breaking news
Female Prime Minister
-
షేక్ హసీనాకు మరణశిక్ష
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రసమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు పదవీచ్యుత మహిళా ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణశిక్ష విధింపునకు దారితీసింది. జూలై 15న విద్యార్థుల సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసి 1,400 మంది మరణాలకు హసీనా కారణమయ్యారంటూ దాఖలైన కేసులో ఆమెకు మరణశిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరిచింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ మొహమ్మద్ గులామ్ మోర్తుజా మజూందార్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కోర్టు గతంలోనే ఆమె పారిపోయిన నేరుస్తురాలిగా ప్రకటించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నిర్దయగా ఆదేశాలు జారీచేసి భద్రతబలగాల సాయంతో ఉద్యమాన్ని అణిచివేశారని, వందల మంది మరణాలకు ప్రధాన బాధ్యురాలు అని ప్రభుత్వం అందించిన సాక్ష్యాధారాలతో రూఢీ అయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ వందల మరణాలకు, ఉద్యమాన్ని అణచివేత వ్యూహాలకు కర్త, కర్మ, క్రియ హసీనాయే. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న విద్యార్థులపైకి ఆమెకు చెందిన పార్టీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులకు తెగబడేలా ఆమె రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చారు. దాడులు చేస్తున్న వారిని ఏమాత్రం కట్టడిచేయకుండా ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. నిరసనబాటపట్టిన వేలాది మంది విద్యార్థులపై మారణాయుధాలు, హెలికాప్టర్లతో దాడులు చేయించారు’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వంటి ఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నాటి హసీనా ప్రభుత్వంలో హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్షను ఖరారుచేసింది. మాజీ పోలీస్ ఉన్నతాధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ చౌదరి అబ్దుల్లా అల్–మమూన్కు ఐదేళ్ల శిక్ష విధించింది. ఆమెను అప్పగించాలన్న తాత్కాలిక సర్కార్గత ఏడాది ఆగస్ట్ 5న దేశం నుంచి పారిపోయి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న అవామీ లీగ్ పార్టీ అధినేత్రి హసీనాను తమకు అప్పగించాలని భారత్ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ భారత్కు పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమాల్లను వెంటనే బంగ్లాదేశ్ ఉన్నతాధికారులకు అప్పగించండి. గతంలో మన రెండు శాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒడంబడికను గౌరవించాల్సిందే. కోర్టు తీర్పుతో దోషులుగా నిర్ధారణ అయిన ఖైదీలను మాకు భారత ప్రభుత్వం అప్పగించాలి. దోషులు అని తేలాకకూడా వాళ్లను ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వక చర్య అనిపించుకోదు. ఇలాంటి ధోరణి న్యాయబద్ధంకాదు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ‘‘ఈ మేరకు మరోసారి భారత్కు అధికారికంగ లేఖ రాస్తాం. ఊచకోత కారకులకు ఇంకా ఆశ్రయం కల్పిస్తామని భారత్ మొండికేస్తే రెండుదేశాల మధ్య విరోధం పెరుగుతుంది’’ అని ప్రభుత్వ న్యాయ సలహాదారు అసిఫ్ నజ్రుల్ స్పష్టంచేశారు. దీనిపై భారత్ స్పందించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.తీర్పు తర్వాత పలు చోట్ల ఘర్షణలుతమ పార్టీ చీఫ్ హసీనాకు మరణశిక్ష ఖరారుచేస్తూ తీర్పు వెలువడటంతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగా కీలక నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. దీంతో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ అనుకూల వర్గాలు సైతం రోడ్లమీదకొచ్చాయి. ఢాకాలో హసీనా తండ్రికి చెందిన భవనాన్ని కూల్చేందుకు యత్నించగా పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.ఉక్కు మహిళ నుంచి మరణశిక్ష దాకా..1947 సెప్టెంబర్ 28వ తేదీన నాటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి తర్వాత బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం సిద్దించేలా కృషిచేవారు. తర్వాత బంగ్లాప్రజలు ఆయనను జాతిపితగా కీర్తించారు. ఢాకా యూనివర్సిటీలో ఈమె చదువుకున్నారు. 1968లో అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను పెళ్లాడారు. 1975లో సైనిక తిరగుబాటు వేళ తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతం తర్వాత ఈమె దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికే దివంగత దేశాధ్యక్షుడు జివుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరిద్దరినీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పోరాడే బేగమ్లు అని పిలిచేవారు. 1996లో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. 2001లో ఓడినా 2008లో మళ్లీ పీఠం అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అంశం గతేడాది చిలికిచిలికి గాలివానగా, విద్యార్థి మహోద్యమంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే రహస్య జీవితం గడుపుతున్నారు.చట్టానికి ఎవరూ అతీతులు కారుతీర్పును స్వాగతిస్తూ యూనుస్ వ్యాఖ్యఢాకా: హసీనాకు పడిన మరణశిక్షను ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. తీర్పును స్వాగతిస్తున్నట్లు యూనుస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ ఈరోజు బంగ్లాదేశ్ వ్యాప్తంగా, దేశానికి ఆవల సైతం ప్రతిధ్వనించేలా దేశ న్యాయస్థానాలు అత్యంత స్పష్టమైన సందేశానిచ్చాయి. అధికారంలో ఉన్నా, లేకున్నా చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే ప్రాథమిక సూత్రం ఇక్కడ వర్తిస్తుందని న్యాయస్థానం మరోసారి గుర్తుచేసింది. గత జూలై, ఆగస్ట్లో ఉద్యమం వేళ ప్రాణాలు కోల్పోయిన, వేధింపులకు గురైన, ఇప్పటికీ మనోవ్యథను భరిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడింది. ఏళ్ల తరబడి కొనసాగిన అణిచివేతతో పెళుసుబారిన ప్రజాస్వామ్య పునాదుల పునరుద్ధరణకు మేం కృషిచేస్తాం’’ అని యూనుస్ వ్యాఖ్యానించారు.హసీనాపై మోపిన కీలక ఆరోపణలు1. హత్య, హత్యాయత్నం, నిరసనకారులను చిత్రహింసలకు గురి చేయడం. విద్యార్థులపై దాడులను ప్రోత్సహించడం, దాడులను ఏమాత్రం అడ్డుకోకపోవడం2. హలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో నిరాయుధ విద్యార్థులపైకి మారణాయుధాలతో సైన్యం దాడిచేసేలా ఆదేశాలు ఇవ్వడం3. రంగ్పూర్లో బేగమ్ వర్సిటీ విద్యార్థి అబూ సయీద్ను అత్యంత దారుణంగా చంపేయడం4. ఆగస్ట్ 5న ఛంకార్పూర్లో ఆరుగురిని హత్యచేయడం, విద్యార్థులపై దాడి చేయాలని ప్రసంగాలు ఇవ్వడం5. ఆగస్ట్ 5న అషూలియాలో ఆరుగురు విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించడం, తర్వాత ఆధారాల్లేకుండా తగలబెట్టడం రాజకీయ ప్రేరేపిత తీర్పు ఇదితీర్పుపై ఘాటుగా స్పందించిన హసీనాతీర్పుపై 78 ఏళ్ల హసీనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత తీర్పు. ప్రజాతీర్పు పొందని ఎన్నికల్లో గెలవని ఒక అనామిక ప్రభుత్వం ఒత్తిడితో వెల్లడైన తీర్పు ఇది. ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్రస్థాయి భావజాలం ఏ స్థాయిలో తీర్పు కళ్లకుకడుతోంది. తీర్పు పూర్తిగా పక్షపాతధోరణితో, రాజకీయ కక్షతో వెలువర్చారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రధానిగా ఎన్నికైన నన్ను, అవామీ లీగ్ రాజకీయశక్తిని నిర్వర్యీంచేసే కుట్ర ఇది. పారదర్శకంగా కేసు నడవని, సాక్ష్యాధారాలను పరిశీలించని ఇలాంటి ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులకు నేను అస్సలు భయపడను. మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తమ చేతగానితనాన్ని ఈ తీర్పును సాకుగా చూపి అస్తవ్యస్తపాలనను అద్భుతంగా ఉందని చెప్పుకునే దుస్సాహసంచేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హెయిర్ స్టైల్నే కాదు చరిత్రనే మార్చేసింది!
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకాయిచి చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో... ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైయిల్లా ఉండాలి’ అని తన హెయిర్ స్టయిల్ మార్చారు. అయితే ఆమె మార్చింది కేవలం హెయిర్స్టైల్ మాత్రమే కాదు, పితృ స్వామ్య ఆధిపత్యంతో కూడిన ఎన్నో స్థిర అభిప్రాయాలను! తకాయిచి సుపరిచిత రాజకీయ జీవితం మాట ఎలా ఉన్నా, అదర్సైడ్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. సింగర్, డ్రమ్మర్, బైక్ రైడర్, కరాటే ఫైటర్, టీవీ ప్రెజెంటర్... ఒకటా రెండా!సనే తకాయిచికి మెటాలిక, ఐరన్ మెయిడెన్, బ్లాక్ సబ్బాత్ లాంటి హెవీ మెటల్ మ్యూజిక్ బ్యాండ్లు అంటే చాలా ఇష్టం. బిగ్గరగా, దూకుడుగా ధ్వనించే రాక్ స్టైల్ హెవీ మెటల్ బ్యాండ్ల సొంతం. సంగీత అభిమానిగా ఉన్న తకాయిచి కాలేజీ బ్యాండ్లో డ్రమ్ వాయించేవారు. ఆమె బ్యాండ్ వాయించడం ఎంత ఉధృతంగా ఉండేది అంటే కర్రలు తప్పనిసరిగా విరిగిపోయేవి! అందుకే బ్యాకప్గా నాలుగు జతల కర్రలను తీసుకువెళ్లేవారు. స్కూల్ రోజుల్లో గిటార్ వాయించేవారు.వయసుతో పాటు ఉత్సాహం పెరుగుతూనే ఉంది..! కళలపై ఎంత పాషన్ ఉన్నా సరే వయసుతోపాటు కొందరిలో ఉత్సాహం తగ్గిపోతుంది. అయితే తకాయిచి అలా కాదు. ఇప్పటికీ ఇంట్లో డ్రమ్స్ వాయిస్తారు. రాజకీయాలు అన్నాక ఒత్తిడి సహజం కదా! ఎప్పుడైనా మరీ ఒత్తిడికి గురైనప్పుడు డ్రమ్స్ వాయించే సమయం రెట్టింపు అవుతుంది.రాజకీయ నేపథ్యం లేదు... ధైర్యం మాత్రమే ఉంది... జపాన్లోని పితృస్వామ్య రాజకీయ వ్యవస్థలో తకాయిచి ప్రధానిగా ఎన్నికకావడం అనేది ఆశ్చర్యకరమైన, అరుదైన విజయం. ఆమె దేశభక్తి విద్యను ప్రోత్సహిస్తున్నారు. యుద్ధాలను త్యజించే విధానాలకు మద్దతు ఇచ్చారు. తన రాజకీయ సహచరులలో చాలామందిలా ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. తండ్రి ఒక కార్ల కంపెనీలో పనిచేసేవాడు. తల్లి పోలీస్ ఆఫీసర్. రాజకీయాల్లోకి రాక ముందు తకాయిచి టీవి కామెంటేటర్గా పనిచేసేవారు. నవ్వుతూ, నవ్విస్తూ ఇంటర్వ్యూలు, టీవి కార్యక్రమాలు చేసేవారు. జపాన్ పార్లమెంట్లో మొదటిసారి అడుగు పెట్టిన కాలంలో తన జుట్టు స్టైల్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైల్లా ఉండాలి’ అని హెయిర్ డ్రెస్సర్కు చెప్పారు.మార్గరెట్ థాచర్కు ఆమె వీరాభిమాని... ‘గుంపు వెంట పరుగెత్తడం కాదు... ఆ సమూహం నిన్ను అనుసరించేలా చేసుకోవాలి’... ఇలా థాచర్ ప్రసిద్ధ మాటలు ఎన్నో తకాయిచి నోట వినిపించేవి.బైక్ రైడింగ్కు గుడ్బై... బైక్ రైడింగ్ అంటే తకాయిచికి బోలెడు ఇష్టం. సమయం చిక్కేది కాదా? భద్రతా కారణాలా? తెలియదుగానీ 32 సంవత్సరాల వయసులో పార్లమెంట్లోకి అడుగు పెట్టిన తకాయిచి తనకు అత్యంత ప్రియమైన కవాసకి జెడ్400జీపి మోటర్ సైకిల్కు గుడ్బై చెప్పారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపి)లో తనదైన ప్రత్యేకత నిలుపుకున్న తకాయిచి ఎన్నో క్యాబినెట్ ర్యాంక్ పదవుల్లో రాణించారు. పార్టీ పాలసీ రీసెర్చ్ కౌన్సిల్కు అధ్యక్షురాలిగా పనిచేశారు.భవిష్యత్ ఏమిటి? ‘ప్రధానిగా తకాయిచి ఎన్నిక పార్టీకి అదృష్టాన్ని తెస్తుందా? పార్టీని పునర్జీవింపజేస్తుందా? లేక పార్టీ క్షీణతను వేగవంతం చేస్తుందా?’ అంటూ విశ్లేషణలు చేస్తున్నారు రాజకీయ పండితులు.మహిళలకు సంబంధించి ఆమెకు ఉన్న అభిప్రాయాలు కొన్ని వివాదాస్పదం అయ్యాయి. అయితే ఎన్నికల ప్రచారంలో బేబీ సిట్టింగ్ కోసం పన్ను మినహాయింపులు, పిల్లల సంరక్షణ కోసం కార్పొరెట్ ప్రోత్సాహకాలను ప్రతిపాదించడం అనేది మహిళా–స్నేహపూర్వక విధానాల వైపు తకాయిచి అడుగులు వేస్తున్నారు అని చెప్పడానికి సంకేతం. ఒక లవ్ స్టోరీ... లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)లో తన రాజకీయ సహచరుడు యమమోటోను తకాయిచి వివాహం చేసుకున్నారు. అతడు ఆమెను ఎంతోకాలంగా మౌనంగా ప్రేమిస్తున్నాడు. ఇట్టి విషయాన్ని ఆమె గమనించక పోలేదు. ఒకానొక రోజు ఆయన ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేశారు. ఆమె ఒప్పుకున్నారు. పెళ్లి జరిగింది. ‘మీకు లవ్ యూ చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. మీరు అంత త్వరగా ఎలా ఒప్పుకున్నారు?’ అనే ప్రశ్నకు తకాయిచి ఇలా జోక్ చేశారు... ‘నిజం చెప్పమంటారా! నేను భోజనప్రియురాలిని. మంచి రుచికరమైన భోజనం చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. యమమోటోని పెళ్లి చేసుకుంటే మంచి భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ధైర్యంతో ఒప్పుకున్నాను. ఎందుకంటే ఆయన ట్రైన్డ్ చెఫ్!’ రాజకీయా అభిప్రాయాలలో తేడా కారణంగా విడిపోయిన ఈ దంపతులు 2021లో తిరిగి వివాహం చేసుకున్నారు. -
శ్రీలంకను భారత భద్రతకు ముప్పుగా మారనివ్వను
న్యూఢిల్లీ: శ్రీలంక గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకుని తీరతానని శ్రీలంక మహిళా ప్రధాని హరిణి అమరసూర్య వ్యాఖ్యానించారు. ఢిల్లీలో డిగ్రీ చదువుకున్న రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. 1991–94కాలంలో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో సోషియాలజీలో డిగ్రీ చదువుకున్న నేపథ్యంలో గురువారం ఆమె పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘శ్రీలంక నిరంతరం ఒకే నిబంధనకు కట్టుబడి ఉంటుంది. పొరుగున ఉన్న మిత్రదేశం భారత్కు ముప్పు వాటిల్లేలా మా భూభాగాన్ని ఎలాంటి భారతవ్యతిరేక కార్యకలాపాలకు నెలవు కానివ్వను. ఈ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తాం’’అని అన్నారు. తమ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి గత ప్రభుత్వం కూలిపోవడంపై ఆమె మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం అనేది ప్రేక్షకులు ఆస్వాదించే క్రీడ కాదు. అతి నిరంతర అవిశ్రాంత కృషి. అంటే మన సమాజంతో ఎల్లప్పుడూ మమేకం కావాలి. న్యాయం కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరూ తమతమ స్థాయిలో అందరి సంక్షేమం కోసం పాటుపడాలి. శ్రీలంక దేశ చరిత్రలో భారత్ శాశ్వత భాగస్వామిగా కీర్తికిరీటం పొందింది. ద్వీపం అయిన మా దేశంలో ఆర్థికసంక్షోభం తలెత్తినప్పుడు భారత్ నిజమైన నేస్తంలా ఆపన్న హస్తం అందించింది’’అని ఆమె అన్నారు. జయసూర్య తెలుసా? ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని భారత్, శ్రీలంకలో చూడొచ్చు. నాలాంటి సాధారణ వ్యక్తులను సైతం సమాజంలోని సమస్యలు, విద్యావ్యవస్థ రాటుదేలేలా చేస్తాయి. దేశసేవ చేసే స్థాయికి ఎదగనిస్తాయి. పాక్ జలసంధి కేవలం 22 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే సముద్రం వెంట భారత్, శ్రీలంకలను విడదీస్తోంది. కానీ ఇరుదేశాల నాగరికత, సాంస్కృతి, మత, ప్రాచీన బంధం ఏకంగా 2,000 సంవత్సరాల క్రితమే బలపడింది. ఇప్పుడు క్రికె ట్ సైతం ఈ బంధాన్ని పెనవేస్తోంది. 1991 లో ఇక్కడ డిగ్రీ ఆనర్స్ చదివేందుకు హిందూ కాలేజీలో తొలిసారి అడుగు పెట్టినప్పుడు నా పేరు చెప్పా. నాది శ్రీలంక అని తెలిసి చాలా మంది ఒక్కటే ప్రశ్న వేశారు. నీకు క్రికెటర్ జయసూర్య తెలుసా?’’అని ఆమె అన గానే పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ అంజూ శ్రీవాస్తవసహా నాటి ఆమె స్నేహితులు పక్కున నవ్వారు. ‘‘భారత్, శ్రీలంకలు ఒకే సంప్రదాయ వారసత్వం, విలువలు, పరస్పర గౌరవాలతో ఎదిగాయి. ఈ సంస్కృతి బంధం పోగులే ఇరు దేశాల సమాజ సౌభ్రాత్వాన్ని పెనవేసేలా చేశాయి. కొన్ని విషయాల్లో మనలో మనకు కొన్ని పొరపొచ్చాలు రావొచ్చు. కానీ చివరకు అందరం ఇరుగుపొరుగున కలిసే జీవిస్తున్నాం. కలిసి పనిచేస్తున్నాం. చివరకు ఒకరినొకరం గౌరవించుకుంటున్నాం. శ్రీలంక ఆర్థిక పురోభివృద్ధికి భారత్ ఎంతగానో సాయపడుతోంది. కష్టకాలంలో మా ఆర్థిక స్థిరత్వం, ప్రగతికి భారత్ అండగా నిలబడింది. 2022లో తీవ్ర ఆర్థికసంక్షోభంలో మేం కూరుకుపోతే భారత్ రుణసాయం చేసింది. ఈ సాయాన్ని మేం ఏనాటికీ మరువం. ఇరుదేశాల భాగస్వామ్యం నేటి తాత్కాలిక అగత్యం కాదు. రేపటి శాశ్వత అవసరం. గత డిసెంబర్లో మా దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె ఢిల్లీలో పర్యటించడం, ఏప్రిల్లో లంకలో మోదీ పర్యటన బలపడుతున్న ఇరుదేశాల బంధానికి గుర్తులు’’అని ఆమె అన్నారు. -
జపాన్ కొత్త ప్రధాని తకైచి
టోక్యో: జపాన్ చరిత్రలో తొలిసారి ఒక మహిళ ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్నారు. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్షురాలిగా ఆర్థిక భద్రత శాఖ మాజీ మంత్రి సనే తకైచి (64) ఎన్నికయ్యారు. జపాన్లో అధికార పార్టీ అధ్యక్షుడే ప్రధాని అవుతారు. శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ శాఖ మంత్రి షింజిరో కొయిజుమిపై ఆమె గెలుపొందారు. షింజిరో కొయిజుమి ఆ దేశ మాజీ ప్రధాని జునిచిరో కొయిజుమి కుమారుడు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబా నిర్ణయించుకోవటంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎగువ, దిగువ సభల ఎన్నికల్లో ఎల్డీపీ ఓటమి చవిచూడటంతో షిగెరు నాయకత్వంపై పార్టీ నేతలు విశ్వాసం కోల్పోయారు. అయితే ప్రధానిని ఎన్నుకునే దిగువ సభలో ఇప్పటికీ ఎల్డీపీనే అతిపెద్ద పార్టీగా ఉండటంతో తకైచి ప్రధాని కావటం ఖాయమని చెబుతున్నారు. మరో పది రోజుల్లో జపాన్ పార్లమెంటు కొత్త ప్రధానిని ఎన్నుకొనే అవకాశం ఉంది. చైనాకు ప్రబల శత్రువు సనే తకైచికి జపాన్ రాజకీయాల్లో అత్యంత సంప్రదాయవాదిగా పేరుంది. ఆమె మాజీ ప్రధాని షింజో అబె విధానాలకు అతిపెద్ద మద్దతుదారు. చైనాను ప్రబల శత్రువుగా భావిస్తారు. జపాన్ సైనికీకరణకు గుర్తుగా భావించే యషుకుని ఆలయాన్ని ఆమె తరుచూ సందర్శిస్తుంటారు. పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత ఆమె మాట్లాడుతూ.. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తాను మొదట చేయబోయే పని దేశంలో పెరిగిపోతున్న వస్తువుల ధరలను తగ్గించటమేనని తెలిపారు. అమెరికాతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయతి్నస్తానని చెప్పారు. దేశానికి కొత్తగా ఎదురవుతున్న భద్రత, దౌత్య సవాళ్లపై దృష్టిపెడుతానని వెల్లడించారు. అయితే, ఆమె పదవి చేపట్టిన వెంటనే అతిపెద్ద దౌత్య సవాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణకొరియాలో ఈ నెల 31 నుంచి ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ఆ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడితో ఆమె జపాన్ ప్రధాని హోదాలో ముఖాముఖి సమావేశం కావాల్సి ఉంటుంది. ఇటీవల మిత్ర దేశాలపై కూడా ఎడాపెడా టారిఫ్లు విధిస్తున్న ట్రంప్.. జపాన్ను కూడా వదల్లేదు. మరోవైపు జపాన్ తన సైనిక వ్యయాన్ని పెంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో దౌత్య సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని తకైచి తెలిపారు. మరోవైపు దేశంలో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఎల్డీపీకి ఎదురుగాలి వీస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని రెండు సభల్లోనూ ఆ పార్టీ మెజారిటీ కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ తన పారీ్టపై ప్రజలకు విశ్వాసం కల్పించటం తకైచి ముందున్న అతిపెద్ద సవాలు. పట్టువదలని సంకల్పంసనే తకైచి ఎల్డీపీ అధ్యక్ష పదవికి 2021లోనే పోటీ పడ్డారు. అయితే, నాడు ఆమె విపరీత సంప్రదాయ భావాలను వ్యతిరేకించిన పారీ్టలోని మెజారిటీ సభ్యులు ఆమెను ఓడించారు. దీంతో నాడు ఆమె మూడో స్థానంలో నిలిచారు. తకైచి 1961 మార్చి 7న నారా ప్రావిన్స్లోని యమటోకొయిరామాలో జని్మంచారు. ఆమె కోబె యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదివారు. అనంతరం బ్రాడ్కాస్టర్గా, రాజకీయ సలహాదారుగా పనిచేశారు. పలు రచనలు కూడా చేశారు. అనంతరం ఎల్డీపీలో చేరి 1993లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని షింజో అబెకు ఆమె ప్రధాన అనుచరురాలిగా గుర్తింపు పొందారు. ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. 2019–20 మధ్య దేశ అంతర్గత వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. ఫుమియో కిషిడా మంత్రివర్గంలో 2022–24 మధ్య ఆర్థిక భద్రత సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024లో కూడా ఆమె పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ, ప్రస్తుత ప్రధాని షిగేరు ఇషిబా చేతిలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి పట్టువదలక ప్రయత్నించి విజయం సాధించి ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ఆమె జపాన్ తొలి మహిళా ప్రధానిగానే కాకుండా నారా ప్రావిన్స్ నుంచి తొలి ప్రధానిగా కూడా రికార్డు సృష్టించబోతున్నారు. -
జయము.. జయము.. మహారాణి!
ప్రపంచంలో ఇద్దరూ మహిళలే ‘పెద్దలు’గా ఉన్న దేశంగా ఐరోపాలోని ఎస్టోనియా అవతరించింది. అవును. ‘అవతరణ’ అనే అనాలి. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఏక కాలంలో ప్రధాని, ప్రెసిడెంట్ మహిళలుగా లేరు. ఈనెల 26 న 43 ఏళ్ల కాజా కల్లాస్ ఎస్టోనియా దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ దేశానికి ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపు వచ్చింది. అధ్యక్షురాలిగా కెర్స్తీ కల్జులైడ్ (51) అంతకుముందు నుంచే ఉన్నారు. వీళ్లిద్దరూ రాజకీయ నాయకులే అయినా, ప్రజలెన్నుకున్న మహారాణులు. వైఫ్ క్యారీయింగ్ క్రీడకు ఎస్టోనియా ప్రసిద్ధి. భార్యల్ని వీపుౖÐð మోస్తూ భర్తలు రన్నింగ్ రేస్ చేసే ఆట అది. ఇప్పుడు ఆ దేశ ప్రజల బాధ్యతల్ని మోస్తున్న ‘నాథులు’ ప్రధాని కాజా, అధ్యక్షురాలు కల్జులైడ్. ఏక కాలంలో దేశాధినేతలుగా ఇద్దరూ మహిళలే ఉండటం ప్రపంచంలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్, బార్బడోస్, డెన్మార్క్ దేశాలకు, గతంలో బ్రిటన్ వంటి మరి కొన్ని దేశాలకు ఏక కాలంలో మహిళా దేశాధినేతలు ఉన్నప్పటికి, ఆ దేశాల మహిళా ప్రధానులు మాత్రమే ప్రజల