breaking news
Case file against
-
ఆలయ పూజారి ఫిర్యాదు.. ఇద్దరు బీజేపీ ఎంపీపై కేసు నమోదు
రాంచీ: బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, నిశికాంత్ దూబేలకు ఊహించని షాక్ తగిలింది. ఆలయంలో పూజలు జరుగుతున్న వేళ ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఎంపీలు ఇద్దరూ నిర్లక్ష్యంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఆలయ పూజరి.. ఎంపీ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన జార్ఖండ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. శ్రావణమాసం నేపథ్యంలో బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, నిశికాంత్ దూబే ఆగస్టు రెండో తేదీన జార్ఖండ్ దేవ్గఢ్లోని బాబా వైద్యనాథ్ ఆలయానికి వెళ్లారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ఆలయంలోకి వీఐపీ, వీవీఐపీల ప్రవేశాలను నిలిపివేశారు. కానీ, బీజేపీ ఎంపీలు ఇద్దరు మాత్రం ఇవేవీ లెక్క చేయలేదు. భద్రతా సిబ్బంది అడ్డు చెప్పినప్పటికీ.. లెక్కచేయకుండా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేశారు. ఏకంగా గర్భ గుడిలోకి ప్రేవేశించి పూజలు జరిపారు. వారి ప్రవర్తనతో గుడిలో ఉన్న పూజారులు సైతం ఖంగుతిన్నారు. ఈ క్రమంలో ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆలయ పూజారి కార్తీక్నాథ్ ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.बाबा नाम केवलम्! बोल बम! जय शिव!अब तक 48वाँ.........हर हर महादेव।निशिकांत दुबे... ज़िंदाबाद।💪@nishikant_dubey@ManojTiwariMP pic.twitter.com/fouxq0Vpje— Binita PaswanBJP (@BinitaPaswanBjp) August 8, 2025తన ఫిర్యాదులో భాగంగా.. ఎంపీలు బలవంతంగా ప్రవేశించడం, భద్రతా సిబ్బందితో వాదనకు దిగినట్లు తెలిపారు. మత సంప్రదాయం, మనోభావాలను దెబ్బతీసినట్టు చెప్పుకొచ్చారు. ఆగస్టు 2న రాత్రి 8.45 నుండి రాత్రి 9 గంటల ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని భక్తులు భయాందోళనకు గురయ్యారని, తొక్కిసలాట వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో ఎంపీలు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాంచీ పోలీసులు వెల్లడించారు.ఇక, పోలీసులు కేసు నమోదు చేయడంపై నిశికాంత్ దూబే స్పందించారు. ట్విట్టర్ వేదికగా నితికాంత్ దూబే..‘పూజలు చేసినందుకు తనపై కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటివరకు 51 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రేపు తాను అరెస్టు అయ్యేందుకు నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్తానన్నారు. మరోవైపు, మనోజ్ తివారీ మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.पूजा करने के कारण यह केस है,अभी तक 51 केस मेरे उपर दर्ज है । कल देवघर एयरपोर्ट से सीधे पुलिस स्टेशन जाकर गिरफ़्तारी दूँगा https://t.co/75wzLi8jFY— Dr Nishikant Dubey (@nishikant_dubey) August 8, 2025ఇదిలా ఉండగా.. శ్రావణ మాసంలో కన్వరియాలు వేలాదిగా బాబా బైద్యనాథ్ ధామ్ వెళ్తారు. బీహార్లోని సుల్తాన్గంజ్ నుండి జార్ఖండ్లోని దేవఘర్ వరకు 105 కిలోమీటర్ల తీర్థయాత్రకు బయలుదేరి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయంలో పవిత్ర గంగా జలాన్ని అర్పించడానికి బయలుదేరుతారు. నెల రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు దాదాపు 55 లక్షల మంది కన్వరియాలు ఆలయంలో పవిత్ర జలాన్ని అర్పించారు. -
పీసీఐ అనుమతి లేకుండా కేసులొద్దు
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తగదని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరిపై ఇలాగే కేసులు పెట్టారని గుర్తుచేశారు. జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే పీసీఐ అనుమతిని తప్పనిసరి చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామిపై కేసు
ముంబై: ఇద్దరిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్ణబ్ గోస్వామి సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఎండీ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి శనివారం ముంబై సమీపంలోని వారి ఫాం హౌస్లో ఆత్మహత్య చేసకుని చనిపోయారు. అన్వయ్ సూసైడ్ నోట్ రాస్తూ అర్ణబ్ గోస్వామితోపాటు ఫెరోజ్ షేక్, నితీశ్ సర్దా అనే వ్యక్తులు తనకు రూ. 5.4 కోట్లు చెల్లించాలనీ, కానీ వాళ్లు ఆ డబ్బు ఇవ్వకుండా వేధిస్తూ తమ ఆత్మహత్యలకు కారణమయ్యారని పేర్కొన్నారు. అన్వయ్ ఆరోపణలు అవాస్తవాలంటూ ఆదివారం రిపబ్లిక్ టీవీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
విందు పేరుతో ప్రలోభాలు: ఎమ్మెల్యేపై కేసు నమోదు
మెదక్ జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్పై స్థానిక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ నందీశ్వర్ గౌడ్పై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే గత అర్థరాత్రి హోటల్లో ముస్లిం ఓటర్లకు సదరు ఎమ్మెల్యే విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు భారీగా ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఆ విందుపై కొంత మంది యువకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హోటల్పై దాడి చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.