డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకర్లు
ఇవ్వాల్సిన రుణం రూ.1139కోట్లు
ఐదు నెలల్లో ఇచ్చింది రూ.175కోట్లు
పాత బకాయిల పేరుతో ముఖం చాటేస్తున్న వైనం
రుణమాఫీ పాపం డ్వాక్రా సంఘాలకు శాపమై వెంటాడుతోంది. రుణాలు దొరక్క నిరుపేద మహిళలు మైక్రో ఉచ్చులో పడివిలవిల్లాడుతున్నారు. మాఫీకి మంగళం పాడేసి..ఆర్థిక వెసులుబాటు పేరిట సంఘానికి రూ.30వేల చొప్పున జమ చేసినా బ్యాంకర్లు మాత్రం ముఖం చాటేస్తున్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలంటూ సంఘాల పాలిట సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు.
విశాఖపట్నం: ఏరు దాటే వరకు ఓడ మల్లన్న..దాటాక బోడి మల్లన్న చందంగా గద్దెనెక్కే వరకు మాఫీ జపం పాటించిన టీడీపీ పాలకులు పగ్గాలు చేపట్టిన తర్వాత రుణమాఫీని మాఫీ చేశారు. ఏడాది పాటు ఊరించి ఊరించి చివరకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున సంఘానికి రూ.30వేలుగా జమ చేశారు. ఈ మొత్తంతో పదిరెట్లు రుణం ఇప్పిస్తాం..దాంతో సంఘాలన్నీ బలోపేతమైపోతాయని ఊహలపల్లకిలో ఊరేగించారు. తీరా ఆచరణలో మాత్రం బ్యాంకర్లు వీరికి చుక్కలు చూపిస్తున్నారు. మార్చిలో ప్రకటించిన రుణప్రణాళిక ప్రకారం ఈ ఏడాది జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు రూ.1139 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఈ రుణాలను 24,392 మందికి ఇవ్వను న్నట్టుగా ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై అప్పుడే ఐదు నెలలు గడిచిపోయింది. కేవలం రూ.175కోట్లు మాత్రమే రుణాలివ్వగలిగారు. అది కూడా పాతబకాయిలు చెల్లించినవారికే. ఈ విధంగా రుణాలు పొందిన వారు జిల్లాలో నాలుగువేలకు మించి లేరని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఆర్థికసంవత్సరం ముగియడానికి మిగిలింది ఏడు నెలలే. ఇవ్వాల్సిన రుణ లక్ష్యం సుమారు వెయ్యికోట్ల వరకు ఉంది. ఆర్థిక వెసులుబాటుతో సర్కార్ సమకూర్చిన పెట్టుబడి నిధిపై చిత్తశుద్ధి ఉంటే రుణాలు ఇవ్వొచ్చు. కానీ బ్యాంకర్లు మాత్రం రుణమాఫీ వర్తించని రైతుల మాదిరిగానే వడ్డీతో కొండలా బకాయిలున్న సంఘాల వైపు కన్నెత్తయినా చూడడంలేదు. దీంతో ఎక్కే గుమ్మం..దిగే గుమ్మం అన్నట్టుగా డ్వాక్రా సంఘాల మహిళలు రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా అధికారులు చెప్పేది ఒకటైతే..క్షేత్రస్థాయిలో జరిగేది మరొకటిగా ఉంది. దీంతో రుణాలు వీరికి అందని ద్రాక్షగా మారుతున్నాయి. గతేడాది రుణమాఫీ పుణ్యమాని రూ.755 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా అతికష్టంమీద రూ.200కోట్లకు మించి ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా అదే సీను రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉచ్చు బిగిస్తున్న మైక్రో సంఘాలు
ఇన్నాళ్లు బ్యాంకర్లు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. దీంతో మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు కాళ్లావేళ్లాపడినా వీరి వడ్డీబాదుడుకు జడిసి ఎవరూ వీరి వద్ద రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం వ్యాపార, కుటుంబ అవసరాలు నిమిత్తం మళ్లీ మైక్రో సంఘాల దారి పట్టాల్సి వస్తోంది. ఐదురూపాయలు..పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా తమ అవసరాల కోసం వీర్ని ఆశ్రయించకతప్పని దుస్థితి.
మైక్రో ఉచ్చులో విలవిల
Published Mon, Aug 31 2015 12:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement