-
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మెదక్ మున్సిపాలిటీ : మెదక్ జిల్లా నూతన సమీకృత కలెక్టరెట్, ఎస్పీ భవనాలకు శంకుస్థాపన చేసేందుకు ఈనెల 9న సీఎం కేసీఆర్ మెదక్జిల్లాకు రానున్న సందర్భంగా మంత్రి హరీశ్రావు, శనివారం మెదక్లో ఏర్పాట్లు పరిశీలించారు. శుక్రవారం రాత్రి సీఎం పర్యటనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన మెదక్లోనే బస చేశారు. శనివారం ఉదయం æహవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ శివారులోకి చేరుకొని సమీకృత కలెక్టరెట్, ఎస్పీ భవనాలు నిర్మించనున్న స్థలాలను పరిశీలించారు. బహిరంగసభకు భారీ ఎత్తున జనాలు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం కేసీఆర్ పర్యటనను జయప్రదం చేయాలన్నారు. ఆయన వెంట డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జేసి నగేశ్, ఆర్డీఓ మెంచు నగేశ్, ఇరిగేషన్ ఈఈ ఏసయ్య ఆర్అండ్బీ ఈఈ చంద్రయ్య, మైనింగ్ ఏడీ జయరాజ్, డీపీఓ హనోక్, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనాథ్, అడిషనల్ ఎస్పీ నాగరాజు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళియాదవ్, మున్సిపల్చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తీరనున్న దాహార్తి
వాటర్గ్రిడ్పై నాప్ సర్వే పూర్తి పాలేరు నుంచి నీటి సరఫరాకు చర్యలు గ్రిడ్ నిర్మాణానికి స్థలాల పరిశీలన కొనసాగుతున్న రీ సర్వే 17 మండలాలకు రూ.1700 కోట్లు కేటారుుంపు మహబూబాబాద్ : వాటర్గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలోని 17 మండలాల ప్రజల దాహార్తి తీర్చేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించిన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.1700 కోట్లు కేటారుుంచింది. ప్రతి మండలంలోనూ గ్రిడ్ నిర్మాణాలకు స్థలాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ దాహార్తి తీరుతుందా అని ఆయూ మండలాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున సాగర్ నుంచి కాలువ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు నీరు వస్తే.. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా మరిపెడ సమీపంలోని మాదిరిపురం గుట్టపై 170 ఎంఎల్డీ (మిల్లి లీటరు ఫర్ డే) సామర్థ్యం గల ట్యాంకును నిర్మిస్తారు. దీంతో పాటు మూడు జీఎల్బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు), ఒక ఓహెచ్బీఆర్ (ఓవర్ హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్) నిర్మిస్తారు. గుట్ట కింది భాగంలో ఫిల్టర్బెడ్(వాటర్ ట్రీట్మెంట్ నిర్మాణాలు) నిర్మించి.. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేస్తారు. ఒక జీఎల్బీఆర్ నుంచి మరిపెడ మండలానికి, రెండవ జీఎల్బీఆర్ నుంచి కురవి, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం మండలాలకు, మూడవ జీఎల్బీఆర్ నుంచి నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, రాయపర్తి మండలాలకు నీరందించేలా మ్యాప్ తయారు చేశారు. ఓహెచ్బీఆర్ నుంచి గూడూరు మండలం బొద్దుగొండ వద్ద సంప్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కొత్తగూడ, దుగ్గొండి, నెక్కొండ, ములుగు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు నీరు సరఫరా చేయనున్నారు. ఆ ట్యాంకుల నుంచి ఇంటర్నల్ పైపులైన్లు నిర్మించి బొడ్లాడ, మొరిపిరాల, ఇతరత్రా గ్రామాలకు కూడా నీరందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ అన్ని మండలాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీరు, అర్బన్లో 135 లీటర్ల నీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతి మండలంలో సంప్, ఇతరత్రా నిర్మాణాల కోసం అధికారులు స్థలాల పరిశీలిస్తున్నారు. మానుకోటలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న గెస్ట్హౌస్ను గ్రిడ్ కార్యాలయానికి ఉపయోగించేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా, ఈ పనుల కోసం మ్యాప్ సర్వే పూర్తయినట్లేనని అధికారులు చెపుతుండగా.. కాంట్రాక్టర్ మాత్రం రీ సర్వే చేస్తున్నారని, అది పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అన్ని మండలాల్లో స్థలాలను పరిశీలించి అంతర్గతంగా ఇతరత్ర నిర్మాణాలు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నారు. అరుుతే ఆయా మండలాల్లో గతంలో నిర్మించిన ట్యాంకులు ఉపయోగపడుతాయా లేక కొత్తగా నిర్మించాలా అనేది నీటి సరఫరా ప్రారంభమైతేనే తెలియనుంది. అధికారుల కృషి ఫలించి గ్రిడ్ సక్సె స్ అయితే.. మానుకోట పట్టణ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనుంది. 30 నెలల్లో గ్రిడ్ పూర్తికావాలి.. వాటర్గ్రిడ్కు సంబంధించిన నిర్మాణాలు 30 నెలల్లో పూర్తి కావాలని ఒప్పందం జరిగింది. సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న గెస్ట్హౌస్ను గ్రిడ్ కార్యాలయానికి కేటాయించారు. గ్రిడ్కు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు, మానుకోట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు, నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలకు, పాలకుర్తిలోని 2 మండలాలకు, ములుగులోని ఒక మండలానికి నీరందించేలా మ్యాప్తో పాటు సర్వే కూడా పూర్తయింది. డీఈలు గంగాధర్, శ్రీనివాస్తో పాటు సిబ్బంది ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నారు. - కె.రాములు, ఈఈ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (02-05-2024)
Swapna Kondamma: బుల్లితెర నటి సీమంతం.. ఎంతో సింపుల్గా ఇంట్లోనే.. (ఫోటోలు)
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
నితీష్ ఊచకోత.. 8 సిక్స్లతో వీర విహారం! వీడియో వైరల్
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement