breaking news
varmicompost unit
-
కృషి ఉంటే కావ్య అవుతారు!
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైనా నెలనెలా బంగారు గుడ్డు పెట్టే బాతులానే చూస్తారు. పైగా కావ్యా ధొబాలే–దత్ఖిలే జీతం నెలకు 76 వేలు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక సయాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు తను! చిన్న వయసులోనే అంత పెద్ద ఆసుపత్రి, అంత పెద్ద జీతం అంటే మున్ముందు సర్వీసుతో పాటు పెరిగే జీతం లక్షల్లోనే కదా ఉంటుంది! అయితే కావ్య ఈ లెక్కలేమీ వేసుకోలేదు. ఆసుపత్రి ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యవసాయ క్షేత్రం వైపు మళ్లారు!కావ్య లక్ష్యం ఏమిటి? ఏం లేదు, మనుషుల ఆరోగ్యం కాపాడటం మాత్రమే. సయాన్ ఆసుపత్రిలో ఆ పనే కదా ఆమె చేస్తున్నారు! కానీ అంతకుమించి, అసలు మనుషులకు ఆసుపత్రి అవసరమే కలుగకుండా చేసే పనిని ఆమె ఎంచుకున్నారు. ఎలాగంటే – వర్మి కంపోస్ట్తో పండించే పంటల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలుసుకున్న కావ్య ఏకంగా వర్మి కంపోస్ట్ ఉత్పత్తినే ప్రారంభించారు! అంతేకాదు, రసాయన రహిత పంటల గురించి అవగాహన కల్పించటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 200 మంది ఔత్సాహిక వర్మి కంపోస్ట్ వ్యవస్థాపకులకు శిక్షణ ఇచ్చారు. అంటే – కావ్య తన లాంటి కావ్యల్ని వందలాదిగా తయారు చేశారు. కారణం లేదు.. ప్రేరణ ఉంది ఎవరైనా ఉద్యోగం మానటానికి, ఉద్యోగం మారటానికి ఒక కారణం ఉంటుంది. కానీ కావ్య ఉద్యోగం వదలి వ్యవసాయంలోకి రావటం వెనుక ఒక ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ వెనుక.. ఇతరులకు సహాయం చేయాలని చిన్నప్పట్నుంచీ ఆమెతో పాటు ఎదుగుతూ వస్తున్న తపన ఉంది. ఆ తపనే ఆమెను మొదట నర్సింగ్ కోర్సు వైపు మళ్లించింది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీలో డిప్లొమా చేశాక, ముంబైలోని ‘లోకమాన్య తిలక్ మునిసిపల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్’లో (ఇదే సయాన్ హాస్పిటల్) నర్సుగా చేరారు కావ్య. తర్వాత టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండేళ్లు పని చేశారు. 2017లో నర్సింగ్లో బీఎస్సీ పూర్తి చేశాక ఏడాది పాటు ఒక ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ పాఠాలు చెప్పారు. ఆ తర్వాత తిరిగి సయాన్ ఆసుపత్రిలో ఉద్యోగిగా చేరి స్టాఫ్ నర్స్ అయ్యారు. అలా చేరటమే ఆమె కెరీర్ను వ్యవసాయం వైపు మలుపు తిప్పింది. అన్ని మరణాలను చూశాక..!2019 నుంచి 2022 వరకు సయాన్ లో నర్సుగా ఉన్నారు కావ్య. అది కరోనా వ్యాపించిన పాడు కాలం. నర్సుగా ఆమె కొన్ని నెలల పాటు అనేక మంది తన కళ్ల ముందే కరోనాతో మరణించటాన్ని దగ్గరగా చూశారు. దాంతో ఆమె జీవిత దృక్పథమే మారిపోయింది. ‘‘నేను కూడా అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడ్డాను. దాదాపుగా మరణశయ్యపై ఉన్నాను. కానీ నా రోగ నిరోధక శక్తి నన్ను రక్షించింది. మనం పండిస్తున్న, మనం తింటున్న రసాయనాలతో కూడిన ఆహారం వల్ల మన శరీరాలు బలహీనమౌతున్నాయని నాకు అర్థమైంది. అప్పుడే నేనొక నిర్ణయానికి వచ్చాను. రసాయనాల జాడలు లేని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను’’ అంటారు కావ్య. ఉద్యోగం వదలి వర్మి కంపోస్ట్లోకిఅయితే అందుకోసం ఉద్యోగం మానేయాలన్న కావ్య నిర్ణయాన్ని ఆసుపత్రిలో, ఇంట్లో, బంధువుల్లో ఎవరూ హర్షించలేదు. ఆమె భర్త రాజేశ్ దత్ఖిలే ఒక్కరే ఆమె వైపు నిలబడ్డారు. అలా 2022లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై నుంచి భర్త స్వగ్రామమైన పుణె దగ్గరి జున్నార్కు మారిపోయారు కావ్య. అక్కడే ఆమె వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేయటం మొదలు పెట్టారు. దాని కన్నా ముందు వర్మి కంపోస్ట్ను ఎలా తయారు చేయాలో కొన్ని నెలల పాటు వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకున్నారు. అలా ఆసుపత్రి బెడ్ల మధ్య నుంచి వర్మి కంపోస్ట్ ‘బెడ్’ల మధ్యకు వచ్చారామె.కిలో వానపాములే పెట్టుబడి‘‘నా ప్రారంభ పెట్టుబడి సున్నా. 2022 ఆగస్టులో ఒక రైతు నుంచి కిలో వాన పాములను తీసుకుని చిన్న ‘బెడ్’తో (ఎత్తు మడి) పనిలోకి దిగాను. ఆవు పేడలో వాన పాములను జోడించాను. వాటికి ఆహారంగా ఇతర పశువుల పేడ, రాలిన చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, ఇతర సేంద్రియ పదార్థాలను ఉపయోగించాను. 2022 అక్టోబర్ నాటికి తొలి విడత వర్మి కంపోస్ట్ సిద్ధమైపోయింది’’ అని ఎంతో ఎగ్జయింట్గా చెబుతారు కావ్య. తర్వాత ‘బెడ్’ల సంఖ్య పెరిగింది, వర్మి కంపోస్ట్ ఉత్పత్తీ పెరిగింది. చివరికి అదొక వ్యాపారంగానూ మారింది.ఈ ఆర్థిక సంవత్సరానికి కావ్య టర్నోవర్ ఎంతో తెలుసా? 24 లక్షల రూపాయలు! టర్కీ, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు ‘కృషి కావ్య బ్రాండ్’ పేరుతో కావ్య వర్మి కంపోస్ట్ ఎగుమతి అవుతోంది. కావ్య దగ్గర శిక్షణ తీసుకున్న రెండు వందల మందీ మహారాష్ట్ర వ్యాప్తంగా వర్మి కంపోస్ట్ను తయారు చేస్తూ ఆరోగ్యవంతమైన ప్రకృతి వ్యవసాయానికి తోడ్పతున్నారు. తామూ ఉపాధి పొందుతున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో అగాధాన్ని సృష్టించింది. మరెందరో జీవితాల్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు కోవిడ్-19 సృష్టించిన విలయం కారణంగా ఆత్మీయులను కోల్పోయినవారిలో, ఉద్యోగాలను పోగొట్టుకున్నవారిలో జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరించింది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో ఒకరు కావ్య ధోబ్లే. కోవిడ్ రోగుల మధ్య నెలల తరబడి పనిచేస్తూ, రోజుకు అనేక మరణాలను చూడటం, స్వయంగా కరోనా బాడిన నేపథ్యంలో జీవితంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఆమె విజయానికి, సంతోషకరమైన జీవితానికి పునాది వేసింది. ఏంటి ఆ నిర్ణయం? కావ్య సాధించిన విజయం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.కావ్య ధోబ్లే-దత్ఖిలే ముంబైలో ఒక నర్సు. కావ్య ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలో పెరిగింది. బహుశా ఆ కోరికే ఆమెన నర్సింగ్పైపు మళ్లించిందేమో.జనరల్ నర్సింగ్,మిడ్వైఫరీలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ (సియోన్ హాస్పిటల్)లో పనిచేయడం ప్రారంభించింది. తరువాత ను టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండు సంవత్సరాలు పనిచేసింది. దీనితో పాటు, కావ్య 2017లో నర్సింగ్లో బి.ఎస్సీ పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక సంవత్సరం బోధించిన తర్వాత,ముంబైలోని సియోన్ ఆసుపత్రికి స్టాఫ్ నర్సుగా చేరింది. 2019 నుండి 2022 వరకు సియోన్ హాస్పిటల్లో ఆయన పనిచేసిన కాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది.ఉద్యోగం మానేసి, సంచలన నిర్ణయం కావ్య కూడా కరోనా బారిన పడి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఎన్నో మరణాలను చూసింది. కానీ తన రోగనిరోధక శక్తి తనను కాపాడిందనే విషయాన్ని అర్థం చేసుకుంది. అలాగే వ్యవసాయం అంటే మక్కువ ఉన్న ఆమె మనం పండించే, రసాయనాలతో నిండిన ఆహారం వ్యాధులకు హేతువని తెలుసుకుంది. అందుకే సమస్య మూలాన్ని తొలగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతే నెలకు రూ. 75వేల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసింది. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినా, ఆమె భర్త రాజేష్ దత్ఖిలే క్యావకు మద్దతు ఇచ్చాడు. 2022లో, ఆమె తన ఉద్యోగాన్ని వదిలి భర్త గ్రామానికి వెళ్లింది.నర్సింగ్ నుండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వరకుఆహారానికి ఆధారం వ్యవసాయం. అందుకే ఎలాంటి రసాయనాలు వాడని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది కావ్య. పట్టుదలగా కృషి చేసింది. వర్మీ కంపోస్ట్ బిజినెస్తో లక్షలు సంపాదిస్తోంది. రాజేష్ కుటుంబానికి పూణేలోని జున్నార్లోని దత్ఖిలేవాడి గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. ఇందులో 5 గుంతల (0.02 ఎకరాలు) వర్మీకంపోస్ట్ తయారీ యూనిట్ను ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని వదిలి, వర్మీకంపోస్ట్ వంటి సేంద్రీయ ఇన్పుట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కావ్య స్థానిక రైతులతో మాట్లాడింది. ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై ఒక యూట్యూబ్ ఛానెల్ను కూడా ప్రారంభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి సంవత్సరంలో టర్నోవర్ రూ. 24 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 లక్షల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. కావ్య ప్రతి నెలా దాదాపు 20 టన్నుల రిచ్ వర్మీకంపోస్ట్ను తయారు చేస్తుంది. 50 శాతం లాభం మార్జిన్తో 50 కిలోల బ్యాగు ధర రూ. 500 లకు విక్రయిస్తుంది. ప్రస్తుతం 30 లక్షల వార్షిక టర్నోవర్తో విజయ వంతంగా దూసుకుపోతోంది. వోల్జా డేటా ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వర్మీకంపోస్ట్ ఎగుమతిదారు. ఆ తర్వాత టర్కీ, ఇండోనేషియా,వియత్నాం ఉన్నాయి. ఈ రంగంలో అవార్డును కూడా అందుకుంది. ప్రారంభంలో తప్పని సవాళ్లుసేంద్రీయ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ గురించి కావ్య రైతులతో మాట్టాడినప్పుడల్లా, ఆమెకు లభించే సమాధానం, 'మీరు దీన్ని చేసి మాకు చూపించండి' అని. దీంతో ఆగస్టు 2022లో, అతను ఒక రైతు నుంచి ఒక కిలో వానపాములతో జీరో పెట్టుబడితో వర్మీ కంపోస్ట్ తయారీనీ మొదలు పెట్టింది. ప్రారంభించాడు. అక్టోబర్ 2022 నాటికి, వర్మీకంపోస్ట్ సిద్ధమైంది. మార్చిలో, కావ్య కృషి కావ్య బ్రాండ్ కింద వర్మీకంపోస్ట్ వాణిజ్య అమ్మకాలను ప్రారంభించింది. దాని ఫలితాలను రైతులు స్వయంగా అనుభవించారు. వారి విజయాలను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసేది. ఒక రైతు ఐదు టన్నుల వర్మీకంపోస్టును రూ. 50,000 (కిలోకు రూ. 10) కు కొనుగోలు చేశాడు. రెండు వేల మంది రైతులకు ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ 2,000 కిలోల వానపాములను కొనుగోలు చేసింది. కావ్య కిలో రూ.400కి అమ్మింది. ప్రతి రెండు నెలలకు 200 కిలోల వానపాములు, 35వేల కిలోల వర్మీ కంపోస్టును విక్రయిస్తుంది. అంతేకాదు ఆమె శిక్షణ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు.తన చుట్టూ ఉన్నరైతుల్లో ఈ మార్పు తీసుకురాగలిగినందుకు చాలా సంతోషం అంటుంది కావ్య. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు?వర్మీకంపోస్ట్కు అవసరమైన ప్రధానమైనవి ఆవు లేదా గొర్రెలు , మేక పెంట, చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, బయోగ్యాస్ ప్లాంట్ స్లర్రీ లాంటి సేంద్రియ వ్యర్థాల మిశ్రమానికి వానపాములు కలుపుతారు, అవి ఎరువుగా రూపాంతరం చెందుతాయి.కేవలం రూ.500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కంపోస్ట్ను ఎత్తైన పడకల మీద, డబ్బాలు, చెక్క డబ్బాలు, సిమెంటు ట్యాంకులు లేదా గుంటలు, వెదురు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా మట్టి కుండలలో కూడా తయారు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 జాతుల వానపాములు ఉన్నాయి. అయితే స్థానిక జాతులను ఉపయోగించడం అనువైనది ఎందుకంటే అవి తక్షణమే అందుబాటులో ఉంటాయి, పైగా స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. భారతదేశంలో, సాధారణంగా ఉపయోగించే వానపాము జాతులు పెరియోనిక్స్ ఎక్స్కవాటస్, ఐసెనియా ఫోటిడా , లాంపిటో మౌరిటీ లాంటివి ఉన్నాయి. View this post on Instagram A post shared by Kavya Dhoble - Datkhile (@kavya.dhoble) -
పెదపారుపూడిని మోడల్ గ్రామంగా మారుద్దాం
పెదపారుపూడి : పెదపారుపూడి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తయారు చేసుకుందామని పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ దినేష్కుమార్ అన్నారు. పెదపారుపూడిలో నిర్మించిన ఘన వ్యర్థపదార్థాల తయారీ కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఘన వ్యర్థ పదార్థాల తయారీ కేంద్రం నుంచి నెలకు ఎంత వర్మీకంపోస్టు తయారు చేస్తున్నారు, దీనికి ఎంత ఖర్చు అవుతోందని సర్పంచ్ గారపాటి శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్తను ఎలా వేరుచేస్తారో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో చెత్త నుంచి సంపద కోసం ఘన వ్యర్థపదార్థాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు. అందరూ బాధ్యతగా భావించి గ్రామాభివృద్ధి చేసుకోవాలని సూచించారు. స్థానికులు కొంద రు గ్రామంలో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు ఉన్నా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షకాలం ఇబ్బందిగా ఉందని దీనిష్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన డ్రైనేజీ పనులు నిర్వహించాలని సర్పంచ్కు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ రామా ంజనేయులు, అడిషనల్ కమిషనర్ సుధాకర్, ఉపాధి హామీ జిల్లా అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతిబసు, గుడివాడ డీఎల్పీవో విక్టర్, ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, ఎంపీపీ కాజ విజయలక్ష్మి, కార్యదర్శులు ఎస్.రాధిక, నరసింహారా వు, ఎలీషారావు తదితరులు పాల్గొన్నారు.