war with pakistan
-
పాక్ పీచమణచేందుకు ముహూర్తం ఖరారు!
న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: సర్వం సిద్ధమవుతోంది. ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా బ్లాకౌట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు.12వ రోజూ కాల్పులుమరోవైపు పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు వరుసగా 12వ రోజూ కొనసాగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్లో 8 సెక్టా్టర్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు దీటుగా బదులిచ్చినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతి చర్యల్లో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని పక్కన పెడుతూ ఏప్రిల్ 24న కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ వెంటనే నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆగడాలు మొదలయ్యాయి.భేటీలతో బిజీబిజీగా మోదీదేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కీలక సమీక్షలు నిర్వహించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతి చర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్సింగ్తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పహల్గాంకు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతలను మోదీ వారికే అప్పగించారు.యుద్ధం వద్దు: ఐరాసజనాక్రోశాన్ని అర్థం చేసుకోగలనుదాడులు పరిష్కారం కాదు: గుటెరస్ఐరాస: భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చింది. వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలకూ సూచించారు. అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు. సాయుధ ఘర్షణ మొదలైతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఆ పాశవిక దాడిని మరోసారి ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా పౌరులను లక్ష్యం చేసుకోవడం దారుణం. దీనికి పాల్పడ్డవారికి చట్టపరంగా కఠిన శిక్షపడాల్సిందే’’ అన్నారు.అణుయుద్ధం దిశగా పరిస్థితులు: పాక్కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి తమపై భారత్ ఏ క్షణమైనా సైనిక దాడి చేయవచ్చని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు తమకు నివేదికలున్నట్టు చెప్పుకొచ్చారు. అదే జరిగితే దీటుగా బదులిస్తామన్నారు. మరోసారి ‘అణు’ పల్లవి వినిపించారు. మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాసియాను అణుయుద్ధం వైపు నెడుతున్నారని ఆక్షేపించారు. పాక్లోని ఖైబర్ ఫక్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో భారత్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి, తమపై భారత్ పాల్పడుతున్న ఆర్థిక ఉగ్రవాదానికి 2016, 2017ల్లోనే ఐరాసకు అన్ని ఆధారాలూ సమర్పించామని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి కూడా భారత్ పనే. మా ప్రధాని షహబాజ్ షరీఫ్ సూచించినట్టు అంతర్జాతీయ దర్యాప్తు జరిగితే ఆ దాడి మోదీ సర్కారు పనా, లేక భారత్లోని ఏదైనా సంస్థ పనా అన్నది తేలిపోయేది’’ అంటూ అతి తెలివి ప్రదర్శించారు.పాక్ పార్లమెంటు భేటీపాక్ పార్లమెంటు సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. పహల్గాం దాడికి తమను నిందించడాన్ని తీవ్రంగా ఖండించింది. సింధూ జల ఒప్పందం నిలిపివేతను యుద్ధ చర్యగా పేర్కొంది. భారత ప్రతీకార చర్యలను నిరసించింది. కశ్మీరీల స్వయంప్రతిపత్తి పోరుకు మద్దతిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తీర్మానాలు చేసింది. -
పాక్ యుద్ధంతో ఎన్నికల్లో లాభం పొందే వ్యూహం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఏకంగా ముఖ్యమంత్రే ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి దుర్దినమన్నారు. చార్మినార్ వద్ద బుధవారం జరిగిన రాజీవ్ సద్భావన యాత్ర స్మారక సభలో ఆయన పాల్గొన్నారు. బహిరంగంగా ఫిరాయింపులు జరుగుతున్నా న్యాయవ్యవస్థ నిర్ణయం తీసుకోవడం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని, ఆర్ఎస్ఎస్ శిక్షణ వల్లే సర్జికల్ స్ట్రైక్స్ అంటూ సైన్యం దాడులను రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలోనూ సర్జికల్ స్ట్రైకస్స్ జరిగాయని గుర్తుచేశారు. కానీ ఇప్పుడే జరిగినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటోందని అన్నారు. ఎన్నికల హామీల అమలులో బీజేపీ విఫలమైందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అందుకే పాకిస్థాన్తో యుద్ధం వస్తే ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తోందన్నారు. గతంలో ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ధైర్యంగా పాక్తో యుద్ధం చేశారని తెలిపారు. మత నియమాలను కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని, కామన్ సివిల్ కోడ్పై అన్ని పార్టీలతో చర్చించాలని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం కుదిరితేనే తేవాలి తప్ప.. ఒక మతంపై కామన్ సివిల్ కోడ్ రుద్దితే కాంగ్రెస్ పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు. నల్లధనం పేరుతో చిన్న వ్యాపారులకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడి జరిగితే తల దించుకుంటానన్న ప్రధాని నరేంద్రమోదీ, గుజరాత్లో దళితులపై ఊచకోత జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బ్రిక్స్ డిక్లరేషన్లో సిరియా ప్రస్తావన ఉందే తప్ప పాకిస్థాన్ ప్రస్తావన లేదని, ఇది మోదీ దౌత్య వైఫల్యం కాదా అని దిగ్విజయ్ అన్నారు. -
పాకిస్థాన్తో ఇలా యుద్ధం చేయొచ్చు!
న్యూఢిల్లీ: సరిహద్దుల గుండా టెర్రరిజాన్ని భారత్లోకి ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్ను పీచమణచడం ఎలా? ప్రత్యక్షంగా సంప్రదాయ యుద్ధానికి దిగాల్సిన అవసరం లేకుండా పాకిస్థాన్ దానంతట అదే స్వయంగా దిగివచ్చేలా చేయడం ఎలా? కశ్మీర్లో లాగా యావత్ పాకిస్థాన్లో కల్లోల పరిస్థితులను సృష్టించి ఆ దేశాన్ని కాళ్ల బేరానికి తీసుకరాలేమా? ఈ దిశగా కొంతమంది భారతీయ నిపుణులు యోచిస్తున్నారు. పాకిస్థాన్ పరిపాలన వ్యవస్థను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పాక్ సైన్యం, రెండు పాక్ ప్రభుత్వం, మూడు పాక్ ప్రజలు. విడివిడిగా ఈ మూడు విభాగాల్లో చిచ్చు పెట్టవచ్చు. పాక్ సైనిక జనరళ్లందరు పార్ట్టైమ్ సైనికులు, ఫుల్టైమ్ వ్యాపారస్థులు. వారిలో 90 శాతం మందికి సొంతంగా బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు ఉన్నాయి. పైకి రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నడిపినట్లుగా కనిపిస్తుంది కానీ అక్కడి ప్రభుత్వాన్ని నిజంగా నడిపేది ఆర్మీ జనరళ్లే. ఈ విషయం మనకు నవాజ్ షరీష్, అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ ముషార్రఫ్ మధ్య చోటుచేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనం. ముషారఫ్ గాల్లో ఉండగానే (విమానంలో ప్రయాణిస్తుండగానే) ఆయన్ని పదవి నుంచి నవాజ్ షరీఫ్ తొలగించడం, విమానం దిగిదిగగానే నవాజ్ షరీఫ్ను ముషారఫ్ అరెస్ట్ చేయించి తానే దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్న విషయం తెల్సిందే. పాక్లో సైనిక జనరళ్లకున్నన్ని వ్యాపారాల్లో సగం కూడా అక్కడి రాజకీయ నాయకులకు లేవంటే ఆశ్చర్యం వేస్తోంది. ఈ రెండు కీలక విభాగాలను భారత్ దెబ్బతీయాలంటే వారి పూర్తి వ్యాపార కార్యకలాపాలను స్తంభింపచేయాలి. వారి సరకు బయటి ప్రపంచంలో విక్రయించకుండా, బయటి ప్రపంచం సరకు వారి మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలి. ఇది అంత పెద్ద కష్టమేమి కాదు. వారి ఎగుమతి మార్కెట్లతోని భారత్ పోటీ పడాలి. అవసరమైన సబ్సిడీలకు సైతం మన సరకులను చేరవేయాలి. ఈ సబ్సిడీల మొత్తం ఆర్థిక విలువ సంప్రదాయక యుద్ధంలో నాలుగు యుద్ధ విమానాలకు అయ్యే ఖర్చుకాదు. అలాగే మనం పాకిస్థాన్తో అన్ని వ్యాపార, రవాణా ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. పాక్తో వ్యాపార సంబంధాలు పెట్టుకోకుండా అంతర్జాతీయ సమాజంపై దౌత్యపరంగా ఒత్తిడి తేవాలి. అసరమైన మన పెద్ద మార్కెట్ను అడ్డు పెట్టుకోవాలి. పాకిస్థాన్తో వ్యాపారం చేస్తారా లేక భారత్తో వ్యాపారం చేస్తారా? అన్న విషయాన్ని తేల్చుకోవాల్సిందిగా అన్ని దేశాలపై ఒత్తిడి తీసుకరావాలి. ప్రపంచీకరణ చట్టాలు, ఒప్పందాలు అందుకు అడ్డుపడితే, ప్రభుత్వాలతో కాకుండా కంపెనీలతోనే బేరాలు పెట్టుకోవాలి. మెక్డొనాల్డ్, కోక్, పెప్సీ లాంటి కంపెనీలను భారత్ మార్కెట్ కావాలా, పాకిస్థాన్ మార్కెట్ కావాలో తేల్చుకోమని చెప్పి దారికి తెచ్చుకోవచ్చు. పాక్తో సంబంధాలను తెగతెంపులు చేసుకోకపోతే చైనా నుంచి ఎలాంటి దిగుమతులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించే ప్రసక్తే లేదని చైనాను బెదిరించాలి. ఇలా వ్యాపారలావాదేవీలను దెబ్బతీస్తే, పాక్ మిలటరీ, రాజకీయ నాయకుల వెన్నుముకలిరగడంతోపాటు సగం దేశం కుప్పకూలిపోతుంది. అదే సమయంలో పాక్ సైన్యాన్ని మునివేళ్లపై నిలబెట్టేందుకు అటు అఫ్ఘాన్ వైపు నుంచి ఇటు భారత్ వైపు నుంచి పాక్ సరిహద్దుల్లో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించాలి. ఇటీవల కాలంలో ప్రపంచంలోకెల్లా ఎక్కువ ఆయుధాలను కొనుగోలు చేస్తున్న భారత్ మరిన్ని ఆయుధాలను కొనాలి. ప్రధానంగా భారత్ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ఆయుధాలను కొనుగోలు చేయడం లేదు. కాలంతీరిపోయిన ఆయుధాల స్థానంలో భర్తీ చేసుకుంటున్నాం. అదే సమయంలో పాకిస్థాన్కు యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, ఇతర ఆయుధాలు విక్రయించకుండా రఫెల్, బోఫోర్స్ లాంటి కంపెనీలపై కూడా భారత్ ఒత్తిడి తీసుకరావాలి. అదే సమయంలో విద్యా, ఉపాధి అవకాశాల పేరిట పాకిస్థాన్ యువతను భారత్ ఆకర్షించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి ఎలా ఉంటుందో వారికి అనుభవపూర్వకంగా చూపించాలి. టెర్రరిజమ్వైపు యువతను రెచ్చగొడుతున్న పాక్లాంటి వ్యవస్థపై తిరుగుబాటు చేసేలా వారిని ప్రోత్సహించాలి. వీటన్నింటికీ పక్కా వ్యూహంతో ముందుకు కదలాలి. (‘పాకిస్థాన్పై భారత్ ఎలా యుద్ధం చేయాలి’ అనే అంశంపై టీవీ యాంకర్లు, రాజకీయ నాయకులు ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్లిస్తున్న నేపథ్యంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సీఈవో, 11 ఏళ్ల పాటు భారత సైన్యంలో పనిచేసిన రామన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి).