మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంతిమ యాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం సైనిక లాంఛనాలతో యాత్ర మొదలైంది. కలాం అంత్యక్రియలు తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పేక్కరుంబు గ్రామంలో ఆయన బంధువులు ఎంపిక చేసిన స్థలంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఇస్లాం సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు కలాం అంత్యక్రియల్లో పాల్గొనేవారి కోసం మధురై నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇక కలాం అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Jul 30 2015 10:33 AM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement