-
ఆర్టీసీలో ఇంటి దొంగలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఇంటి దొంగలు పెరిగిపోతున్నారు. శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఆర్టీసీ ఖజానాకే వారు కన్నం పెడుతున్నారు. తాత్కాలిక సిబ్బందిని నియమించామంటూ వారి పేర జీతాలు డ్రా చేసిన బాగోతం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. వరంగల్లో ఓ ఇన్చార్జి డిపో మేనేజర్ ఇదే తరహాలో నిధులు స్వాహా చేసినట్టు ఫిర్యాదులు రావటంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఇటు అధికారులు కూడా అంతర్గత విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ అక్రమాలు నిజమేనని తేలితే తమ బండారం కూడా బయటపడుతుందన్న కారణంతో పాటు, ఆ ఇన్చార్జి డిపో మేనేజర్తో ఉన్న సన్నిహిత పరిచయం వల్ల కేసును నీరుగార్చేందుకు తెరవెనక ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సిబ్బంది బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బస్భవన్లోని కొందరు అధికారుల ద్వారా ఆ ఇన్చార్జి డిపో మేనేజర్ను సమస్య నుంచి తప్పించేందుకు రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడీ వ్యవహారం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో అవినీతి బాగోతంపై ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. కనీస వేతనాల పెంపు మొత్తం పక్కదారి.. ఆర్టీసీలో కొన్ని రకాల పనులకు ముందు నుంచి తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవటం పరిపాటి.. గతంలో వీరి సం ఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆర్టీసీ దివాలా దశకు చేరుకోవటంతో వీరి సంఖ్య తక్కువగా ఉంటోంది. తాత్కాలిక ఉద్యోగులు పనిచేసిన సమయంలో.. ప్రభుత్వం కనీస వేతనాలను సవరించినప్పుడు ఆ పెరిగిన మొత్తం కూడా తాత్కాలిక ఉద్యోగుల పేర విడుదలవుతాయి. ఉమ్మడి వరంగల్లోని మరో డిపోలో ఓ పర్యాయం అలా అందిన అదనపు మొత్తాలను తాత్కాలిక ఉద్యోగులకు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచి తర్వాత స్వాహా చేశారనేది ఆరోపణ. దీనిపై అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. స్వాహా చేసిన మొత్తం చిన్నదే అయినప్పటికీ, ఆ వ్యవహారం జరిగిన తీరు తీవ్రమైనదిగా పరిగణించాల్సిందే. ఇదే క్రమంలో గత మేడారం జాతర సమయంలో దొంగ బిల్లులతో పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినట్టు కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పీలుకు ధర ఖరారు చేసి వసూలు టికెట్ల రూపంలో వచ్చిన మొత్తంలో కొంతమేర తగ్గితే కండక్టర్లను సస్పెండ్ చేయటం సహజం. అలాగే దురుసు డ్రైవింగ్, ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లను కూడా సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత వారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా అప్పీల్ చేసుకుంటారు. ఇలా వచ్చిన అప్పీళ్లకు వరంగల్ రీజియన్ పొరుగున ఉన్న రీజియన్ అధికారి ధర ఖరారు చేసి వసూలు చేశాడన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఒక్కో అప్పీలుపై రూ.30 వేల నుంచి రూ.50 వరకు వసూలు చేశారని, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏర్పాటు చేసి మరీ వసూళ్లు జరిపారని ఆర్టీసీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవల ఈ విషయం రవాణాశాఖ మంత్రి దృష్టికి కూడా రావటంతో బస్భవన్లో చర్యలపై అంతర్మథనం జరిగింది. ఈ కేసుల్లో బాధ్యులు, తెరవెనక సహకరించిన వారిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని డ్రైవర్, కండక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 రూపాయలు తేడా వచ్చినా కండక్టర్లను సస్పెండ్ చేయటం, బస్సు లైట్ పగిలితే డ్రైవర్పై చర్యలు తీసుకునే అధికారులు.. ఈ వ్యవహారాల్లో చూసీచూడనట్టు పోవటంపై గుర్రుగా ఉన్నారు. సమ్మె తదనంతర పరిణామాలతో కొంతకాలంగా అధికారులు–కండక్టర్, డ్రైవర్, శ్రామిక్లకు మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. ఇప్పుడు అధికారులపై ఆరోపణలు రావటంతో ఈ వ్యవహారాన్ని రచ్చ చేస్తుండటం విశేషం.. -
రోడ్డు మీద రోడ్డు వేసి
► వరదలకు దెబ్బతిన్నాయని అంచనాలు తయారుచేయించిన టీడీపీ నాయకులు ► తూతూమంత్రంగా పనులు ► నిధులు స్వాహా చేస్తున్నా పట్టించుకోని అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మండలంలో టీడీపీ నాయకులు పాల్పడుతున్న అవినీతి అంతులేకుండాపోయింది. వరదలకు పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని అంచనాలు తయారుచేయించి తూతూమంత్రంగా పనులు చేసి నిధులు బొక్కేస్తున్నారు. అధికారులు వారికి అండగా ఉన్నారు. పెళ్లకూరు(సూళ్లూరుపేట) : 2015 సంవత్సరం నవంబరులో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పెళ్లకూరు, చవటకండ్రిగ, ఎగువతాగేలి రోడ్లు పలుచోట్ల వరద ఉధృతికి కోతకు గురయ్యాయి. ఇదే అదునుగా భావించిన కొందరు టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి మండలంలోని 22 ప్రాంతాల్లో 43.95 కిలోమీటర్ల పంచాయతీరాజ్ శాఖ రోడ్లు దెబ్బతిన్నట్లు అంచనాలు తయారుచేయించారు. అయితే మండలంలో 56 కిలోమీటర్లు పీఆర్ రోడ్లు ఉండగా వాటిలో 12 కిలోమీటర్లు బీటీరోడ్డు, మిగిలిన 44 కిలోమీటర్లు గ్రావెల్రోడ్లున్నాయి. మొత్తం 44 కిలోమీటర్ల గ్రావెల్రోడ్లలో 43.95 కిలోమీటర్లు వరదలకు దెబ్బతిన్నాయని అంచనాలు రూపొందించారు. కొందరు అధికారులు, నాయకులు కలిసి బాగున్న రోడ్లను బాగోలేనివిగా చూపించి పనులు చేసి నిధులు స్వాహా చేశారు. దారి తప్పిన నిధులు రోడ్ల మరమ్మతుల కోసం మంజూరైన రూ.37.60 లక్షల నిధులు దారి మళ్లుతున్నాయి. టీడీపీ నాయకులు తుఫాన్ నిధుల కోసం తూతమంత్రంగా పనులు చేసి అధికారులకు పర్సంటేజ్లు అందజేసి బిల్లులు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేయడానికి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా పనులు చేసి బడా నేతల అండతో ఎంబుక్లు చేయించుకొని తుఫాన్ నిధులను జేబుల్లో వేసుకుంటున్నారు. ఇక్కడ పనులన్నీ జన్మభూమి కమిటీ సభ్యులకే అప్పగించారు. దీనిపై పూర్తిగా పర్యవేక్షణ కరువైంది. నాసిరకంగా ఉంటే బిల్లులు చేయడం లేదు నిబంధనల మేరకు పనులు చేయిసున్నాం. పనులు నాసిరకంగా జరిగినట్లు గుర్తిస్తే అలాంటి వాటికి బిల్లులు చేయడం లేదు. – కృష్ణారావు, పంచాయతీరాజ్ ఏఈ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement