-
జీతాలు రావు..సెలవుల్లేవు!
నిన్న.. మొన్నటివరకు 108, 104 వాహనాల సిబ్బంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే కోవలోకి తాజాగా 102 వాహన (తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్) సిబ్బంది చేరిపోయారు. టీడీపీ ప్రభుత్వం 2016 జనవరి ఒకటో తేదీ నుంచి ఈ వాహనాలను తెరపైకి తెచ్చినప్పటికీ ఇప్పటికీ విధివిధానాల్లేక సిబ్బంది పడరానిపాట్లు పడుతున్నారు. ఓ ఏజెన్సీకి వీటి నిర్వహణ బాధ్యతలను సర్కార్ అప్పగించింది. జీతాల్లేక, రిలీవర్లు ఉండక.. ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాశీబుగ్గ: పేరుగొప్ప..ఊరుదిబ్బ చందంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తీరు. ఆర్భాటంగా పథకాలను ప్రారంభించి తరువాత వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 102 వాహనాల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణిని.. డెలివరీ తరువాత తల్లీబిడ్డను ఇంటికి క్షేమంగా తీసుకెళ్లేందుకు 102 వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే వీటిలో పని చేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. రోజంతా ఒక్కరే డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. కనీసం రిలీవర్ను కూడా కేటాయించడం లేదు. పీఎఫ్ సౌకర్యం ఉందో..లేదో తెలియక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సర్కార్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. వాహనాలు కేటాయించిన ఆస్పత్రులు శ్రీకాకుళం కేంద్ర ఆస్పత్రికి:4, నరసన్నపేటకు:2, పలాస, కొత్తూరు, టెక్కలి, సొంపేట, పాలకొండ, పాతపట్నం, రాజాం ఆస్పత్రులకు ఒకొక్కటీ. సమస్యలు పరిష్కారిస్తాం 102 వాహనాలు సక్రమంగానే నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల పేదలకు వరంగా ఉన్నాయి. సిబ్బంది సమస్యలు ఇంతవరకు మా దృష్టికిరాలేదు. జీతాలు ఏజెన్సీలు చెల్లిస్తాయి.అలస్యమైతే వారితో మాట్లాడి జీతాలు అందేలా చూస్తాం. –సనపల తిరుపతిరావు, డీఎంహెచ్వో,శ్రీకాకుళం -
వేతనాలు పెరగలేదు..తగ్గాయి
► కొత్త విధానంతో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని నష్టం ► తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకున్నప్పటికీ, వాస్తవానికి వారి వేతనాలు తగ్గాయని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీకి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు బలయ్యారని యూనియన్ అధ్యక్షులు వి.కుమారస్వామి, ప్రధాన కార్య దర్శి ఎస్.వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కె.సత్యం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైస్కిల్డ్ కార్మికుడికి రూ.23 వేలు, స్కిల్డ్ కార్మికుడికి రూ.19 వేలు, సెమీస్కిల్డ్ కార్మికుడికి రూ.16 వేలు, అన్స్కిల్డ్ కార్మికుడికి రూ.14 వేల వేతనం ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారని, అయితే, ఈ నాలుగు కేటగిరీల కార్మికులకు వాస్తవానికి వచ్చేది వరుసగా రూ.16,676, రూ.13,774, రూ.11,705, రూ.10,241ల వేతనం మాత్ర మేనన్నారు. విద్యుత్ సంస్థల యాజమాన్యా లు కట్టాల్సిన పీఎఫ్, ఈఎస్ఐల వాటాలనూ కార్మికుల వేతనాల నుంచి కోతపెట్టి చెల్లించే విధంగా కొత్త విధానాన్ని రూపొందిం చడంతో కార్మికుల చేతికి వచ్చే వేతనాలు భారీగా తగ్గిపోయాయన్నారు. గతంలో చేసే పనిని బట్టి స్కిల్డ్ వేతనం పొందిన అనేక మంది తక్కువ చదువుకున్న కార్మికులు, చదువులేని కార్మికులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్టిజన్–4 కేటగిరీలోకి వెళ్లారన్నా రు. దీంతో రూ.15,870 వేతనం పొందు తున్న సీబీడీ గ్యాంగ్ వర్కర్లు, రూ.12,722 వేతనం పొందుతున్న చదువులేని స్కిల్డ్ వర్కర్ల వేతనం రూ.10,241కు తగ్గిపోయిం దన్నారు. పే రివిజన్ సందర్భంగా సంపాదిం చుకున్న 12 శాతం స్పెషల్ అలవెన్స్, జెన్కో లో డక్ట్ అలవెన్స్, షిఫ్టు అలవెన్స్లూ పోయా యన్నారు. విద్యుత్ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో జరుగుతున్న అన్యాయానికి నిర సనగా సెప్టెంబర్ 6న డిమాండ్ బ్యాడ్జీలు ధరించాలని, 12న టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని, 19న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement