⇒ ఇసుక తీసుకెళ్తున్న కూలీలను అడ్డుకున్న పోలీసులు
⇒ ఆ ఇసుక ఇరిగేషన్ శాఖదట
⇒ ‘ముఖ్య’ నేత రంగంలోకి దిగటంతో కూలీలకు గండి
⇒ కూలీల ఇసుక ట్రాక్టర్లపై కేసుల నమోదుకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్ : కృష్ణానదిలోని ఇసుక చుట్టూ రాజకీయం నడుస్తోంది. అధికార పార్టీ నేతలు కొందరు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి కృష్ణా నదిలో భారీగా డంప్ చేశారు. వారిపై కన్నెత్తి చూడని పోలీసులు.. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఉచిత ఇసుకను తరలిస్తూ ఉపాధి పొందుతున్న కూలీలను సోమవారం అడ్డుకున్నారు. డంప్ చేసిన ఇసుక ఇరిగేషన్ శాఖదని ప్రకటించారు. ఇసుక తరలింపుపై ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినందున కూలీలను అడ్డుకున్నామని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. డంప్ చేసిన ఇసుకను తరలించడానికి వీల్లేదని కూలీలను వెళ్లగొట్టిన పోలీసులు కొందరు కూలీలు సహా ట్రాక్టర్లపై కేసుల నమోదుకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.
డ్రెడ్జర్లతో తవ్వకాలు...
రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం, రాయపూడి సమీపంలోని కృష్ణా నదిలో కొద్దిరోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు డ్రెడ్జర్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురిం చింది. సుప్రీం కోర్టు హెచ్చరించినా అక్రమార్కులు భారీ యంత్రాలతో ఇసుకను తవ్వుతూనే ఉండటం గమనార్హం. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగుల ఎత్తున ఇసుకను డంప్ చేశారు. ఈ విషయమై డ్రెడ్జర్లతో తవ్వుతున్న వారిని అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించినా, వారి నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో కొద్దికాలంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.
ఇసుక ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలు
రాజధాని కోసం భూములు త్యాగం చేసి పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్న కూలీలు ఇసుక ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితమేనని ప్రకటించిన నేపథ్యంలో నదిలోని ఇసుకను తరలిస్తూ ఉపాధి పొందుతున్నారు. వారం రోజులుగా కొందరు కూలీలు ఇసుకను గృహావసరాల కోసం తీసుకెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాఫియా నేతల అనుచరులు ఆ ప్రాంతానికి వచ్చి పలుమార్లు కూలీలను హెచ్చరిం చారు. అయితే కూలీలు ప్రభుత్వం ఇసుకను ఉచితమని చెప్పిందనే విషయాన్ని గుర్తు చేశారు. భారీగా డంప్ చేసిన ఇసుక ఎవరిదని పలుమార్లు అడిగినా వారి నుంచి సరైన సమాధానం లేదు. భారీ యంత్రాలతో ఇసుకను డంప్ చేయటానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించినా నోరెత్తలేదు. పోలీసులు కూడా వచ్చి కూలీలను ఆరా తీశారు. ఇసుక ఉచితమే కదా? అని చెప్పటంతో పోలీసులు అడ్డుచెప్పలేదు.
‘ముఖ్య’ నేత ఆదేశాల మేరకు
టీడీపీకి చెందిన ఓ ‘ముఖ్య’ నేత ఆదేశాల మేరకు సోమవారం పోలీసులు రంగంలోకి దిగినట్లు కూలీలు చెబుతున్నారు. బలవంతంగా తమను తోసివేసినట్లు కూలీలు కన్నీరుపెట్టుకున్నారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బం దులు పడుతున్న సమయంలో ఇసుకను తరలించి ఉపశమనం పొందుతుంటే పోలీసులు అడ్డుకోవడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం నదుల్లో ఉన్న ఇసుకను యంత్రాలతో తవ్వకూడదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఇసుక అక్రమతవ్వకాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా అధికార పార్టీ నేతలు పోలీసుల అండదండలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండా చేసుకుం టున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారీ ఇసుక డంప్ వెనుక అధికార పార్టీ నేతలు
కృష్ణా నది ఒడ్డున భారీగా డంప్ చేసిన ఇసుక వెనుక ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, తుళ్లూరు మండల పరిధిలోని ఇద్దరు టీడీపీ నాయకులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం. 10 ఎకరాల విస్తీర్ణంలో డంప్ చేసిన ఇసుకలో సగభాగం ఓ ప్రైవేటు కాంట్రాక్టర్కు రూ.15 కోట్లకు విక్రయించినట్లు తెలిసింది. మరో సగ భాగం ఇసుకను రూ.25 కోట్లకు విక్రయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కూలీలు ఇసుకను తీసుకెళ్తే తమ పరిస్థితేమిటని ఇసుక కాంట్రక్టర్లు అధికార పార్టీ ‘ముఖ్య’ నేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు అధికారి ఒకరు వెల్లడించారు.
అధికారుల వత్తాసూ వారికే ...
నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబ సభ్యులు, నేను ఇసుక పని చేసుకుంటూనే జీవనం సాగించాం. రెండేళ్లుగా పరిస్థితి తారుమారైంది. రాజధాని ప్రకటనతో రాజకీయ రాబందులు మా నోటి దగ్గర కూడు లాగేసుకుంటున్నాయి. ఆఖరికి న్యాయం చేయాల్సిన అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. బడుగు వర్గాల్లో పుట్టడమే పాపమా?
– జొన్నకూటి రాజేష్, కూలీ
మాట్లాడే హక్కు లేదా?
ఈ రెండేళ్లలో పనులు లేక పస్తులు ఉంటున్నాం. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఇసుక ద్వారా ఉపాధి కలిగింది. అయితే పోలీసులు మా కడుపు కొడుతున్నారు. ట్రిబ్యునల్ ఎక్కడైనా ఇసుక తవ్వుకోవచ్చని, యంత్రాలు వాడొద్దని సూచించింది. అయితే జిల్లా స్థాయి పోలీసు అధికారి ఇసుక తవ్వకూడదు, అరెస్టు చేస్తాం అంటే ఎలా? మాకు మాట్లాడే హక్కు లేదా?
– యడ్ల రాఘవులు, కూలీ
అక్రమ డంప్కు అండ
Published Tue, Mar 14 2017 10:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
No Headline
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కనీసం ఇలాంటప్పుడైనా చెప్పుకోవడానికి మీరు ఏదైనా చేసుంటే బావుండేద్సార్!
నిలకడగా శిశువు ఆరోగ్య పరిస్థితి
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement