Top Stories
ప్రధాన వార్తలు

అప్పు ఇవ్వొద్దు,పాక్పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్..
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్ చేస్తోంది భారత్. ఇప్పటికే ఐఎంఎఫ్ తలుపు తట్టిన ప్రధాని మోదీ సర్కార్ తాజాగా, ఇటలీలో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (adb)ను సంప్రదించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్కు రుణాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఏడీబీ వార్షిక సమావేశం కోసం ఇటలీకి వెళ్లిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంక్ చీఫ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పాకిస్తాన్కు ఇస్తున్న ఏడీబీ రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదేశానికి అప్పిస్తే.. ఆ సొమ్ము మొత్తం ఉగ్ర సంస్థల ఖాతాల్లోకి వెళుతోందని వివరించారు. ఏడీబీ చీఫ్తో పాటు, ఇటలీ ఆర్థిక మంత్రి జియాన్కార్లో గియోర్గెట్టితో కూడా ప్రత్యేక సమావేశమయ్యారు. పాకిస్తాన్కు ఇచ్చే నిధుల విషయంలో పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman is received by Ambassador Ms. Vani Rao and Consul General Shri Lavanya Kumar after her arrival at the Milan Malpensa Airport, Italy. The Union Finance Minister will participate in the 58th #ADBAnnualMeeting… pic.twitter.com/w63TIRpLQb— Ministry of Finance (@FinMinIndia) May 4, 2025 కాగా, మే 4 నుండి 7 వరకు జరగనున్న ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) గవర్నర్ల బోర్డు 58వ వార్షిక సమావేశంలో సీతారామన్ ఇటాలి మిలాన్లో పర్యటిస్తున్నారు. గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశానికి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు

'ట్రంప్తో ప్రపంచం నాశనం'
వాషింగ్టన్: వ్యక్తిగత జీవితంతోనే కాదు.. రాజకీయ అభిప్రాయాలతోనూ వివాదాస్పదమైన హాలీవుడ్ నటుడు సీన్ పెన్ (Sean Penn) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రపంచాన్ని నాశనం చేస్తారన్నారు. అంతేకాదు.. హంతకుడైన అసూయపూరిత జీవిత భాగస్వామిగా అభివర్ణించారు. డెమొక్రటిక్ ప్రతినిధి ఎరిక్ స్వాల్వెల్తో కలిసి జిమ్ అకోస్టా పాడ్ కాస్ట్ ‘ది జిమ్ అకోస్టా షో’లో పెన్ మాట్లాడారు.తనకు కాకపోతే ఇంకెవ్వరికీ దక్కవద్దన్న ధోరణి ట్రంప్లో ఉంటుందన్నారు. తన అధికారంతో విధ్వంసానికి పాల్పడే స్వార్థపూరిత వ్యక్తిగా ట్రంప్ను అభివర్ణించారు. మూడోసారి అధ్యక్ష పదవికోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు పెన్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఇక డెమొక్రాట్ అయిన ఎరిక్ స్వాల్వెల్ (Eric Swalwell) మాట్లాడుతూ.. నియంతలెప్పుడూ తమ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రణాళికలు వేయలేదన్నారు. తనను తాను రక్షించుకోవడానికి దేశాన్ని ఏం చేయడానికైనా ట్రంప్ సిద్ధమవుతారని వ్యాఖ్యానించారు. చదవండి: దయలేని ట్రంప్.. ఈసారి సినిమాలపై సుంకం

భారత్కు అండగా ఉంటాం: రష్యా
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్ చేసిన పుతిన్.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్లో పాకిస్తాన్కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

పోలీస్ అధికారులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం..
సాక్షి,విజయవాడ: పోలీస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్రెడ్డి కేసులో అరెస్ట్ సమయం, తేదీపై తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని ఫైరయ్యింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్లలో సమాచారం తప్పని హైకోర్టు తేల్చింది.2024 నవంబర్ 8న అరెస్ట్ చేసి 10న చేశామని ఎలా చెప్తారు? అని ప్రశ్నించింది. తాము తీసుకోబోయే చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్లో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్ నంబరు 409/24, అండర్ సెక్షన్ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్విత్ 3(5) బిఎన్ఎస్ 2023 సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్మెంట్ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్కుమార్రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే,ఈ అక్రమ కేసులపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో వర్రా రవీంద్రారెడ్డికి పలు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది.

పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.అమెరికాలో ఆర్థిక లోటు సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం లేకుండా ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో నిర్ణయించలేకపోతున్నామని బఫెట్ అన్నారు. మనం చాలా కాలంగా భరించలేని ఆర్థిక లోటుతో పనిచేస్తున్నాము. ఇది ప్రస్తుతం నియంత్రించలేని స్థాయికి చేరిందని వెల్లడించారు.యూఎస్ డాలర్ పతనావస్థలో ఉంది. ఒక దేశంగా మనకు ఎప్పుడూ చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇది మాత్రం మనమే తెచ్చుకున్న సమస్య. అమెరికా ఆర్ధిక విధానాలు, వాణిజ్య విధానం వంటివన్నీ డాలర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని బఫెట్ వివరించారు.సీఈఓగా వారెన్ బఫెట్ పదవీ విరమణశనివారం (2025 మే 3) జరిగిన బెర్క్షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్

ఇదేం ఆట?.. గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే..
కోల్కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) అద్భుత ఇన్నింగ్స్ ఆడినా వృథాగానే పోయింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఊహించని రీతిలో కమ్బ్యాక్ ఇచ్చాడు.45 బంతుల్లో 95 పరుగులుఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రియాన్ పరాగ్.. ఆ తర్వాత ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది స్కోరు బోర్డును దౌడు తీయించాడు. కేకేఆర్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్ (13వ ఓవర్)లో వరుస సిక్స్లతో అలరించి వహ్వా అనిపించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి 95 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఈ మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టడంతో రియాన్ పరాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఐదు, ఆరో నంబర్ బ్యాటర్లు ధ్రువ్ జురెల్, వనిందు హసరంగ డకౌట్ కావడం పట్ల రియాన్ ఆగ్రహానికి లోనయ్యాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి ధ్రువ్ జురెల్ (0)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మరో రెండు బంతులకు అదే రీతిలో వనిందు హసరంగ (0)ను కూడా బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు.చూపుతోనే చంపేసేలాఇక హసరంగ అవుట్ కావడాన్ని రియాన్ పరాగ్ సహించలేకపోయాడు. సహచర ఆటగాడిని ఒ క్క చూపుతోనే బెంబెలెత్తేలా ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో కొంత మంది రియాన్ ఆగ్రహంలో అర్థం ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం కెప్టెన్గా ఉండటం మామూలు విషయం కాదని అతడికి ఇప్పుడే తెలిసి వస్తోందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్ ఆదివారం కోల్కతాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది.ఒక్క పరుగు తేడాతో ఓడిభారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా.. రియాన్ తన ఇన్నింగ్స్తో మ్యాచ్ను మలుపుతిప్పాడు. ఆఖరి బంతి వరకు రాజస్తాన్ పోరాడిందంటే అందుకు కారణం కెప్టెన్. అయితే, రియాన్ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన వేళ.. శుభమ్తో కలిసి పరుగు పూర్తి చేసిన జోఫ్రా ఆర్చర్ రనౌట్ అయ్యాడు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖరారైంది. కేకేఆర్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడి.. ఈ సీజన్లో పన్నెండింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.రాజస్తాన్ బ్యాటర్లలో రియాన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరవగా.. యశస్వి జైస్వాల్ (34), షిమ్రన్ హెట్మెయిర్ (29), శుభమ్ దూబే (14 బంతుల్లో 25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా వాళ్లలో వైభవ్ సూర్యవంశీ(4) పూర్తిగా విఫలం కాగా.. కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్, హసరంగ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆర్చర్ ఆఖర్లో 12 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. ఆయుశ్కు ధోని చెప్పిందిదే!Through the gate ✖ 2️⃣ \|/Varun Chakaravarthy is weaving his magic in Kolkata! 👏Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @chakaravarthy29 | @KKRiders pic.twitter.com/vHcMTObTrL— IndianPremierLeague (@IPL) May 4, 2025

రైతులకు బాసటగా వైఎస్సార్సీపీ: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్కు వైఎస్ జగన్ సూచించారు.

‘సినిమా’ చూపించిన ట్రంప్.. అమెరికాలో కష్టమే!
‘అమెరికా ఫస్ట్’అనే విధానంతో ప్రపంచ దేశాలపై ‘సుంకాల యుద్ధం’ ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇప్పటికే వివిధ రంగాలపై భారీగా టారీఫ్ విధించిన ట్రంప్..ఇప్పుడు సినిమా రంగంపై విరుచుపడ్డాడు. అమెరికాలో కాకుండా ఇతర దేశాలలో నిర్మించిన చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించి సినిమా రంగానికి షాకిచ్చాడు. ట్రంప్ నిర్ణయం భారత సినీ పరిశ్రమపై ముఖ్యంగా టాలీవుడ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు.గతకొన్నేళ్లుగా అమెరికాలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ భారీగా కలెక్షన్స్ రాబట్టే చిత్రాలలో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు అగ్రస్థానంలో ఉంటాయి. పటాన్, ఆర్ఆర్ఆర్, డంకీ, పుష్ప, జవాన్ లాంటి చిత్రాలు అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. (చదవండి: దయలేని ట్రంప్.. ఈసారి సినిమాపై 100% సుంకం)ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఉత్తర అమెరికాలో భారీ క్రేజీ ఉంది. ఇండియా కంటే ఒక్క రోజు ముందుగానే అక్కడ సినిమాను రిలీజ్ చేస్తారు. అక్కడ హిట్ టాక్ వస్తే.. ఇక్కడ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వేసిన టారీఫ్ బాంబుకి అక్కడి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కుదేలు అవ్వడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ట్రంప్ చెప్పినట్లుగా విదేశీ చిత్రాలకు 100 శాతం సుంకం విధిస్తే.. ఒక మిలియన్ డాలర్కు సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ మరో మిలియన్ డాలర్ని టాక్సీగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ రెట్టింపు ధరను చెల్లించి ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయాలన్నమాట. ఈ భారం ప్రేక్షకుడిపై వేయాల్సి ఉంటుంది. లాభాల కోసం టికెట్ ధరను పెంచాల్సి వస్తుంది. ఇప్పుడున్న ధరకే ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్లడం లేదు. ఇక ధరలు పెంచితే.. అమెరికాలో కూడా థియేటర్స్ ఖాలీ అవ్వడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న రేటుకి రెట్టింపు చెల్లించాలి కాబట్టి..అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ వెనుకడుగు వేస్తారు. అలాగే ఓటీటీలకు కూడా ట్రంప్ నిర్ణయం వర్తిసుందని చెబితే మాత్రం.. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఇండియన్ సినిమాలకు తక్కువ డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. మొత్తంగా అమెరికా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలకు ట్రంప్ భారీ షాకిచ్చాడనే చెప్పాలి.పాన్ ఇండియా సినిమాపై ట్రంప్ ఎఫెక్ట్అమెరికా మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే భారీ బడ్జెట్తో కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ధనుష్ ‘కుబేర’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, చిరంజీవి ‘విశ్వంభర’ తదితర చిత్రాలన్ని త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. ఓవర్సిస్ బిజినెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాలకు భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ విధించిన 100 శాతం సుంకం కారణంగా ఈ చిత్రాలకు జరిగే బిజినెస్లో తేడాలు వస్తాయి. ఓవర్సీస్లో తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. అలాగే ఓటీటీలో కూడా కొనుగోలు విషయంలో వెనకడుకు వేసే అవకాశం ఉంది. అయితే ట్రంప్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సినిమా రంగంపై విధించిన వందశాతం టారీఫ్ విషయంలో ఆయన మరోసారి ఆలోచన చేస్తాడా? మనసు మార్చుకొని టారిఫ్ తగ్గిస్తాడా లేదా చూడాలి.

ఈనాడు పేపర్నే కూటమి సర్కార్ ఫాలో అయ్యేది: ఉండవల్లి
తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్ పోలీస్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు.. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి
గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్సార్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రొత్సహంతో వైఎస్సార్సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్ పర్సన్గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.
ఎయిర్టెల్, టాటా చర్చలకు చెక్
‘కాస్ట్ లీ కరెంట్’ ఒప్పందం: ‘ప్రజలపై రూ. 15 వేల కోట్లు భారం వేస్తారా?’
అరటి పండుతో అదిరేటి రుచులు
ధోనికి కాల్ చేయ్ పంత్.. నాకు కూడా ఇలానే జరిగింది: వీరేంద్ర సెహ్వాగ్
'ట్రంప్తో ప్రపంచం నాశనం'
ముద్దు సీన్ కోసం అదనంగా కోటి చెల్లించిన హీరో
ఎవరిమీద మీ సమరం?.. ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ ఆగ్రహం
‘సినిమా’ చూపించిన ట్రంప్.. అమెరికాలో కష్టమే!
పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
మూడోసారి టైటిల్... సబలెంకా ప్రైజ్మనీ ఎంతంటే?
నా కొడుకును సంపేయండి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్లైన్ ఆపరేటర్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
3 నిమిషాలకో మరణం
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
కొందరికే ‘భరోసా’
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
పాక్ నడ్డి విరిగేలా..
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
ముష్కర మూకలకు ముచ్చెమటలు
ఎయిర్టెల్, టాటా చర్చలకు చెక్
‘కాస్ట్ లీ కరెంట్’ ఒప్పందం: ‘ప్రజలపై రూ. 15 వేల కోట్లు భారం వేస్తారా?’
అరటి పండుతో అదిరేటి రుచులు
ధోనికి కాల్ చేయ్ పంత్.. నాకు కూడా ఇలానే జరిగింది: వీరేంద్ర సెహ్వాగ్
'ట్రంప్తో ప్రపంచం నాశనం'
ముద్దు సీన్ కోసం అదనంగా కోటి చెల్లించిన హీరో
ఎవరిమీద మీ సమరం?.. ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ ఆగ్రహం
‘సినిమా’ చూపించిన ట్రంప్.. అమెరికాలో కష్టమే!
పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
మూడోసారి టైటిల్... సబలెంకా ప్రైజ్మనీ ఎంతంటే?
నా కొడుకును సంపేయండి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్లైన్ ఆపరేటర్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
3 నిమిషాలకో మరణం
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
కొందరికే ‘భరోసా’
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
పాక్ నడ్డి విరిగేలా..
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
ముష్కర మూకలకు ముచ్చెమటలు
సినిమా

రామ్ చరణ్తో శ్రీలీల మాస్ స్టెప్పులు.. మరో ‘కిస్సిక్’ అవుతుందా?
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు రామ్ చరణ్ నాన్స్టాప్గా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకొని టుస్సాడ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం విదేశాలకు వెళ్తున్నారు. రామ్ చరణ్ రావడానికి కనీసం రెండు, మూడు వారాలైనా పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఆయనతో సంబంధం లేని సన్నివేశాలను షూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందట. ఈ పాటను కాజల్తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్ని పుకార్లు మాత్రమే. బుచ్చిబాబు ప్లాన్ వేరే ఉందంట. ఓ స్టార్ హీరోయిన్తో ఈ ఐటమ్ సాంగ్కి స్టెప్పులేయించబోతున్నాడట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు మన ‘కిస్సిక్’ పాప శ్రీలీలనే.పుష్ప 2 చిత్రంలో శ్రీలీల చేసిన ఐటం సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇప్పుడు రామ్ చరణ్తో కలిసి చిందులేసేందుకు శ్రీలీల రెడీ అవుతోందని టాలీవుడ్లో వినిపిస్తున్న లేటెస్ట్ గాసిప్. రంగస్థలంలోని ‘జిగేల్ రాణి’ మాదిరి పెద్దిలో కూడా ఓ ఊరమాస్ సాంగ్ని ప్లాన్ చేశాడట బుచ్చిబాబు. ఈ పాటకు శ్రీలీల అయితేనే న్యాయం చేస్తుందని మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలకు చెప్పాడట. అయితే వాళ్లు ఇంకా శ్రీలీలను సంప్రదించలేదట. కానీ దాదాపు ఆమెతోనే ఆ పాట చేయించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పట్లో శ్రీలీల డేట్స్ దొరకడం చాలా కష్టం. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సినిమా షూటింగ్, ప్రమోషన్స్కే ఎక్కువ డేట్స్ కేటాయించింది. ఆ సినిమా తర్వాత రవితేజ మాస్ జాతర షూటింగ్లో పాల్గొంటుంది.అలాగే శివకార్తికేయన్ ‘పరాశక్తి’, అఖిల్ ‘లెనిన్’ కూడా లైన్లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న శ్రీలీలకి ‘పెద్ది’ కోసం ఇప్పట్లో డేట్స్ కేటాయించే చాన్స్ అయితే లేదు. బుచ్చిబాబుకు కూడా ఇప్పుడే ఆ పాట కావాలన్న డిమాండేమి లేదు. సినిమా రిలీజ్కి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు శ్రీలీల మూడు నాలుగు రోజులు డేట్స్ కేటాయిస్తే చాలు.. పాట అయిపోతుంది. మరి శ్రీలీల చేసే ఈ రెండో ఐటమ్ సాంగ్ కూడా ‘కిస్సిక్’ మాదిరి సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ నుంచి వస్తున్న ప్రతి సినిమా ఆకట్టుకుంటోంది. రీసెంట్ టైంలో పలు చిత్రాల డబ్బింగ్ లతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీతో ఓటీటీలో రచ్చ చేసేందుకు సిద్ధమైపోయాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్?(ఇదీ చదవండి: ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..) స్వతహాగా డైరెక్టర్ అయిన బాసిల్ జోసెఫ్ గత కొన్నాళ్ల నుంచి హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది కాలంలో నూనక్కుళి, సూక్ష్మదర్శిని, ప్రావింకుడు షప్పు, పొన్ మన్ తదితర చిత్రాలతో వచ్చాడు. ఇప్పుడు 'మరణమాస్' మూవీతో రాబోతున్నాడు. మలయాళ పండగ విషు సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మే 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాని ప్రముఖ హీరో టొవినో థామస్ నిర్మించడం విశేషం.(ఇదీ చదవండి: ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ మూవీ రివ్యూ) 'మరణమాస్' విషయానికొస్తే.. ఓ రాత్రి అనుకోకుండా సీరియల్ కిల్లర్ తోపాటు ఓ శవం ఉన్న బస్సులో కొందరు వ్యక్తులు చిక్కుకుంటారు. ఆ శవాన్ని వాళ్లు ఏం చేశారు? ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకున్నారనేదే స్టోరీ. ఈ సినిమాలో లూక్ పీపీ అనే ఇన్ ఫ్లూయెన్సర్ గా బాసిల్ జోసెఫ్ నటించాడు. ఓ అమ్మాయి తన ప్రేమని అంగీకరించకపోవడంతో లూక్.. ఆమెను వేధిస్తూ ఉంటాడు. అదే ఊరిలోని వృద్ధులను చంపి నోటిలో అరటిపండు పెడుతుంటాడు సీరియల్ కిల్లర్. డార్క్ కామెడీగా తీసిన ఈ సినిమా వచ్చే వారాంతంలో రిలీజ్ అవుతుంది.(ఇదీ చదవండి: 'కిర్రాక్ ఆర్పీ మోసాన్ని నా జీవితంలో మర్చిపోను'.. జబర్దస్త్ తన్మయ్) Welcome to a world where nothing makes sense, but everything will crack you up!Watch #Maranamass on SonyLIV From 15 May #MaranamassOnSonyLIV pic.twitter.com/s3GTEM5YEz— Sony LIV (@SonyLIV) May 5, 2025

నా వయసు 12 ఏళ్లు.. బస్సులో భయానక సంఘటన: బుల్లితెర నటి
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి గౌతమి కపూర్ బీ టౌన్లో పరిచయం చేయాల్సిన పనిలేదు. సీరియల్స్తో పాటు పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. గౌతమి చివరిసారిగా కొరియన్ డ్రామా రీమేక్ అయినా గ్యారహ్.. గ్యారహ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో కనిపించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్లతో పాటు సినిమాలతో బిజీగా ఉన్న గౌతమి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన చిన్నతనంలో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.ముంబయిలో పాఠశాల ఇంటికి వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తాను ఆరో తరగతిలో ఉండగా ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా తన ప్యాంట్ లోపలికి చేయి పెట్టాడని ఆ భయానక అనుభవాన్ని పంచుకుంది. అప్పుడు నా వయసు 12 ఏళ్లు కావడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపింది. ఆ తర్వాత భయంతో వెంటనే బస్సుదిగి వెళ్లిపోయానని గౌతమి కపూర్ ఆ చేదు సంఘటనను వివరించింది. ఆ వ్యక్తి నన్ను అనుసరిస్తున్నాడా అని నేను ఆలోచిస్తూనే ఉన్నానని వెల్లడించింది. ఈ విషయాన్ని అమ్మతో చెప్పడానికి భయపడ్డానని గౌతమి చెప్పింది.ఈ సంఘటన జరిగినప్పుడు తాను తన స్కూల్ యూనిఫాంలోనే ఉన్నానని గౌతమి పంచుకుంది. ఇంటికి వచ్చి నా తల్లికి జరిగిందంతా వివరించానని తెలిపింది. వెంటనే 'నీకు పిచ్చి పట్టిందా? నువ్వు వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి కాలర్ పట్టుకుని ఉండాల్సిందని.. ఎప్పుడూ భయపడవద్దని అమ్మ నాకు ధైర్యం చెప్పిందని తెలిపింది. ఎవరైనా అలా చేస్తే.. వారి చేతిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరవండి.. భయపడకుండా పెప్పర్ స్ప్రే వారి ముఖంపై కొట్టండి అని సలహా ఇస్తోంది బాలీవుడ్ భామ.

ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) నటించిన జాక్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. చాలారోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన జాక్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.'జాక్' సినిమా మే 8న ఓటీటీలో విడుదల కానుందని 'నెట్ఫ్లిక్స్'(Netflix) ప్రకటించింది. తెలగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను షేర్ చేశారు. డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట అందుకొని ఫుల్ జోష్లో ఉన్న సిద్ధు.. జాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. అయితే, ఆయన అంచనాలు తప్పడంతో భారీ నష్టాలను ఈ మూవీ మిగిల్చింది. సిద్ధు గత సినిమా 'టిల్లు స్క్వేర్'కి రూ.23 కోట్లు తొలిరోజే రాబట్టింది. అయితే 'జాక్' చిత్రానికి మాత్రం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే ఫస్ట్ డే వచ్చాయి. సుమారు రూ. 36 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఫైనల్గా కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.కథేంటంటే.. పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్తో పాటు భారత్లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు జాక్ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్ డిటెక్టివ్ అఫిషాన్ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్ ఇండియా ప్రసాద్(నరేశ్). అఫిషాన్ బేగం భానుమతి పేరుతో జాక్కి దగ్గరై జాక్ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్ మనోజ్(ప్రకాశ్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు జాక్. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ గ్యాంగ్ని జాక్ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్ ‘రా’ ఏజెంట్ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్(Jack Movie Review) సినిమా చూడాల్సిందే.
న్యూస్ పాడ్కాస్ట్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు
క్రీడలు

సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. అతడితో పోలికే వద్దు!
ఐపీఎల్-2025 (IPL 2025)లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)తో పాటు వెలుగులోకి వచ్చిన మరో యువ సంచలనం ఆయుశ్ మాత్రే (Ayush Mhatre). వైభవ్ రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగితే.. ఆయుశ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్నారు.అయితే, ఈ ఇద్దరూ ఆయా జట్ల కెప్టెన్లు గాయం కారణంగా దూరం కావడంతో తుదిజట్టులోకి రావడం సహా ఇద్దరూ ఓపెనర్లే కావడం విశేషం. వైభవ్ రాజస్తాన్ సారథి సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేస్తే.. ఆయుశ్ చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు బదులు బ్యాట్ ఝులిపిస్తున్నాడు.ఇద్దరూ ఇ ద్దరే..ఇక వైభవ్ ఇటీవల గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా అద్భుత శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. భారత్ తరఫున ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.మరోవైపు.. ఆయుశ్ మాత్రే సైతం వైభవ్ మాదిరే అరంగేట్ర మ్యాచ్లో మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ వంటి పటిష్ట జట్టుపై 15 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో మాత్రం ఆయుశ్ దుమ్ములేపాడు.ఆర్సీబీ విధించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆయుశ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 94 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ 17 ఏళ్ల టీనేజర్.ఇక ఈ మ్యాచ్లో చెన్నై ఆర్సీబీ చేతిలో కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఆయుశ్ ఇన్నింగ్స్ పట్ల హర్షం వ్యక్తం చేశాడని అతడి తండ్రి యోగేశ్ మాత్రే తెలిపాడు. అదే విధంగా ఆయుశ్ను వైభవ్తో పోల్చుకోవద్దని తాను సలహా ఇచ్చినట్లు వెల్లడించాడు.సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. అతడితో పోలికే వద్దు!ఈ మేరకు మిడ్-డేతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్.. నువ్వూ వేర్వేరు రకమైన బ్యాటర్లు అని ఆయుశ్కు చెప్పాను. ఎవరైనా నిన్ను వైభవ్తో పోలిస్తే పట్టించుకోవద్దనన్నాను.అంతేకాదు వైభవ్ను అనుకరించకూడదని కూడా చెప్పాను. అతడిలా సెంచరీ చేయాలనే తొందరపాటు కూడా వద్దన్నాను. ఎందుకంటే ఆయుశ్ కూడా ఇంకా చిన్నవాడే. ఇప్పుడే తనపై పోలికలతో భారం పడి.. వాడు ఒత్తిడికి లోనుకావడం నాకు ఇష్టం లేదు. తను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.ధోని చెప్పిందిదేఇక ఆర్సీబీపై ఆయుశ్ ఇన్నింగ్స్ తర్వాత దిగ్గజ క్రికెటర్ ధోని. ‘బాగా ఆడావు చాంపియన్’ అని ప్రశంసించారు. నిజానికి జట్టును గెలిపించలేకపోయానని ఆయుశ్ బాధపడ్డాడు. అయితే, ధోని వచ్చి వెన్నుతట్టిన తర్వాత వాడు ఎంతగానో సంబర పడిపోయాడు.‘బాగా బ్యాటింగ్ చేశావు.. భవిష్యత్తులో కూడా ఇలాగే ఆడాలి’ అని ధోని చెప్పారంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ధోని చెప్పినవి రెండు మాటలే అయినా ఆయన ప్రభావం మాత్రం ఎంతగానో ఉంటుంది. ఆయుశ్కు ఇష్టమైన, తను ఆరాధించే క్రికెటర్ నుంచి మెచ్చుకోలు మర్చిపోలేనిది’’ అని ఆయుశ్ తండ్రి యోగేశ్ మాత్రే చెప్పుకొచ్చాడు.చదవండి: కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!.. రేసులో మూడు పేర్లు.. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl)

IPL 2025: కెప్టెన్గా ధోనిని అధిగమించిన శ్రేయస్ అయ్యర్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుత సీజన్లో పంజాబ్ కింగ్స్ సారధిగా వ్యవహరిస్తున్న అయ్యర్.. వివిధ జట్ల తరఫున (ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్) 81 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించి 45 విజయాలు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో కనీసం 80 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన వారిలో శ్రేయస్దే అత్యధిక విజయాల శాతం.తాజాగా లక్నోపై విజయంతో (ధర్మశాల) ఐపీఎల్లో శ్రేయస్ విన్నింగ్ పర్సెంటేజీ 58.22కు చేరింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయిన ధోనిని శ్రేయస్ విన్నింగ్ పర్సెంటేజీ అంశంలో అధిగమించాడు. ఐదు సార్లు సీఎస్కేను ఛాంపియన్గా నిలబెట్టిన ధోని ప్రస్తుత సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో సీఎస్కేకు స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్లో 6 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన ధోని కేవలం ఒకే ఒకే మ్యాచ్లో (లక్నోపై) తన జట్టును విజయపథాన నడిపించాడు.తాజా వైఫల్యాల తర్వాత కెప్టెన్గా ధోని ట్రాక్ రికార్డు అమాంతం పడిపోయింది. అతని విన్నింగ్ పర్సంటేజీ 58.82 నుంచి 57.75కి దిగజారింది. ఈ మధ్యలో వరుస విజయాలు సాధించిన శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ధోనిని అధిగమించారు.ఈ సీజన్లోనే పంజాబ్ కెప్టెన్గా నియమితుడైన శ్రేయస్ తన జట్టుకు అపురూపమైన విజయాలు అందిస్తూ ప్లే ఆఫ్స్ దిశగా నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో శ్రేయస్ నేతృత్వంలో పంజాబ్ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 7 విజయాలతో 15 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానాంలో కొనసాగుతుంది. 2014 సీజన్ తర్వాత పంజాబ్ ఓ సీజన్లో 15 పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. నిన్న మ్యాచ్ జరిగిన ధర్మశాలతో పంజాబ్ 12 ఏళ్ల తర్వాత గెలిచింది. ఈ సీజన్లో పంజాబ్ శ్రేయస్ కెప్టెన్సీలో గతానికి భిన్నంగా సాగుతోంది. పంజాబ్ ఇదే జోరును కొనసాగిస్తే వారి టైటిల్ కల నెరవేరుతుంది. గత సీజన్లో కేకేఆర్ను ఛాంపియన్గా, అంతకుముందు ఢిల్లీని రన్నరప్గా నిలబెట్టిన శ్రేయస్.. పంజాబ్ తలరాత మారుస్తాడేమో చూడాలి.ప్రస్తుత ఐపీఎల్ కెప్టెన్ల విజయాల శాతం..శ్రేయస్ అయ్యర్- 58.22 (81 మ్యాచ్లు)ధోని- 57.75 (232 మ్యాచ్లు)హార్దిక్ పాండ్యా- 60.00 (55 మ్యాచ్లు)రిషబ్ పంత్- 52.77 (54 మ్యాచ్లు)రహానే- 40.00 (36 మ్యాచ్లు)కమిన్స్- 46.15 (26 మ్యాచ్లు)శుభ్మన్ గిల్- 54.54 (22 మ్యాచ్లు)అక్షర్ పటేల్- 50.00 (11 మ్యాచ్లు)రజత్ పాటిదార్- 72.72 (11 మ్యాచ్లు)రియాన్ పరాగ్- 25.00 (8 మ్యాచ్లు)

కేఎల్ రాహుల్ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే.. కుమార్తెకు ఓ ‘గిఫ్ట్’!
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్రైజర్స్ హైదరాబాద్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో తలపడనుంది. సొంత మైదానం ఉప్పల్లో అక్షర్ సేనను కమిన్స్ బృందం ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సాంకేతికంగా రైజర్స్కు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఒకవేళ సోమవారం నాటి మ్యాచ్లో గనుక ఢిల్లీ చేతిలో ఓడితే.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తర్వాత ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా సన్రైజర్స్ నిలుస్తుంది. ఈ క్రమంలో కీలక పోరు కోసం కమిన్స్ బృందం నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.కేఎల్ రాహుల్ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేమరోవైపు.. ఢిల్లీ జట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని సన్రైజర్స్తో మ్యాచ్కు అన్ని విధాలా సన్నద్ధమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను కలిశారు.ఈ సందర్భంగా తన కుమార్తె శ్రీనికను కూడా కౌశిక్ రెడ్డి వెంట తీసుకువెళ్లారు. ఇక రాహుల్ కూడా ప్రేమ పూర్వకంగా నవ్వుతూ వీరిని పలకరించాడు. అదే విధంగా.. శ్రీనిక తీసుకువచ్చిన టీ-షర్టుపై తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు.ఇందుకు సంబంధించిన వీడియోను పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఇంతకు ముందు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్.. అదే జట్టుకు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ను కూడా కౌశిక్ రెడ్డి కలిశారు.కాగా కౌశిక్ రెడ్డి కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. దేశీ క్రికెట్లో ఆయన హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు.అదరగొడుతున్న రాహుల్ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 సీజన్లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లలో కలిపి 371 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 93 నాటౌట్. ఇక ఢిల్లీ జట్టు పది మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా తన భార్య అతియా శెట్టి తమ తొలి సంతానం ఇవారాకు జన్మనిచ్చిన నేపథ్యంలో రాహుల్ సీజన్లో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు.చదవండి: IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..! Had a great time with KL Rahul. I absolutely loved his outfit colour...PINK PERFECT 🩷@KLRAHUL@Kaushik @Shrinika@Cricket@PinkVibes pic.twitter.com/NI6Faiq5dD— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 5, 2025

IND vs ENG: బుమ్రాకు షాక్.. వైస్ కెప్టెన్గానూ అవుట్!
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్తో సిరీస్లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్తో 3-0తో క్లీన్స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్నే కెప్టెన్గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్లు ఆడడు. కాబట్టి కెప్టెన్కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా ఇంగ్లండ్లోనూ అతడిని వరుస మ్యాచ్లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్
బిజినెస్

‘మనీ మహిమ’తోనే చాలామంది విడాకులు!
మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. అందుకు చాలానే కారణాలుండొచ్చు.. అయితే దాంపత్య జీవితంలో భాగస్వామికి డబ్బు లేకపోవడం, అప్పులుండడం, ఖర్చు చేయలేకపోవడం.. వంటివి కూడా పచ్చని కాపురంలో చిచ్చు పెడుతోంది. కలకాలం సంతోషంగా జీవించాల్సిన జంటను ఈ డబ్బు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిస్తోంది. విడిపోయే జంటల జీవితాలను మనీ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.రుణాలు..కొత్తగా పెళ్లయిన జంటను స్థిరమైన ఆర్థిక ఒత్తిళ్లు వేరు చేస్తున్నాయి. ఈ రోజుల్లో పెళ్లికి చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. సంపన్నులకు డబ్బు ఖర్చయినా తిరిగి సంపాదిస్తారు. పేదవారు కూడా ఉన్నంతలో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిస్తారు. కానీ సమస్య అంతా మధ్య తరగతి ప్రజలతోనే. బంధువుల్లో గొప్ప కోసమో.. మళ్లీ చేయని కార్యక్రమం అనో.. పెళ్లికి బాగానే డబ్బు ఖర్చు చేస్తారు. మధ్య తరగతివారికి సరైన సంపాదన ఉండకపోవడంతో దీనికోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటిని తీర్చేందుకు అదనపు కట్నం కోసం భాగస్వామిపై వేదింపులు సాగిస్తారు. అది చివరకు విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది.ఆర్థిక అస్థిరతపెళ్లైనప్పటి నుంచి వధువరులకు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి తర్వాత పిల్లలు, వారి చదువులు, వాహనాల కొనుగోలు, ఆస్తులు కూడబెట్టడం.. వంటి కార్యకలాపాల కోసం చాలామంది అప్పులు చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించలేక మానసిక ఒత్తిడితో భాగస్వామితో సఖ్యతగా నడుచుకోకుండా చివరకు కాపురాన్ని కూల్చుకుంటున్నారు.దుబారా ఖర్చులు..పెళ్లికి ముందు చాలా మందికి దుబారాగా డబ్బు ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. వివాహం తర్వాత కూడా అది కొనసాగితే అప్పులు తప్పవు. సంపాదన భారీ మొత్తంలో ఉన్న కుటుంబాలపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలపై ఈ వ్యవహార శైలి తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇది దంపతుల మధ్య గొడవలు జరిగేందుకు కారణమవుతుంది. ఇది కూడా విడాకులకు దారితీస్తుంది.ఇదీ చదవండి: వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలుమరేం చేయాలి..జల్సాలకు, దుబారా ఖర్చులకు అలవాటుపడే వారు, పెళ్లి కోసం అనాలోచితంగా చేసే భారీగా ఖర్చు చేసేవారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఆ దంపతులు తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు చాలాసార్లు కారణమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సవాళ్లు అనివార్యమైనప్పటికీ సరైన ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ వల్ల సమస్యలను గట్టెక్కవచ్చు. ఆ దిశగా దంపతులు ఆలోచించాలి. ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేయకుండా పెట్టుబడి, పొదుపుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరెన్సీ నోటు కాపురాలను కలకాలం నిలబెడుతుంది.. అదే కాపురాలను చిదిమేస్తుందని గుర్తుంచుకోవాలి.

వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలు
ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభిస్తే దేశీయంగా రెస్టారెంట్ రంగం 2028 నాటికి 1.5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) వైస్ ప్రెసిడెంట్ జొరావర్ కల్రా తెలిపారు. ఇందుకోసం ‘పరిశ్రమ’ హోదా కల్పించాలని, జీఎస్టీపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాల్లాంటివి ఇవ్వాలని కోరారు.ప్రస్తుతం 85 లక్షల మంది ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఎన్ఆర్ఏఐలో సుమారు 5 లక్షల రెస్టారెంట్లకు సభ్యత్వం ఉంది. సొంత ప్రైవేట్–లేబుల్ బ్రాండ్లతో క్విక్ కామర్స్ విభాగంలో దూసుకెళ్లిపోతున్న స్విగ్గీ, జొమాటోలాంటి ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లతో నెలకొన్న వివాదం సామరస్యంగా సద్దుమణుగుతుందని కల్రా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇండియా ఫుడ్ సర్వీసెస్ రిపోర్ట్ 2024 అంచనా ప్రకారం ఈ రంగం విలువ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.5.69 లక్షల కోట్లు. ఇది 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.7.76 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.ఇదీ చదవండి: పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..రెస్టారెంట్ రంగాన్ని అభివృద్ధి చేసే సాంకేతిక అంశాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డైనమిక్గా వ్యవహరిస్తోంది. వీటి కార్యకలాపాలను పెంచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్, ఏఐ ఆధారిత రిజర్వేషన్ సిస్టమ్లు, ఆటోమేటెడ్ ఆర్డర్ ప్రాసెసింగ్లను చాలా సంస్థలు మెరుగుపరుస్తున్నాయి. ఇది క్లౌడ్-ఆధారిత నిర్వహణ సాఫ్ట్వేర్లో ట్రాకింగ్ను క్రమబద్ధీకరించడానికి, వ్యర్థాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది.

పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.95,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఎన్నడూ లేనంత ఆర్థిక అనిశ్చితి
ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గణనీయంగా తగ్గించేసింది. కరోనా సమయం కంటే అధిక అనిశ్చితి నెలకొన్నట్టు పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2025లో 2.8 శాతం, 2026లో 3 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని తాజాగా అంచనా వేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి 2025లో 0.8 శాతం, 2026లో 1.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్ విడుదల చేసిన గణాంకాలతో పోల్చి చూస్తే ప్రపంచ వృద్ధి అంచనా 0.5 శాతం తగ్గగా, యూరో ప్రాంతం వృద్ధి అంచనా 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. మూడు నెలల క్రితంతో పోలి్చతే మరింత అనిశ్చితుల్లో నేడు ప్రపంచం ఉన్నట్టు ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది. టారిఫ్లు, అనిశ్చితి..అమెరికా టారిఫ్ విధానాలను ఊహించలేకుండా ఉన్నామని ఐఎంఎఫ్ తెలిపింది. 2025 ఏప్రిల్ 2 లిబరేషన్ డే అన్నది ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద టారిఫ్ల పెంపుగా నిలిచిపోతుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల పెంపునకు 90 రోజుల విరామం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. వచ్చే డిసెంబర్, రెండేళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? చైనా–అమెరికా మధ్య టారిఫ్ల పోరు ఎంత కాలం పాటు కొనసాగుతుంది? వీటికి సమాధానాలు ఎవరికీ తెలియవంటూ ఐఎంఎఫ్ నిట్టూర్చింది. ఐఎంఎఫ్ ప్రపంచ వాణిజ్య అశ్చితి సూచీ 2024 అక్టోబర్ నాటితో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇది కరోనా విపత్తు నాటితో పోల్చినా గరిష్టానికి చేరింది. టారిఫ్ల కారణంగా కంపెనీలు తమ తయారీ చైన్ను పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుందని, వినియోగదారులు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వైపు చూడొచ్చని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. ఆర్థిక అస్థిరత..టారిఫ్లు, ప్రణాళికలు తరచూ మారిపోతుండడం ఫైనాన్షియల్ మార్కెట్లలో పెద్ద ఎత్తున అస్థిరతకు దారితీస్తుందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నాటి స్థాయి అనిశ్చితులను ఫైనాన్షియల్ మార్కెట్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘ఐదేళ్ల క్రితం అమెరికా రుణ భారంతో అనిశ్చితులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణితో ఇన్వెస్టర్లు అధిక రిస్క్తో కూడిన సాధనాల్లో (ఈక్విటీ) అమ్మకాలు చేసి, బంగారం, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితిని చూస్తున్నాం. యూఎస్ బాండ్ల ధరలు లిబరేషన్ డే నాటి నుంచి తగ్గిపోయాయి. అంటే ఇన్వెస్టర్లు వాటిని విక్రయిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలను సురక్షిత పెట్టుబడి సాధనంగా మార్కెట్లు భావించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, అమెరికా రుణానికి ఉన్న పాత్రను దృష్టిలో పెట్టుకుని చూస్తే, భవిష్యత్తులో మరింత ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు’ అని ఐఎంఎఫ్ తెలిపింది.ఇదీ చదవండి: అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?కరోనా సమయంలో ఉత్పత్తి కార్యకలాపాలను బలవంతంగా నిలిపివేయాల్సి రావడంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అవరోధాలు ఏర్పడగా.. నేడు టారిఫ్ల కారణంగా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. నేడు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితులకు ఎలాంటి వైరస్ కారణం కాదంటూ.. ట్రంప్ సలహాదారులు అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోణంలో వీటికి కారణమవుతున్నట్టు తెలిపింది.
ఫ్యామిలీ

మిస్ వరల్డ్తో మోక్షం.!
బంజారాహిల్స్: ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్లో జరిగే పోటీల కోసం సుందరాంగులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించే దిశలో వివిధ శాఖలు సమన్వయంతో ముందుకుసాగుతున్నాయి. ముఖ్యంగా అందగత్తెలు రాకపోకలు సాగించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న వైర్లు, తుప్పుబట్టిన కరెంటు స్తంభాల తొలగింపు, మరమ్మతులు చేస్తోంది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సబ్స్టేషన్ల పరిధిలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, లైన్మెన్లు, సిబ్బంది ఆదివారం మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఈనెల 18న సుందరాంగులు రానున్న నేపథ్యంలో ఈ రోడ్డులో శిథిలావస్థకు చేరిన 12 ట్రాన్స్ఫార్మర్లను మార్చారు. తుప్పుబట్టిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. వేలాడుతున్న కేబుల్ వైర్లను సరిజేశారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తున్న సుందరాంగులు తమ షెడ్యూల్లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే పోటీలు జరిగే హైటెక్స్కు కూడా ఈ ప్రాంతాల నుంచే వెళ్తారు. ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్లలోనే వారంతా బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. దీంతో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు గత వారం రోజులుగా సుందరాంగులు రాకపోకలు సాగించే, పర్యటించే ప్రాంతాలను సర్వే చేశారు. రోడ్డు మార్గంలో వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు శిథిలావస్థకు చేరాయో వాటిని గుర్తించారు. ఓవైపు ఒరిగిన ట్రాన్స్ఫార్మర్ల జాబితాను తయారు చేశారు. దీని ఆధారంగానే ఆదివారం నుంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ ఫిలింనగర్ సబ్స్టేషన్ ఏఈ పవిత్ర పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని సబ్స్టేషన్ల పరిధిలోనూ పనులు చేస్తున్నారు. ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

ఊ(రి)ట బావులు : అంతుచిక్కని రహస్యాలు?
ఒకప్పుడు మంచి నీరు కావాలంటే బావికి వెళ్లాల్సిందే. తెల్లారితే చాలు గ్రామాలు, చిన్నపాటి పట్టణాల్లో కావిడి భుజాన వేసుకుని, చేతిలో చేద పట్టుకుని వీధుల నిండా జనం కనిపించేవారు. ఊరంతటికీ మంచినీటి బావి ఒకటుండేది. అక్కడకు వెళ్లే అందరూ మంచినీరు తెచ్చుకునే వారు. బావి లేని ఊరుండేది కాదు. రానురానూ బోర్లు, మంచినీటి పథకాలు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ బావులు కనుమరుగైపోయాయి. మంచినీటి మాట అటుంచితే కనీసం వాడుకలో కూడా లేకుండా పోయాయి. బావులు అంటే ఏమిటో భావితరాలకు తెలియని రీతిలో కనుమరుగయ్యాయి. కానీ చరిత్రలో తాము ఉన్నామంటూ కొన్ని బావులు మాత్రం ఇప్పటికీ ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒక్కో బావి చుట్టూ ఒ క్కో విశ్వాసం పెనవేసుకుపోయింది. దీంతో ఆ బావుల్లో నమ్మకాల ఊట ఇప్పటికీ ఊరుతూనే ఉంది. అలాంటి బావులివి..గో.. - పిఠాపురంబొటన బావి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి క్షేత్రంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయంలో ఉంది. సుమారు 9 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణమంతా ఈ బావి నీటితోనే చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఈ బావి ఉంది. చుట్టూ రాళ్లు పేర్చి చేసిన ఈ నేలబావి నిర్మాణం వింత గొలుపుతుంది. ఈ బావి నీటితోనే ఆలయంలోని మూలవిరాట్టుకు అభిషేకాలు నిర్వహిస్తూంటారు. ఈ బావిలోని నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం వంటి కోరికలు తీరుతాయని పలువు రు విశ్వసిస్తారు. కార్తిక మాసంలో ఈ బావి నీటితో స్నానం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. కార్తిక పౌర్ణమి నాడయితే మరింత ప్రాశస్త్యమని చెబుతారు. అది కూడా అర్చకులతో నీరు తోడించుకుని స్నానం చేస్తూంటారు. చైత్రం, శ్రావణం, ధనుర్మాసాల్లో భక్తులే స్వయంగా స్నానం చేస్తారు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బావి నీటిని సీసాల్లో నింపి, తీర్థంలా తమతో తీసుకుని వెళ్లి, మామూలు నీటితో కలిపి స్నానం చేస్తారు. ఎంత వర్షాభావ పరిస్థితులున్నా ఎప్పుడూ ఈ బావి ఎండిన ఆనవాళ్లు లేవని స్థానికులు చెబుతారు. ఎంత నీరు తోడినా ఈ బావి ఎప్పుడూ నిండుకుండలా కళకళలాడుతూంటుంది.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుగొల్లగుంట నుయ్యి కాకినాడ జిల్లాలో మండల కేంద్రమైన ఉప్పాడ కొత్తపల్లిలో ఈ బావి పూర్వం నుంచీ పేరెన్నికగన్నది. గతంలో కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప గ్రామాలకు ఇదే మంచినీటి బావి. ఈ మూడు గ్రామాల ప్రజలు ఈ బావి నుంచే మంచినీరు తెచ్చుకునే వారు. వందల ఏళ్ల నాటి ఈ బావి నుంచే పిఠాపురం మహారాజా వారి సంస్థానానికి గుర్రపు బగ్గీలపై మంచినీరు తీసుకెళ్లేవారని పెద్దలు చెబుతారు. సముద్ర తీరం దగ్గరలో ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కడ తవ్వినా ఉప్పు నీరే పడగా ఈ బావిలో మాత్రమే మంచినీరు.. అదీ కొబ్బరి నీళ్లలా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలందరూ దీనినే మంచినీటికి ఉపయోగించే వారు. ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా ఈ బావి ఎప్పుడూ ఎండిపోకపోవడం విశేషంగా చెబుతారు. ఎన్ని రకాల మంచినీటి పథకాలు వచ్చినా ఇప్పటికీ కొందరు ఈ బావి నీటినే తాగుతూంటారు.కవలల బావి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట గ్రామంలోని బావి కవల పిల్లల బావిగా పేరొందింది. ఈ బావి నీరు తాగితే కవల పిల్లలు పుడతారనే నమ్మకం పలువురిలో బలంగా ఉంది. ఈ గ్రామంలో ఏకంగా 110 మందికి పైగా కవల పిల్లలు పుట్టడమే దీనికి నిదర్శనమని చెబుతారు. ఈ గ్రామంలో ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకూ కవలలున్నారు. గతంలో మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడు గ్రామంలో జనాభా లెక్కల కోసం రాగా ఎక్కువగా కవల పిల్లలుండటం చూసి ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు ఆయన అదే గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చి, అక్కడే నివాసం ఉన్నారు. కొద్ది రోజులకు ఆయనకు కూడా కవల పిల్లలు పుట్టారు. దీంతో, ఆ గ్రామంలోని బావి నీరు తాగడంతో కవల పిల్లలు పుడుతున్నారని అందరికీ చెప్పడంతో అప్పటి నుంచీ ఇది కవల పిల్లల బావిగా పేరొందింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా ఈ బావి పేరు మార్మోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం జనం వచ్చి ఈ బావి నీటిని తీసుకెళ్తున్నారంటే ఎంతగా పేరొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.నిండు కుండలా.. సామర్లకోటలోని మాండవ్య నారాయణస్వామి వారి ఆలయంలో ఉన్న పురాతన బావి ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. మామూలు బావుల్లో వేసవిలో నీరు అడుగంటుతూంటుంది. కనీసం నీరు తగ్గుతుంది. కానీ ఈ బావిలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.బావి నీరు వల్లే కవలలు మా గ్రామంలోని బావి నీరు తాగడం వల్లే కవలలు పుడుతున్నారన్నది మా నమ్మకం. ఎక్కువ మంది కవలలు ఒకే గ్రామంలో పుట్టడం అరుదుగా ఉంటుంది. అలా మా గ్రామంలో వంద మందికి పైగా కవలలు పుట్టారంటే దీనికి కారణం మా గ్రామంలోని బావి నీరేనని అందరూ నమ్ముతున్నారు. మాకు కవలలే పుట్టారు. గతంలో చాలా మంది నమ్మేవారు కాదు. కానీ, ఈ బావి నీరు తీసుకెళ్లిన దూర ప్రాంతాల వాళ్లకు కూడా కవలలు జన్మించినట్లు చెబుతూండటంతో అందరూ ఈ విషయం నమ్మి తీరుతున్నారు. – అడబాల రామదాసు, కవల పిల్లల తండ్రి, దొడ్డిగుంట, రంగంపేట మండలంకోరికలు తీర్చే బావిగా నానుడి మా ఊరి గుడిలోని బొటన బావి నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలా కోరికలు తీరిన వారు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడకు దర్శనానికి వచ్చేవారు తప్పకుండా ఈ బావి నీటితో స్నానం చేయడం లేదా తాగడం చేస్తారు. తమతో పాటు నీటిని తీసుకెళతారు. ఈ బావి నీటిని స్వామి వారి తీర్థంగా భావిస్తారు. అంత పవిత్రంగా చూస్తారు. కోరిన కోర్కెలు తీరాక వచ్చి, స్వామి వారికి తులాభారాలు ఇస్తూంటారు. – కూనపురెడ్డి కోదండ రామయ్య, తిరుపతి, పెద్దాపురం మండలంఅపోహే.. ఇదిలా జరుగుతుందని మానసికంగా అపోహపడటం తప్ప బావి నీరు తాగడం వల్ల కవల పిల్లలు పుట్టడం, సంతానం కలగడం వంటివి ఉండవు. సంతాన ఉత్పత్తి జన్యుపరంగా జరుగుతుంది. మానసికంగా ఒక నమ్మకం కలిగించుకుంటారు తప్ప వాటి వల్ల ఎలాంటి సంతానం కలిగే అవకాశం శాస్త్రీయంగా లేదు. – డాక్టర్ కాటన్, మానసిక వైద్యుడు, జీజీహెచ్, కాకినాడచదవండి: Yoga: ఎమోషషన్స్ను బ్యాలెన్స్ చేసే యోగాసనం ఏదో తెలుసా?బావి నీటి వల్ల కాదు కవలలు పుట్టడం, సంతానం కలగడం వంటివి భార్యాభర్తల మధ్య జన్యుపరంగా జరిగేవే. బావి నీటి వల్ల కాదు. అలాగైతే పూర్వం అన్ని గ్రామాల్లో బావులుండేవి. అందరికీ కవలలు పుట్టాలి కదా! ఇదంతా ఒక నమ్మకం మాత్రమే. ఎక్కువగా ఆడపిల్ల ఇంట్లో కవలలు పుట్టిన వారు ఉంటే ఆ కుటుంబంలో మిగిలిన వారికి కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. దొడ్డిగుంటలో ఇదే జరిగి ఉండవచ్చు. కేవలం రెండు అండాలు విడుదలవ్వడం వల్ల మాత్రమే కవలలు జన్మిస్తూంటారు. అంతే తప్ప బావి నీరు తాగడం వల్ల మాత్రం కాదు. – డాక్టర్ అనిత, గైనకాలజిస్టు, పిఠాపురం

Inspiration దశరథుడి మంత్రి మండలి
రాచరికాలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సమర్థులైన పాలకులెవరూ నిరంకుశులుగా, నియంతలుగా, కేవలం తమ ఇచ్చ వచ్చినట్టు పరిపాలించటం ఉండేది కాదు. మన పురాణేతిహాసాలలో ప్రసిద్ధులైన రాజులందరూ, రాజ్య పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను, మేధావులయిన తమ మంత్రుల బృందాలతోనూ, ఇతర నిపుణులతోనూ, అవసరమయితే పౌర ప్రముఖులతోనూ, సామంతులతోనూ, జానపదులతోనూ విస్తృతంగా చర్చించిన తరవాతే తీసుకొనేవాళ్ళని కనిపిస్తుంది. అల్పబుద్ధులూ, ఆసురీ స్వభావులు మాత్రమే అధికార మదాంధకారంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా, నిరంకుశంగా, ఇష్టారాజ్యంగా పాలించి, అందరినీ అవస్థలు పెట్టి, అపయశస్సు కూడగట్టుకొని, ఆయువు తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు.దశరథుడు అరవయి వేల సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన చేశాడని రామాయణం చెబుతుంది. ఏ కీలక నిర్ణయమైనా, ఆయన సంబంధితులందరితో విస్తృతంగా చర్చించిగానీ తీసుకొనేవాడు కాదు అని వాల్మీకి వక్కాణించాడు. దశరథుడికి ఒక సమర్థమైన మంత్రిమండలి ఉండేది. వాళ్ళలో ప్రధానమైన మంత్రులు ఎనిమిది మంది: ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళుగాక, దశరథుడికి వసిష్ఠుడు, వామదేవుడు ముఖ్య పురోహితులుగా, ధర్మ నిర్దేశకులుగా, గురువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ నేపథ్యం గురించి ఎంతో పరిశోధన జరిపించిన తరవాతే, దశ రథుడు తన మంత్రులను నియమించుకొనేవాడు. వాళ్ళు ఎన్నో పరీక్షలు నెగ్గవలసి ఉండేది. అందుకే ఆ మంత్రులందరూ పరువు ప్రతిష్ఠలు కలవారుగా, సంస్కా రులుగా, శాస్త్ర జ్ఞాన నిష్ణాతులుగా ఉండేవారు. వాళ్ళు కుశాగ్ర బుద్ధులు, విద్యావంతులు, లోకజ్ఞులు, నీతి వేత్తలు. ఎప్పుడూ రాజు శ్రేయస్సునూ, రాజ్య శ్రేయస్సునూ కాంక్షించే నిస్వార్థపరులు, నిజాయతీపరులు. అపరాధులయితే, సొంత పుత్రుల నయినా నియమానుసారం దండించే నిష్పక్షపాతులు. ఇంతటి నిపుణులతో, నీతిమంతులతో, ధర్మజ్ఞులతో అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించిన తరవాతే అన్ని ముఖ్యమైన నిర్ణయాలూ తీసుకోవటం జరిగేది. కనకనే దశరథుడి సుదీర్ఘ పాలనలో ప్రజలంతా ధర్మమార్గంలో తృప్తిగా, సుఖశాంతులతో జీవించారు అని వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది.– ఎం. మారుతి శాస్త్రి

నోని కీర్తికి స్త్రీ శక్తి పురస్కారం
‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అని చెక్ బయో ఆర్గానిక్స్ కో–ఫౌండర్ కీర్తి అంటున్నారు. ఇటీవల నగరంలోని నోవోటెల్ హోటల్ వేదికగా స్త్రీ శక్తి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్, బ్యూటీ, టూరిజమ్, వైద్యం, ఎంటర్ప్రెన్యూర్ వంటి వివిధ విభాగాల్లో 30 మంది మహిళలు పురస్కారాలను అందుకున్నారు. వారిలో చెకోటి కీర్తి రెడ్డి ఎంటర్ప్రెన్యూర్ జర్నీ వైవిధ్యమైనది. ఆమె ఏనాడూ ఒక పారిశ్రామికవేత్త కావాలని కల కనలేదు. కంప్యూటర్ రంగాన్ని ఎంచుకున్న కీర్తి, హైదరాబాద్కి కంప్యూటర్ పరిచయమైన తొలినాళ్లలో కోచింగ్ సెంటర్ నిర్వహించారు. కానీ జీవితం ఆమెను వ్యవసాయం, పరిశ్రమల రంగం వైపు నడిపించింది. పరిశ్రమను నడిపించడంలో ఆమె పాటించిన నియమాలే ఆమెను తన రంగంలో వన్ అండ్ ఓన్లీగా నిలిపాయి. ‘రైతు నేస్తం, ఏరువాక, నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్’ పురస్కారాలు ఆమెకు గతంలో గుర్తింపునిచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీ వేదికగా ప్రకటించిన ‘నారీశక్తి’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆ కీర్తి ప్రస్తుతం స్త్రీ శక్తి పురస్కారం అందుకుని మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచారు. పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు..‘తొగర చెట్టు.. ప్రకృతి మనదేశానికి అందించిన వరం. సంజీవని వంటి తొగర పండు మీద పాశ్చాత్య దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కానీ ఆ చల్లటి వాతావరణంలో ఈ చెట్లు మనలేవు. మా కుటుంబ సభ్యులకు నోని ఫ్రూట్ ఔషధంగా పని చేయడంతో నేను ఆ పండు మీద అధ్యయనం మొదలుపెట్టాను. దీని కోసం పొలం కొని పంట వేశాను. పండ్లతో జ్యూస్లు, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. కేవలం పరిశ్రమ నిర్వహణ మాత్రమే కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం కలగలిసి ఉండడంతో నాకు ‘ఫార్మర్స్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ వెల్నెస్ ప్రోడక్ట్స్’ విభాగంలో ఈ పురస్కారం లభించింది. నోని పండు మీద చేసిన పరిశోధనల కారణంగా ‘నోని కీర్తి’ నయ్యాను. ఈ స్త్రీ శక్తి పురస్కారం ఎంపిక ప్రక్రియలో దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు పాతిక మంది పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులు పురస్కార గ్రహీతలను జూమ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు’ అని వివరించారు కీర్తిరెడ్డి. ఈ కార్యక్రమంలో 30 మంది మహిళలు స్త్రీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ సంప్రదాయ గోంద్లడ్డు, నారాయణపేట చీరలు, టెర్రకోట బొమ్మలు వంటి హస్తకళాకృతులను తయారు చేస్తున్న ఐదుగురు గ్రామీణ, ఆదివాసీ మహిళలు స్త్రీ రత్న పురస్కారాలను అందుకున్నారు. (చదవండి: అందాల తారల ఆగమనం..)
ఫొటోలు


'#సింగిల్'తో అదృష్టం పరీక్షించుకోనున్న ఇవానా (ఫొటోలు)


హిమాచల్ ప్రదేశ్ లో చిల్ అవుతున్న అరియానా (ఫొటోలు)


శర్వానంద్ సినిమాతో గ్లామర్ బ్యూటీ రీ ఎంట్రీ ఇంతకీ ఎవరు? (ఫొటోలు)


కూకట్పల్లిలో సినీనటి కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)


వడగండ్లు.. గాలిదుమారం.. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)


‘దిల్’ రాజు ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియో లాంచ్... టాలీవుడ్ ప్రముఖులు సందడి (ఫొటోలు)


ఉప్పల్లో జోరుగా SRH, DC ప్లేయర్ల ప్రాక్టీస్.. పరుగుల సునామీ ఖాయం (ఫొటోలు)


విశాఖ బీచ్ లో సమంత ‘శుభం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


తిరుపతిలో భారీ వర్షం.. గాలివాన బీభత్సం (ఫొటోలు)


బ్లూ శారీలో మెరిసిపోతున్న యాంకర్ లాస్య.. (ఫోటోలు)
అంతర్జాతీయం

మాకు కావాల్సింది భాగస్వాములు.. బోధకులు కాదు: జై శంకర్
న్యూఢిల్లీ: యూరోపియన్ దేశాలపై భారత విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు జైశంంకర్. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. భారతదేశానికి భాగస్వాములు కావాలని, అంతే కానీ బోధకులు అవసరం లేదని చురకలంటిచారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు గ్రిమ్సన్ తదితరులతో జరిగిన చర్చావేదికలో యూరప్ తీరును జైశంకర్ బహిర్గతం చేశారు. యూరప్ దేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటుదని అడిగిన ప్రశ్నలో భాగంగా జై శంకర్ఇలా సమాధానమిచ్చారు. ‘మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, భాగస్వాముల కోసం చూస్తాం. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు.ఇప్పుడు యూరప్ దేశాలు వాస్తవిక వైపు అడుగులు వేయగలరా లేదా అనేది చూడాలి. మనం భాగస్వామ్యాన్ని చేసుకోవాలంటే, కొంత అవగాహన ఉండాలి, కొంత సున్నితత్వం ఉండాలి, పరస్పర ప్రయోజనాల పట్ల అవగాహ ఉండాలి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలి, ఈ విషయంలో కొన్ని యూరప్ దేశాలు సమర్థవంతంగా ఉండగా, మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు.గతంలో కూడా యూరప్ దేశాల తీరుపై జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా చూపిస్తారని, ప్రపంచ సమస్యల్ని మాత్రం వారు పట్టించుకోరంటూ వ్యాఖ్యలు చేశారు.

‘మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా’
కరాచీ: తమపై భారత్ యుద్ధానికి దిగితే ఏంటనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తోంది. భారత్ తో పోరాడే పూర్తి శక్తి సామర్థ్యాలు ఏ రకంగా చూసే పాక్ కు లేవు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగా భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తమకు చుక్కలే కనిపిస్తాయనే భావన కొందరి నాయకుల్లో కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఒక పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. ఒకవేళ తమతో భారత్ యుద్ధానికి దిగితే తాను ఇంగ్లండ్ కు పారిపోతానంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఎంపీ సరదాగా చేసినా సీరియస్ గా ఈ వ్యాఖ్యలు చేసినా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వంగానేఅభివర్ణించినట్లు ఆయన మాటల్లో కనబడుతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి చెందిన ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక లోకల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సదరు ఎంపీ ఈ కామెంట్స్ చేశారు. పాక్ పై భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తాను ఇంగ్లండ్ వెళ్లిపోతానంటూ తేల్చిచెప్పారు.ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని వెనక్కి తగ్గమని చెప్పొచ్చు కదా.. అని అడిగిన మరో ప్రశ్నకు ‘నేను చెబితే వినడానికి.. మోదీ జీ ఏమైనా మా బంధువా.? అంటూ చమత్కరించారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.Pakistaniyon ki fat ke char ho gayi hai🧵Journalist : Aapko nahi lagta Modi ko thoda pichhe hatna chahiyeSher Afzal Khan Marwat, a lawyer and senior #PTI leader : Modi kya meri Khala ka beta hai, jo mere kehne pe ruk jayega😂Journalist : Agar india ne attack kar diya to?… pic.twitter.com/jNu5H3lzQ1— KashmirFact (@Kashmir_Fact) April 30, 2025 ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) తరఫున ఆయన ఎంపీగా ఉన్నారు. గతంలో అంటే ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఎంపీ హవా నడిచేది. పీటీఐలో కీలకంగా వ్యవహరించేవారు షెర్ ఆఫ్జల్ ఖాన్,.గత కొన్నినెలలుగా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అఫ్జల్ ఖాన్,. ఈ క్రమంలోనే భారత్ తో యుద్ధాన్ని పాక్ తట్టుకోలేదనే సంకేతం వచ్చేలా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఎంపీ అఫ్జల్ ఖాన్.

అదే జరిగితే.. భారత్కు పాక్ మరోసారి అణు బెదిరింపులు
మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపడుతున్న చర్యలు.. పాక్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ అణు బూచిని భారత్కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్ ఆర్టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్ జాతీయులని తేలింది. దీంతో భారత్ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్కు భారత్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్ ప్రకటనలు గుప్పిస్తోంది.

భారత్తో టెన్షన్ వేళ పాక్కు షాక్.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్ఏ
క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్ తగిలింది. పాక్ సైన్యానికి సవాల్ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్ చేసిన బీఎల్ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.బలుచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్ఏ దాడుల్లో వందలాదిమంది పాక్ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళుతున్న ట్రైన్ని హైజాక్ చేసిన బీఎల్ఏ.. పాక్ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్ఏ పాక్ సైన్యం కాన్వాయ్పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.Baloch sarmachars are roaming openly through Mangocher city, seizing control of banks, as well as government and military assets. Certain handles suggest that government personnel have been forced to evacuate, and that several state institutions are no longer operational.… https://t.co/h9KewE0JZc pic.twitter.com/P4mdw3l6aG— Char (@cqc_coffee_guns) May 3, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్. ఇది పాక్లో ఒక ప్రావిన్స్గా ఉంది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్లో అతి పెద్ద ప్రావిన్స్గా బలూచిస్తాన్ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ నుంచి డిమాండ్ పుట్టుకొచ్చింది.అలాగే ఆ ప్రావిన్స్లో పాక్ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్ఏ యాక్టివ్గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో బీఎల్ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది.
జాతీయం

ఇదేం ప్రేమరా బాబు.. భార్య అందాన్ని తట్టుకోలేక భర్త పిచ్చి పని..
ఎవరైనా భర్త.. తన భార్య అందంగా ఉండాలని అనుకుంటాడు. అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇక్కడో భర్త.. తన భార్య అందంగా ఉందన్న కారణంగా ఆమె ముక్కును కొరుక్కుని తిన్నాడు. ఈ వింత దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆ భార్య భయపడిపోయింది. బాధతో గట్టిగా కేకలు వేసింది.వివరాల ప్రకారం.. నదియా జిల్లాలోని శాంతీపుర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ అనే దంపతులు నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున అర్ధరాత్రి మూడు గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. తన భార్య మధు ఖాతూన్ ముక్కును భర్త కొరికి నమిలేశాడు. దీంతో బాధను తట్టుకోలేక మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. బయటకు పరుగులు తీసింది. అయితే ఆమె వెంటబడిన భర్త.. వేలును కూడా కొరికే ప్రయ్నతం చేశాడు. ఈ క్రమంలో ముక్కూ, వేలికి తీవ్రగాయాలయ్యాయి.అనంతరం, భర్త నిర్వాకంపై మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి రేష్మా బేగంతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన మధు ఖాతూన్ భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పనీ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తాను అందంగా ఉండటంతో ముఖంపై యాసిడ్ పోస్తానని తాగిన మత్తులో తన భర్త బెదిరించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. దీంతో, అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాపన్ షేక్ను అరెస్టు చేసి కోర్టులో పరిచారు. ఇక, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

బోర్డర్కు అదనంగా భారత సైన్యం.. ఆర్మీ ప్లానేంటి?
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి 11వ రోజు మరోసారి కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో, వెంటనే భారత భద్రతా బలగాలు అప్రమత్తమై పాక్ ఆర్మీ ప్లాన్ను తిప్పికొట్టాయి.మరోవైపు.. సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించింది. కొత్తగా 16 అదనపు బెటాలియన్లు రంగంలోకి దిగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేశారు. కాగా, పాకిస్తాన్పై దాడి సన్నాహాల్లో భాగంగా సైన్యం మోహరించినట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల్లో 193 బెటాలియన్లు మోహరించాయి. ఒక్కో బెటాలియన్లో దాదాపు 1000 మందికిపైగా సైనికులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి కీడు తలపెట్టాలని చూసేవారి తాట తీయడంలో సైనిక బలగాలతో కలిసి పనిచేయడం, దేశ సరిహద్దుల్ని కాపాడుకోవడం తన కర్తవ్యమని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గురించి ప్రజలకు బాగా తెలుసునని.. ఆయన పనితీరు, కట్టుబాటు, జీవితంలో రిస్కు తీసుకునే విధానంపైనా వారికి అవగాహన ఉందని చెప్పారు. ప్రజలు కోరుకున్నవన్నీ మోదీ నేతృత్వంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పారు. అంతకు మించి దానిపై వివరించలేదు.

ఛీ.. వీళ్లేం పేరెంట్స్!
బెంగళూరు: పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితమే అయిపోయినట్లు ఫీలైపోయి ప్రాణాలు తీసుకునే విద్యార్థులను చూసుంటాం. లేదంటే.. ఏదో నేరం చేసినట్లు పిల్లల్ని మందలించే.. దండించే పేరెంట్స్ను చూసుంటాం. కానీ, పరీక్ష తప్పితే ఇంటా.. బయటా అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముందని అభిషేక్ తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకే.. ఎవరేం అనుకుంటే ఏమి అనుకుంటూ ఇలా కేక్ కట్ చేయించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కర్ణాటకలోని బాగల్కోట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు పరీక్ష తప్పితే.. చుట్టుపక్కల వాళ్లను పిలిచి.. కేక్ తెప్పించి కట్ చేయించి.. చిన్నపాటి వేడుక నిర్వహించారు. మరోసారి పరీక్షలు రాసి పాస్ అవ్వాలంటూ కొడుకుకు నచ్చజెప్పారు. In a heartwarming gesture, the parents of Abhishek, a student at Basaveshwara English Medium High School in Bagalkot, chose to celebrate his effort rather than scold him for failing his exams. Despite scoring just 200 out of 625 marks and not clearing any subject, the family held… pic.twitter.com/RxnlTwrcHp— The Siasat Daily (@TheSiasatDaily) May 4, 2025టెన్త్లో అన్ని సబ్జెక్ట్ల్లో ఫెయిలయ్యాడు అభిషేక్. మొత్తం 600 మార్కులకుగాను 200 మార్కులు మాత్రమే వచ్చాయి. లాగిపెట్టి కొట్టక.. ఇదేం పని అని తిట్టుకున్న వాళ్లు ఉన్నారు ఈ ఫొటోలు, వీడియో చూశాక. కానీ, ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు బాధను అర్థం చేసుకునేది ఆ తల్లిదండ్రులేగా!. మరోసారి రాసి పాసవుదులేరా అని వెన్నుతట్టి ప్రొత్సహించారు. పరీక్షలలో ఫెయిల్ కావడం అంటే జీవితంలో ఫెయిల్ కావడం కాదు, భవిష్యత్తులో విజయానికి పట్టుదల కీలకం అని సందేశం ఇచ్చారు ఆ పేరెంట్స్. అఫ్కోర్స్.. అభిషేక్ తల్లిదండ్రులు చేసిన ఈ పని నచ్చనివాళ్లు కూడా ఉంటారనుకోండి. అది వేరే విషయం.

మూడేళ్ల చిన్నారి ‘సల్లేఖనం’
ముంబై: మూడేళ్ల చిన్నారి వియానా. ఐటీలో పనిచేసే పీయూష్, వర్షా జైన్ దంపతుల ఒక్కగానొక్క కూతురు. మాటలు కూడా పూర్తిగా రాని చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు గత జనవరిలో నిర్ధారణ అయ్యింది. ముంబైలో ఆపరేషన్ చేయించినా లాభం లేకపోయింది. రోజురోజుకూ పరిస్థితి విషమించడంతో జైన మతస్తులైన వారు ఇండోర్లోని తమ మత గురువు రాజేష్ ముని మహరాజ్ దగ్గరకు వెళ్లారు. చిన్నారిని ‘సంతారా/సల్లేఖన’ (ఆమరణ నిరాహార దీక్ష) చేయించాలని సూచించగా అగీకరించారు. అయితే ఆ దీక్ష తీసుకున్న పది నిమిషాల్లోనే చిన్నారి మరణించింది. అతి పిన్న వయసులో ‘సల్లేఖన దీక్ష’ స్వీకరించిన వ్యక్తిగా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో వియానా పేరు నమోదవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ దీక్ష? సంతారా లేదా సల్లేఖనం అంటే స్వచ్ఛందంగా ఆమరణ నిరాహార దీక్ష చేసే జైన ఆచారం. అలా శరీరాన్ని కృశింపజేసుకుంటూ మరణాన్ని ఆహా్వనించడం. సాధారణంగా వృద్ధులు ఈ దీక్ష తీసుకుంటారు. మూడేళ్ల చిన్నారికి అలాంటి దీక్ష ఇవ్వడం చర్చనీయంగా మారింది. జీవించే హక్కును కాలరాస్తూ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. తల్లిదండ్రుల వాదన వేరేలా ఉంది. ‘‘కూతురు చనిపోవాలని ఏ తల్లీ కోరుకోదు. నా బిడ్డతో సంతార ప్రతిజ్ఞ చేయించడానికి ఎంత బాధపడ్డానో చెప్పలేను! ట్యూమర్తో తను విలవిల్లాడుతోంది. ఆ స్థితిలో చూడలేకే అంగీకరించాం’’ అని వర్ష తెలిపింది. ‘‘నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడ్డ స్థితిలో పాపకు చివరి క్షణాలు సమీపించాయి గనుక మా గురువు సలహా మేరకు సంతారకు అంగీకరించాం’’ అని పీయూష్ చెప్పారు. కానీ అలాంటి నిర్ణయం తీసుకునే హక్కు తల్లిదండ్రులకు లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ‘‘మత స్వేచ్ఛ నమ్మకానికి సంబంధించింది మాత్రమే. ప్రాణాలు తీసే ఆచారాలను పాటించడానికి కాదు’’ అన్నది వారి వాదన. సల్లేఖనం నేరమన్న హైకోర్టు సంతారా/సల్లేఖన దీక్ష నేరమని 2015లో రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. ఈ ఆచారాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆత్మాహత్యాయత్నంగా పరిగణించి శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది. ఇది న్యాయ, జైన మత వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తీర్పును జైన సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు.

ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!
వెంగళరావునగర్(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్కుమార్ (37) తన స్నేహితుడు సందీప్తో కలిసి పదేళ్లుగా మధురానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్కుమార్కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్


రాజకీయ పార్టీల చేతుల్లో ఉద్యోగులు పావులు కావద్దు : సీఎం రేవంత్


సిర్పూర్ కాగజ్నగర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన


పోలీస్ అధికారులపై ఏపీ హైకోర్టు సీరియస్


ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్


వైఎస్ జగన్ వెళ్లిన చోటుకి వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు: అమర్నాథ్


కార్యకర్త చనిపోతే పట్టించుకోని పవన్.. దళితులంటే చిన్నచూపా


పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వినయ్ నర్వాల్ భార్యపై ట్రోలింగ్


పాకిస్థాన్పై భారత్ జల యుద్ధం


గోదావరి జిల్లాలో అన్నదాతల కష్టాలు వర్ణనాతీతం