
అధికం... అనర్థమే!
నిల్వ మాంసం మరింత ప్రమాదకరం హోటళ్లు, రెస్టారెంట్లలో నిల్వ మాంసంతో వంటకాల తయారీ జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండెజబ్బులు, కొలస్ట్రాల్, ఒబెసిటీ వచ్చే అవకాశం గింజలు, పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు మేలంటున్న వైద్యులు
జీర్ణకోశ సమస్యలు పెరిగాయి
సమస్యలు ఇలా...
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే మాంసాహారం తీసుకునే వాళ్లు. కొందరు ఏదైనా ప్రత్యేక సందర్భంగా మాత్రమే మాంసాహారం తినేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిరోజూ మాంసాహారం తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా మాంసాహారం లాగించేస్తున్నారు. అలాంటి వాళ్లు జబ్బులను కూడా కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో జీర్ణకోశ వ్యాధులతో పాటు, గుండెజబ్బులు, అధిక కొలస్ట్రాల్, ఒబెసిటీతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకుతున్నాయంటున్నారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవే నిదర్శనం
ఇలా వీరిద్దరే కాదు కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలతో వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారమిలా..
అధిక మాంసాహారం తీసుకునే వారిలో జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెడ్మీట్ తినే వారిలో పేగులపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం, జంక్ఫుడ్స్ తినే వారిలో అల్సర్స్, క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి సమస్యలతో మా వద్దకు ఎక్కువగా వస్తున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి.
– డాక్టర్ వీర అభినవ్ చింతా,
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సెంటినీ విజయవాడ

అధికం... అనర్థమే!