breaking news
gauribidanur
-
ప్రియురాలిపై అనుమానం.. ఎలుకల మందు తాగించాడు!
సాక్షి, కర్ణాటక: తాలూకా తొండేబావి హోబళీ కమలాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ (21)ప్రియురాలిపై అనుమానం పెంచుకుని ఆమె అంతమొందించాలని ఎలుకల మందు తాగించాడు. ఇతడు ఒక మైనరు బాలికను ప్రేమించాడు. ఈ నెల 6వ తేదీన తొండేబావి సమీపానికి పిలుచుకొని పోయి నీ ప్రేమ పరిశుద్దమైనదైతే ఈ ద్రావణాన్ని తాగాలని బలవంతం చేశాడు. బాలిక అలాగేనని తాగడంతో కొంతసేపటికి ఇద్దరూ ఎవరి ఇళ్లకు వారు వచ్చారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి బాలిక ఇంటికి వచ్చి కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండడంతో ఆమె అన్న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. మందు ప్రభావంతో బాలిక ఇటీవల మరణించింది. దీంతో ప్రియుడు వెంకటేశ్ తనను పోలీసులు పట్టుకుపోతారని భావించి తన నోటికి ఎలుకల మందును పూసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు నటించాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు వెంకటేశ్ ఏమీ తాగలేదని చెప్పడంతో పోలీసులు విచారించి బాలికకు మందు తాగించింది ఇతడేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. మంచేనహళ్ళి పోలీసులు వెంకటేశ్ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: మోడల్స్ను పంపుతా.. ఆ ఖర్చులను మీరే భరించాలి..! -
ప్రియుడి ప్రేమను గెలుచుకున్న హిజ్రా
బెంగళూరు: కర్ణాటకలోని గౌరిబిదనూరు పట్టణంలో ఓ హిజ్రాకు వివాహభాగ్యం కలిగింది. గౌరిబిదనూరు పట్టణం లో నివాసం ఉంటున్న హిజ్రా ఫిజారా (24)ను ముజీబ్ (24) అనే వ్యక్తితో శుక్రవారం వివాహం జరిగింది. పట్టణంలోని 19వ వార్డులో మహిళా రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యమ్మ నేతృత్వంలో ఈ వివాహం జరగింది. గతంలో ముజీబ్తో హిజ్రా ఫిజారాకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. దాంతో ముజీబ్ తాను ప్రేమించుకుంటున్నామని తమకు పెళ్లి చేయాలంటూ మహిళా రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యమ్మను ఫిజారా ఆశ్రయించింది. దాంతో ముజీబ్ను పిలిపించి భాగ్యమ్మ మాట్లాడారు. తాను ఫిజారాతో వివాహనికి సుముఖంగా ఉన్నట్లు ముజీబ్ వెల్లడించారు. దీంతో భాగ్యమ్మ పెళ్లిపెద్దగా ఆ ఇద్దరికి పెళ్లి జరిపించారు.