అధికం... అనర్థమే! | - | Sakshi
Sakshi News home page

అధికం... అనర్థమే!

Oct 5 2025 8:44 AM | Updated on Oct 5 2025 8:52 AM

అధికం

అధికం... అనర్థమే!

సమస్యలు ఇలా... ● లబ్బీపేటకు చెందిన రాజేష్‌ వారంలో ఐదు రోజులు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఫుడ్‌కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుంటాడు. ఇటీవల అర్ధరాత్రి బిర్యానీ తిని ఇంటికి వెళ్లిన తర్వాత కడుపులో తీవ్రమైన మంట రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ చేయగా అల్సర్స్‌ వచ్చినట్లు నిర్ధారించారు. ● పటమటకు చెందిన అన్వర్‌ ఎక్కువగా మటన్‌ తీసుకుంటుంటాడు. ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. గుండె రక్తనాళంలో పూడికలు ఉన్నట్లు నిర్ధారించారు. కొలస్ట్రాల్‌ స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ● మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. వారానికి ఒకటీ, రెండు సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది. ● కొవ్వు తక్కువగా ఉండే స్కిన్‌లెస్‌ చికెన్‌, చేపలు వంటివి ఎంచుకోవాలి. ● పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ● క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మాంసాహారం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించవచ్చు. ● వేపుడు కంటే ఉడికించిన కూరలు తినడం మేలు. ● జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి, లేట్‌ నైట్‌ మాంసాహారం తీసుకోకూడదు. ● ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

నిల్వ మాంసం మరింత ప్రమాదకరం హోటళ్లు, రెస్టారెంట్‌లలో నిల్వ మాంసంతో వంటకాల తయారీ జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండెజబ్బులు, కొలస్ట్రాల్‌, ఒబెసిటీ వచ్చే అవకాశం గింజలు, పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు మేలంటున్న వైద్యులు

జీర్ణకోశ సమస్యలు పెరిగాయి

సమస్యలు ఇలా...

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే మాంసాహారం తీసుకునే వాళ్లు. కొందరు ఏదైనా ప్రత్యేక సందర్భంగా మాత్రమే మాంసాహారం తినేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిరోజూ మాంసాహారం తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా మాంసాహారం లాగించేస్తున్నారు. అలాంటి వాళ్లు జబ్బులను కూడా కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో జీర్ణకోశ వ్యాధులతో పాటు, గుండెజబ్బులు, అధిక కొలస్ట్రాల్‌, ఒబెసిటీతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్‌లు కూడా సోకుతున్నాయంటున్నారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవే నిదర్శనం

ఇలా వీరిద్దరే కాదు కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలతో వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారమిలా..

అధిక మాంసాహారం తీసుకునే వారిలో జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెడ్‌మీట్‌ తినే వారిలో పేగులపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం, జంక్‌ఫుడ్స్‌ తినే వారిలో అల్సర్స్‌, క్యాన్సర్‌లు సోకే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి సమస్యలతో మా వద్దకు ఎక్కువగా వస్తున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి.

– డాక్టర్‌ వీర అభినవ్‌ చింతా,

గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, సెంటినీ విజయవాడ

అధికం... అనర్థమే! 1
1/1

అధికం... అనర్థమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement