-
నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు
-
చుక్క నీరు కూడా వృథా కాకూడదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సముద్రపు నీటి డీశాలినేషన్ (సముద్రపు నీటిని శుద్ధి చేసి వినియోగించడం)పై దృష్టి సారించాలన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇజ్రాయెల్ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్ డిప్యూటీ సీఈవో లీహి టోరెన్స్టైన్, ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మంచి నీటిని వృథా చేయకుండా డీశాలినేషన్ నీటిపై దృష్టి పెట్టామన్నారు. ఇజ్రాయెల్ మొత్తం డీ శాలినేషన్ నీటినే వినియోగిస్తోందని, పారిశ్రామిక అవసరాలకు ఆ నీటినే వినియోగించాలని చెప్పారు. అవసరమైన పక్షంలో తాగునీటి అవసరాల కోసం కూడా డీశాలినేషన్ నీటినే వినియోగించే పరిస్థితి రావాలని సూచించారు. ఆ మేరకు ఆ ప్లాంట్ను అప్గ్రేడ్ చేసుకునేట్టు ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ డీశాలినేషన్ ప్లాంట్లు పెట్టాలి అన్న దానిపై అధ్యయనం చేసి, ఆ మేరకు నివేదికలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. మొదట విశాఖపట్నంతో ప్రారంభించి.. దశల వారీగా విస్తరించుకుంటూ వెళ్లాలని సూచించారు. నిర్వహణ, ఖర్చు వివరాలతో నివేదిక విశాఖపట్నం, తడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో డీశాలినేషన్ నీటిని వినియోగించేలా చూడాలని సీఎం సూచించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు డీశాలినేషన్ లేదా శుద్ధి చేసిన నీటిని వాడేలా చూడాలని, రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లు కూడా ఆ నీటినే వినియోగించేలా ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మురుగు నీటి శుద్ధికి అవుతున్న ఖర్చు, టెక్నాలజీపై కూడా దృష్టి పెట్టాలని, డీశాలినేషన్ ప్లాంట్ల సాంకేతికత, నిర్వహణ ఖర్చులపై సమగ్ర వివరాలు సమర్పించాలన్నారు. విశాఖపట్నం సహా ఆయా ప్రాంతాలను పరిశీలించి ఆ మేరకు నివేదికలు రూపొందించాలని, పరిశ్ర మలకు ఏ ప్రమాణాలతో నీరు కావాలో నిర్ణయించి ఆ మేరకు అన్ని అంశాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. 40 దేశాల్లో ఐడీఈ కార్యకలాపాలు ఇండియా అనేక రకాలుగా నీటి కొరతను ఎదుర్కొంటోందని, నీటి భద్రత అనేది చాలా ముఖ్యమని ఐడీఈ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఏపీలో నీటి కొరత తీర్చడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమన్నారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. 1964లో తొలిసారిగా కమర్షియల్ డీశాలినేషన్ ప్లాంట్ను ఇజ్రాయెల్లో పెట్టామని వారు వివరించారు. ఐడీఈ టెక్నాలజీస్ ప్రపంచ వ్యాప్తంగా 4 దశాబ్దాలుగా 40 దేశాల్లో 400కు పైగా ప్లాంట్లను నిర్వహిస్తోందన్నారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ తమ కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. భారత్లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డీశాలినేషన్ ప్లాంట్ల వల్ల త్వరితగతిన పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాలు, ఆదాయం వస్తుందని వారు వివరించారు. సముద్రపు నీటిని డీశాలినేషన్ చేయడంతో పాటు కలుషిత నీటిని కూడా శుద్ధి చేయడంలో అత్యుత్తమ సాంకేతిక విధానాలను అవలంభిస్తున్నామన్నారు. ఎస్సార్, రిలయన్స్ కంపెనీల్లో ఇండస్ట్రియల్ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నామని, శుద్ధి చేసిన మురుగు నీటిని పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయని వారు వివరించారు. -
రంగనాయకపురంలో ఇజ్రాయిల్ బృందం
రంగనాయకపురం (తాళ్లరేవు), న్యూస్లైన్ : ఇజ్రాయిల్ వాలంటీర్ల బృందం తాళ్లరేవు పాఠశాలలో పాఠాలు బోధిస్తోంది. విద్యా ర్థులతో కలసిపోయి వారి మంచి విషయాలను మనసుకు హత్తుకునేలా చెబుతోంది. మన దేశంలో విద్యా విధానంపై పరిశోధనకు, సామాజిక సేవ చేయాలని మంజుల, ఒమెర్ నేతృత్వంలోని 11మంది సభ్యుల బృందం తాళ్లరేవు వచ్చింది. నిమ్మీ, బెచ్షేవా, రోమీ, ఇలీల్, మాయా, షరోన్, ఆఫర్, అలీల్, సాంద్రా, ఇలానా, గాల్ ఆ బృందంలో ఉన్నారు. స్థానిక రంగనాయకపురంలోని రంగా విద్యాలయలోనే ఉండి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రత ఎంత ముఖ్యమో వివరించారు. విద్యార్థులకు బోధించే అంశాల్లో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల హెచ్ఎమ్ కేవీవీ రామకృష్ణ, పిఆర్ఓ కె.ఆదినారాయణ పర్యవేక్షిస్తున్నారు. సేవ చేయడం ద్వారానే... చిన్నతనం నుంచే సేవాభావం అలవర్చాలని ఇజ్రాయిల్ బృందం కో ఆర్డినేటర్ ఒమెర్ అన్నారు. ఇక్కడ పిల్లలు పాఠశాల గదులకే పరిమితం అవుతున్నారని, తమ దేశంలో ఏడాదిలో నాలుగు సార్లు అటవీ ప్రాంతంలో ప్రకృతి గురించి పరిశోధనలు చేస్తారని తెలిపారు. ఇక్కడ బట్టీ విధానం కొనసాగిస్తున్నారని, తమ దేశంలో చర్చల ద్వారా సబ్జెక్ట్పై అవగాహన కలిగిస్తారని చెప్పారు. పరీక్షలతో సంబంధం లేకుండా విద్యార్థి రాణించిన సబ్జెక్ట్లో ప్రోత్సాహం అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతారని ఒమెర్ పేర్కొన్నారు. టీచింగ్ మెథడాలజీపై శిక్షణ ఇజ్రాయిల్ దేశస్థులు ముఖ్యంగా విద్య, వ్యవసాయ రంగాలపై దృష్టిసారిస్తారని మరో కోఆర్డినేటర్ మంజుల తెలిపారు. ఏటా నెల రోజులు సామాజిక సేవ చేయడానికి ముందుకొ స్తారని చెప్పారు. మంతెన భువనేశ్వరి సూచన మేరకు రంగా విద్యాలయంలో వారం పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. ఇండియాలో 10 బిటిజిగాక్ ఆర్గనైజేషన్ పేరిట సేవలు అందిస్తున్నామని తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement