16వ లోక్సభలో తొలి ఆందోళన | TRS MPs oppose Polavaram ordinance in Lok Sabha | Sakshi
Sakshi News home page

16వ లోక్సభలో తొలి ఆందోళన

Jun 9 2014 3:14 PM | Updated on Sep 2 2017 8:33 AM

పోలవరం ఆర్డినెన్స్ పై 16వ లోక్సభలో తొలి ఆందోళన నమోదయింది. పోలవరం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు లోక్సభలో నిరసనకు దిగారు.

న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ పై 16వ లోక్సభలో తొలి ఆందోళన నమోదయింది. పోలవరం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు లోక్సభలో నిరసనకు దిగారు. బి మహతాబ్ నేతృత్వంలోని బీజేడీ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి టీఆర్ఎస్ ఎంపీలు జతకలిశారు. పోలవరం ఆర్డినెన్స్ కు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

పోలవరం ప్రాజెట్టు వల్ల గిరిజనులు ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ నచ్చజెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఆర్డినెన్స్ చర్చకు వచ్చినప్పుడు నిరసన తెలపాలని స్పీకర్ కోరినా సభ్యులు ఆందోళన కొనసాగించారు. రాష్రపతి ప్రసంగ ప్రతులను విసిరేశారు. దీంతో స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement