breaking news
Tribal life
-
ఆదివాసీల గోదారమ్మ
గిరిజనుల జీవనం చెట్టు... పుట్ట... మధ్య ప్రకృతితో ముడివడి ఉంటుంది. దాంతో ఆదివాసీల జీవన విధానంలో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. గోదావరి తీరాన నివసించే ఆదివాసీలకూ ఓ ప్రత్యేకమైన జీవనశైలి ఉంది. గోదావరికి ఉన్నట్లే వారి జీవనశైలికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, ప్రధాన్లు, కొలామ్లు వంటి 14 గిరిజన తెగలున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోభా ఆలయం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఉంది. ఇది గోదావరి తీరానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏటా జాతర సందర్భంగా వారు తమ దైవాన్ని గోదావరి జలంతోనే అభిషేకిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆనవాయితీని తప్పరు. ఏటా జాతరకు ముందు గూడెంలోని వాళ్లు ఒక బృందంగా ఏర్పడి కుండలతో గోదావరి జలం కోసం బయలుదేరుతారు. ఒక్కొక్కరు ఒక్కో కుండను మోస్తూ వందకిలోమీటర్ల దూరాన్ని కాలినడకనే వెళ్తారు. అయితే ఇక్కడో నిబంధన ఉంటుంది. ఒక ఏడాది వెళ్లిన దారిలో మరో ఏడాది వెళ్లకుండా మార్గాన్ని నిర్ణయించుకుంటారు. గోదావరి నది తీరం నుంచి నాగోబా ఆలయం వరకు ఉన్న ఆదివాసీల గూడేలను కలుపుకుంటూ జలయాత్ర సాగుతుంది. ఏడాదికి కొన్ని గూడేల చొప్పున ఈ జలయాత్రకు మార్గంగా మారతాయన్నమాట. వీరు పుష్కరాల సమయంలో గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేస్తారు. రాష్ట్రంలో ప్రసిద్ధి! ఈ నది ఒడ్డునే వారి ఆరాధ్య దైవం పద్మల్ పూరి కాకో (పెద్ద అమ్మమ్మ) అమ్మవారు వెలిసింది. దండేపల్లి మండలంలోని గుడిరేవు వద్ద గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం వరదల తాకిడికి శిథిలమైంది. ప్రస్తుతం పద్మల్ పూరికాకో విగ్రహాలను అక్కడే ఉన్న చెట్టు కింద ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఏడాదికి రెండు ఉత్సవాలు! దసరా - దీపావళి పండగల మధ్య రోజుల్లో భారీ ఎత్తున జరిగే ఈ ఉత్సవాలను దండారి ఉత్సవాలుగా వ్యవహరిస్తారు. పుష్య మాసంలో పెర్షాపెన్ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలు, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్న ఆదివాసీలు కూడా వస్తారు. గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని నిష్ఠతో కొలుస్తారు. కోళ్లు, మేకలు బలిచ్చి భోజనాలు చేస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా చేసే గుస్సాడి నృత్యాలు అలరిస్తాయి. ఉత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా కొందరు కాకో అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలతో గోదారమ్మను శాంతింప చేయాలని వారి విశ్వాసం. - పాత బాలప్రసాద్, బ్యూరోఇన్చార్జి, ఫొటోలు: మోదంపురం వెంకటేష్, ఆదిలాబాద్ గోదారమ్మకు శాంతి జేస్తాం... ఏటా గోదారమ్మకు శాంతి పూజలు జేస్తాం. పుష్కరాల సమయంలో కూడా ఈ పూజలు నిర్వహిస్తాం. స్నానాలు చేస్తాం. అగ్గినిపుకలను అగ్గి ఉండగానే పొడి చేసి, పసుపు, కుంకుమతో పాటు మరో ఏడు రకాల రంగుల పిండితో పట్టు పరుస్తాం. బియ్యం పోసి, తెల్లకోడి, నల్లకోడితో పూజలు చేసి వాటన్నింటిని ఆకులతో చేసిన డొప్పల్లో పెట్టి గోదావరిలో వదులుతాం, అలా గోదారమ్మకు శాంతి చేసి అందరం నదిలో స్నానాలు చేస్తాం. ఆ తర్వాత మా ఆరాధ్య దైవాలకు పూజలు చేస్తాం. - రాయిసిడాం దాము పటేల్, వందుర్గూడ, దండేపల్లి మండలం ఆదిలాబాద్ జిల్లా -
అరణ్య రోదన
అడుగడుగునా అడవి బిడ్డలకు కష్టాల పలకరింపు గుక్కెడు నీటి కోసం బారెడు దూరం.. పనులు లేక పట్నం బాట పాలకులు మారినా అవే దుర్భర బతుకులు స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా ఆదివాసీల జీవనంలో మార్పు లేదు.. వారి బతుకులు మారలేదు.. అదే అరణ్య రోదన.. నరకానికి నకళ్లు చూపించే రహదారులు.. దాహం తీర్చుకోవడానికి మైళ్ల దూరం నడక.. రోగమొచ్చినా.. నొప్పొచ్చినా.. కడుపునొచ్చినా నాటు వైద్యమే దిక్కు.. ప్రభుత్వ వైద్యులు ఉన్నా లేనికిందకే లెక్క.. స్థానికంగా ఉండకపోవడం.. ఉన్నా సరైన వైద్యం అందించకపోవడంతో ఏటా వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నారుు.. చదువుకుంటే విజ్ఞానం పెరిగి అభివృద్ధి చెందుతారనుకుంటే అజ్ఞానంలోనే కాలం వెళ్లదీస్తున్నారు.. అనేక పల్లెలు, తండాలు, గూడేలు విద్యుత్ వెలుగులకు నోచుకోక అంధకారంలోనే మగ్గుతున్నాయి.. ఉపాధి లేక ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి పొట్టచేత పట్టుకుని వలస వెళ్తున్నారు.. ఇంత దుర్భరమైన జీవనం గడుపుతున్నా గిరిజనులపై సర్కారుకు కనీస ప్రేమ లేదు.. అడవి బిడ్డలను పట్టించుకోవాలి.. వారి కలలను సాకారం చేయూలి.. జిల్లాలోని 13 మండలాల్లో విస్తరించి ఉన్న 177 గ్రామాల్లోని 2 లక్షల మంది అడవి బిడ్డల దీనస్థితిపై ‘సాక్షి’ ఫోకస్.. - ములుగు/ఏటూరునాగారం/కొత్తగూడ/మంగపేట సదువు సాగదు.. ఏజెన్సీ పిల్లలు బడికి వెళ్లాలంటే నిత్యం ప్రయాసే. గూడేనికి మైళ్ల దూరంలో పాఠశాల ఉండడంతో విద్యార్థులు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి. వీరిని పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తీసుకెళ్లాలి. మళ్లీ బడి ముగిశాక తీసుకురావడానికి అదే పరిస్థితి. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను అధికారులు రేషనలైజేషన్ పేరుతో మూసివేశారు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లోని విద్యార్థులు పక్కనే ఉన్న గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు ఇలా ఫొటోలో కనిపిస్తున్నట్లు సైకిల్ మీద వారి పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్నారు. ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఆదివాసీలు ఎన్ని పనులు ఉన్నా సాయంత్రం పాఠశాల వదిలే సమయానికి తిరిగి వారి పిల్లలను తీసుకురావడానికి తంటాలు పడుతున్నారు. తమ గ్రామంలో పాఠశాల ఉంటే కష్టాలు తీరుతాయని ములుగు మండలంలోని లాలాయిగూడెం, దుబ్బగూడెం, పత్తిపల్లి, కొడిశలకుంట, జగ్గన్నపేట, ఏటూరునాగారం మండలం ముల్లకట్ట, మంగపేట మండలం నడిమిగూడెం, కొత్తగూడ మండలం పుల్సంవారిగుంపు, పెద్దెల్లాపూర్తోపాటు వెంకటాపురం, గోవిందరావుపేట మండలాల్లో రేషనలైజేషన్ పేరుతో పదుల సంఖ్యలో ఉన్న ఐటీడీఏ పాఠశాలలను అధికారులు మూసివేశారు. వాటిని పునఃప్రారంభించి ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు. రవాణా బహుదూరం ఏజెన్సీలోని గిరిజన గూడేలకు రవాణా దూరం.. భారంగా మారింది. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నేటికీ ఎడ్ల బండ్లు, సైకిళ్ల మీద ప్రయాణం చేయడం పరిపాటిగా మారింది. వాగులు, ఒర్రెలు నిత్యం ప్రజల రవాణాను అడ్డుకుంటూ గిరిజనులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోగమొస్తే డొల్లాలు, మంచాలను కట్టుకొని పది మైళ్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారికి చేరుకోవాల్సిన దుస్థితి. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో. వాగులపై కల్వర్టులు, బ్రిడ్జిలు లేకపోవడంతో రాంపూర్, ఐలాపురం, సర్వాయి, చిట్యాల, భూపతిపూర్, లింగాల, రాయబంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రవాణా మార్గం లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఉపాధి లేక వలసలు గిరిజన గూడేల్లో ఉపాధి పనులు లేకపోవడంతో గిరిజనులు వలసపోతున్నారు. ఉపాధిహామీ పథకం మారుమూల అటవీ గ్రామాల్లో చేపట్టకపోవడంతో కూలీ పనుల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వరి, మిరప పంటల్లో పనిలేదు. దీంతో ట్రాక్టర్లు, కాలినడకన ఇతర గ్రామాలకు చేరుకొని అక్కడ పొద్దంతా కూలీ పనులు చేసి ఇంటికి తిరిగి రావాల్సి వస్తోంది. ఇంకా గొత్తికోయగూడేల్లో సైతం గిరిజనులు ఏటూరునాగార ం నుంచి ఇతర గ్రామాలకు పనులకు వెళ్తున్నారు. వ్యవసాయ పనులు దూరమవుతుంటే.. భవన నిర్మాణ కూలీ పనులపై గిరిజనులు ఆధారపడాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొంది. దరి చేరని వైద్యం ఏజెన్సీలో వైద్యం అందక ఆదివాసీలు విలవిలలాడుతున్నారు. మంగపేట మండలంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. కడుపునొప్పి, జ్వరం వచ్చినా గ్రామాల్లో వైద్య సేవలు అందకపోవడంతో సమీపంలోని మంగపేట, రాజుపేటలోని ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం వంటి పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని గిరిజనులు ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు నాటు వైద్యాన్ని నమ్ముకుని ప్రాణాలు వదులుతున్నారు. మంగపేట, చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ ఆయా కేంద్రాల పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పీహెచ్సీల వైద్యాధికారులు ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు తప్ప మరెవరికీ తెలవకపోవడం గమనార్హం. వాతావరణ పరిస్థితులను బట్టి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉంటూ గ్రామాల్లో పరిస్థితులను పర్యవేక్షించాల్సిన కొందరు ఏఎన్ఎంలు మండల కేంద్రాల్లో ఉంటూ వారంలో ఒకరోజు సబ్సెంటర్కు వచ్చి వెళ్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో ఫార్మసిస్టు, స్టాఫ్నర్స్ ఇచ్చే మాత్రలు తీసుకొని వెళ్తున్నారు. డీడీలు కట్టినా... జిల్లాలోని 177 ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కోసం ఐటీడీఏ పథకాలను ప్రవేశపెడుతూ అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా సంస్థ ఎలాంటి పనులు చేపట్టలేదని తెలుస్తోంది. మారుమూల గిరిజన గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం లేక గిరిజన రైతులు వ్యవసాయానికి నీటిని పెట్టుకోలేని పరిస్థితి. కొత్తగూడ మండలం గంగారం పంచాయతీ పరిధిలోని కొడిశలమిట్ట గ్రామంలోని సుమారు 24 మంది రైతులు వ్యవసాయ విద్యుత్ కోసం 2011లో రూ.6,150 చొప్పున డీడీలు తీశారు. అలాగే సొంత డబ్బులు వెచ్చించి బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. డీడీలు కట్టి మూడేళ్లు గడిచినా త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్కు ఇప్పటికీ పదిహేడుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ట్రాన్స్కో అధికారులకు ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు అయితేగాని గిరిజన రైతుల కష్టాలు తీరవు. నీటి కష్టాలు ఫొటోలో కనిపిస్తున్న వీరు ములుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పగిడపల్లి ఆదివాసీ గిరిజన మహిళలు. వీరు వర్షాకాలం, చలికాలం తాగునీటికి ఇబ్బందిపడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న మంచినీటి బావి వద్దకు బిందె నెత్తిన పెట్టుకుని పరుగులు తీస్తారు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలో నిలబడి నీటిని తోడుకుంటారు. తర్వాత బిందె నెత్తిన పెట్టుకొని ఇంటి దారి పడతారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. వీరే కాకుండా చుట్టుపక్కల ఉన్న కన్నాయిగూడెం, సర్వాపురం, పంచోత్కులపల్లి, కొత్తూరు, దుబ్బగూడెం, లాలాయిగూడెం , ఏటూరునాగారం మండలం ఐలాపురం, అల్లంవారి ఘనపురం, చెల్పాక, రాంపూర్, మంగపేట మండలం శెనగకుంట, పూరేడుపల్లి, దోమెడ, తక్కళ్లపల్లి, తాడ్వాయి మండలం మేడారం, కాల్వపల్లి, నార్లాపూర్, ఆశన్నగూడెం, కొత్తగూడ మండలం పూనుగొండ్ల, దుబ్బగూడెం, జంగవానిగూడెం, చిట్యాల తండా, వెంకన్నగుంపు, తిర్మలగండి ఏజెన్సీ గ్రామాల్లోనూ నీటి కోసం కష్టాలు పడుతున్నారు. ఇక వేసవిలో గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతారు. ఇక్కడి ప్రజలు వర్షాకాలం ఎప్పుడొస్తుందా అని.. కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. భూగర్భ జలవనరులు ఈ ప్రాంతంలో తక్కువగా ఉండడంతో వేలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ బోర్లు వృథా అవుతున్నాయి. నీటి సమస్యను పరిష్కరించాలని ఎన్నిమార్లు వినతులు సమర్పించినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఏజెన్సీ ప్రజల బతుకులు మార్చాలని వారితో స్వయంగా చర్చా కార్యక్రమానికి వెళ్లిన కలెక్టర్ వారి నీటి కష్టాన్ని తీర్చలేకపోయారు. నీటి ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చి ఐదు నెలలు గడిచినా అతీగతి లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల పక్కనే లక్నవరం చెరువు ఉంది. అందులో బోర్లు వేయించి చుట్టుపక్కల గ్రామాలకు నీటిని అందిస్తే కష్టాలు తీరుతాయని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటీసులతో ఆందోళన ఆదివాసీలు కడుపు నింపుకునేందుకు పోడు చేసుకుని పంటలు పండిస్తున్నారు. అయితే ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు గిరిజనులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో విప్లవ పార్టీల అండతో పోడు చేసుకుని ఇక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. విప్లవ పార్టీల బలం ఎక్కువగా ఉన్నప్పుడు నోరు మెదపని అధికారులు.. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుంటామంటూ ఎదుళ్లపల్లి, బత్తులపల్లి, కొత్తగూడ, కోమట్లగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులకు నోటీసులు జారీ చేశారు. మండల కేంద్రంలో ఇరవై ఎకరాల పోడు భూమిని స్వాధీనం చేసుకుని నర్సరీ పెంచేందుకు సిద్ధం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల పోడు భూములను స్వాధీనం చేసుకుంటే సహించేది లేదంటూ ఆదివాసీ సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు దాడులు ఆపకుంటే తమ బతుకులు ఛిద్రం అవుతాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన చందూలాల్ పోడు భూములపై దృష్టి సారించి ఆదుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు. కర్ర స్తంభాలే దిక్కు కర్ర స్తంభాలను చూస్తే అభివృద్ధి ఎంతమాత్రం ఉందో ఇట్టే అర్థమవుతుంది. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి ఆదివాసీలు స్వయంగా తయారు చేసిన కర్ర స్తంభాల ఆధారంగానే విద్యుత్ లైన్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ కాంతులు పొందుతున్నారు. ఊరు పుట్టిన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈదురు గాలులు, విద్యుత్ హైఓల్టేజీ వల్ల కర్రలు కాలిపోతే మళ్లీ అదే ప్రాంతంలో స్తంభాలు ఏర్పాటు చేసుకోవడం గిరిజనులకు పరిపాటిగా మారింది. ఏళ్లు గడిచినా ఐటీడీఏ ద్వారా స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యుత్ కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ అధికారులు ట్రాన్స్కోకు కొంత మొత్తం నిధులు చెల్లించి గ్రామానికి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామంలోని సుమారు 80 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ.. ఇంతవరకు కరెంటు స్తంభాల కోసం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇప్పటికీ గిరిజనులు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. -
కొమురం భీమ్....ఆ పేరే ఒక పోరాటం
-
ఆదివాసీ అభివృద్ధితో భీంకు నివాళి
నేడు కొమురం భీం 74వ వర్ధంతి కొమురం భీం మరణించి ఏడు దశాబ్దాలు దాటినా ఆదివాసీ జీవితం నేటికీ ఏ కొత్త చిగురులూ వేయలేదు, ఏ కొత్త పూవులూ పూయలేదు. ఈ నేపథ్యంలో నాలుగు తరాలుగా నెరవేరని ఆదిలాబాద్ భూమిపుత్రుల చిరకాల కోర్కెలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పరిష్కరించాలి. ఆదివాసీ హక్కుల కోసం జరిగిన వీరోచిత పోరా టంలో 1941 అక్టోబర్ 8న కొమురం భీం అసువులు బాశాడు. ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం నుం చి హైదరాబాద్కు కాలినడకన వెళ్లి నిజాం ప్రభు వుకు గిరిజనుల జీవన్మరణ బాధను భీం వినిపిం చాడు. భూములకు పట్టాలివ్వాలని, కప్పం కట్టాలని అధికార్లు, రజాకార్లు చేస్తున్న వేధింపులను ఆపాలని వేడుకున్నాడు. నిజాం సర్కారు కరుణించకపోగా రజాకార్లను ఉసిగొల్పడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన కొమురం భీం 1941 ఆశ్వయుజ మాసం కార్తీక పౌర్ణమినాడు 12 గ్రామాలకు చెందిన గిరిజన తెగ లను కూడగట్టి సామూహిక తిరుగుబాటుకు సిద్ధమ య్యాడు. రాజీ మార్గం విఫలమై నిజాం రజాకార్లు చేసిన దాడిలో భీం వీర మరణం పొందాడు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం భీం నేల కొరిగిన జోడెన్ ఘాట్ను తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు సందర్శించనున్నారు. కేసీఆర్ రాకకు రెండు రోజుల ముందు, ఆ పరిసర ప్రాం తాల్లో ఆంత్రం జంగు (18) డిగ్రీ విద్యార్థి, తొడసం రావు పటేల్ (55), జక్కావాడ్ (4), వేముల సోని (20) అనే నలుగురు గిరిజనులు తీవ్ర జ్వరాలతో మరణించారు. 74 ఏళ్ల క్రితం భీం ప్రాణాలొడ్డి చాటి న సమస్యలు నేటికీ అపరిష్కృతంగా ఉండటం నిజంగా సిగ్గుచేటు. గిరిజనుల ప్రాథమిక హక్కు జల్ జంగల్ జమీన్పై ఏ ప్రభుత్వాలూ పట్టించుకో లేదు. వారు సాగుచేస్తున్న అటవీ పోడు భూము లకు, బంజర్లకు నేటికీ సంపూర్ణ హక్కుపత్రాలు రాలేదు. భీం ప్రాణత్యాగం తర్వాత హక్కు పత్రాలి చ్చిన భూములకు చట్టబద్ధమైన సౌకర్యాలు, రుణ సదుపాయాలను నేటికీ కొమురం భీం వారసులు పొందకపోవడం ఘోరం. ఆదివాసీలకు నేటికీ రక్షిత నీరు లేదు. ప్రాణా లకు ప్రమాదకరమైన చెలిమల్లో, వాగుల్లో నీళ్లే వాళ్లకు ప్రధాన దిక్కు. ఈ అరక్షితమైన తాగునీళ్లే ప్రతి ఏటా వందలాది మంది గిరిజనుల ప్రాణా లను తీస్తున్నాయి. జిల్లాలోని ఆదివాసీల్లో నూటికి 70 మంది తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నవారే. వీరి అనారోగ్య మరణాలను నివారించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైంది. కేసీఆర్ పర్యటన సంద ర్భంగానైనా జిల్లాలో అనారోగ్యం బారిన పడి మర ణిస్తున్న ప్రతి ఒక్క చావుకు శాశ్వత ముగింపు పలికేలా గట్టి చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో ఒక ఊరితో మరో ఊరికి రహ దారి సంబంధం లేని వాగులపై వంతెనలు లేని జిల్లాల్లో ఆదిలాబాద్దే అగ్రస్థానం. ఇక్కడ నేటికీ ఎడ్లబండ్లే అంబులెన్సులు. వర్షం వస్తే చాలు మంచా లు, కర్రకు కట్టిన జోలెలే రోగులకు ఆంబులెన్సులు అవుతున్నాయి. చస్తే అవే పాడెలవుతున్నాయి. జిల్లా లోని 32 అంబులెన్సులకుగాను 16 పైగా మూత పడ్డాయి. ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకునే శక్తి లేక నిస్సహాయ పరిస్థితుల్లో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శవాలను ద్విచక్ర వాహ నాలపై తీసుకెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాగ్దానం చేసినట్లుగా హెలికాప్టర్ అంబులెన్స్ (రోగులను హెలికాప్టర్ ద్వారా తరలించడం) సౌకర్యం కల్పిస్తే కేసీఆర్ గారికి ఆదివాసులు రుణపడి ఉంటారు. అపారమైన నీరున్న ఆదిలాబాద్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వాటర్ గ్రిడ్ను ప్రారంభించాలి. వ్యవసాయానికి ఒక్క పంటకు కూడా సాగునీరు సౌకర్యం లేకపోవ డమే జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలకు కారణం. 1,050 కిలోమీటర్ల దూరం ప్రవహింపచేసి చేవెళ్లకు తరలించే మా ప్రాణహిత నీళ్లను ముందుగా అతి సమీపంలో ఉన్న మూలవాసుల ప్రాణాలకు, భూములకు కూడా హితం చేకూర్చే ప్రణాళిక కావా లిప్పుడు. ఇక్కడికి సమీపంలోని ఉట్నూరు ఆదివాసీ ప్రాంతంలోని భూములకు రెండు పంటలకు సాగు నీరు అందించాలి. మెరుగైన పారిశుధ్య వసతులను కల్పించాలి. ఆదివాసుల్లో రక్తహీనతను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచే అతి చౌకైన పౌష్టికాహా రాన్ని (జొన్నలు, కొర్రలు, రాగులు, సామలు, పప్పుదినుసులు) చౌకధరలతో ప్రత్యేక నిత్యావసర పథకం కింద అందించాలి. అన్ని రకాల పోషకాహార పంటలకు మద్దతు ధర పెంచి ప్రోత్సహించాలి. జిల్లాలోని ప్రతి ఆదివాసీ ప్రాణాన్నీ కాపాడే ప్రణా ళికలను సీఎం కేసీఆర్ ప్రకటించాలి. అదే కొమురం భీం ప్రాణార్పణకు అచ్చమైన నివాళి. - మర్సుకోల తిరుపతి (ఏజెన్సీ ఆరోగ్య పరిరక్షణ కమిటీ కన్వీనర్) నైనాల గోవర్ధన్ (తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షులు)