నాన్నా క్షమించు.. ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం | degree student suicide in warangal | Sakshi
Sakshi News home page

నాన్నా క్షమించు.. ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

Mar 29 2023 9:35 AM | Updated on Mar 29 2023 9:38 AM

degree student suicide in warangal - Sakshi

ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్‌ లెటర్‌ రాసి

వరంగల్: ఉంగరం పోయిందని మండలంలోని గున్నెపల్లి గ్రామానికి చెందిన మద్దుల హేమలతరెడ్డి(19) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హేమలతరెడ్డి హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగ కోసం ఇటీవల ఇంటికి వచ్చిన హేమలతరెడ్డి చేతి ఉంగరం పోయింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఇంట్లో వాళ్లు ఏమైనా అంటారనే భయంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్‌ లెటర్‌ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి మద్దుల జానకీరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement