Top Stories
ప్రధాన వార్తలు

‘యాక్సిస్’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్'
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో ఏడువేల మెగావాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారుచౌకగా యూనిట్ రూ.2.49కే అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.లక్ష కోట్లకుపైగా ఆదా చేశారు. దీన్ని అభినందించాల్సింది పోయి.. కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. తద్వారా దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్కామ్కు తెర తీసింది! ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం, ఇలా బరి తెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్తు రంగ నిపుణులు, అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఒప్పందాల్లో దీన్ని అతిపెద్ద స్కామ్గా అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వం అత్యంత చౌకగా, ఐఎస్టీఎస్ చార్జీలు లేకుండా కేంద్ర సంస్థ సెకీ నుంచి సోలార్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే బురద జల్లి దేశమంతా రాద్దాంతం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం సహేతుకమేనని ఇప్పటికే విద్యుత్తు నియంత్రణ మండలి నిర్థారించిందని, తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అయిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఒప్పందాల్లో నిజానిజాలను ఒకసారి పరిశీలిద్దాం.. ఏడాదిగా హామీల అమలు ఊసు లేకుండా.. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఈ తరుణంలో కనీసం ఇప్పుడైనా ఓ అమ్మ ఒడి, అన్నదాతా సుఖీభవ గురించో.. సూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తుంటే మరో పిడుగు పడింది! ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా బిల్లుల బాదుడుతో చుక్కలు చూపిస్తుండగా ఈసారి అడ్డగోలు విద్యుత్తు ఒప్పందాలతో బాదేశారు! 25 ఏళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసే ఖరీదైన విద్యుత్తు ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి ఆమోదించుకోవడం ద్వారా సర్కారు లాలూచీ వ్యవహారాలు మరోసారి నిరూపితమయ్యాయని, ఇదో పెద్ద కుంభకోణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సోలార్, రాత్రి పూట అంతా పవన విద్యుత్తు అందుబాటులో ఉంటుందని.. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్ రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావటాన్ని తప్పుబడుతున్నారు. పీక్ అవర్స్లో డిమాండ్ 3 – 4 గంటలు మాత్రమే ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని గంటలకూ ఒకే ధర చెల్లించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వర్షాకాల అవసరాల కోసం గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో టీడీపీ నేతలు సిండికేట్గా మారి పోలీసుల అండతో దౌర్జన్యంగా షాపులు దక్కించుకున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో గనుల యజమానులను బెదిరిస్తూ కప్పం వసూలు చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి పనుల్లో టెండర్లలో ముఖ్యనేతలు అంచనాలను ఎడాపెడా పెంచేశారు. ఐకానిక్ టవర్లు పేరుతో అవినీతికి గేట్లు తెరిచారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల ముసుగులో పనుల విలువలో పది శాతం చెల్లించి తిరిగి 8 శాతం కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో లూలూకు భూ పందేరంతోపాటు రూ.3,000 కోట్ల అత్యంత ఖరీదైన భూమిని ఊరూ పేరు లేని అనామక సంస్థ ఉర్సాకు ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ క్యాబినెట్లో ఆమోద ముద్ర వేయించారు. గత 11 నెలలుగా ఇలా విచ్చలవిడి అవినీతి వ్యవహారాలతో చంద్రబాబు సర్కారు ఆల్టైమ్ రికార్డు సృష్టించిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మేం వస్తే విద్యుత్తు చార్జీలను పెంచం.. ఇంకా తగ్గిస్తాం..! గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని నాశనం చేసింది. ఐదేళ్లలో రూ.1.29 లక్షల కోట్లకుపైగా నష్టం జరిగింది..’’ అంటూ ఎన్నికల ముందు, ఆ తరువాత శ్వేతపత్రంలో విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పాతికేళ్ల పిడుగు.. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం ఆమోదించింది. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పవన–సౌర హైబ్రీడ్) 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ పాతికేళ్ల పాటు యూనిట్ కు రూ.4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించటానికి వీల్లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించడం గమనార్హం. అంటే భవిష్యత్తులో పవన, సౌర విద్యుత్తు రేట్లు తగ్గినా ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెలిక పెట్టారు. ఒకపక్క మార్కెట్లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. ఎక్కువ ధరకు ఎందుకు కొనాలి? డిస్కమ్ల పిటిషన్పై కర్నూలులో ఇటీవల జరిగిన బహిరంగ విచారణలో నేరుగా, ఆన్లైన్ ద్వారా వివిధ వర్గాల ప్రజలు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని యాక్సిస్తో ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయడం వల్ల అంతిమంగా ఆ భారం ప్రజలపైనే ట్రూఅప్ చార్జీల రూపంలో వేస్తున్నారని.. ఇప్పటికే రూ.15,485 కోట్లు భారం మోపి వసూలు చేస్తున్నారని ఈ విచారణలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మార్కెట్లో ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరకే లభిస్తున్నందున యాక్సిస్ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేదంటూ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ వారి వాదనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తాననుకున్నదే చేసింది. యాక్సిస్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ జారీ చేసిన ఆదేశాలు మంచి చేస్తే అభినందించాల్సింది పోయి..గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్ అందించింది. డిస్కంలకు 2019–24 మధ్య ఏకంగా రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించడం గమనార్హం. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య గత ప్రభుత్వం రెండు లక్షలకు పైగా అగ్రికల్చరల్ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. ఇప్పుడేమంటావు కరపత్రమా ? కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో గత వైఎస్ జగన్ ప్రభుత్వం అతి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఈనాడు అడ్డగోలుగా రాసిన అసత్య కథనాలు గతంలో చంద్రబాబు పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 ఫీడర్లను 9 గంటలు వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామరŠాధ్యన్ని వైఎస్ జగన్ పెంచారు. విద్యుత్ రంగానికి ఆయన ఇంత మంచి చేస్తే.. సెకీ విద్యుత్ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారని, ధర ఎక్కువని, ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సి వస్తుందంటూ కూటమి నేతలు, కరపత్రికలు తప్పుడు ఆరోపణలు చేశాయి. అదే కూటమి సర్కారు ఇప్పుడు యాక్సిస్తో అధిక ధరకు ఒప్పందం చేసుకుని అసలు సిసలైన అవినీతికి గేట్లు తెరిచింది. నేడు సెక్షన్ 108తో మండలిని బెదిరించి.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి కూటమి ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్తో పీపీఏలను అంగీకరించాలంటూ గతేడాది సెప్టెంబర్ 24న ప్రభుత్వం లేఖ రాసిందని ఏపీఈఆర్సీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంటే దీన్ని తిరస్కరించడానికి వీల్లేదని, ఒకవేళ ఏపీఈఆర్సీ తిరస్కరిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒప్పందంపై ముందుకు వెళుతుందని పరోక్షంగా బెదిరించినట్లు తేటతెల్లమవుతోంది. 400 మెగావాట్ల విద్యుత్తు కోసం ఈ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ బెదిరించాల్సిన అవసరం చంద్రబాబు సర్కారుకు ఎందుకు వచ్చింది? ఈ ఒప్పందం వెనుక కేవలం కుంభకోణం మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎక్కడుందని విద్యుత్తు రంగ నిపుణులు నిలదీస్తున్నారు. సెక్షన్ 108 ప్రకారం.. యాక్సిస్ పీపీఏలను ఆమోదించాలంటూ ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ ఆదేశాల్లో పేర్కొన్న భాగం నాడు స్వయంగా ప్రతిపాదించిన ‘సెకీ’ రైతులకు పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు సెకీ నుంచి 17 వేల మిలియన్ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం గత ప్రభుత్వంలో జరిగింది. అది కూడా అత్యంత చౌక ధరతో.. యూనిట్ కేవలం రూ.2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన స్వయంగా సెకీ నుంచే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యూనిట్ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ రూ.2.49కే ఇచ్చేందుకు నాడు సెకీ అంగీకరించింది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. ఇదే విషయం కేంద్ర విద్యుత్ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు బురద చల్లేందుకు యత్నించారు. అయితే సెకీతో ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) తేల్చి చెప్పడంతో ఈ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు పవన, సౌర హైబ్రీడ్ విద్యుత్ మార్కెట్లో యూనిట్ రూ.2.90కి అంతకన్నా తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ఓ ప్రైవేట్ డెవలపర్ నుంచి యూనిట్ రూ.4.60 చెల్లించి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చెప్పే ధైర్యం చంద్రబాబు సర్కారుకు, ఈ కుంభకోణాలపై నిలదీసే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా?

భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా జరిగి తీరుతుందంటూ తేల్చి చెప్పారు. అందుకు తాను హామీ ఇస్తున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారాయన.‘‘మోదీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం నా బాధ్యత’’ అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్ను దెబ్బతీయడానికి దుస్సాహసం చేసిన వారికి ధీటైన రీతిలో సమాధానం ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరో వైపు, భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

అవే ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అవే ఉద్రిక్తతలు. అదే ఉత్కంఠ. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా పదో రోజూ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా జమ్మూ కశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖూ్నర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు.నావికా దళాధిపతి చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠితో సమావేశమైన 24 గంటల్లోపే ఎయిర్ చీఫ్ మార్షల్తో మోదీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొత్త పల్లవి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్టు చెప్పుకున్నారు. మరోవైపు మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. తుర్కియేకు చెందిన భారీ యుద్ధనౌక ఆదివారం కరాచీ తీరం చేరుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడికి తెగబడ్డ వారికి త్వరలో మర్చిపోలేని రీతిలో సమాధానం చెప్పి తీరతామని పునరుద్ఘాటించారు. ‘‘సైనికులను కాపాడటం నా బాధ్యత. ప్రధాని మోదీ పట్టుదల అందరికీ తెలుసు. ప్రజలు కోరుతున్నది ఆయన నాయకత్వంలో జరిగి తీరుతుంది’’ అని ప్రకటించారు.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీíÙయన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు. భద్రతా మండలికి పాక్ పహల్గాం దాడిని అడ్డు పెట్టుకొని భారత్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పాక్ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతామండలి భేటీ జరిగేలా చూడాలని ఐరాసలోని తమ శాశ్వత ప్రతినిధి, రాయబారి అసీం ఇఫ్తికార్ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. ‘‘సింధూ జల ఒప్పందం నిలిపివేత ప్రాంతీయ శాంతిభద్రతలకు దెబ్బ. భారత్ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం’’ అని చెప్పుకొచి్చంది. భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్యదేశం.నేడు పాక్ పార్లమెంట్ ప్రత్యేక భేటీ భారత్తో ఉద్రిక్తతలపై చర్చించేందుకు పాక్ పార్లమెంట్ సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సింధూ ఒప్పందం నిలిపివేత వంటి అంశాలపైనా చర్చిస్తామని ఎంపీలు తెలిపారు.మళ్లీ ‘అణు’ ప్రేలాపనలు పాక్ మరోసారి అణు ప్రేలాపనలకు దిగింది. పాక్లోని కొన్ని భూభాగాలపై భారత్ త్వరలో దాడి చేయనున్నట్లు తమకు సమాచారముందని రష్యాలో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ చెప్పుకొచ్చారు. ‘‘దాడికి దిగితే భారత్కు గట్టిగా బదులిస్తాం. అణ్వాయుధాలు సహా సర్వశక్తులూ ప్రయోగిస్తాం’’ అని హెచ్చరించారు. యుద్ధం జరిగితే పాక్ కచ్చితంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందన్నారు. భారత్పై అణు బాంబులు ప్రయోగిస్తామని పాకిస్తాన్మంత్రి హనీఫ్ అబ్బాసీ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే.

నిప్పుకు తెలుసు.. నీళ్లు రావని..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విశ్వనగరంలా మారుతోంది. సిటీ నలువైపులా శరవేగంగా విస్తరిస్తోంది. ఆకాశాన్నంటుతున్నాయా..అన్నట్టుగా బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతున్నాయి. 50 అంతస్తులకు మించి కూడా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. నగర అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తున్న ఈ ఆకాశ హర్మ్యాలు.. అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ బహుళ అంతస్తుల భవనాలు ఎంతవరకు భద్రం? ముఖ్యంగా ఏ కారణంతోనైనా, ఊహించని విధంగా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి? ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యవస్థ వాటిల్లో ఉంటోందా? మన అగ్నిమాపక శాఖ సామర్థ్యం ఎంతవరకు ఉంది? 40–50 అంతస్తుల వరకు కూడా మంటలను ఆర్పగలిగే, వాటిల్లో ఉండే వారిని రక్షించగలిగే అధునాతన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. ఇప్పుడున్న అరకొర రక్షణ వ్యవస్థలు, ఆయా భవనాల్లోని సొంత భద్రతా ఏర్పాట్లు, వాటి పర్యవేక్షణ పరిగణనలోకి తీసుకుంటే హైరైజ్ నివాస, వాణిజ్య సముదాయాలన్నీ ఒకింత డేంజర్లో ఉన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంలా మారుతున్నా.. రాష్ట్ర అగ్నిమాపక శాఖ వద్ద కేవలం 18 అంతస్తుల వరకు మాత్రమే ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఆపై అంతస్తుల్లో ప్రమాదం జరిగితే కష్టమేనని, ఆయా భవనాల్లో ఉన్న సొంత రక్షణ వ్యవస్థపైనే అంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదాలను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎంత?, భవనాల్లో ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉండాలి? పర్యవేక్షణ మాటేమిటి? యాజమానుల బాధ్యతలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. జీ ప్లస్ 5 దాటితే అనుమతి తప్పనిసరి హైదరాబాద్లో జీ ప్లస్ 5 అంతస్తులకు (నివాస సముదాయాలు) పైబడిన భవనాలన్నిటికీ అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. అదే వాణిజ్య, ఇతర భవనాలు జీ ప్లస్ 4 మించితే అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నగరంలోని అన్ని హైరైజ్ భవనాలకూ అగ్నిమాపక శాఖే అనుమతులు ఇస్తోంది. భవనం డిజైన్, నిర్మాణం, తర్వాత ఆక్యుపెన్సీ తదితర అన్ని సందర్భాల్లో అన్నీ పరిశీలించాకే ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) మంజూరు చేస్తున్నారు. ఒకసారి ఎన్ఓసీ వచి్చన తర్వాత యజమానులు ఐదేళ్లకు ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాతే అధికారులు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అయితే అనుమతులు మంజూరు చేస్తున్న అధికారులు, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదనే విమర్శలున్నాయి. అగ్నిమాపక శాఖలో దాదాపు 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండడం ఈ పరిస్థితికి కారణమనే వాదన ఉంది. పత్రి నెలా 11వ తేదీన జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి (ఏడీఎఫ్ఓ), 23న డీఎఫ్ఓలు భవనాలు ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు. సిబ్బంది కొరత నేపథ్యంలో భవనాల సంఖ్య మేరకు తనిఖీలు ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. మన అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎలా ఉంది? తెలంగాణ మొత్తం కలిపి 147 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి..జీహెచ్ఎంసీ పరిధిలో 34 ఫైర్ స్టేషన్లు, 3 అవుట్ పోస్ట్లు ఉన్నాయి. అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే రంగంలోకి దిగేలా సుశిక్షితులైన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్లో 55 మీటర్ల ఎత్తు వరకు అంటే 18 అంతస్తుల వరకు వెళ్లగలిగే బ్రాంటో స్కై లిఫ్ట్లు రెండు ఉన్నాయి. వీటికి అదనంగా 133 వాటర్ టెండర్లు (ఫైర్ ఇంజిన్లు), 5 నీటి సరఫరా లారీలు, 56 మల్టీపర్పస్ టెండర్లు, 10 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లు, 17 వాటర్ బౌజర్లు సహా కీలక పరికరాలు ఉన్నాయి. ఇక 18 అంతస్తులకు మించిన భవనాల్లో అంతర్గతంగా ఉండే ఫైర్ పంపులు, నీళ్ల ట్యాంకులు, ఇతర వ్యవస్థలను ఉపయోగించుకుని అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేయాల్సి ఉంటుంది. బిల్డర్లు, నిర్వాహకుల బాధ్యతలేమిటి? – భవనం భద్రతను బిల్డింగ్ నిర్వాహకులు, యజమానులు విధిగా పర్యవేక్షించాలి. – సాధారణ సెక్యూరిటీ మాదిరిగా ప్రైవేటు ఫైర్ ఆఫీసర్లు, ఫైర్ గార్డులను నియమించుకోవాలి. – బిల్డర్లు ప్రతి ఆకాశ హర్మ్యంలో విధిగా ఓ రెస్క్యూ ప్లేస్ పెట్టాలి. ఆ భవనంలో అంతస్తులను బట్టి నాలుగు ఫ్లోర్లకు ఒక రెస్క్యూ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – ప్రత్యేకంగా ఫైర్ లిఫ్ట్ ఉండాలి. అగ్నిప్రమాదాల సమయంలో ఫైర్ సిబ్బంది మాత్రమే దీన్ని వాడతారు. దీనికి పవర్ సప్లై ప్రత్యేకంగా ఉండాలి. – నిర్వాహకులకు ఎమర్జెన్సీ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిప్రమాదం జరిగితే ఎవరు ఎలా స్పందించాలనే ప్రణాళిక ఉండాలి. – భవనాల్లో నివాసం ఉండేవారికి, పనిచేసే సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలనే దానిపై తరచూ శిక్షణ ఇవ్వాలి. – ఫైర్ అలారమ్లు, స్మోక్ డిటెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు సరిగా పనిచేస్తున్నాయా..లేదా చూసుకోవాలి. – అయితే చాలా భవనాల్లో.. నిర్మాణం, ఆక్యుపెన్సీ సమయంలో ఉండే ఫైర్ ఫైటింగ్ పరికరాలు...కొన్నాళ్ల తర్వాత పనిచేసే స్థితిలో ఉండడం లేదన్న విమర్శలు ఉండటం గమనార్హం. ఢిల్లీ, మహారాష్ట్రల్లో మెరుగ్గా.. ఫైర్ సేఫ్టీ అంశంలో మన దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన చట్టాల అమలు పక్కాగా ఉండడంతో పాటు అగ్ని ప్రమాదాల నియంత్రణ మెరుగ్గా ఉంది. ఢిల్లీలో 110 మీటర్ల స్కైలిఫ్ట్లు నాలుగు అందుబాటులో ఉన్నాయి. పైర్ ఫైటింగ్ పరికరాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నిబంధనల అమలులో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో 50 అంతస్తుల వరకు చేరుకునే ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో పటిష్ట వ్యవస్థలు సింగపూర్, దుబాయ్, అమెరికా, ఆ్రస్టేలియా, జర్మనీ, జపాన్, కెనడా, లండన్ దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత పక్కాగా అగ్నిమాపక వ్యవస్థ ఉంది. ఈ దేశాల్లో ఫైర్ స్టేషన్లు అన్ని ప్రాంతాలకు సమీపంలో అందుబాటులో ఉంటాయి. ఫైర్ ఫైటింగ్లోనూ ఆయా దేశాల సిబ్బంది ముందుంటున్నారు. పౌరులందరికీ అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో పూర్తి అవగాహన కలి్పస్తారు. ఏదైనా భవనం వినియోగంలోకి వచి్చన తర్వాత కూడా అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుంటుంది. తరచూ తనిఖీలు, ఫైర్ మాక్ డ్రిల్స్ పక్కాగా కొనసాగుతుంటాయి. ఫైర్ ఫైటింగ్ ఆఫీసర్లను నియమించుకోవాలి కార్యాలయాలు, ఆసుపత్రులు ఇలా ప్రతి బహుళ అంతస్తుల భవనాల్లోనూ అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే స్పందించేలా, ఫైర్ ఫైటింగ్కు సంబంధించిన పరికరాల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లను పెట్టుకోవాలి. వీరందరికీ అగ్నిమాపక శాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ వ్యవస్థ ప్రమాదం జరిగిన మొదటి రెండు గంటలపాటు ఫైర్ ఫైటింగ్కు ఉపయోగపడుతుంది. ప్రాణ నష్టం నివారించలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు పూర్తిస్థాయిలో ఆర్పే పనితో, ప్రజా రక్షణ చర్యలు చేపడతారు. రాష్ట్రంలో ఉన్న అగ్నిమాపక వాహనాలు, పరికరాలు ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. – వై.నాగిరెడ్డి, డీజీ, అగ్నిమాపక శాఖ తరచూ తనిఖీలు ఎంతో అవసరం బహుళ అంతస్తుల భవనాలకు డిజైన్ చేయడంలో ఫైర్ సేఫ్టీ అంశం కూడా అత్యంత కీలకమైనది. డిజైన్లో ఉన్నట్టుగా నిర్మాణం జరిగిందా లేదా? ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయా? అన్నది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో అధికారులు తనిఖీ చేయాలి. ఆ తర్వాత కూడా తరచూ తనిఖీలు నిర్వహించాలి. నివాస సముదాయాల్లో కంటే హైరైజ్ కమర్షియల్ బిల్డింగ్స్లో అగ్ని ప్రమాదాల రిస్క్ ఎంతో ఎక్కువ. ప్రమాదం జరిగితే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాణిజ్య భవనాల విషయంలో అదనపు జాగ్రత్తలు మరింత అవసరం. – భిక్షపతి, మాజీ డైరెక్టర్ జనరల్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటినెన్స్ పట్టించుకోక పోతే కష్టమే.. మన దగ్గర వేగంగా అభివృద్ధి జరగడం, ఆ మేరకు బహుళ అంతస్తులు వస్తుండటం ఎంతో సంతోషించదగ్గ విషయం. బిల్డింగ్ డిజైన్లలో, నిర్మాణంలో.. ఫైర్సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నాం. కానీ ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫైర్సేఫ్టీని పట్టించుకోవడం లేదు. ఫైర్ ఫైటింగ్ పరికరాల మెయింటినెన్స్పై అటు ప్రభుత్వ విభాగాలు కానీ, ఇటు భవన యజమానులు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మన హైరైజ్ భవనాలు డేంజర్లో ఉన్నట్టే. ఫైర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అవసరమైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి డెవలపర్స్ నుంచి ఫీజులు వసూలు చేసినా ఫర్వాలేదు కానీ అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధునీకరించాలి. ప్రతి ఆరు నెలలకు ఫైర్ ఫైటింగ్ పరకరాలు తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలి. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు, భవనాల యజమానులకు బాధ్యత అప్పగించి ప్రభుత్వ విభాగాలు తప్పుకోవడం సరికాదు. – సీఏ ప్రసాద్, ప్రెసిడెంట్, ప్రీ ఇంజినీర్డ్ స్ట్రక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైరైజ్ బిల్డింగుల్లో ఉండాల్సినవేమిటి? ⇒ నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం.. ఎత్తైన భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు, ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ (తక్షణ రక్షణ వ్యవస్థ), తగిన నీటి సరఫరా సౌకర్యం, ఫైర్ పంపులు, ఫైర్ ఎస్కేప్ మార్గాలు, ఫైర్మెన్ లిఫ్ట్, సర్వీస్ షాఫ్ట్ ఎన్క్లోజర్లు, ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ తప్పక ఉండాలి. నివాస సముదాయాలైనా, ఇతర భవనాలైనా ఇవన్నీ తప్పనిసరి. ఇలా అన్ని దశల్లోనూ అగ్నిమాపక వ్యవస్థ సరిగా ఉందా? లేదా? అన్నది అత్యంత కీలకం. వ్యవస్థ ఇలా పనిచేయాలి ⇒ భవనం ఎత్తు ఆధారంగా పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ పంపులు, నీటిని చల్లేలా పూర్తి వ్యవస్థ ఉండాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఎలక్ట్రిక్ పంపులు పనిచేయడం ప్రారంభం కావాలి. ⇒ ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్ల వ్యవస్థ కూడా ఉండాలి. ఇదీ పని చేయకపోతే డీజిల్ పంపు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా కనీసం రెండు గంటల పాటు మంటలను నిలువరించి, నివాసితులు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా ఉండాలి.

నిరాఘాటంగా 15 గంటలు విలేకరుల సమావేశం
మాలే: మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (46) సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు! ఈ విషయంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ముయిజ్జు విలేకరుల సమావేశం శనివారం ఉదయం పదింటికి ప్రారంభమైంది. 14 గంటల 54 నిమిషాలపాటు కొనసాగింది. కేవలం ప్రార్థనల కోసం మధ్యలో కాసేపు విరామం ఇచ్చారు. ‘‘దాదాపు 25 మంది విలేకరుల ప్రశ్నలకు ముయిజ్జు విరామం లేకుండా సమాధానాలిచ్చారు.15 గంటల పాటు మాట్లాడి ప్రపంచ రికార్డు నెలకొల్పారు’’ అని మాల్డీవ్స్ ప్రభుత్వం అదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2019 అక్టోబర్లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ 14 గంటల పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదొక రికార్డుగా నిలిచిపోయింది. అంతకుముందు రికార్డు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషేంకో పేరిట ఉండేది. ఆయన ఏడు గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ముయిజు్టకు ముందు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా చేసిన మొహమ్మద్ నషీద్ కూడా ఒక రికార్డు సృష్టించారు. 2009లో ఆయన ప్రపంచంలోనే తొలిసారి సముద్రం అడుగు భాగాన కేబినెట్ సమావేశం నిర్వహించారు! వాతావరణ మార్పులతో సముద్రమట్టం పెరిగిపోతోందని, ఫలితంగా తమ దేశం మునిగిపోయే ప్రమాదముందని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడానికే ఈ సాహసానికి పూనుకున్నారు.

అన్నదాతకు గుండెకోత
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వరి రైతుల పాలిట చంద్రబాబు ప్రభుత్వం పెనువిపత్తుగా పరిణమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన కుండపోత వర్షాలకు ధాన్యం రాశులు, కోత కోసిన వరి పనలు నీటమునిగాయి. ఇతర పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కాకినాడ జిల్లాలో 7 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనల మీద వరి, నీట మునిగిన ధాన్యపు రాశుల్ని చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.ఉప్పలగుప్తం, అయినవిల్లి, ఐ.పోలవరం మండలాల్లో ధాన్యం రాశులు, ధాన్యం బస్తాలు వర్షాలకు తడిసిపోయాయి. ఈ మండలాల్లో సుమారు 600 ఎకరాల్లో పంట పనల మీద ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని భద్రపరుచుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. చేలలోనే ధాన్యం రాశులు ఉండటంతో.. వాటిపై బరకాలు కప్పినప్పటికీ కింది భాగంలో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇవ్వగా.. ఇప్పటివరకు కేవలం సుమారు 4.40 లక్షల మెట్రిక్ ధాన్యం మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. మరో దాదాపు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉంది. సంచులు లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో కల్లాల్లోనే ధాన్యం మిగిలిపోయింది.ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ముంచిందిధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిలువునా ముంచేసింది. గడిచిన వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ వర్ష సూచనపై తీవ్ర హెచ్చరికలు చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడలేదు. ఫలితంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కల్లాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. కళ్లెదుటే కష్టార్జితం నీటిలో నానిపోతుంటే రైతులు నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపించారు. ధాన్యం రాసులపై కనీసం కప్పడానికి పట్టాలు కూడా లేని దయనీయస్థితిలో ధాన్యం నింపడానికి సంచులు లేని దుస్థితిలో ఉరుకులు పరుగులు తీశారు. నేలవాలిన రైతు ఆశలుప్రస్తుత వాతావరణ మార్పులతో తడిసిన ధాన్యం రంగు మారడం, మొలకలొచ్చే ప్రమాదంతో పాటు ముక్క విరుగుడు సమస్య తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రారంభించినప్పటి నుంచి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైతుసేవా కేంద్రాల్లోకి వెళ్లిన రైతులకు నిరాశ తప్ప ధాన్యం కొంటామనే మాట వినిపించట్లేదు. దళారులు, మిల్లర్లు పచ్చజెండా ఊపితేనే రైతు ధాన్యం లోడుకు మోక్షం లభిస్తుంది. ఇలా చేస్తే మద్దతు ధరలో 75 కిలో బస్తాకు రూ.300–రూ.450 దళారీకి, మధ్యవర్తికి ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇదంతా ప్రభుత్వం దళారుల దందాకు గేట్లు బార్లా తెరవడంతోనే రైతులు మద్దతు ధర కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది.ఇంత అరాచక వ్యవస్థను తట్టుకోలేని రైతులు రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. ఉంగుటూరులోని బొమ్మిడి సొసైటీ వద్ద ఆదివారం సాయంత్రం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ ధర్నాకు దిగారు. ఏలూరు మండలం మల్కాపురం రైతు సేవా కేంద్రం వద్ద పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు మద్దతు ధరను కోల్పోవడంతో పాటు ఆర్థికంగా భారాన్ని మోయాల్సి వస్తోంది. రోజుల తరబడి కల్లాల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు పట్టాలు, గోనె సంచులు, వాహనాలు, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారుతోంది.ధాన్యం సేకరణలో ప్రభుత్వం కపట నాటకాలు ప్రదర్శిస్తోంది. రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడం తప్ప క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. కనీసం ప్రభుత్వం తరఫున ధాన్యం తరలించేందుకు వాహనాలు కూడా సమకూర్చలేని దుస్థితి. ఇక్కడా మిల్లరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. రబీలో ధాన్యం దిగుబడులు 48 లక్షల టన్నులకుపైగా వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా. కానీ, ప్రభుత్వం కొనుగోలు లక్ష్యం 13 లక్షల టన్నులే. ఈ క్రమంలోనే 60–70 శాతం మేర కోతలు పూర్తయినా.. చాలాచోట్ల రైతు సేవా కేంద్రాల్లో టార్గెట్లు అయిపోయాయని కొనుగోళ్లు నిలిపివేశారు. ఉద్యాన పంటలకు దెబ్బఏలూరు జిల్లా నూజివీడు, చింతలపూడి తదితర నియోజకవర్గాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో అరటి పంట దెబ్బతింది. కృష్ణా జిల్లా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న వర్షానికి తడిసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న గింజ, కండెలు తడిసిపోవటంతో నాణ్యత దెబ్బతింటుందని, మార్కెట్లో ధర పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గన్నవరం నియోజకవర్గం పరిసరాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మామిడి తోటల్లో కోతకు వచ్చిన మామిడి కాయ నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలం గోసాలలో అరటి తోటలు నేలవాలాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో అరటి, జూపూడిలంకలో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది.మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరటి రైతులకు నష్టం వాటిల్లింది. అరటి చెట్లు పడిపోయాయి. కల్లాల్లో పసుపు తడిసిపోయింది. మొక్కజొన్న కంకులు తడిసి పోయాయి. బాపట్ల జిల్లాలో భారీ వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కొల్లూరు మండలంలో కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసిపోయింది. రాయల సీమతో పాటు ఉత్తరాంధ్రలోని ఉద్యాన పంటలకు తీవ్ర దెబ్బతగిలింది. బొప్పాయి, దానిమ్మ, కూరగాయలు, మామిడి, అరటి, నిమ్మ, ఆయిల్పామ్ రైతులకు నష్టం వాటిల్లింది.సుమారు 1,700 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం. కర్నూలులో బొప్పాయి, దానిమ్మ, శ్రీసత్యసాయి జిల్లాలో కూరగాయలు, అరటి, మస్క్మిలన్, మామిడి, నంద్యాలలో అరటి, బొప్పాయి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యంలో అరటి, వైఎస్సార్ జిల్లాలో అరటి, మామిడి, కూరగాయలు, ప్రకాశంలో అరటి, బొప్పాయి, దానిమ్మ, అనంతపురంలో అరటి, మామిడి, బొప్పాయితో పాటు కూరగాయ పంటలు, పల్నాడులో బొప్పాయి, కూరగాయలు, చిత్తూరులో అరటి, మామిడి, బొప్పాయి, కొబ్బరి, ఏలూరులో నిమ్మ, ఆయిల్ పామ్ పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలకు ప్రాథమిక నష్టం జరిగినట్టు అధికారికంగా రిపోర్ట్ కాలేదని వ్యవసాయ అధికారులు చెప్పడం గమనార్హం.