చేత ఎన్నికైనవారు. రెండోవారు వారసత్వంగా రాణులుగా ఉన్నవారు. అందుకే ఎస్టోనియాను ఇప్పుడు ప్రపంచంలోని ఏకైక మహిళా రాజ్యం అనడం. పదిహేను మంది సభ్యులున్న ఎస్టోనియా కేబినెట్లో సగానికిపైగా మహిళలే మంత్రులుగా ఉండటం కూడా మరొక విశేషం. ఎస్టోనియాకు 1991లో స్వాతంత్య్రం వచ్చాక ఆ దేశానికి ప్రధాని అయిన తొలి మహిళ కల్లాస్ అయితే, 2016 నుంచీ అధ్యక్షురాలిగా ఉన్నవారు కల్జులైడ్. ఈ ఏడాది సెప్టెంబరు తో ఆమె పదవీ కాలం ముగుస్తుంది. మళ్లీ కనుక ఎన్నికైతే మరో ఐదేళ్ల పాటు ‘మహిళా రాజ్యం’గా ఉంటుంది ఎస్టోనియా. ఆ దేశంలోని రెండు ప్రధాన పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి నాయకురాలిగా ఎన్నికైన కల్లాస్ చేత గత మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు కల్జులైడ్. కల్లాస్ 2010 లో రాజకీయాల్లోకి వచ్చారు. ‘లా’ స్టూడెంట్గా దేశ రాజకీయాలను అధ్యయనం చేయడం రాజకీయాలపై ఆమెకు ఆసక్తిని కలుగజేసింది. ఎస్టోనియన్ రిఫార్మ్ పార్టీలో చేరి ఈ స్థాయికి ఎదిగారు. ఎస్టోనియన్ భాషతో పాటు ఇంగ్లిష్, రష్యన్, ఫ్రెంచి భాషలను ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. ముగ్గురు పిల్లల తల్లి కల్లాస్. ఇక అధ్యక్షురాలు కల్జులైడ్ 2001లో రాజకీయాల్లోకి వచ్చారు. తొలినాళ్లలో ‘ప్రోపాట్రియా యూనియన్ పార్టీ’లో ఉన్నారు. ప్రస్తుతం ‘సోషల్ డెమెక్రాటిక్ పార్టీ’ మద్దతుతో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. కల్జులైడ్ ఎం.బి.ఎ. చదివారు. బిజినెస్ను కెరీర్ గా ఎంచుకుని కొన్నాళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కల్లాస్ లానే బహుభాషా ప్రవీణురాలు. నలుగురు పిల్లల తల్లి. ఇప్పుడీ ‘మహరాణులు’ ఇద్దరూ ప్రజల్ని తమ పిల్లలుగా పాలించబోతున్నారనే అనుకోవాలి. -
బ్రిటన్కు మహిళా ప్రధాని ఖాయం
లండన్: మార్గరెట్ థాచర్ అనంతరం మరోసారి బ్రిటన్కు మహిళా ప్రధాని రావడం ఖాయమైంది. గురువారం నిర్వహించిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పోటీ రెండో రౌండ్లో మహిళలైన హోం శాఖ కార్యదర్శి థెరెసా మే, ఇంధన శాఖ మంత్రి ఆండ్రియా లీడ్సమ్లు తుది బరిలో నిలిచారు. పురుష అభ్యర్థిగా ఉన్న న్యాయ శాఖ కార్యదర్శి మైఖేల్ గోవ్ కేవలం 46 ఓట్లు సాధించి పోటీ నుంచి వైదొలిగారు. మేకు 199 ఓట్లు, లీడ్సమ్కు 84 ఓట్లు దక్కాయి. బ్రెగ్జిట్ ఫలితం అనంతరం ప్రధాని పదవి నుంచి మూడు నెలల్లో వైదొలుగుతున్నట్లు డేవిడ్ కామెరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మైఖేల్ గోవ్ తప్పుకోవడంతో మే, ఆండ్రియా మధ్య తుది పోరు ఖరారైంది. తుది రౌండ్ ఎన్నికల కోసం వీరిద్దరు తమ ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. సెప్టెంబర్ 9న విజేతను ప్రకటిస్తారు.


