఖీలో తేలిందని సీఐ వివరించారు.

అలాగే ఎమ్మార్పీ, తయారీదారుడి చిరునామా తదితర వివరాలు ఏవీ లేకుండా  విక్రయిస్తున్నారన్నారు. వీటన్నింటినీ సీజ్‌ చేసి, కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే అనంతపురం రూరల్‌ మండలంలో పలు గ్రామాల్లో చౌకడిపోలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ముగ్గురు డిపో డీలర్లపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement