విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. టీచర్‌, మాజీ హెచ్‌ఎం అరెస్ట్‌

Teacher Arrested For Molestation 10 Year Girl In School Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు(చెన్నై): వేరువేరు చోట్ల పాఠశాల విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసిన ఉపాధ్యాయుడు, మాజీ ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోవై అన్ననూర్‌ ప్రాంతానికి చెందిన బాలిక(10) ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మాణిక్య సుందరం (47). ఈ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు తెలిసింది. దీనిపై బాధిత బాలిక ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది.

(చదవండి: ప్రైవేట్‌ పాఠాల పేరుతో పిల్లల తండ్రులకు గాలం, ఆపై ‘కట్నం’ పేరిట బ్లాక్‌మెయిలింగ్‌.. )

దీంతో ప్రధానోపాధ్యాయుడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ నిత్యా కేసు నమోదు చేసి మాణిక్య సుందరంను ఫోక్సో  చట్టం కింద అరెస్టు చేశారు. అలాగే పొల్లాచి భద్రకాళి అమ్మన్‌ ఆలయం వీధికి చెందిన ఎబినేసర్‌ (74) పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ఇతను పొల్లాచ్చికి చెందిన 6 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి తల్లి మహిళా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. నేరం నిర్ధారణ కావడంతో నిందితుడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top