breaking news
T.B. Jayacandra
-
శ్రీరామరెడ్డి బాటలో నడుద్దాం
మడకశిర : స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత శ్రీరామరెడ్డి బాటలో నడుద్దామని కర్ణాటక న్యాయశాఖా మంత్రి టీబీ జయచంద్ర అన్నారు. మండలంలోని నీలకంఠాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం శ్రీరామరెడ్డి 108వ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కర్ణాటక మంత్రి టీబీ జయచంద్ర హాజరయ్యారు. అంతకు ముందు టీబీ జయచంద్రతో పాటు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.సుధాకర్, శ్రీరామరెడ్డి కుటుంబ సభ్యులు సెల్వమూర్తి, డాక్టర్ జయరామ్, శ్రీరామ్, అనిల్కుమార్ తదితరులు శ్రీరామరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్ణాటక మంత్రి మాట్లాడుతూ శ్రీరామరెడ్డి మరణించినా ఆయన ఆశయాలు బతికే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని కోరారు. శ్రీరామరెడ్డి వారసుడిగా ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. మడకశిర, శిర నియోజకవర్గాలు కవలపిల్లలాంటివన్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం ప్రసంగిస్తూ శ్రీరామరెడ్డి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ మాట్లాడుతూ శ్రీరామరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పీఏబీఆర్ తాగునీటి పథకానికి శ్రీరామరెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు. రఘువీరారెడ్డి సోదరుడు సెల్వమూర్తి, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి తదితరులు ప్రసంగిస్తూ శ్రీరామరెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను కర్ణాటక మంత్రి చేతుల మీదుగా అందించారు. పాఠశాలలకు వంద శాతం హాజరైన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. -
గాలికుంటుకు పరిహారం
=‘అక్రమ-సక్రమ’ వర్తింపు వ్యవధి పెంపు =మంత్రి వర్గం నిర్ణయాలు సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో గాలికుంటు వ్యాధితో మృతిచెందిన పశువులకు సంబంధించిన యజమానులకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో అక్రమ-సక్రమ వర్తింపు వ్యవధిని పెంచాలని తీర్మానించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశం అనంతరం న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర మంత్రి వర్గం నిర్ణయాలను విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యాంశాలు. = గాలికుంటు వ్యాధితో మరణించిన ఒక్కో ఆవుకు రూ.25 వేల నష్ట పరిహారం. ఇందులో కర్ణాటక పాడి సమాఖ్య వాటా రూ.10 వేలు. గేదెలు, దూడలకు నష్ట పరిహారం త్వరలో వెల్లడి. = బెంగళూరు సహా నగరాల్లో బ్లూప్రింట్కు వ్యతిరేకంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు వ్యవధి విస్తరణ. ఇప్పటి వరకు 2009 డిసెంబరు 31కి ముందు నిర్మించిన భవనాలకే ఈ పథకం వర్తించేది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, గవర్నర్ దానిపై సంతకం చేసే తేదీ వరకు విస్తరణ. = ఆశా కార్యకర్తలకు ఇకపై నెలకు రూ.1,000 ప్రోత్సాహకం. = పేద విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు. = రేషన్ షాపుల్లో అక్రమాల నిరోధానికి నలుగురితో కమిటీ. = జిల్లాకో తాలూకాలో ఉచిత డయాలసిస్ కేంద్రం = ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో అన్ని ఆదాయ వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి విధానం = ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక అధికారం.