breaking news
Hazrat Syed Shah
-
9 నుంచి కడప పెద్దదర్గాలో ఉరుసు
కడప కల్చరల్: దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన వైఎస్సార్ జిల్లా కడప పెద్దదర్గాలో వెలిసిన హజరత్ ఖ్వాజా సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఫిబ్రవరి 9 నుంచి ఘనంగా నిర్వహించనున్నామని దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తెలిపారు. దర్గా ఆవరణలో శనివారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారంరోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు, జిల్లావాసులు ప్రభుత్వశాఖలు తమవంతుగా సహకారం అందించాలని కోరారు. కలెక్టర్ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను జిల్లా ఉత్సవాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. ప్రత్యేకంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తామని చెప్పారు. ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 10న గంథం, 11న ఉరుసు, 12న జాతీయస్థాయిలో ముషాయిరా, 13న ఖవ్వాలీ తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. -
కాజీపేట దర్గాలో వైఎస్ జగన్ ప్రార్థనలు
వరంగల్ జిల్లా కాజీపేటలోని ప్రఖ్యాత హజరత్ సయ్యద్ షా దర్గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రెహమాన్ తదితరులతో కలసి దర్గాకు వచ్చారు. దర్గాలో వైఎస్ జగన్ ప్రార్థనలు చేశారు. వైఎస్ జగన్కు కు కుసుర్ పాషా, ఇతర మత పెద్దలు స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముస్లింల కోసం రిజర్వేషన్లు సహా ఎంతో చేశారని వైఎస్ జగన్ చెప్పారు. వాటిని దృష్టిలో ఉంచుకుని ముస్లింలు అందరూ తమ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థికి మద్దతు పలకాలని కోరారు. అనంతరం నేతలతో కలసి వైఎస్ జగన్ హన్మకొండకు వెళ్లారు.