ఆంధ్రప్రదేశ్లో మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టెన్త్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6,36,831 మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,850 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు.