ఎన్టీఆర్ సుజల స్రవంతికి పవర్ కట్ | ntr sujala sravanthi water plant closed due to not paying power bill | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సుజల స్రవంతికి పవర్ కట్

Dec 3 2015 4:10 PM | Updated on Sep 3 2017 1:26 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ గుంటూరు జిల్లాలో మూతపడింది.

వినుకొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ గుంటూరు జిల్లాలో మూతపడింది. వినుకొండలోని ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను గురువారం తెరవలేదు.

విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో వినుకొండ ఎలక్ట్రికల్ ఏఈ కరెంటు సరఫరా నిలిపివేయడంతో ప్లాంట్ మూసివేశారు. దీంతో మంచి నీరు దొరక్క స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ ప్లాంట్కు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement