Massachusetts university
-
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
వాషింగ్టన్: దేశ వ్యతిరేక భావజాలం నింపుకున్న వాళ్లకు అమెరికాలో నిలువనీడ లేదని ఇప్పటికే చాటిన ట్రంప్ సర్కార్ పలు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాల రద్దు పర్వాన్ని కొనసాగిస్తోంది. శాస్త్రసాంకేతిక పరిశోధనా విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ది మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) విశ్వవిద్యాలయం పైనా ఈ వీసాల రద్దు ప్రభావం పడింది.ఇప్పటికే పలు వర్సిటీల్లో విద్యార్థులతోపాటు పరిశోధకులు, బోధనా, బోధనేతర సిబ్బందిపైనా వీసాల రద్దు వేటువేసిన రిపబ్లికన్ ప్రభుత్వం కనీసం ఎందుకు వీసా రద్దు చేస్తున్నారో చెప్పకపోవడం దారుణమని ఎంఐటీ వర్సిటీ పేర్కొంది. తమ వర్సిటీలో 9 మంది విదేశీ విద్యార్థుల వీసాలను కారణం చూపకుండానే రద్దుచేశామని వర్సిటీ తాజాగా వెల్లడించింది. అమెరికాలో సీబీఎస్ మీడియాసంస్థ సమాచారం మేరకు ఇప్పటిదాకా అక్కడి 88 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో దాదాపు 530 మంది విద్యార్థులు, సిబ్బంది, పరిశోధకుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం ఆకస్మికంగా రద్దుచేసింది. తమ వర్సిటీలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దుపై ఎంఐటీ వర్సిటీ అధ్యక్షురాలు సలీ కార్న్బ్లూత్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.వర్సిటీ వర్గాలకు ఈ మేరకు సోమవారం ఆమె ఒక లేఖ రాశారు. ‘‘ఏప్రిల్ 4వ తేదీ తర్వాత హఠాత్తుగా విద్యార్థుల చదువులను కాలరాస్తూ తీసుకున్న ఈ విధానాలు ఏమాత్రం ఆమోదనీయం కాదు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వీసాల రద్దుకు కారణం చెప్ప లేదు. అత్యంత ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఆకర్షించగల వర్సిటీ సామర్థ్యాన్ని ఈ నిర్ణయాలు దెబ్బతీస్తాయి. వర్సిటీ కార్యకలాపాలూ కుంటుపడతాయి. అప్పుడు అంతర్జాతీయంగా వర్సిటీల్లో శాస్త్రసాంకేతిక పరిశోధనలకు సంబంధించి మా వర్సిటీలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగడం కష్టసాధ్యమవుతుంది. నూతన పరిశోధనలు, ఆవిష్కరణలతో దేశాన్ని మరింత సుసంపన్నం చేసే క్రతువు కుంటువుడుతుంది’’ అని ఆమె అన్నారు.పరిశోధనా వ్యయాలకు పరిమితిపైనా వర్సిటీల ఆగ్రహం అధునాతన అధ్యయనాలకు సంబంధించిన పరోక్ష పరిశోధనా వ్యయాలను పరిమితం చేసుకోవాలని ప్రభుత్వ ఇంధన శాఖ ప్రకటించడంపై వర్సిటీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పరోక్ష పరిశోధనా ఖర్చులు ఎంత పెరిగినాసరే ప్రభుత్వం మాత్రం 15 శాతం మాత్రమే రీయింబర్స్ చేస్తుందని పేర్కొనడాన్ని వర్సిటీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. విద్యాసంస్థలకు నిధులు తగ్గిస్తే ఆయా విభాగాల సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు దాదాపు ఆగిపోతుందని వర్సిటీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ(డీఓఈ)పై బోస్టన్ ఫెడరల్ కోర్టులో ప్రిన్స్టన్, కాల్టెక్, ఇల్లినాయీ, ఎంఐటీ వర్సిటీలు కోర్టులో దావా వేశాయి. -
డ్యాషింగ్ అడ్వైజర్
ఐక్యరాజ్య సమితి అంటేనే హై లెవల్. అందులోని ‘హై లెవల్ అడ్వైజరీ బోర్డ్’ (హెచ్.ఎల్.ఎ.బి.) అంటే ఐక్యరాజ్య సమితి కన్నా హై లెవల్! సమితికి ఏ విషయంలోనైనా మార్గదర్శనం చేసేందుకు ఆ బోర్డులోని సభ్యులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన మేధావులు, విద్యావంతులు అయి ఉంటారు. ఆ టీమ్లో తాజాగా భారతదేశ ఆర్థికవేత్త జయతీ ఘోష్కు స్థానం లభించింది! కొన్నాళ్లుగా యూఎస్లోనే మసాచుసెట్స్లో ఉంటున్నారు జయతి. ఇప్పుడిక సలహా బృందంలో సభ్యురాలు అయ్యారు అట్నుంచటు విమానంలో అరగంట ప్రయాణదూరంలో ఉండే న్యూయార్క్లోని సమితి ప్రధాన కార్యాలయానికి త్వరలోనే ఆమె తన బుక్స్ సర్దుకుని వెళ్లబోతున్నారు. ఆ బుక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అర్థం చేసుకోడానికి జయతి అధ్యయనం చేస్తూ వస్తున్నవి మాత్రమే కాదు, జయతి రూపొందించిన వివిధ దేశాల అభివృద్ధి ప్రణాళికల సమగ్ర నివేదికలు కూడా. ప్రభుత్వాలకు అవి పరిష్కార సూచికలు. ప్రస్తుతం ఆమ్హర్ట్స్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్’లో ఎకమిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు జయతి ఘోష్. అక్కడికి వెళ్లడానికి ముందు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.) లో 35 ఏళ్ల పాటు ఆర్థికశాస్త్రాచార్యులుగా ఆమె పని చేశారు. ఇప్పుడు సమితి సలహా బృందానికి ఆమె పేరును ప్రతిపాదించినది వేరెవరో కాదు. ఐక్యరాజ్యసమితిలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సోషల్ అఫైర్స్’! జయతికి హ్యూమనిస్ట్ ర్యాడికల్ అనే పేరు ఉన్నప్పటికీ ఆ ర్యాడికల్ అనే పేరును పక్కన పెట్టి, ఆమెలోని హ్యూమనిస్టుని మాత్రం సమితి తీసుకున్నట్లుంది. లేదా, దేశాల ఆర్థికస్థితిని మెరుగు పరిచి సామాజిక జీవనాలను సరళతరం చేయడానికి జయంతి సూచించే కఠినతరమైన ఆర్థిక వ్యూహాలను అనుసరించాలని నిశ్చయించుకుని ఉండొచ్చు. 2030 నాటికి ప్రపంచంలోని పేద దేశాలన్నీ శుభ్రమైన తిండి, బట్ట కలిగి ఉండాలని సమితి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. అందుకోసం రెండేళ్ల క్రితం ఎకనమిక్స్, సోషల్ అఫైర్స్ విభాగం ‘యు.ఎన్. హై–లెవల్ అడ్వయిజరీ బోర్డు’ను ఏర్పాటు చేసుకుంది. ఆ బోర్డు కాల పరిమితి రెండేళ్లు. అది పూర్తవడంతో ఇప్పుడు రెండో అడ్వయిజరీ బోర్టు అవసరమైంది. ఇందులో ఆర్థిక, సామాజిక అంశాలలో అంతర్జాతీయంగా నిపుణులు, అధ్యయనవేత్తలైన పలు రంగాల ప్రసిద్ధులు మొత్తం 20 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో 65 ఏళ్ల జయతీ ఘోష్ ఒకరు. ∙∙ జె.ఎన్.యు.లో చదివి, జె.ఎన్.యు.లోనే పాఠాలు చెప్పారు జయతి. ఎకనమిక్స్లో ఎం.ఎ., ఎంఫిల్ ఆమె. పిహెచ్.డిని ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేశారు. సలహా బోర్డు సభ్యురాలుగా ఇక ఆమె ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గ్యుటెరస్కు వివిధ దేశాల వర్తమాన, భావి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రణాళికా విధానాలను సూచించవలసి ఉంటుంది. అదేమీ ఆమెకు కష్టమైన సంగతి కాబోదు. ప్రజల్లో తిరిగిన మనిషి. విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్న ప్రొఫెసర్. డెవలప్మెంట్ ఎకనమిస్ట్. ఆమె భర్త అభిజిత్ భారతదేశ ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు. జయతి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలవైపు లేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పిడికిలి బిగించిన ప్రతి ఉద్యమంలోనూ జయతి నినాదం ఉంది. మొన్నటి ఢిల్లీ సి.ఎ.ఎ. అల్లర్లలో ప్రేరేపకులుగా పోలీస్లు దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్ల పేర్లతో పాటు జయతి పేరు కూడా ఉంది. అలాగని ప్రభుత్వాలు ఆమెకు ఇవ్వవలసిన గుర్తింపును ఇవ్వకుండా ఏమీ లేవు. జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) 2010 లో ఆమెకు ‘డీసెంట్ వర్క్ రిసెర్చ్ ప్రైజ్’ను అందించింది. యు.ఎన్.డి.పి. ‘ఎక్స్లెన్స్ ఇన్ ఎనాలిసిస్’ అవార్డును ప్రకటì ంచింది. సమితి సలహాదారుగా ఇప్పుడు ఆమెకు లభించించీ అవార్డులాంటి ప్రతిష్టే. -
చూపు లేకపోతేనేమి.. లక్ష్యముంది!
ఇప్పటివరకూ 3,000 మంది విద్యార్థులకు విద్యను అందించటమే కాదు.. వృత్తివిద్య కోర్సుల్లోనూ శిక్షణ ఇచ్చాం. కానీ వారికి ఉపాది ఎలా ? అందుకే ఈ కంపెనీ మొదలు పెట్టాం. ఇప్పుడు మా కంపెనీలో 150 మంది రకరకాల వృత్తి నిపుణులు ఉన్నారు. అంతా ఏదో ఒక భౌతిక అవయవ లోపం ఉన్నవారేం. అయితే మిగతావారికి వీరంతా ఏమాత్రం తీసిపోరు. లోపమనది ఎప్పటికీ విజయానికి అడ్డుగోడ కాదు. ఉన్నత లక్ష్యాలు లేకపోవడమే నిజమైన లోపం. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడమే గొప్పగా భావిస్తారు. అలాంటిది అతిపిన్న వయసులో.. ఫోర్బ్స్ సూపర్ అచీవర్స్ ఫ్రమ్ ఏషియా జాబితాలో చోటు దక్కించుకున్నా.. ఆయన దానిని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దృష్టంతా ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరడమే. సాధారణ వ్యక్తులు ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే గొప్పేంకాదు.. కానీ పుట్టుకతో చూపులేనివారు ఇటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోవడం, సాధించడం సాధారణ విషయం కాదు. ఇంతకీ ఆయనెవరో తెలుసా.. మన తెలుగువ్యక్తి శ్రీకాంత్ బొల్లం. వివరాల్లోకెళ్తే... స్కూల్ ఎడిషన్: శ్రీకాంత్ బొల్లం... రూ.50కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి సీఈవో. అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. తన కంపెనీని సక్సెస్ గ్రాఫ్లో ముందుంచడానికి కష్టపడే ఈ యువకుడిని చూసి ఒకప్పుడు నవ్వినవాళ్ళే అంతా. ఆఖరికి మంచి ర్యాంక్తో ఐఐటీ సీటు సంపాదించుకున్నా క్యాంపస్లోకి కూడా రానివ్వలేదు. ఎందుకంటే శ్రీకాంత్ అంధుడన్న కారణంతోనే.. మన తెలుగువాడే..: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లె టూరిలో పుట్టాడు శ్రీకాంత్. పుట్టినప్పటి నుంచే కళ్లు కనిపించవు. దీంతో ఏదైనా అనాధాశ్రమంలో చేర్చమని సలహా ఇచ్చారు బంధువులు. కానీ కన్నప్రేమ అందుకు అంగీకరించలేదు. అంధుడైనప్పటికీ మిగతావారిలాగే ఊర్లోని బడికి పంపించారు. ఆ తర్వాత అంధుల పాఠశాలలో చేరి పదోతరగతిలో 90 శాతం మార్కులు సంపాదించాడు. క్రికెట్, చెస్ ఆటల్లోనూ చాంపియన్గా నిలిచాడు. అయితే ఈ విజయాలేవీ అతనికి పూలబాటను ఏర్పాటు చేయలేదు. ఐఐటీతోపాటు ఇంజనీరింగ్ పూర్తిచేసేందుకు ఎన్నో ముళ్లబాటల్లో నడవాల్సి వచ్చింది. అబ్దుల్ కలాం చొరవతో...: అంధుడైనప్పటికీ అద్భుత ప్రతిభతో లీడ్ ఇండియా ప్రాజెక్ట్లో చోటు దక్కించుకున్నాడు. సాక్షాత్తూ మన మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం చేపట్టిన ప్రాజెక్ట్లో చదువుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విదేశాల్లోని ఆహ్వానాలు.. అడ్మిషన్లు శ్రీకాంత్ జీవితాన్నే మార్చేశాయి. చదువు పూర్తయిన వెంటనే తిరిగి భారత్లో అడుగు పెట్టాడు. తన లాంటి మరికొందరికి చేయూత అందించాలని నిర్ణయించుకున్నాడు. బొల్లాంత్ ఇండస్ట్రీస్ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.