ఉమ్మడి చితిపేర్పు
‘యుద్ధం’ రెండక్షరాల మాటే, ‘శాంతి’ కూడా అంతే! విచిత్రంగా, చావుబతుకులు రెంటినీ ఇముడ్చుకున్నవి కూడా ఆ రెండే; జీవన ప్రవాహానికి రెండు వైపులా కాపుకాసే తీరాలూ, మనిషిని ఇరువైపులా మోహరించిన భిన్న ధ్రువాలూ అవే; వాటి మధ్యనే మానవ సంచారం. లియో తొలు స్తాయ్ ‘వార్ అండ్ పీస్’ పేరుతో, నిర్దిష్ట స్థలకాలాల నేపథ్యంతో రచించిన ఐతిహాసిక నవలలో మార్చి మార్చి జరిగే ఆ సంచారాన్ని అత్యద్భుతంగా, ఆర్ద్రంగా కళ్ళకు కట్టిస్తాడు. యుద్ధమూ, శాంతీ మనిషితోనే పుట్టి ఉంటాయి. బహుశా మనిషి తొలి యుద్ధం సాటిమనిషితో కాదు, ప్రకృతి శక్తులతో! అది బతకడానికి మొదలైన యుద్ధం; మనుషులొకరి నొకరు చంపుకునే యుద్ధం ఆ తర్వాత వచ్చింది; నాగరికత ముదిరినకొద్దీ అది మహాయుద్ధాల స్థాయికి చేరింది.శాంతి అన్నది యుద్ధమనే రెండు క్రూర సింహాల మధ్య ఇరుక్కున్న బెదురుచూపుల లేడికూనా, మండు టెడారిలో అక్కడక్కడ మరులుగొలిపే శీతలజలచ్ఛాయా అయింది. మనిషి ఒంటిగా ఉన్నప్పుడు బతకనిచ్చే, బతుకునిచ్చే శాంతినే కోరుకుంటాడు; పదిమందిలో ఒకడైనప్పుడే యుద్ధపిపాసి అవుతాడు. ఈ చంచలత్వం మనిషి స్వభావంలోనే ఉంది. తన శాంతి యుత అస్తిత్వానికే చేటు వచ్చినప్పుడు చావో, రేవో తేల్చుకోవాలనుకోవడం సహేతుకమే; కానీ ఏదో ఒక విస్తరణ దాహంతో రక్తపుటేరులు పారించడంలోనే ఎక్కువ చరిత్ర మూటగట్టుకున్నాడు. తన లక్షల సంవత్సరాల మనుగడలో శాంతియుత సహజీవనంపై ఇంతవరకు ఏకీభావానికి రాలేక పోయాడు. అతని అనేకానేక విజయాలను నిలువునా వెక్కిరించే మహా వైఫల్యం అదే. ప్రకృతి ప్రణాళికలో లేని బలవంతపు చావును కొని తెచ్చుకునే వికటించిన తెలివి మనిషిది. ప్రపంచ సాహిత్యంలోని అనేక శిఖరాయమాన రచనల్లో యుద్ధమే ఇతివృత్తం. దేశ కాలాలు, భాషా సంస్కృతులు వేరైనా అవి ఒక్కలానే యుద్ధభాష మాట్లాడాయి, యుద్ధ సంస్కృతిని చిత్రించాయి; యుద్ధం తెచ్చిపెట్టే అపార విధ్వంసంపై, సృష్టించే దుఃఖసముద్రాలపై ఒక్క గుండెతోనే స్పందించాయి. యుద్ధాలను గర్హించే పాత్రలకూ, ఆకాశానికెత్తే పాత్రలకూ కూడా ఒకే గౌరవాన్ని కట్టబెట్టాయి. యుద్ధాలు తగవంటూనే పోరాడి ప్రాణాలు బలిపెట్టిన వీరులకు హారతి పట్టాయి. మహాభారతాన్నే తీసుకుంటే, యుద్ధం వద్దన్నవారు కూడా యుద్ధంలోకి దిగిపోయినప్పుడు, విదురుడొక్కడే ఒంటరిగా ఒడ్డున మిగిలిపోతాడు. అంతవరకు కురుపాండవులుభయుల శ్రేయస్సునూ కోరుకున్న భీష్మ పితామహుడు యుద్ధంలో పాండవ పక్షాన్ని నిర్దాక్షిణ్యంగా నరికి పోగులుపెడతాడు. చస్తే యుద్ధంలోనే చావాలి, ఇంట్లో రోగమొచ్చి చావడం కన్నా పాపమేదీ ఉండదని ఉద్బోధిస్తాడు. అర్జునుడు తనను చంపుతానని ప్రతిజ్ఞ చేసినప్పుడు ప్రాణభయంతో వచ్చి తనను కలిసిన సైంధ వునితో ఆచార్య ద్రోణుడూ అదే అంటాడు; ‘మృత్యువుకెందుకు భయపడుతున్నావు, వెళ్ళి యుద్ధం చేయి, ఎవరూ భూమ్మీద శాశ్వతం కాదు, అందరూ పోయేవాళ్ళే’ నంటాడు. ‘వార్ అండ్ పీస్’లో మరియా దిమిత్రెవ్నా అనే పాత్ర, తన కొడుకులు నలుగురు సైన్యంలో ఉన్నారనీ, అయినా తనకు చింత లేదనీ, చావనేది ఇంట్లో పడుకుని ఉన్నా వస్తుందనీ సగర్వంగా అంటుంది. యుద్ధానికి ఎందుకు సిద్ధమవుతున్నావని పియర్ అనే పాత్ర తన మిత్రుడు ప్రిన్స్ ఆంద్రైని అడిగినప్పుడు, ‘ఏమో, ఎందుకో నాకే తెలియదు, ఇప్పుడు జీవిస్తున్న జీవితం నాకు నచ్చడంలే’దని అతనంటాడు. హోమర్ కృతి ‘ఇలియడ్’లో ట్రాయ్ రాకుమారుడు హెక్టర్, అర్జునుడిలానే యుద్ధాన్ని ద్వేషిస్తాడు, తన భార్య శత్రువుకి బానిసగా చిక్కి ఊడిగం చేసే దృశ్యాన్ని ఊహించుకుని కుంగిపోతాడు, అయినా సరే యుద్ధం చేసి అఖిలీస్ చేతిలో మరణిస్తాడు. అఖిలీస్ చంపడంలోనే వెర్రి ఆనందాన్ని అనుభ విస్తాడు, అదే ఉత్తమోత్తమ పుణ్యకార్యమనుకుంటాడు, ఆ రోజుకి యుద్ధమైపోయాక మళ్ళీ మనిషై పోతాడు. తను రథానికి కట్టి ఈడ్చుకొచ్చిన హెక్టర్ మృతదేహాన్ని యాచించడానికి అతని తండ్రి ప్రియామ్ వచ్చినప్పుడు, అతణ్ణి సగౌరవంగా ఆహ్వానించి శవాన్ని అప్పగించి పంపిస్తాడు. యుద్ధవ్యతిరేకతా, యుద్ధప్రియత్వాల మధ్య; మానుష, అమానుషత్వాల మధ్య మనిషి ఊగిస లాట ఆశ్చర్యం గొలుపుతుంది; క్షతగాత్రుడై పడున్న శత్రువీరుడు ఆంద్రైని చూసి నెపోలియన్ గుండె కరుగుతుంది. తన చేతిలో మరణించిన వాలిపై పడి తారా, రావణునిపై పడి మండోదరీ హృదయ విదారకంగా రోదిస్తున్నప్పుడు రాముడు మ్రాన్పడి ఉండిపోతాడు. ఏ యుద్ధంలోనైనా విజేతలు, పరాజితులన్న తేడా కేవలం సాంకేతికమే; అంతిమ విజయం మృత్యు, విధ్వంసాలదే! విజేత పక్షానికి చెందిన గర్భవతి ఉత్తర, భర్త అభిమన్యుని మరణానికి కన్నీరుమున్నీరవుతుంది. ఉప పాండవులను పోగొట్టుకున్న ద్రౌపది కడుపుకోతా, నూరుగురు కొడుకులను కోల్పోయిన గాంధారి గర్భశోకమూ ఒక్కటే అవుతాయి. నివాసాలు శ్మశానాలవుతాయి, ఊళ్ళు కాలిబూడిదవుతాయి,కొంపలు కొల్లేరవుతాయి, ఖజానాలు ఖాళీ అవుతాయి, శవాల గుట్టల మధ్య బతికున్నవాళ్లు జీవచ్ఛ వాలవుతారు. గాంధారి శోకం శాపమై యదువంశాన్ని పట్టి కుదుపుతుంది, యుద్ధం ఇంకో యుద్ధానికే బీజావాపమవుతుంది, విధ్వంసం మరో విధ్వంసానికే దారి తీయిస్తుంది. శాంతి, రెండు యుద్ధాల మధ్య విరామ చిహ్నమవుతుంది. ఎంతో ఎదిగామనుకునే ఈ రోజున కూడా యుద్ధానికీ, శాంతికీ మధ్య ద్వైదీభావాన్ని మనిషి జయించలేకపోతున్నాడు; ఉండి ఉండి యుద్ధోన్మాది అవుతూనే ఉన్నాడు, భేరీలు మోగిస్తున్నాడు, నినాదాలు ఎలుగెత్తుతున్నాడు! ఇందుకు ఏ ఒక్కరో బాధ్యులు కారు, ఇది సమష్టి వైఫల్యం, ఉమ్మడి చితిపేర్పు.

కులగణన... చరిత్రాత్మక నిర్ణయం
జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కులగణన నిర్వహించా లన్న ప్రతిపక్షాల డిమాండ్కు కేంద్రం తలొ గ్గిందని కూడా కొందరు సామాజిక రాజకీయ వేత్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏమైనా కులగణన ప్రకటన చరిత్రాత్మక రాజకీయ ప్రకటన అని భావించవచ్చు. అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా భారతదేశంలో కుల గణన జరగాలని ఎంతో పోరాడారు. నిజానికి బీసీల కులగణన లేక పోవటం వల్ల బహుజనుల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో న్యాయం జరగలేదు. ఓబీసీల జీవన వ్యవస్థ ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ వలన విధ్వంసం అవుతూ... వారు జీవించే హక్కులు మృగ్యమవుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ముదావహం.మారిన పార్టీల అవగాహనఈ ప్రకటన తర్వాత దేశంలోని రాజకీయ, సామాజిక విశ్లేషకు లకు అనేక ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ కులగణన ప్రస్తావన వచ్చినప్పుడల్లా వ్యతిరేకించాయి. ఇప్పుడు వాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. బిహార్, బెంగాల్, తమిళనాడుల్లో జరగబోయే ఎన్నికల కోసం ఈ ప్రకటన జరిగిందా అనే మరో ప్రశ్న అందరి ముందుకు వచ్చింది. సాక్షాత్తూ పార్లమెంటులోనే బీజేపీ ఎంపీలు కులగణనను వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశ పాలకవర్గం... బ్రాహ్మణ, బనియా, భూస్వామ్య కూటమిగా ఉందనేది స్పష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అంబేడ్కర్, లోహియా, పెరియార్ రామస్వామి చెబుతూనే వచ్చారు. ‘లండన్ హౌజ్ ఆఫ్ కామన్స్’లో అంబేడ్కర్ శత జయంతి సందర్భంగా... భారత మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్ నాతో మాట్లా డుతూ బీసీల రాజకీయ, సామాజిక సంస్కరణల విషయంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వ్యతిరేకంగా వ్యవహరించార ని అన్నారు. మండల్ కమిషన్ రిపోర్టును ఇందిరాగాంధీ అమలు జరపలేదు. దీనికోసం వీపీ సింగ్ చొరవ చూపారనేది సత్యం. ఈ విషయాలను వీపీ సింగ్, శరద్ యాదవ్, రామ్విలాస్ పాశ్వాన్ అనేక సందర్భాల్లో, ముఖ్యంగా చుండూరు పోరాటం సందర్భంలో నాతో చర్చించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి రాక ముందున్న తన ప్రవర్తనను కాంగ్రెస్... బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చుకున్నట్లు అర్థమవుతోంది. నెహ్రూ, ఇందిరాగాంధీ కంటే కూడా సామాజిక, రాజకీయ విషయాల్లోనూ; దళిత బహుజన దృక్పథంలోనూ రాహుల్ గాంధీ అవగాహన భిన్నంగా ఉంది. ఆయనపై సబాల్ట్రన్ స్టడీస్ ప్రభావం కనిపిస్తుంది. తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు పూనుకున్నప్పుడు, వీపీ సింగ్ ప్రభుత్వ మండల్ నివేదికలను అమలు జరపడానికి పూనుకున్నప్పుడు రిజర్వే షన్లకు వ్యతిరేకంగా పోరాటం నడిపినవారు ఆర్ఎస్ఎస్, బీజేపీ వారేనన్నది స్పష్టమే. కుల నిర్మాణ చట్రంఒక రాజకీయ పథకంపై ఓ తీర్పు ఇవ్వడానికి ముందు దానికి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను పరిశీలించడం తప్పనిసరి. ‘ప్రాథమిక ప్రణాళిక’ అంటే ఏ సమాజానికైతే రాజకీయ పథకాన్ని వర్తింపజేయాలని అనుకుంటున్నారో, ఆ సమాజపు నిర్మాణమే ప్రాథ మిక ప్రణాళిక అని చెప్పవచ్చు. సామాజిక నిర్మాణంపై రాజకీయ నిర్మాణం ఆధారపడి ఉందని చెప్పడానికి ఎటువంటి సమర్థనా అవసరం లేదు. వాస్తవానికి రాజకీయ నిర్మాణంపై సామాజిక నిర్మాణం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ నిర్మాణం పని చేసే తీరును అది మార్చవచ్చు, నిరర్థకం చేయవచ్చు లేదా అపహాస్యం పాలు కూడా చేయవచ్చు. భారతదేశ విషయంలో సామాజిక నిర్మాణం అనేది కుల వ్యవస్థపై నిర్మితమై ఉంది. కుల స్వభావం గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. కానీ కులవ్యవస్థకు ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలను గుర్తించి తీరాలి. కులాలు ఎలా పంపిణీ అయ్యాయి అంటే... ప్రతి ప్రాంతంలోనూ ఒక ప్రధాన కులమూ, కొన్ని చిన్న కులాలూ ఉన్నాయి. జనాభా రీత్యా ప్రధాన కులంతో పోల్చినప్పుడు చిన్నవి కావడం వల్లనూ, గ్రామంలో ఉన్న భూమిలో ఎక్కువ భాగం సొంతం చేసుకున్నటువంటి ప్రధాన కులంపై ఆర్థికంగా ఆధారపడి ఉండటం వల్లనూ... ఈ చిన్న కులాలు ప్రధాన కులానికి లోబడి ఉండేవిగా ఉన్నాయి. కేవలం అసమానతే కులవ్యవస్థ ప్రత్యేకత కాదు. క్రమబద్ధంగా శ్రేణీకరించిన అసమానతతో అది ప్రభావితమై ఉంది. కులాలు ఒకదానిపై మరొకటి ఉంటాయి. అదొక రకమైన ఆరోహణా క్రమపు ద్వేషమూ, అవరోహణా క్రమపు ఏవగింపూ కలిగి ఉన్నాయి. కులమనేది సామాజిక, సాంస్కృతిక, తాత్త్విక జీవన వ్యవస్థల నుండి ఆ యా కాలాలలో పరిణామం చెందుతూ వచ్చి కుల నిర్మూలనా దశకు చేరుకుంటుందని అంబేడ్కర్ భావించారు. అందుకే ఆయన కులనిర్మూలనా ప్రణాళికను రూపొందించారు. కులనిర్మూలనా సంస్కృతి కార్యక్రమ ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో కుల గణనే కాక, కుల ఆర్థిక గణన కూడా చేయగలిగితే... భారతదేశ సామాజిక, ఆర్థికపరమైన నిజ స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడే ఏ కులానికి ఎంత సంపద ఉందన్నది బయటకు వస్తుంది. మొత్తం మీద నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన భారతదేశంలో తప్పక గుణాత్మకమైన మార్పు వస్తుందనీ; బీసీలు, దళితులలో... ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెరుగుతుందనీ ఆశించాల్సిన చారి త్రక సందర్భం ఇది. సానుకూల దృక్పథమే భారతదేశ భవితవ్యానికీ, దళిత బహుజన రాజకీయ విప్లవానికీ దోహదం చేస్తుందన్నది వాస్తవం.డా‘‘ కత్తి పద్మారావువ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695

బఫెట్ వారసుడొచ్చాడు..!
ఒమాహ: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ (94) ‘బెర్క్షైర్ హాతవే’ చైర్మన్గా ఈ ఏడాది చివర్లో తప్పుకోనున్నారు. తన స్థానంలో వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్కి సారథ్య బాధ్యతలు అప్పగించాలంటూ కంపెనీ బోర్డుకు సిఫారసు చేయనున్నట్టు శనివారం ప్రకటించి ఇన్వెస్టర్లను, ఫాలోవర్లను షాక్కు గురిచేశారు. దీంతో ఆరు దశాబ్దాల పెట్టుబడుల యాత్రకు బఫెట్ ముగింపు పలకనున్నారు. ‘‘కంపెనీ సీఈవోగా ఈ ఏడాది చివర్లో గ్రెగ్ బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైంది’’అంటూ వాటాదారులతో నిర్వహించిన ప్రశ్న–జవాబుల కార్యక్రమం చివర్లో బఫెట్ ప్రకటించారు.దీనిపైపై మాత్రం ప్రశ్నలకు అనుమతించలేదు. ఈ నిర్ణయం కంపెనీ బోర్డు సభ్యులైన తన ఇద్దరు పిల్లలు హోవర్డ్, సూసీ బఫెట్కు మాత్రమే తెలుసని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వేదికపై బఫెట్ పక్కనే గ్రెగ్ అబెల్ ఆసీనులై ఉండడం గమనార్హం. ‘‘బెర్క్షైర్ హాతవే కంపెనీ షేరు ఒక్కటి కూడా విక్రయించాలన్న ఉద్దేశం నాకు లేదు. చివరికి వీటిని విరాళంగా ఇచ్చేయాల్సిందే. కానీ, ప్రతీ షేరును కొనసాగించాలన్న నిర్ణయం ఆర్థిక కోణంలో తీసుకున్నదే. ఎందుకంటే నా కంటే కూడా గ్రెగ్ నాయకత్వంలో బెర్క్షైర్ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాను’’అని బఫెట్ తెలిపారు.ఇప్పటికే కీలక బాధ్యతలు..బఫెట్ భవిష్యత్ వారసుడిగా గ్రెగ్ అబెల్ (62) గతంలోనే నియమితులయ్యారు. కంపెనీ నాన్ ఇన్సూరెన్స్ వ్యాపార బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. కానీ, బఫెట్ మరణానంతరమే ఆయన స్థానంలో కంపెనీ బాధ్యతల్లోకి గ్రెగ్ వస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. తనకు రిటైర్మెంట్ ప్రణాళికలేవీ లేవంటూ లోగడ బఫెట్ ప్రకటించడం ఇందుకు దారితీసింది. బెర్క్షైర్ కంపెనీని నడిపించే సామర్థ్యాలు గ్రెగ్ అబెల్కు ఉన్నాయని చాలా మంది ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.ఇకపై ఇన్సూరెన్స్ వ్యాపారం బాధ్యతల నిర్వహణతోపాటు కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను (2024 చివరికి 334 బిలియన్ డాలర్లు) అబెల్ ఎలా పెట్టుబడులుగా మలుస్తారన్న ఆసక్తి నెలకొంది. బఫెట్ ప్రకటన తర్వాత వేలాది మంది ఇన్వెస్టర్లు నిల్చుని మరీ దిగ్గజ ఇన్వెస్టర్ సేవలకు ప్రశంసలు కురిపించడం కనిపించింది. బఫెట్ సారథ్యంలో (1965 నుంచి నేటి వరకు) బెర్క్షైర్ ఎస్అండ్పీ 500 కంటే (ఏటా 10.4 శాతం) రెట్టింపు స్థాయిలో ఏటా 19.9 శాతం కాంపౌండెడ్ రాబడులు అందించడం గమనార్హం. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం వారెన్ బఫెట్ సంపద విలువ ప్రస్తుతం 169 బిలియన్ డాలర్లుగా ఉంది.

మానవీయ మతగురువు
నేను ఒకసారైనా పోప్ ఫ్రాన్సిస్ని కలిసి ఉండాల్సింది. ఆయన విషయంలో తప్ప, ఇతర ప్రముఖుల గురించి ఎప్పుడూ ఇలా అనుకోలేదు. పోప్ ముఖంలో ఎప్పుడూ కరుణ, ఆప్యాయత, ఆనందం ఉట్టిపడుతూ ఉండేవి. ఆయన నవ్వుతూ ఉండేవారు. నవ్విన ప్రతిసారీ ఆ కళ్లు వెలుగులు ప్రసరించేవి. అది పెదవుల మీద చిందే మామూలు మందహాసం కాదు. గుండె లోతుల్లోంచి వచ్చినట్లుంటుంది. సహజమైనది. చిన్నారుల పట్ల ఆయన ఎంతో వాత్సల్యం ప్రదర్శించేవారు. అందులోనూ నిజాయతీ కనిపించేది. పోప్ మరణం తర్వాత నేను ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వాటితోనే నాకాయన ఎంతో ప్రేమాస్పదుడు అయ్యారు.క్యాథలిక్ చరిత్రలో పరమ పూజ్యుడిగా గుర్తింపు పొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పేరును పోప్ తన ‘పాపల్ నేమ్’గా స్వీకరించారు. ఆ ఇటాలియన్ మార్మికుడి మాదిరిగానే పోప్ అతి నిరాడంబరంగా జీవించారు. పోప్ అధికారిక నివాసమైన వ్యాటికన్ ప్యాలెస్ను (దీన్నే గ్రాండ్ పాపల్ హోమ్ అంటారు) కాదని అక్కడి అతిథి గృహంలోని ఓ చిన్న రెండు గదుల అపార్టుమెంటులో ఉన్నారు. ఆయన ఎంత సాదాసీదాగా ఉండేవారంటే, తను వేసుకునే బ్రౌన్ కలర్ షూస్ బాగా నలిగిపోయి ఉండేవి. గార్డులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం ఆయనకు పరిపాటి. కార్మికులు తినే క్యాంటిన్లోనే తరచూ భోజనం చేసేవారు. ప్రీస్ట్ కావటానికి ముందు బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా)లో ఫ్రాన్సిస్ ఒక బౌన్సర్ ఉద్యోగం చేశాడంటే నమ్మగలరా? ఇతర ప్రీస్టుల కంటే భిన్నంగా ఉండటా నికి బహుశా అదొక కారణం అయ్యుంటుంది. పేదల పక్షం ఉండటమే ఈ పోప్ తత్వం. వారి కళ్లలో ఆయనకు చర్చి కనబడేది. కాబట్టే ఆయన్ను మురికివాడల బిషప్పు అని పిలుచుకునేవారు.2023 అక్టోబరులో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైనప్పటి ఉదంతమిది: గాజాలో హోలీ ఫెయిత్ చర్చి ఉంది. ఆ ఏకైక క్యాథలిక్ చర్చిలోనే క్రైస్తవులు, ముస్లిములు తల దాచుకున్నారు. వారి కోసం ప్రార్థించడానికి, వారికి ఊరడింపుగా ఉండటానికి పోప్ రాత్రి సమయాల్లో వాటికన్ నుంచి ఫోన్ చేసేవారు. ప్రపంచానికి తెలియని ఇలాంటి ఎన్నో అద్భుతమైన పనులు ఆయన చేశారు. వాటిలో ఇదొకటి. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా తాను అనుకున్నది చేయడం సెయింట్ ఫ్రాన్సిస్ స్వభావం. అలా ఉండటానికే పోప్ ఫ్రాన్సిస్ కూడా ఇష్టపడేవారు. ఈ విషయాలు తెలిసిన ఆయన సన్నిహితులు సైతం వాటిని అందరి దృష్టికీ తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. స్వలింగ సంపర్కం పట్ల క్యాథలిక్ చర్చి వైఖరి కఠినంగా ఉంటుంది. ఈ కాఠిన్యాన్ని సడలించిన మొట్ట మొదటి పోప్... ఫ్రాన్సిస్సే! తన విమర్శకులను ఉద్దేశించి, మంచో చెడో ‘‘తీర్పు చెప్పడానికి నేనెవరిని?’’ అని ప్రశ్నించారు. విడాకులు తీసుకున్నవారు, పునర్వి వాహం చేసుకున్నవారు ‘సాక్రమెంటు’ స్వీకరించడంలో తప్పు లేదని చెప్పిన మొదటి పోప్ కూడా ఆయనే. నలుగురు మితవాద కార్డినల్స్ బాహాటంగా వ్యతిరేకించినప్పటికీ పోప్ తన అభిమతం మార్చుకోలేదు.గర్భనిరోధం, గర్భస్రావం, స్వలింగ వివాహాలు, ట్రాన్స్జెండర్లకు గుర్తింపు వంటి అంశాల్లో ఆయన సంప్రదాయానికి లోబడి వ్యవహరించారు. ఏదేమైనా, ఆనవాయితీలను అధిగమించి నూతన భావనలు ప్రవేశపెట్టడాన్నే ఆయన ఇష్టపడేవారు. ఎంత తిరిగినా మళ్లీ అక్కడకే వస్తాం... పోప్ ఫ్రాన్సిస్ సామాన్య జనం గురించి తపన పడేవాడు. వలసదారులు, శరణార్థుల సమస్యపై ఆయన తీసుకున్న వైఖరి దీన్ని రుజువు చేస్తుంది. పోప్ హోదాలో తన తొలి పర్యటనకు ల్యాంపెడుజా అనే ఇటలీ ద్వీపాన్ని ఎంచుకున్నారు. ఉత్తర అమెరికా అక్రమ వలసదారు లను కలిసి వారి సమస్య పరిష్కరించడమే ఈ పర్యటన ఉద్దేశం. తాను జబ్బు పడటానికి కొన్ని వారాల ముందు కూడా, అక్రమ వలసదారులను నేరస్థులుగా పరిగణిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన విధానాలను పోప్ విమర్శించారు. మరే ఇతర దేశాధిపతీ ఇంతగా తెగించి ఉండడని వ్యాఖ్యానించారు. ఇస్లాంతో అధికారికంగా చర్చ జరిపిన మొట్ట మొదటి పోప్ కూడా ఆయనే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆయన బహిరంగ ‘మాస్’ నిర్వ హించారు. అరబ్ ద్వీపకల్పంలో ఇలా చేయడం ఇదే ప్రథమం. ఈ మతాంతర సౌభ్రాతృత్వ చర్యల మీద మితవాదులు దాడి చేశారు. వారిని ఆయన అసలు పట్టించుకోలేదు. పోప్ జీవితంలో వైఫల్యాలు లేవని చెప్పలేం. ముఖ్యంగా వాటికన్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యవహారంలో సమర్థంగా వ్యవహరించలేక పోయారు. ఈ కేసులో కార్డినల్ ఏంజెలో బెచూ మీద ఆరోపణలు రుజువు అయ్యాయి. 2023లో జైలు శిక్ష కూడా పడింది. అంతిమంగా, పోప్ ఈ సమస్యను విస్తృత స్థాయిలో ఎదుర్కోలేక పోయారనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ముందున్న వారెవరూ ఆయన కంటే సమర్థులు కారు. ఏమైనప్పటికీ, ఫ్రాన్సిస్ తన తర్వాత కూడా క్యాథలిక్ చర్చ్ తన ఆకాంక్షలకు అనుగుణంగా నడిచేలా జాగ్రత్తపడ్డారు. ఆయన వారసుడిని ఎన్నుకునే అర్హత 135 మంది కార్డినల్స్కు ఉంటుంది. వారిలో 108 మందిని తనే నియమించారు. అందులో యూరోపి యన్లు 53 మంది కాగా, 82 మంది ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, ఓసియానియా (ఆస్ట్రేలియా సహా అనేక ఇతర పసిఫిక్ దీవులు) ప్రాంతాల వారే! అంటే, ఆయన వారసుడు మరో యూరపే తరుడు అవుతాడా? అవకాశాలు అలానే ఉన్నాయి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
పంజాబ్ పరాక్రమం
కాస్మిక్ బోన్కు పగుళ్లు
నిరాఘాటంగా 15 గంటలు విలేకరుల సమావేశం
కేవలం 4 రోజుల్లో చేతులెత్తేయడమే!
అవే ఉద్రిక్తతలు
ఐటీఆర్–3ని నోటిఫై చేసిన ఆదాయపన్ను శాఖ
పెట్టుబడులకు కాస్త స్థిరత్వం
బఫెట్ వారసుడొచ్చాడు..!
బ్రహ్మంగారి మఠం... ఆరంభమైన ఆరాధనోత్సవాలు
డబుల్ ధమాకా
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్లైన్ ఆపరేటర్
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
బంగారం భారీగా పడిపోతుంది!
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
ఇంట్లో పాముల కలకలం
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
3 నిమిషాలకో మరణం
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
హైదరాబాద్లో హై అలర్ట్
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఒకే ఇల్లు.. ఒకే వంట
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
ముష్కర మూకలకు ముచ్చెమటలు
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు
పిడుగుపాటుకు ఆరుగురు మృతి
అన్నదాతకు గుండెకోత
ప్రతి నియోజకవర్గానికి పీ4 కో–ఆర్డినేటర్
రాష్ట్రంలో మీడియా ట్రయల్ జరుగుతోంది
మూడింట ఒక వంతు రుణమే
సన్రైజర్స్కు ఆఖరి చాన్స్!
కోల్కతా బతికిపోయింది!
పంజాబ్ పరాక్రమం
కాస్మిక్ బోన్కు పగుళ్లు
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్లైన్ ఆపరేటర్
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
బంగారం భారీగా పడిపోతుంది!
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
ఇంట్లో పాముల కలకలం
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
3 నిమిషాలకో మరణం
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
హైదరాబాద్లో హై అలర్ట్
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఒకే ఇల్లు.. ఒకే వంట
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
ముష్కర మూకలకు ముచ్చెమటలు
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
సినిమా

'చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం.. శ్రీదేవి వల్ల ఆ సాంగ్ చేయాల్సి వచ్చింది'
తెలుగు చిత్రసీమ చరిత్రలోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం విడుదలై 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మే 9న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రీ రిలీజ్ చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ నిర్మించారు.కాగా.. మే 9వ తేదీ 1990న జగదేక వీరుడు అతిలోక సుందరి థియేటర్లలో విడుదలైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా ఈ సినిమా తుడిచిపెట్టేసింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ అనేలా ఈ మూవీ నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు దాని క్రేజ్ గురించి ఒక్క మాటలో ఓ ఉదాహరణగా చెప్పాలంటే.. రూ. 6 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్లో రూ. 210 వరకు అమ్మేశారట. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు అన్నమాట. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలోని ఎవర్ గ్రీన్ సాంగ్ అబ్బనీ తీయని దెబ్బ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. 'ఈ పాటను ఒక రోజులోపు కంపోజ్ చేశామని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇళయరాజా ఉదయం 9 గంటలకు ఆ పాటపై పని చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 లేదా 12:30 గంటల ప్రాంతంలో బాగుందా? లేదా వినండి అంటూ ఇళయరాజా మాకు ఒక ట్యూన్ ఇచ్చారు. అది రాఘవేంద్రరావు, అశ్వనీదత్తో పాటు నాకు వెంటనే నచ్చింది. ఆ ట్యూన్ ఎంతో సింపుల్గా, తియ్యగా అనిపించింది. భోజన సమయంలో వేటూరి సాహిత్యం రాశారు. బాలు, చిత్ర గారు అలా సరదాగా పాడేశారు'అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ‘అందాలలో’ అనే పాట గురించి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. 'కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు, హీరోయిన్ ఒక దేవత అని చెప్పాల్సి వచ్చింది. దానిని పాట ద్వారా మాత్రమే సమర్థవంతంగా తెలియజేయగలమని మేము భావించాము. ఆ ఐకానిక్ పాటను కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన అదే' అని అన్నారు.‘దినక్కుతా’ అనే పాట గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ .. ‘ఈ పాటను షూట్ చేసే టైమ్కి చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ప్రతి షాట్ బ్రేక్ సమయంలో.. మేము అతని శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం. శ్రీదేవి కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఆయన ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత, ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళ్లనుంది. మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు’ అని అన్నారు.శ్రీదేవి గతంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ గురించి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో తనకు ఇష్టమైన పాట ‘ప్రియతమ’ సాంగ్ అని అన్నారు. అది చాలా అందమైన మెలోడీ. రాఘవేంద్రరావు దానిని ఎక్కువ మూమెంట్స్ లేకుండా కేవలం కంటి చూపులు, సైగలతోనే కంపోజ్ చేయించారు. అది మరపురాని పాట అని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్లు అజయన్ విన్సెంట్, కె.ఎస్. ప్రకాష్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ‘మాస్ట్రో’ ఇళయరాజా ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీకి కథను యండమూరి వీరేంద్రనాథ్.. స్క్రీన్ప్లేను జంధ్యాల అందించారు. ఈ వేసవిలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాజాలాన్ని మే 9న 2డీ, 3డీ ఫార్మాట్లలో చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

మేకప్ లేకుండా శ్రద్ధా కపూర్.. పాపతో మెహ్రీన్
మేకప్ లేకుండా కనిపించి షాకిచ్చిన శ్రద్ధా కపూర్నడుము ఒంపుసొంపులతో తెలుగమ్మాయి రమ్యచీరలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ప్రణీతబరువులెత్తేస్తూ జిమ్ చేస్తున్న ఐశ్వర్య మీనన్చాన్నాళ్ల తర్వాత ఆమిర్ ని కలిసిన సమీరా రెడ్డిబ్లర్రీ పోజులతో మైమరిపించేస్తున్న కేథరిన్అందాలన్నీ చూపించేస్తున్న సాక్షి అగర్వాల్ View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by AISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk)

అసలు నేను సినిమాలో ఉన్నానా?.. డైరెక్టర్ను డైరెక్ట్గా అడిగేసిన లయ!
రాబిన్హుడ్ తర్వాత నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్ వేణు శ్రీరామ్ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.డైరెక్టర్ వేణు శ్రీరామ్ పుట్టినరోజు కానుకగా తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో వెల్లడించారు. దర్శకుడు వేణు శ్రీరామ్ దగ్గరికి వచ్చిన హీరోయిన్లు బర్త్ డే విషెస్కు బదులుగా మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు సార్?అని అడుగుతారు. దీంతో ఆయన కాస్తా షాకింగ్కు గురవుతారు. హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మతో పాటు మరో సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ లయ కూడా దర్శకుడితో మూవీ విడుదల తేదీ గురించే ఆరా తీస్తుంది.అసలే నేను తెలుగమ్మాయిని.. 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నా.. నేను ఈ సినిమాలో ఉన్నానా సార్? అంటూ డైరెక్టర్ వేణు శ్రీరామ్ను ప్రశ్నిస్తుంది. 'ఒక్క పోస్టర్ లేదు.. అప్డేట్ లేదు.. కనీసం సినిమా రిలీజ్ డేట్ అయినా చెప్పండి.. వెళ్లి థియేటర్లోనే చూసుకుంటా' అని లయ మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ మూవీ ప్రమోషన్లలో ఇదొక డిఫరెంట్ వే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. వేణు శ్రీరామ్- నితిన్ కాంబోలో వస్తోన్న తమ్ముడు మూవీ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో దిల్రాజు, అల్లు శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాబిన్ హుడ్ మూవీ హిట్ కాకపోవడంతో నితిన్ ఫ్యాన్స్ తమ్ముడిపై ఆశలు భారీగానే పెట్టుకున్నారు. మరీ వారి అంచనాలకు తగినట్లుగా రాణిస్తుందో లేదో తెలియాలంటే జూలై 4వరకు వేచి చూడాల్సిందే.Just as I asked, they’ve announced it!😏#Thammudu releasing on July 4th, 2025🎯#HBDSriramVenu sir #ThammuduOnJuly4th❤️🎂@actor_nithiin #Laya @VarshaBollamma #Swasika #DilRaju #Shirish @SVC_official @AJANEESHB pic.twitter.com/zw4zLuR6QD— Sapthami Gowda (@gowda_sapthami) May 4, 2025An Ambitious & Powerful Saga Will Ignite Big Screens🔥Feel the pulse of Action, emotion & adrenaline!💥#Thammudu Hitting the Bullseye on July 4th, 2025🎯#ThammuduOnJuly4th@actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya @VarshaBollamma #Swasika #DilRaju #Shirish… pic.twitter.com/bIlA0oWOHH— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2025

బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు
సినిమా ఇండస్ట్రీ అంటేనే నెపోటిజం, ఒకరిని ఒకరు తొక్కేయడాలు లాంటివి చాలా ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. కాకపోతే వీటి గురించి పెద్దగా బయటకు రాదు, రానివ్వరు. అప్పుడప్పుడు కొందరు నటీనటులు మాత్రం తమ బాధని వెళ్లగక్కుతుంటారు. అవి వీడియోల రూపంలో వైరల్ అవుతుంటాయి.(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!) తాజాగా హిందీ సినిమాలు చేస్తున్న ఓ యంగ్ హీరో బాబిల్ ఖాన్.. ఏడుస్తూ బాధపడుతూ ఓ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లో అస్సలు మర్యాద ఇవ్వరు అని నోటికొచ్చింది మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటికే వీడియోని డిలీడ్ చేయడంతో పాటు అకౌంట్ ని డీయాక్టివేట్ చేసేశాడు.'ఈ రోజు మీ అందరితో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇండస్ట్రీలో(బాలీవుడ్) అర్జున్, అనన్య, షనయాతో పాటు సంబంధం లేని అర్జిత్ సింగ్ లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే అత్యంత నకిలీ ఇండస్ట్రీ. ఇది బాగుండాలని కోరుకునేది కొందరే. నేను మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను' అని బాబిల్ ఏడుస్తూ సదరు వీడియోలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తెలుగు హీరోతో మృణాల్ ప్రేమ? నిజమేంటి?) గతంలో లంచ్ బాక్స్, పీకూ, పాన్ సింగ్ తోమార్ తదితర సినిమాలతో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ కొడుకే ఈ బాబిల్ ఖాన్. 2020లో తండ్రి చనిపోయిన తర్వాత నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. పలు సినిమాల్లో సహాయ నటుడిగా చేశాడు. మొన్నీమధ్యే లాగౌట్ అనే ఓటీటీ మూవీలో హీరోగానూ చేశాడు.ఇప్పుడు చేసిన ఈ వీడియో పీఆర్ స్టంట్ లేదంటే నిజంగా బాధతో చెప్పాడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అర్జున్, అనన్య, షనయా నెపోటిజం అని అన్నాడు. అదే టైంలో తన తండ్రి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని బాబిల్ మర్చిపోయినట్లున్నాడు. మరి దీని వెనుక ఏం మతలబు ఉందో?(ఇదీ చదవండి: భార్య, సవతి కలిసి భర్తని మాయం చేస్తే.. ఓటీటీ రివ్యూ)
న్యూస్ పాడ్కాస్ట్

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు
క్రీడలు

స్టేడియం బయటకు బంతి.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్! వీడియో
ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన శశాంక్ సింగ్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 33 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే శశాంక్ తన ఇన్నింగ్స్లో కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచింది. పంజాబ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ నాలుగో బంతిని శశాంక్ సింగ్కు బ్యాక్-ఆఫ్-ఎ-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని శశాంక్ సింగ్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్-లెగ్ మీదుగా 92 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. అతడి పవర్ దాటికి బంతి మైదానం బయట పడింది. ఈ క్రమంలో స్టాండ్స్లో కూర్చుని మ్యాచ్ను వీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా అద్బుతమైన రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(91) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా.. శ్రేయస్ అయ్యర్(45), శశాంక్ సింగ్(33), ఇంగ్లిష్(30) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.Fetch that one from the mountains! 🏔#ShashankSingh lights up Dharamsala with a monstrous six. Power-hitting at it's finest! 🤩Watch the LIVE action in BHOJPURI ➡ https://t.co/Iz9KWvDwyp #IPLRace2Playoffs 👉 #PBKSvLSG | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star… pic.twitter.com/C24qxSp4lE— Star Sports (@StarSportsIndia) May 4, 2025

వారి వాళ్లే ఈ మ్యాచ్లో గెలిచాము.. సంతోషంగా ఉంది: అజింక్య రహానే
ఐపీఎల్-2025లో కోల్కతా నైట్రైడర్స్ తమ ప్లేఆఫ్స్ ఆశలను మరింత పదిలం చేసుకుంది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్కతా ఆరో స్దానానికి చేరుకుంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. రాజస్తాన్ 20 పరుగులు చేయగల్గింది. శుభమ్ దూబే ఆఖరి ఓవర్లో మెరుపులు మెరిపించినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అదేవిధంగా రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్(95) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో మోయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన తమ ఆటగాళ్లపై రహానే ప్రశంసల వర్షం కురిపించాడు."ఉత్కంఠ పోరులో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి లేదా రెండు పరుగుల తేడాతో గెలిచినప్పుడు ఆ విజయం మనకు చాలా సంతృప్తిని ఇస్తుంది. గుర్భాజ్, అంగ్క్రిష్ చాలా బాగా ఆడారు. వీరితో పాటు రస్సెల్ మాకు అద్బుతమైన ముగింపు అందించాడు.పవర్ప్లేలో దూకుడుగా ఆడి, ఆ తర్వాత 12 ఓవర్ వరకు ఆచితూచి ఆడాలన్నది మా ప్రణాళిక. నేను, అంగ్క్రిష్ వీలైనంతవరకు క్రీజులో ఉండాలనుకున్నాము. ఫీల్డింగ్లో మా బాయ్స్ అద్బుతం చేశారు. మా ఫీల్డర్లు 10 నుంచి 12 పరుగులు కాపాడారు. ఇదే మా విజయంలో కీలక పాత్ర పోషించింది. రెండు మంచి క్యాచ్లు తీసుకొని, ఓ రనౌట్ చేయగలిగితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో రహానే పేర్కొన్నాడు.

క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ సరసన ప్రభ్సిమ్రన్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్ (PBKS vs LSG)తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను చితక్కొడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, దురదృష్టవశాత్తూ శతకానికి తొమ్మిది పరుగుల దూరంలో ప్రభ్సిమ్రన్ ఆగిపోయాడు.అయితేనేం.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్బుత ఆట తీరుతో క్రిస్ గేల్, కేఎల్ రాహల్ (KL Rahul)సరసన నిలిచాడు. గతేడాది నిలకడైన ప్రదర్శన కనబరిచిన ప్రభ్సిమ్రన్ సింగ్ను పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు భారీ ధరకు అట్టిపెట్టుకుంది. అతడి కోసం పర్సు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించింది.అందుకు తగ్గట్లుగానే ప్రభ్సిమ్రన్ ఈసారీ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్తో అలరిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా లక్నోతో మ్యాచ్లోనూ అతడు బ్యాట్ ఝులిపించాడు. మొత్తంగా 48 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 91 పరుగులు సాధించాడు.అయితే, దిగ్వేశ్ రాఠీ బౌలింగ్లో నికోలస్ పూరన్కు క్యాచ్ ఇవ్వడంతో ప్రభ్సిమ్రన్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక అతడికి ఈ సీజన్లో ఇది ఓపెనర్గా వరుసగా మూడో అర్ధ శతకం కావడం విశేషం. తద్వారా పంజాబ్ కింగ్స్ తరఫున ఒకే సీజన్లో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రభ్సిమ్రన్ చేరిపోయాడు.ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఇప్పటికి పది మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. ఒకటి వర్షం కారణంగా రద్దైంది. ఈ క్రమంలో 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా లక్నోతో మ్యాచ్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకుపోతుంది.మరోవైపు.. ఈ సీజన్లో ఇప్పటికి (ఈ మ్యాచ్తో కలిపి) పదకొండు ఇన్నింగ్స్ ఆడిన ప్రభ్సిమ్రన్ 437 పరుగులు సాధించాడు. తద్వారా పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికి నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. ఇక లక్నోతో ఆదివారం నాటి మ్యాచ్లో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 236 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ప్రభ్సిమ్రన్ సింగ్తో పాటు జోష్ ఇంగ్లిస్ (14 బంతుల్లో 30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45), శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్), మార్కస్ స్టొయినిస్ (5 బంతుల్లో 15) దంచికొట్టారు.ఒక సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఓపెనర్గా వరుసగా అత్యధిక అర్ధ శతకాలు సాధించింది వీరేక్రిస్ గేల్ (2018)- మూడుకేఎల్ రాహుల్ (2018)- మూడుకేఎల్ రాహుల్ (2019)- మూడుకేఎల్ రాహుల్ (2020)- మూడుప్రభ్సిమ్రన్ సింగ్ (2025*) మూడు.Sent the ball to enjoy the view 🏔😍Shashank Singh and Prabhsimran Singh with an entertaining partnership tonight 💪Scorecard ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/9WqFWRd3zt— IndianPremierLeague (@IPL) May 4, 2025

నా బ్యాటింగ్ అద్బుతమే.. కానీ మా వాళ్లే అలా!.. అతడైతే గ్రేట్: రియాన్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్కు చేదు అనుభవం ఎదురైంది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో ఆదివారం నాటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.అప్పటికి నా బ్యాటింగ్ అద్భుతమే..తాను ఆఖరి వరకు క్రీజులో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పరాగ్ పేర్కొన్నాడు. ‘‘నేను అవుట్ కావడం తీవ్ర నిరాశపరిచింది. ఆఖరి రెండు ఓవర్ల వరకు క్రీజులో ఉండాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ 18వ ఓవర్లోనే అవుటయ్యా.16, 17 ఓవర్లలో మేము ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాం. విజయ సమీకరణం విషయంలో నేను సరైన విధంగా లెక్కలు వేసుకోలేకపోయాను. మ్యాచ్ను విజయంతో ముగించి ఉంటే ఎంతో బాగుండేది.అవుటయ్యేంత వరకు నేను అద్భుతంగా బ్యాటింగ్ చేశాను. ఓడిపోయిన కెప్టెన్గా ఇంటర్వ్యూకు వెళ్లకూడదని నాకు నేనే పదే పదే చెప్పుకొన్నా’’ అని రియాన్ పరాగ్ ఉద్వేగానికి లోనయ్యాడు.మా ప్రదర్శన గొప్పగా లేదుఅదే విధంగా జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘‘ఆఖరి ఆరు ఓవర్లలో మాకు మరింత మెరుగైన ఆప్షన్లు దొరికి ఉంటే బాగుండేది. ముఖ్యంగా బౌలర్ల విషయం గురించి చెబుతున్నా. ఏదేమైనా పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం వల్ల ఫలితం ఏమీ ఉండదు.మ్యాచ్ను పూర్తి చేసి ఉంటే ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చేది కాదు. రసెల్ ఒక సమయంలో 10 బంతుల్లో రెండు పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తర్వాత అతడు బ్యాట్ ఝులిపించిన తీరు చూడటానికి ముచ్చటగా అనిపించింది.ఈ మైదానంలో సులువుగానే సిక్సర్లు కొట్టవచ్చు. వికెట్ కాస్త ట్రికీగా ఉన్నా.. పర్లేదు కాస్త మెరుగైందే. అందుకే నా ప్రణాళికలు చక్కగా అమలు చేసుకుంటూ ముందుకు సాగాను. మైదానంలో మా ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. అందుకే నేను ఇక్కడ ఇలా నిలబడాల్సి వచ్చింది’’ అని రియాన్ పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్తో మ్యాచ్లో టాస్ ఓడిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఓపెనర్ సునిల్ నరైన్ (11)ను అవుట్ చేసి యుధ్వీర్ శుభారంభమే అందించాడు. కానీ మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (35), కెప్టెన్ అజింక్య రహానే (30) ఇన్నింగ్స్ గాడిన పెట్టారు.ఈ క్రమంలో అంగ్క్రిష్ రఘువన్షీ (44) కూడా వీరికి సహకారం అందించగా.. ఆండ్రీ రసెల్, రింకూ సింగ్ పూర్తిగా గేరు మార్చేశారు. ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడి.. కేకేఆర్ స్కోరును 200 దాటించారు.రసెల్ (25 బంతుల్లో 57 నాటౌట్), రింకూ (6 బంతుల్లో 19 నాటౌట్) మెరుపుల కారణంగా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి.. కేకేఆర్ కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. రాజస్తాన్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ కేకేఆర్ బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (34) ఫర్వాలేదనిపించగా.. వైభవ్ సూర్యవంశీ(4) మరోసారి నిరాశపరిచాడు. ఇక కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్, వనిందు హసరంగ డకౌట్ అయ్యారు.ఈ క్రమంలో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించాడు. అతడికి తోడుగా షిమ్రన్ హెట్మెయిర్ (29) కాసేపు నిలబడగా.. రియాన్ అవుటైన తర్వాత కథ మారిపోయింది.పద్దెమినిదవ ఓవర్ నాలుగో బంతికి హర్షిత్ రాణా బౌలింగ్లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి రియాన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్ (12) శుభమ్ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును ముందు నడిపాడు. ఇద్దరూ కలిసి సింగిల్స్ , డబుల్స్ తీస్తూ పందొమ్మిదో ఓవర్లో 11 పరుగులు స్కోరు చేశారు.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. 2, 1, 6, 4, 6 స్కోరు చేసి రాజస్తాన్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. అయితే, ఆఖరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా ఆర్చర్ రనౌట్ కావడంతో కథ కంచికి చేరుకుండానే ముగిసిపోయింది. చదవండి: IND vs SL: టీమిండియాకు చేదు అనుభవం.. లంక చేతిలో ఓటమిSent the ball to enjoy the view 🏔😍Shashank Singh and Prabhsimran Singh with an entertaining partnership tonight 💪Scorecard ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/9WqFWRd3zt— IndianPremierLeague (@IPL) May 4, 2025
బిజినెస్

ఏప్రిల్లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) 2025 ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ గత నెలలో 4,80,896 యూనిట్ల అమ్మకాలు జరిగిపింది. ఇందులో దేశీయ అమ్మకాలు 4,22,931 యూనిట్లు కాగా.. ఎగుమతులు 57,965 యూనిట్లు. 2024 ఏప్రిల్ నెలతో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమ్మకాలు 11.26 శాతం తగ్గాయి.ఏప్రిల్ నెలలో.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా హెచ్ఎంఎస్ఐ లేటెస్ట్ అప్గ్రేడ్లను కలిగి ఉన్న డియో 125 అప్డేట్ వెర్షన్ ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ప్రీమియం మోటార్సైకిల్ పోర్ట్ఫోలియోను విస్తరించడంలో భాగంగా.. సీబీ350, సీబీ350 హైనెస్, సీబీ350ఆర్ఎస్ 2025 ఎడిషన్లను.. కొత్త కలర్ ఆప్షన్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఇదీ చదవండి: ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న కారు ఇదే..హోండా మోటార్సైకిల్ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తోంది. ఈ కారణంగానే మార్కెట్లోని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. ఆశించిన అమ్మకాలను పొందగలుగుతోంది.

ధీరూభాయ్ అంబానీ అసలు పేరేంటో తెలుసా?
భారదేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. రిలయన్స్ సామ్రాజ్యం గురించి తెలిసిన దాదాపు అందరికీ, ఈ కంపెనీ ప్రారంభించిన వారు ధీరూభాయ్ అంబానీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధీరూభాయ్ అంబానీ అసలు పేరు ఏమిటో.. బహుశా చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో ఆ విషయం తెలుసుకుందాం.సాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చి.. ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు.వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. అందరూ ఈయనను 'ధీరూభాయ్ అంబానీ' అని పిలుచుకునే వారు. కానీ ధీరూభాయ్ అనేది ఆయన ముద్దుపేరు, అంబానీ అనేది ఇంటిపేరు.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..ధీరూభాయ్ అంబానీ అసలు పేరు.. 'ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ' (Dhirajlal Hirachand Ambani). 1932 డిసెంబర్ 28న జన్మించిన ఈయన.. ఏడుపదుల వయసులో 2002 జులై 6న మరణించారు. అప్పటికే రిలయన్స్ సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం.

ఇవన్నీ ఉంటే అయిపోదా.. స్మార్ట్ కిచెన్
ఇంటి ఆరోగ్యం, ఆనందం అంతా ఉండేది వంటగదిలోనే.. మరి అలాంటి వంటగదిని ఇప్పుడు మరింత స్మార్ట్గా మార్చేయాలంటే.. ఇలాంటి గ్యాడ్జెట్స్ (కిచెన్ టీవీ, పిజ్జా ఓవెన్, ఎకోజీ స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్, థర్మా ‘మీట్’ర్) ఉండాల్సిందే!. ఈ గ్యాడ్జెట్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కిచెన్ టీవీ‘వంట చేయడం పెద్ద పనేం కాదు’ అని చేయి తిరిగిన నిపుణులు చెబుతుంటారు. కానీ, ఇప్పుడు ఇదే మాటను వంట రాని వారు కూడా చెప్పగలరు. వాళ్ల వంటగదిలో ఈ ‘జీఈ కిచెన్ క్లబ్’ ఉంటే చాలు. ఇదొక స్మార్ట్ టీవీ లాంటిది. 27 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. వంటగదిలో దీనిని అమర్చుకుంటే, మనకు కావాల్సిన వంటను ఎలా వండాలో, ఏంమేం కావాలో, ఎంత మోతాదులో వేయాలో ఎప్పటికప్పుడు చూపిస్తూ, తెలియజేస్తుంది. మొబైల్, ల్యాప్టాప్కు కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ధర 999 డాలర్లు (రూ. 85,301).పిజ్జా ఓవెన్ఆర్డర్ చేసిన అరగంటలో వచ్చే పిజ్జాను వెంటనే తినేయాలి, చల్లారితే అసలు బాగోదు. ఇంట్లో ఉంటే, వెంటనే ఓవెన్లో పెట్టి వేడి చేసుకొని తింటాం. అదే బయట ఉంటే.. సాధ్యం కాని పని. ఇందుకోసం ఈ ‘ఓనీ కోడా 2 పిజ్జా ఓÐð న్’ బాగా ఉపయోగపడుతుంది. ఇదొక గ్యాస్ పవర్డ్ పిజ్జా ఓవెన్. కేవలం పిజ్జాను మాత్రమే ఇందులో వేడి చేసుకొని తినొచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకొని వెళ్లవచ్చు. విహార యాత్రలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ధర 449 డాలర్లు ( రూ. 38,338).ఎకోజీ స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్ఫ్రిజ్లో ఐస్క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. అదే ఈ ‘ఎకోజీ స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్’ సాయంతో చాలా త్వరగా ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. యాప్ ద్వారా కూడా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. దీని ధర 239 డాలర్లు (రూ. 20, 407) మాత్రమే!థర్మా ‘మీట్’ర్సరిగ్గా ఉడకని మాంసం, పచ్చి మాంసం తినటం వలన శరీరంలోకి టేప్ వార్మ్లు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే, మాంసం సరిగ్గా ఉడికిందా లేదా అని తెలసుకోవడానికి రూపొందించినదే ఈ ‘మీట్ర్ ప్లస్’. దీనికున్న సూదికొనను మాంసానికి గుచ్చితే, కేవలం పదిసెకండ్లలోనే మాంసం ఎంత వరకు ఉడికిందో పూర్తి సమాచారం ఇస్తుంది. మాంసం లోపలి ఉష్ణోగత్రను సుమారు 212 డిగ్రీ ఫారన్హీట్ వరకు, బయటి ఉష్ణోగత్రను 527 డిగ్రీ ఫారన్ హీట్ వరకు చెప్పగలదు. బ్లూటూత్ కెనెక్టివిటీతో మొబైల్కు కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ధర 99 డాలర్లు (రూ. 8,543).

మరిన్ని కంపెనీలు కొంటాం: ప్రముఖ సీఈవో
న్యూఢిల్లీ: వేల్యుయేషన్ సముచితంగా ఉంటే మరిన్ని కంపెనీలను కొనుగోలు చేస్తామని ‘యూనికామర్స్ ఈసొల్యూషన్స్’ సీఈవో కపిల్ మఖీజా తెలిపారు. గత నాలుగేళ్లుగా ఈ–కామర్స్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయని, ఆమ్నిచానల్లాంటి కొత్త మోడల్స్ తెరపైకి వచ్చాయని ఆయన చెప్పారు.కంపెనీ ఇటీవలే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫాం షిప్వేను కొనుగోలు చేసిన నేపథ్యంలో కపిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూనికామర్స్ ప్రస్తుతం 7,000 పైచిలుకు వ్యాపారాలకు సేవలు అందిస్తోందని ఆయన వివరించారు.ఈ–కామర్స్ వ్యవస్థలో కస్టమర్లతో సంప్రదింపుల దశ, లావాదేవీలను ప్రాసెస్ చేసే దశ, ఆర్డరును పూర్తి చేసే దశ అని మూడు దశలు ఉంటాయని, తమ సంస్థ ఈ మూడు అంశాల్లోనూ సర్వీసులు అందిస్తోందని కపిల్ వివరించారు. తాము ఇప్పటికే భారత్ కాకుండా ఆరు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, మరింతగా విస్తరించే యోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఫ్యామిలీ

నోటి కేన్సర్ నిర్ధారణ ఇలా!
నోటి పరిశుభ్రత పెద్దగా పాటించకుండా గుట్కా, ఖైనీల రూపంలో పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు నోటి కేన్సర్ను ప్రేరేపిస్తాయి. ఇలాంటివారిలో చెంపలు, నాలుక, పంటి చిగుర్ల... వంటి భాగాలను పరీక్షించి ఏ భాగంలో కేన్సర్ వచ్చిందో కేన్సర్ స్పెషలిస్టు పరీక్షించి చూస్తారు. వీళ్లలోని కొందరిలో నోటిలో వాపు కూడా రావచ్చు. అప్పుడు కూడా దాన్ని కేన్సర్గా అనుమానించాల్సి ఉంటుంది. మొదట సమస్య ఉన్నచోట, మెడ భాగంలోనూ సీటీ, ఎమ్మారై స్కానింగ్ వంటి పరీక్షలు చేయించి, కేన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటు నుంచి అది ఏ మేరకు వ్యాపించి ఉందో తెలుస్తుంది. అది దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిందా అన్న విషయాన్ని కూడా డాక్టర్లు తెలుసుకుంటారు. పేషెంట్ నోటిని మామూలుగానే తెరవగలుగుతున్నాడంటే, కేన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ఎందుకంటే కేన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కష్టమవుతుంది. నోటిలోని కేన్సర్ ఇతరచోట్లకు వ్యాపించకపోతే మొదట కేన్సర్ వచ్చిన మేరకు ఆ భాగాన్ని శస్త్రచికిత్సతో తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత...ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా తొలగించిన భాగాన్ని పునర్మించవచ్చు. ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా కేన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స తాలూకు గాయాలు మానాక, రేడియోథెరపీ ప్లాన్ చేస్తారు. నోటి కేన్సర్ అన్నది చాలా బాధాకరమైనది కావడం వల్ల గుట్కా పొగాకు అలవాటు ఉన్నవారు వెంటనే దాన్ని మానేయాలి. ఈ అలవాటు కేవలం నోట్లోని భాగాలకే కాకుండా మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా కేన్సర్ వచ్చేలా చేయగలదన్న విషయం గుర్తుంచుకుని జాగ్రత్త పడాలి.(చదవండి: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..)

బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..
వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతలు శరీరంలోని నీటిని ఆవిరి చేస్తుంటాయి. ఎన్నిసార్లు నీళ్లు తాగినా దాహం తీరదు. ఆకలిగానూ అనిపించదు. అలసట, నీరసంతో రోజంతా చికాకు. ఈ సమస్యలకు పరిష్కారం మన చేతిలోనే ఉందంటున్నారు పోషకాహార నిపుణులు సుజాతా స్టీఫెన్. ‘శరీరం త్వరగా డీ–హైడ్రేట్ అయ్యే కాలం ఇది. తినే పదార్థాల ఎంపిక సరిగా లేకపోతే జీర్ణవ్యవస్థ గాడి తప్పుతుంది. ఇలాంటప్పుడు... కూరగాయలతో చేసిన సలాడ్స్, సాంబార్, రసం.. వంటివి రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి.రెండు గంటలకు ఒకసారి గ్లాసుడు నీళ్లు, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి. అకస్మాత్తుగా తలనొప్పి, భావోద్వేగాలలో మార్పు, నీరసం, ఇరిటేషన్.. వంటివీ తలెత్తుతుంటాయి. దీనిని సైలెంట్ డీ–హైడ్రేషన్ సమస్యగా గుర్తించి నీళ్లు తాగి, కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. నిమ్మరసం, సబ్జా గింజలతో తయారు చేసుకున్న లస్సీ ఒంటికి మేలు చే స్తుంది. నిమ్మరసంలో షుగర్కు బదులు కొద్దిగా ఉప్పు, సోడా కలుపుకొని తాగచ్చు. మధుమేహులు ఒకేసారి ఎక్కువ మొత్తం తింటే, శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. అందుకని టైమ్ ప్రకారం ఏదో ఒకటి మితంగా తినాలి. గర్భిణులకు ప్రత్యేకంఈ కాలం గర్భిణులు ఏ కొంచెం తిన్నా ఆయాసం వస్తుంటుంది. ఇలాంటప్పుడు మసాలా ఉన్న ఆహారం కాకుండా పండ్లు, జ్యూసులు, సలాడ్స్ పైన దృష్టి పెట్టాలి. దీని వల్ల కడుపులో హెవీగా ఉన్నట్టు అనిపించదు. ఆయాసం సమస్య తలెత్తదు. వయసు పైబడిన వాళ్లు పగటివేళ ఎండగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి అయితే వెంట నీళ్లు, పండ్లు తీసుకెళ్లాలి. డీ హైడ్రేట్ అయితే బీపీ డౌన్ అయ్యి కళ్లు తిరిగి పడి΄ోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వారి వెంట మరొకరు తోడుండాలి. రీ హైడ్రేషన్ వేసవిలో యూరిన్ పసుపు రంగులో వస్తుందంటే శరీరంలో నీటిశాతం తగ్గిందని అర్ధం. రీ హైడ్రేషన్ కోసం నీళ్లు, నిమ్మరసం సరైన ఎంపిక. ఫ్లేవర్డ్, షుగర్ లెస్ మెడికేటెడ్ ఓఆర్ఎస్లను ఎంచుకోవచ్చు. ఇది మంచి సీజన్బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి సీజన్. వేడికి ఎక్కువ ఆహారం తినబుద్ది కాదు.. పండ్లు, కూరగాయలు, జ్యూస్, నీళ్లు ఎక్కువ తీసుకుంటాం. ఇదంతా లో క్యాలరీ ఫుడ్. దీనివల్ల బరువు సులువుగా తగ్గచ్చు. వాకింగ్, జాగింగ్, వ్యాయామాలకు ఉదయం వేళ ఎంచుకోవడమే మంచిది. వేసవిలో పార్టీలకు వెళ్లినప్పుడు తినే మసాలా ఫుడ్స్ మరుసటి రోజు కూడా ప్రభావం చూపుతుంది. పడుకునేటప్పుడు మజ్జిగ తాగితే అసౌకర్యం తగ్గుతుంది.కూల్ సలాడ్కీరా, దోస, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, క్యాప్సికమ్ వంటివి సన్నని ముక్కలుగా తరిగి, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి కలిపి సలాడ్ తయారు చేసుకోవాలి. దీనిని ఫ్రిజ్లో పెట్టి, రోజులో రెండు మూడుసార్లు తింటే, తేలికగా అనిపిస్తుంది. సొరకాయ జ్యూస్, పుదీనా, కొత్తిమీర షర్బత్లు, చట్నీలు, రాగి జావ వంటివి.. ఒంటికి మేలు చేస్తాయి.మాంసాహారులు తాజాగా తయారు చేసుకున్నవి, నూనె తక్కువగా ఉపయోగించినవి తీసుకోవాలి. – సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ (చదవండి: బుల్లితెర నటి అస్మిత హెల్తీ డైట్ ప్లాన్ ఇదే..! 20 ఏళ్లుగా..)

బుల్లితెర నటి అస్మిత హెల్దీ డైట్ ప్లాన్ ఇదే..! 20 ఏళ్లుగా..
‘నాలుగు పదుల వయసు దాటిన మహిళల్లో హార్మోన్లలో మార్పులు సహజం. అందుకే పోషకాహారాన్ని ప్లాన్ చేసుకోవడమే కాదు ఆరోగ్యానికి కొన్ని సప్లిమెంట్స్ వాడకం కూడా అవసరమే’ అంటూ తన డైట్ప్లాన్ను వివరించారు బుల్లితెర నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అస్మిత కర్ణని. ‘ఇరవై ఏళ్లుగా హెల్తీ డైట్ ప్లాన్ చేసుకున్నందుకే ఈ రోజుకీ హెల్తీగా ఉన్నాను’ అని చెబుతున్నారు.‘మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే బాడీ కూల్గా ఉండాలి. నా శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరమో తెలుసుకుంటూ, 20 ఏళ్లుగా డైట్ ప్లాన్ చేస్తున్నాను. రోజూ ఉదయం నట్స్, డ్రై ఫ్రూట్స్తో రోజును స్టార్ట్ చేస్తాను. వర్కౌట్స్ తర్వాత సలాడ్స్, ఫుడ్ సంప్లిమెంట్స్ తీసుకుంటాను. ఒక పూట భోజనానికే ప్రాముఖ్యత. 40 ఏళ్ల తర్వాత హార్మోన్లలో చాలా వేగంగా మార్పులు వస్తుంటాయి. మన ఆరోగ్యం హార్మోన్ల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఆహారపదార్థాల్లో పోషకాలు బాగా తగ్గిపోయాయి. అందుకే నిపుణులు సూచించిన మెడికల్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకుంటాను. బయటి ఫుడ్ తీసుకోను...లంచ్ టైమ్లో ఒక వరస క్రమాన్ని పాటిస్తాను. మొదట కడుపులోకి వెళ్లాల్సింది పీచుపదార్థాలు. అందుకని కూరగాయలతో చేసిన సలాడ్ ముందుగా తీసుకుంటాను. తర్వాత ప్రోటీన్ డైట్, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్ తీసుకుంటాను. బయటి ఫుడ్ దాదాపు తీసుకోను. ఉప్పు... చక్కెర తక్కువమన శక్తి స్థాయులు పెరగాలంటే ఉప్పు, పంచదార వాడకం బాగా తగ్గించేయాలి. అలా చేయడం వల్ల ఎనర్జీ ఏ మాత్రం తగ్గదు. సీజనల్ ఫ్రూట్స్ని ఎప్పుడూ వదులుకోను. వీటిని అరగంటసేపు నీటిలో నానబెట్టి, తీసుకుంటే రసాయనాల ప్రభావం తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్ సాయంత్రం 4:30 కి తీసుకుంటాను. తర్వాత బ్లాక్ కాఫీ. కాఫీ లేదా టీ పాలతో తీసుకుంటే బరువు పెరుగుతారు. అందుకని బ్లాక్ కాఫీ తీసుకుంటాను. సాయంకాలం ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకుంటాను. దీని వల్ల బరువు 70 కేజీలు ఉన్నా, సన్నగా కనిపిస్తాను. ప్రోటీన్ పౌడర్కి, యోగర్ట్, కొన్ని ఫ్రూట్స్ కూడా కలిపి తీసుకుంటాను. సూర్యాస్తమయం తర్వాత ఏదీ తినను. ఏడాది మొత్తం నా డైట్ చార్ట్ ఇలాగే ఉంటుంది.కండరాల బలానికి...వేసవిలో డీ హైడ్రేట్ అవకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఎప్పుడైనా లో ఎనర్జీ అనిపిస్తే ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన చల్లని నీళ్లు తీసుకుంటాను. రోజులో 3–4 లీటర్ల నీళ్లు తాగుతాను. జనరల్ ఫిట్నెస్ కోసం వారంలో 2–3 సార్లు వర్కౌట్స్ చేస్తాను. దీనివల్ల బరువు కూడా మెయింటెన్ అవుతుంది. వృద్ధాప్యంలో కండరాల బలం కోల్పోకుండా ఉండాలంటే ఇప్పటినుంచే వాటికి పని పెట్టాలి. అందుకని వ్యాయామం తప్పనిసరి. అందం గురించి కాదు. ఆరోగ్యంగా ఉండాలనుకోవడం జీవితాంతం చేసే ప్రయాణం. అందుకు నా జీవనశైలిని కూడా ఫిక్స్ చేసుకున్నాను’’ అని వివరించారు అస్మిత. నిర్వహణ: నిర్మలారెడ్డి (చదవండి: డాబా నిద్రలు కజిన్స్తో కబుర్లూ)

డాబా నిద్రలు కజిన్స్తో కబుర్లూ
డాబా’, ‘మిద్దె’, ‘మేడ’... ఈ మాటలు పిల్లలకు తెలుసో లేదోగానీ వేసవి వస్తే ఊళ్ల నుంచి వచ్చిన కజిన్స్తో డాబా మీద చాపలు పరుచుకుని ఆకాశాన్ని చూస్తూ చల్లటి గాలిలో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం పెద్ద లగ్జరీ. అనుబంధాలకు బేస్మెంట్. నగరాల్లో సరే... ఊళ్లల్లో కూడా పిల్లలకు ఈ భాగ్యం ఉండటం లేదు. ఒకప్పటి ఈ దేశీయ ఆనవాయితీ కాలక్రమంలో ‘స్లీపోవర్’గా మారింది. కాని సిసలైన స్లీపోవర్స్ను ఈ వేసవిలో పెద్దలే కలిగించాలి. చుక్కల ఆకాశం. ఆగి ఆగి రివ్వున వీచే గాలి. సాయంత్రం నీళ్లు చల్లి డాబా నేల మీదున్న ఉడుకంతా కడిగిస్తే రాత్రికి వేడి కాస్త నిమ్మళించి ఉంటుంది. ఇంట్లోని ఎక్కడెక్కడివో చాపలు, బొంతలు, దుప్పట్లు, పరుపులు, దిండ్లు పైకి వస్తాయి. పక్కలు ఏర్పాటవుతాయి. టేబుల్ ఫ్యాన్ ఉంటే అది కూడా తోడు నిద్రపోవడానికి వస్తుంది. చెంబులు, వాటర్ బాటిల్స్లో నీళ్లు ఒక పక్కగా సిద్ధమవుతాయి. పెద్దవాళ్లు వాళ్ల పాతకబుర్లు చెప్పుకోవడం మొదలుపెడతారు. పిల్లల కోసం వేసిన వరుసలో పిల్లలు ఊరికూరికే నవ్వుతుంటారు. ఏమిటేమిటో మాట్లాడుతుంటారు. ‘ఏరా... నిద్రపోరా?’ అని పెద్దలు గదిమితే నిద్రపోతారా? వారికి నిద్రే రాదు. ఎందుకంటే అది వేసవి కాలం. అది డాబా మీద పక్క. తోడు ఉన్నది ఇష్టమైన బంధువులు. అన్నయ్యలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు, కజిన్స్... రాక రాక వచ్చారు. రాత్రిని నిద్రలో వృ«థా చేయరు పిల్లలు. కబుర్లే కబుర్లు చెప్పుకుంటారు. పాతకాలం దాటి వచ్చిన పెద్దవారిని వేసవి కాలం గురించి అడిగితే వారు ఇష్టంగా చెప్పుకునే జ్ఞాపకం మేడ మీది నిద్రలే. ఎండవల్ల ఇంట్లో ఉబ్బరింత భరించలేక డాబా మీద, బయటి అరుగుల మీద, పెరట్లో, ఆఖరుకు వీధిలో కూడా మంచాలు వేసుకుని వరుసగా కొలువు తీరి పొద్దు పోయేంత వరకూ వేసే బాతాఖానీ తలుచుకుంటారు. పిల్లలుగా ఉండగా ఏం మాట్లాడుకున్నారో గుర్తు ఉండదుగాని అలా నిద్ర΄ోవడంలోని ఆనందం గుర్తు ఉంటుంది.పుణ్యక్షేత్రాలలో, జాతరలలో, తిరునాళ్లల్లో గుంపుగా నిద్ర పోయినప్పుడు ఉత్సాహం వస్తుంది మనిషికి. పిల్లలకైనా అంతే. గుంపుగా కలిసి ఆరుబయలులో పడుకోవడం హుషారు. బంధువుల పిల్లలు వస్తే ‘వీళ్లు మనవారు’ అనే భావనతో విపరీతమైన దగ్గరితనం ఏర్పడుతుంది ఆ సమయాన. లోలోపల ఉన్న మొహమాటాలు పోయి ఓపెన్ అవుతారు. స్కూలు, పుస్తకాలు, సినిమాలు, ఆటలు, స్నేహితుల పేచీలు, టీచర్లు... ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటారు. వయసులో పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు అనేక విషయాలు చెబుతారు. చిన్న పిల్లలు కుతూహలంగా విని తెలుసుకుంటారు. ఈ ‘చెప్పడం వినడం’ అనేది వేసవి సెలవుల డాబా నిద్రల్లో అద్భుతంగా సాగుతుంది. చదవక ముందు పెసలు, చదివాక పిసలు అయినట్టుగా మన దగ్గర వందల సంవత్సరాలుగా ఉన్న పద్ధతి ఇప్పుడు శాస్త్రంగా వినాల్సి వస్తోంది. పిల్లలు ఎన్ని జోకులు వేయగలరో, ఎన్ని మిమిక్రీలు చేయగలరో, ఎన్ని వెక్కిరింతలు లోపల దాచుకుని ఉంటారో, ఎంత అబ్జర్వ్ చేసి ఉంటారో ఇవన్నీ తమ మనుషులతో తమకంటూ సమయం దొరికినప్పుడు బయటకు వెల్లడి చేస్తారు. కజిన్స్తో వేసవి నిద్రల్లో ఏముంది అనుకోవచ్చు నేడు. అదొక కౌన్సెలింగ్. అదొక వైద్యం. అదొక డీటాక్సినేషన్. వెన్నెలా చంద్రుడూ అందించే ‘ఎస్’ విటమిన్. ఎస్ అంటే సంతోషం. వేసవి సంబరం.మూసి ఉన్న ఇళ్ల నుంచి, మూసి ఉన్న తరగతి గదుల నుంచి ఆరుబయలుకు వచ్చి స్వేచ్ఛాకాశం కింద నిద్రపోవడం వేసవిలో పిల్లలకు కొత్త అనుభూతిని ఇచ్చి అందాకా అనుభవించిన బోర్డమ్ను తొలగిస్తుంది. అందుకే నగరాల్లో బాలల సైకియాట్రిస్టులు స్లీపోవర్లను ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు బంధువుల పిల్లలతో వేసవిలో సాగిన సామూహిక నిద్రలు ఇప్పుడు కరువవడంతో కనీసం ఏదో ఒక ఫ్రెండ్ ఇంట్లో పిల్లలంతా ఒక రాత్రి నిద్ర΄ోవడానికి చేరి కబుర్లు చెప్పుకుని వొత్తిడి దూరం చేసుకోమంటున్నారు. (చదవండి: Fart Walk: రాత్రి భోజనం చేసిన తర్వాత నడుస్తున్నారా?.. ఇలా చేశారంటే..)
ఫొటోలు


బ్లూ శారీలో మెరిసిపోతున్న యాంకర్ లాస్య.. (ఫోటోలు)


వితికా ఏప్రిల్ జ్ఞాపకాలు.. దుబాయి, తిరుపతి ట్రిప్స్ (ఫొటోలు)


దేవకన్యలా మెరిసిపోతున్న శ్రీదేవి విజయ్ కుమార్.. (ఫోటోలు)


చైనా ట్రిప్ వేసిన 'బిగ్ బాస్' సోనియా.. భర్తతో కలిసి (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 04-11)


మాకేం తక్కువ, మేమేం తీసిపోయాం : నవ్వుల రేరాణులు (ఫొటోలు)


బర్త్డే స్పెషల్..త్రిష గురించి 10 ఆసక్తికర విషయాలు!


చెన్నైలో గ్రాండ్గా నటి అభినయ రిసెప్షన్ వేడుక (ఫొటోలు)


కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సింగర్ ఉష (ఫొటోలు)


శ్రీవిష్ణు #Single మూవీ ట్రైలర్ ఈవెంట్లో కేతిక శర్మ సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ ఘన విజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ మరోసారి విజయం దక్కించుకుంది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియాలో గత 21 ఏళ్లలో వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధానిగా ఆయన రికార్డుకెక్కారు. అల్బనీస్ మరో మూడేళ్లపాటు ప్రధానిగా కొనసాగబోతున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో మొత్తం 150 సీట్లు ఉండగా, శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ కడపటి వార్తలు అందేసరికి 83 సీట్లు గెలుచుకుంది. స్పష్టమైన మెజార్టీ సాధించింది. ప్రతిపక్ష లిబరల్ నేషనల్ పార్టీ 14 స్థానాలకే పరిమితమైంది. లిబరల్ పార్టీ 13, నేషనల్ పార్టీ 8 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. కాటర్ పార్టీకి ఒక స్థానం, సెంట్రల్ అలయెన్స్కు ఒక స్థానం దక్కింది. మరికొన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతిపక్ష లిబరల్ నేషనల్ పార్టీ అగ్రనేత పీటర్ క్రెయిగ్ డటన్ తమ ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ప్రచారంలో తాము సరిగ్గా పని చేయలేకపోయామని అన్నారు. ఓటమికి బాధ్యతను తానే స్వీకరిస్తున్నానని చెప్పారు. ప్రధాని అల్బనీస్కు ఫోన్చేసి, అభినందనలు తెలియజేశానని పేర్కొన్నారు. లేబర్ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని, దాన్ని తాము గుర్తిస్తున్నామని వెల్లడించారు. బ్రిస్బేన్ నియోజకవర్గంలో పీటర్ క్రెయిగ్ డటన్ ఓడిపోవడం గమనార్హం. ఇక్కడ ఆయనపై లేబర్ పార్టీ అభ్యర్థి అలీ ఫ్రాన్స్ విజయం సాధించారు. ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం, అధిక ధరలు, ఇంధనం విధానం, ఇళ్ల కొరత, వడ్డీ రేట్లలో పెరుగుదల వంటి అంశాలే ప్రతిపాదికగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తాను ప్రధానమంత్రి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దారిలో నడవనున్నట్లు పీటర్ క్రెయిగ్ డటన్ సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఖర్చులకు కళ్లెం వేస్తానని, ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తానని ప్రకటించారు. ఆయన విధానాల పట్ల ప్రజలు విముఖత చూపినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఆంథోనీ అల్బనీస్ మరోసారి నెగ్గే అవకాశం ఉందని ముందే అంచనాలు వెలువడ్డాయి. ఆంథోనీ నార్మన్ అల్బనీస్ 1963 మార్చి 2న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. 1996లో తొలిసారిగా ఎంపీగా గెలిచారు. 2019 నుంచి లేబర్ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. 2019 నుంచి 2022 దాకా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2022లో ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో మూడేళ్లు పదవిలో కొనసాగబోతున్నారు. ‘‘ఆస్ట్రేలియా విలువలకు ప్రజలు మరోసారి పట్టంకట్టారు. వాటికి అనుగుణంగానే నూతన ప్రభుత్వ పాలన సాగుతుంది. అంతేతప్ప ఎవరినీ అనుసరించబోం. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ వీలైనంత త్వరలో అమలు చేసి చూపిస్తా’’ – విజయోత్సవ ప్రసంగంలో అల్బనీస్ మోదీ అభినందనలు అల్బనీస్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అల్బనీస్ నాయకత్వ సామర్థ్యం పట్ల ఆస్ట్రేలియా ప్రజల తిరుగులేని విశ్వాసానికి ఈ విజయమే తార్కాణమని పేర్కొన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యాన్ని భారత్–ఆస్ట్రేలియా బలంగా కోరుకుంటున్నాయని మోదీ స్పష్టంచేశారు.

మరింత అగ్గి రాజేసేలా.. పాక్ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
తీరుమార్చుకోని పాకిస్థాన్ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.తాజాగా పాకిస్థాన్ ఓడలపై భారత్ నిషేధం విధించింది. పాకిస్థాన్ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

అదృష్టమంటే ఇదే.. విహార యాత్ర వెళ్తే 2.87 కోట్ల నిధి సొంతం!
ఇంట్లో బోర్ కొడుతుంది బ్రో.. ఎక్కడికైనా బయటకు వెళ్దామా?.. అంటూ సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు జాక్పాట్ తగిలింది. అనుకోకుండా నక్క తోక తొక్కవురా బాబు.. అని సామెత అంటారు కదా.. అలాంటి రేంజ్తో వారిద్దరీకి 2.87 కోట్ల నిధి దొరికింది. ఈ ఆసక్తికర ఘటన చెక్ రిపబ్లిక్ (Czech Republic) దేశంలో చోటుచేసుకుంది. ఈ జాక్పాట్ నిధికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చెక్ రిపబ్లిక్లో ఇద్దరు వ్యక్తులు హైకింగ్ చేసుకుంటూ ఈశాన్య పోడ్క్ర్కోనోసి పర్వతాలలోని అడవిలోకి వెళ్లారు. ఇలా వారు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత.. ఒకానొక ప్రదేశంలో తమ కాళ్ల కింద ఏదో ఉందని అనిపించింది. గట్టిగా అడుగులు వేయడంతో శబ్ధం వచ్చింది. దీంతో, అక్కడ కొంత భూమి పొరను తీసి చూడగానే వారిని నిధి కనిపించింది. దానిలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించడంతో పర్యాటకులు ఆశ్చర్యపోయారు. అనంతరం, వాటిని ఈస్ట్ బోహేమియా మ్యూజియం స్వాధీనం చేసుకుంది. ఈ నిధి ఫిబ్రవరిలోనే దొరికినా.. మ్యూజియం అధికారులు తాజాగా ఈ విషయం వెల్లడించారు.మ్యూజియం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిధిలో దొరికిన వాటి విలువ సుమారు రూ.2.87 కోట్లు($340,000) ఉంటుందని అంచనా వేశారు. తాజాగా వాటి బరువు సుమారు 15 పౌండ్లు ఉంటుందని పేర్కొంది. అయితే, నిధిలో దొరికిన బంగారు నాణేలు 100 సంవత్సరాల క్రితం 1808 నుంచి 19వ శతాబ్దం ప్రారంభం నాటివని తెలిపారు. ఈ నిధిని 1921 కాలంలో దాచిపెట్టి ఉంటారని అన్నారు. ఇక, ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఓల్డ్ ఆస్ట్రియా-హంగేరీ నుంచి వచ్చిన కరెన్సీ కూడా ఈ నిధిలో ఉంది.Whoa, what a find! Hikers in the Czech Republic uncovered a $340K stash of gold coins & jewelry near Zvičina Hill! Hidden since WWII, this treasure’s now at the Museum of East Bohemia. Keep hunting, folks! pic.twitter.com/oie6TkDoRI— @_Treasure_Kings_ (@_Treasure_Kings) April 30, 2025ఇదిలా ఉండగా.. నాణేలపై ఉన్న చిన్న గుర్తులు 1918-1992 వరకు ఉన్న పూర్వ యుగోస్లేవియాలో ముద్రించి ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో నాజీలు రష్యన్ దళాలను బహిష్కరించినప్పుడు ముందుకు వస్తున్న రష్యన్ దళాల నుండి వెనక్కి తగ్గడం వల్ల ఈ నిధిని దాచి ఉంటారని అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే, పర్వతం వైపున నిధి ఎలా పాతిపెట్టబడిందో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ‘చెక్’ దేశ చట్టాన్ని అనుసరించి పర్యాటకులు ఇద్దరికీ మొత్తం విలువలో దాదాపు 10 శాతం పొందే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. విలువైన వస్తువులను భూమిలో నిధుల రూపంలో నిల్వ చేయడాన్ని పూర్వకాలంలో డిపోలు అని పిలిచే ఆచారం స్థానికంగా ఉన్నట్టు ప్రజలు చెబుతున్నారు.

CIA: ట్రంప్ ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్ కత్తి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టారు.అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)లో 1200 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.JUST IN: The CIA plans to cut 1,200 employees as the Trump admin eyes downsizing of thousands across the U.S. intelligence community. Keep cutting and downsizing the government!— Gunther Eagleman™ (@GuntherEagleman) May 2, 2025సీఐఏలో ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ పరిపాలన విభాగం చట్టసభ సభ్యులకు సమాచారం అందించింది. అయితే, సీఐఏ సంత్సరాలుగా తొలగింపులకు బదులుగా నియామకాల్ని నిలిపి వేసిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. సీఐఏ ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్ పరిపాలన విభాగం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదే అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ మాట్లాడుతూ జాతీయ భద్రతా ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయి. ఈ చర్యలు సీఐఏ పటిష్టతకు దోహదం చేకూర్చడమే కాదు..ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి.. మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన వ్యూహంలో భాగం’ అని చెప్పారు.దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ డోజ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఉద్యోగుల్నితొలగిస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించింది. కొద్ది రోజుల క్రితం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్కు (ఐఆర్ఎస్) చెందిన 20000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా, సీఐఏ ఉద్యోగుల్ని సైతం తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమించింది.
జాతీయం

ఉగ్రవాదుల పాపాలు పండాయి
శ్రీనగర్: ఉగ్రవాదుల పాపాలు పండాయని, దేశంలో ఉగ్రవాదాన్ని తక్షణమే పెకిలించివేయాలని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. ఉగ్రవాదం ఆనవాళ్లు సైతం ఉండడానికి వీల్లేదని అన్నారు. ఉగ్ర విష భుజంగాలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై మన ప్రభుత్వం చేపట్టే ప్రతీకార చర్యలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఆయన శనివారం పహల్గాంలో పర్యటించారు. గత నెల 22న పర్యాటకులపై దాడి జరిగిన తర్వాత ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ దాడికి పాల్పడిన ముష్కరులను, వారిని వెనుక ఉండి నడిపించిన కుట్రదారులకు నరకమే గతి అని స్పష్టంచేశారు. పహల్గాంలో పర్యాటకులను రక్షించే క్రమంలో ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలు కోల్పోయిన అదిల్ షా కుటుంబాన్ని ఫరూఖ్ అబ్దుల్లా పరామర్శించారు. ముష్కరులు సాగించిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. వారిపై నిప్పులు చెరిగారు. ‘‘ఇక్కడ 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు రోజుల క్రితమే వివాహం జరిగిన ఓ నవ వధువు తన భర్తను పోగొట్టుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి ఓ బిడ్డ బిగ్గరగా రోదించాడు. మారణకాండ చూసిన తర్వాత మాకు భోజనం సహించలేదు. మానవత్వాన్ని పొట్టనపెట్టుకున్న ఆ భూతాలు ఇప్పటికీ ప్రాణాలతో సంచరిస్తున్నాయి. వారు తమను తాము ముస్లింలం అని చెప్పుకుంటున్నారు. కానీ, వారు ముమ్మాటికీ ముస్లింలు కాదు. బాధితుల త్యాగాలు వృథా కావడానికి వీల్లేదు. ఉగ్రవాదుల పాపాల పుట్ట నిండిపోయింది. వారిపై తగిన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. జమ్మూకశ్మీర్లో 35 ఏళ్లుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. కానీ, వారు ఎప్పటికీ విజయం సాధించలేరు’’ అని ఫరూఖ్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. మానవత్వాన్ని హత్య చేసిన వారు నరకానికి తప్ప స్వర్గానికి వెళ్లలేరని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఆగిపోతేనే జమ్మూకశ్మీర్ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పహల్గాం తరహా దాడులను తీవ్రంగా వ్యతిరేకించాలని స్థానికులకు పిలుపునిచ్చారు. భయపడితే మరణించినట్లే... పహల్గాంలో పలువురు పర్యాటకులతో ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. ఉగ్రదాడుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్భయంగా ఉండాలని సూచించారు. జమ్మూకశ్మీర్ను మధ్యలోనే వదిలివెళ్లొద్దని కోరారు. పర్యటన పూర్తి చేసుకోవాలని చెప్పారు. ఇక్కడికి మరెంతో మంది పర్యాటకులు రావాలని ఆకాంక్షించారు. ఎవరూ భయపడొద్దని అన్నారు. భయం అనేది చావుతో సమానమని వ్యాఖ్యానించారు. భయపడితే మరణించినట్లేనని పేర్కొన్నారు.

దిగుమతులు బంద్
న్యూఢిల్లీ/శ్రీనగర్: పహల్గాం దుస్సాహసానికి ము ష్కరులను ప్రేరేపించిన దాయాదికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పాకిస్తాన్ నుంచి దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ భారత్ శనివారం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులకూ ఇది వర్తిస్తుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాక్లో ఉత్పత్తయ్యే, ఆ దేశం గుండా ఎగుమతయ్యే అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తుల ప్రత్య క్ష, పరోక్ష దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేగాక పాక్ నౌకలకు భారత్లోకి అనుమతి నిషేధించింది. ఆ దేశానికి సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. దీని ప్రభావం కూడా పాక్పై తీవ్రంగా ఉండనుంది. ఇక పాక్కు అన్నిరకాల పార్సిల్, పోస్టల్ సేవలను కూడా సంపూర్ణంగా నిలిపేశారు. ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. పాక్కు మన గగనతలాన్ని ఇ ప్పటికే మూసేయడం తెలిసిందే. అంతేగాక సింధూ జల ఒప్పందం నిలిపివేత, పాక్ పౌరులకు వీసాల రద్దు వంటి పలు కఠిన చర్యలు కూడా కేంద్రం ఇప్పటికే తీసుకుంది. దివాలా ముంగిట ఉన్న పాక్కు ఆర్థికంగా ప్రాణాధారం వంటి 700 కోట్ల ఐఎంఎఫ్ రుణాన్ని అడ్డుకునే ప్రయత్నాలకు కూడా పదును పెట్టింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్ను గ్రే లిస్టులో చేర్చి రుణాలు, ఆర్థిక సాయాలు పూర్తిగా నిలిపేయాలని అంతర్జాతీయ సంస్థలకు శుక్రవారం విజ్ఞప్తి చేయడం తెలిసిందే. తద్వారా దాయాది ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేలా కేంద్రం వ్యూహరచన చేస్తోంది. దీనిపై పాక్ శనివారం గగ్గోలు పెట్టింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఐఎంఎఫ్ రుణానికి భారత్ మోకాలడ్డుతోందంటూ ఆక్రోశించింది. దిగుమతులు అంతంతే పాక్ నుంచి దిగుమతుల నిషేధం ప్రభావం మనపై ఏమీ ఉండదు. పుల్వామా దాడుల నేపథ్యంలో 2019 నుంచే ఆ దేశంతో వాణిజ్య కార్యకలాపాలను భారత్ దాదాపుగా తగ్గించుకుంది. గతేడాది దాయాది నుంచి మనం దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ కేవలం 4.2 లక్షల డాలర్లు! ప్రధానంగా సేంద్రియ లవణంతో పాటు ఫార్మా ఉత్పత్తులు, పళ్ల వంటివి వీటిలో ఉన్నాయి. అదే సమయంలో పాక్కు మన ఎగుమతుల విలువ ఏకంగా 44.8 కోట్ల డాలర్లుగా ఉంది. పాక్ ఉత్పత్తులపై భారత్ ఇప్పటికే 200 శాతం విధిస్తోంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్కు అన్ని ఎగుమతులనూ భారత్ ఇప్పటికే నిలిపేయడం తెలిసిందే. తొమ్మిదో రోజూ కాల్పులు సరిహద్దుల వెంబడి పాక్ దుశ్చర్యలు వరుసగా తొమ్మిదో రోజూ కొనసాగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం శనివారం కూడా కాల్పులకు తెగబడింది. వాటికి దీటుగా బదులిచి్చనట్టు సైన్యం ప్రకటించింది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. కశీ్మర్ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. శనివారం శ్రీనగర్లో ఐదుచోట్ల ముమ్మర తనిఖీలు కొనసాగాయి. రెచ్చగొట్టేలా పాక్ క్షిపణి పరీక్షలుఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్ను మరింత రెచ్చగొట్టేలా పాక్ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్తో కూడిన అబ్దాలీ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ‘సింధూ’ నిర్మాణాలను పేల్చేస్తాం పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలు ఇస్లామాబాద్: సింధూ నదీ వ్యవస్థపై భారత్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలకు దిగారు. వాటిని తమపై దురాక్రమణ చర్యగానే పరిగణిస్తామన్నారు. ‘‘నదీ జలాలను ఆపేస్తే మేం ఆకలిదప్పులతో అలమటిస్తాం. అందుకే అలాంటి పరిస్థితి రానివ్వబోం’’అని చెప్పుకొచ్చారు. సింధూ ఒప్పందం నిలిపివేతపై అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు.

ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికన్ యూనియన్ ప్రగతిశీల భాగస్వామ్యపక్షాలు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. గ్లోబల్ సౌత్కు ఇరుపక్షాలు మూలస్తంభాలని చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంప్రదాయ వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక సహకారం వంటి రంగాల్లో భారత్–అంగోలా మధ్య అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను, వారి మద్దతుదారులను శిక్షించడం తథ్యమని స్పష్టంచేశారు. ఉగ్రవాదులపై దృఢమైన, నిర్ణయాత్మక చర్యలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అంతరిక్ష సాంకేతికత వంటి అంశాల్లో ఇండియా శక్తిసామర్థ్యాలను అంగోలాతో పంచుకుంటామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, వజ్రాల ప్రాసెసింగ్, ఎరువులు, ఖనిజాల విషయంలో అంగోలాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అంగోలా అధ్యక్షుడు లోరెన్సోకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి లారెన్సో ఘనంగా నివాళులర్పించారు. భారత్–అంగోలా మధ్య దౌత్య సంబంధాలు 1985లో ప్రారంభమయ్యాయి. ఆఫ్రియన్ యూనియన్కు ఈ ఏడాది అంగోలా దేశమే నేతృత్వం వహిస్తోంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం లోరె న్సో గురువారం భారత్కు చేరుకున్నారు. అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు రూ.1,691 కోట్ల రుణం అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇందుకోసం 200 మిలియన్ డాలర్లు(రూ.1,691 కోట్లు) రుణంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు లోరెన్సో పర్యటన భారత్–అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను నిర్దేశిస్తుందని, భారత్–ఆఫ్రికా నడుమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

పాకిస్తాన్ ‘నీడ’ను దాచిపెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నీడలు ఎక్కడున్నా పసిగట్టే పనిలో పడింది కేంద్రం. ఈ క్రమంలోనే ఒక భారత జవాన్ దొరికేశాడు. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని, ఆ విషయాన్ని తెలియకుండా గుట్టుగా ఉంచాడు. ప్రత్యేకంగా ద సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డాడు.ఇప్పుడు విషయం బయటపడటంతో సదరు జవాన్ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. సీఆర్పీఎఫ్ 41 బెటాలియన్ కు చెందిన మునీర్ అహ్మద్.. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని దాన్ని సీక్రెట్ గా ఉంచడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ ధృవీకరించింది. దేశ భద్రతకు సంబంధించి నియమావళిని అహ్మద్ అతిక్రమించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇలా చేయడం దేశ భద్రతకు అత్యంత హానికరం కావడంతోనే జవాన్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాల్సినట్లు సీఆర్పీఎఫ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.పాక్ పంజాబ్కు చెందిన మినాల్ ఖాన్కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్లైన్లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.పూర్తి కథనం కోసం కింద ఆర్టికల్ను క్లిక్ చేయండిభారత జవాన్కు భార్యగా పాకిస్తానీ మహిళా
ఎన్ఆర్ఐ

డల్లాస్లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై కేసు
హైదరాబాద్, క్రైమ్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh)పై సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

పిల్లలు పుట్టలేదు అని భార్యని చంపి తన ఇంట్లోనే..
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లు కలిసి ఉంటామని.. ఏడడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో జరిగింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు.ఇరవై ఏళ్ల క్రితం వివాహంకరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్కు చెందిన మమతను (35) ఇరవై ఏళ్ల క్రితం జగి త్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్కు ఇచ్చి వివాహం చేశా రు. వివాహ సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్ మద్యానికి బానిసై అప్పులు చేశాడు. రోజూ తాగి వచ్చి మమతను వివాహ సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని, పిల్లలు పుట్టడం లేదని తీవ్రంగా వేధించాడు. అతడితోపాటు తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్, తమ్ముళ్లు అ నిల్, వెంకటేశ్ కూడా వేధింపులకు గురిచేసేవారు. మహేందర్ ఏ పని చేయకపోవడంతో మమత కరీంనగర్లోని ఓషాపింగ్మాల్లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.ఇరవై రోజుల క్రితం పంచాయితీతరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్లో పంచాయితీ నిర్వహించారు. దీంతో మమతను బాగా చూసుకుంటానని మహేందర్ కరీంనగర్లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం పుస్తెలతాడు ఇవ్వాలని మమతను కోరగా నిరాకరించింది. ఈనేపథ్యంలో మహేందర్ గతనెల 26న నల్లగొండ, వేములవాడ దైవ దర్శనానికని నమ్మించి, దైవ దర్శనం అనంతరం కొడిమ్యాలకు తీసుకెళ్లాడు. అదేరోజు నైలాన్ తాడును ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఆమె మెడకు నైలాన్తాడు చుట్టి ఇంటి స్లాబ్కు కట్టాడు. పుస్తెలతాడు తీసుకొని గంగాధరలోని ఓ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అప్పులు తీర్చాడు. ఈక్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం నిందితుడు మోటారుసైకిల్పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ములపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు.

టీచర్తో వివాహేతర సంబంధం.. భార్యను..!
హోసూరు(తమిళనాడు): ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్త తప్పుదారి పట్టాడు, ప్రశ్నించిన భార్యను హతమార్చాడు. హోసూరు పారిశ్రామికవాడలో భార్యను హత్య చేశాడో భర్త. వివరాల మేరకు హోసూరు జూజువాడి ఉప్కర్ నగర్ రాజేశ్వరిలేఔట్కు చెందిన భాస్కర్ (34), భార్య శశికళ (33). గత 2018న ఫేస్బుక్లో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు ఆరూష్ (4), శ్రీషా (2) అనే పిల్లలున్నారు. దంపతులు హోసూరులోని సీతారామ్దిన్న , కామరాజ్నగర్, జూజువాడి, రాజేశ్వరిలేఔట్ ప్రాంతాల్లో జిమ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. టీచర్తో అక్రమ సంబంధం ఈ నేపథ్యంలో భాస్కర్కు ఓ టీచర్తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆమెకు అలసనత్తం ప్రాంతంలో అద్దె గదిలో ఉంచాడు. విషయం తెలుసుకొన్న భార్య శశికళ భర్తతో గొడవపడుతూ వచ్చింది.గత 30వ తేదీన రాత్రి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో దుస్తులతో గొంతు పిసికి హత్య చేశాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు ముక్కులో రక్తం కారుతోందని, వైద్యం చేయాలని తెలిపాడు. పరిశీలించిన డాక్టర్లు శశికళ చనిపోయిందని ధృవీకరించారు. ఈ ఘటనపై శశికళ బంధువుల ఫిర్యాదు మేరకు సిఫ్కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నింధితుడు భాస్కర్ను అదుపులోకి తీసుకొన్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని క్రిష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. హత్య చేసినట్లు రుజువు కావడంతో నిందితున్ని అరెస్ట్ చేశారు.

భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
వీడియోలు


చుట్టుముట్టిన సమస్యలు.. పీకల్లోతు కష్టాల్లో పాక్


పాక్ అప్పుల కుప్ప


జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉండే వైఎస్ జగన్ కు భద్రత తగ్గించారు: పుత్తా


జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రీ రిలీజ్


ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో భేటీ


ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత


చల్లబడిన ఏపీ.. ఈదురుగాలులతో భారీ వర్షం


Janatantram: రాజధాని మతలాబ్


భారత్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ ప్రకటించిన పాక్ దౌత్యవేత్త


యూట్యుబర్ అన్వేష్ పై కేసు నమోదు