తిరుపతి, న్యూస్లైన్: శ్రీవారి కల్యాణోత్సవాల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై టీటీడీ స్పందించిం ది. కల్యాణోత్సవాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిం చింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ కల్యాణోత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్క ర్ చర్యలు చేపట్టారు. ఈ మేరకు కల్యాణోత్సవం ప్రాజె క్టు, కల్యాణాల నిర్వహణపై జేఈవో అధ్యక్షతన శనివా రం శ్వేత భవనంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. కల్యాణోత్సవాల నిర్వహణకు ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించా రు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఆయా సంస్థలపై పరిశీలన, వేదిక ఖరారు, నిర్వహణ, కల్యాణోత్సవ అనంతరం ఖర్చు తదితర అంశాలపై పర్యవేక్షిం చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమి టీ సూచన మేరకే కల్యాణోత్సవాన్ని ఖ రారు చేస్తారు. డొనేషన్ ఎవరి నుంచి తీసుకోవాలి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అలాంటివాటిని పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణరుుంచారు. డొనేషన్ తీసుకునే వారి వివరాలు పూర్తిగా సేకరించి ఏడాది కాలానికి ప్రత్యేక కేలండర్ను రూపొందిస్తారు. దీనికి అనుగుణంగా ఎప్పుడు ఎక్కడ కల్యాణోత్సవం నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. అదేవిధంగా కల్యాణోత్సవం జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కల్యాణోత్సవాల్లో భక్తులు సమర్పించే ప్రతి కానుక టీటీడీ కి అప్పగించాల్సిందేనని అధికారులు సూచించారు.
శ్రీనివాస కల్యాణం, గోవింద కల్యాణాలు వేర్వేరుగా కాకుండా ఒక పేరుతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కల్యాణ నిర్వహణ కేవలం ప్రత్యేక అధికారి కాకుండా టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండాల్సిందేనని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నివేదిక రూపంలో అందజేస్తారు. అనంతరం ఈవో నిర్ణయం మేరకు కల్యాణోత్సవాల నిర్వహణపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు అధికారులు చెప్పారు.
శ్రీవారి కల్యాణాలపై ప్రత్యేక నిఘా
Published Sun, Nov 10 2013 3:26 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement