చనిపోయిన రైతులకు ఎక్స్గ్రేషియా అందడం లేదు | prof kodandaram comments on farmers suicide | Sakshi
Sakshi News home page

చనిపోయిన రైతులకు ఎక్స్గ్రేషియా అందడం లేదు

Sep 20 2015 12:56 PM | Updated on Sep 29 2018 7:10 PM

చనిపోయిన రైతులకు ఎక్స్గ్రేషియా అందడం లేదు - Sakshi

చనిపోయిన రైతులకు ఎక్స్గ్రేషియా అందడం లేదు

రాష్ట్రంలో చనిపోయిన రైతులకు 10 శాతం ఎక్స్ గ్రేషియా కూడా అందడం లేదని జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో చనిపోయిన రైతులకు 10 శాతం ఎక్స్ గ్రేషియా కూడా అందడం లేదని జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లో ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ... రైతుల ఆదాయ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే పండిన పంటకు గిట్టుబాటు ధరను కూడా ప్రభుత్వమే కల్పించాలన్నారు.

ఖర్చు తక్కవగా ఉండే సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 90 శాతం మంది చిన్న... సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కోదండరామ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement