breaking news
company representative meeting
-
వర్క్ఫ్రమ్ హోం.. శాలరీ స్ట్రక్చర్ ఓ కొలిక్కి!
దేశంలో వర్క్ఫ్రమ్ హోం విధానంలో కొనసాగే ఉద్యోగుల జీతభత్యాల రూపకల్పనకు సంబంధించిన కసరత్తులు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమల విభాగం జరుపుతున్న చర్చలు ‘శాలరీ స్ట్రక్చర్’ని ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు సమాచారం. వర్క్ఫ్రమ్ హోంలో కొనసాగే ఉద్యోగులకు బేసిక్ శాలరీ, హైకులు, బోనస్ల నిర్ణయాలు పూర్తిగా కంపెనీవే. తాజాగా ‘తక్కువ ఇంటి అద్దె భత్యం నుంచి కొత్త తగ్గింపుల వరకు’.. కొన్ని ప్రతిపాదనలపై కేంద్రం, కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు నడిచాయి. కొత్త వర్క్ మోడల్కు సరిపోయేలా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించే క్రమంలోనే ఇలా పారిశ్రామిక ప్రతినిధులతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వరుస భేటీలు నిర్వహిస్తోందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. హెచ్ఆర్ఏ మీదే.. వర్క్ఫ్రమ్ హోం ఎఫెక్ట్తో సొంతూళ్లకే పరిమితమైన ఉద్యోగుల కారణంగా ఇంటి అద్దె భత్యంలో తగ్గింపు, వైఫై-కరెంట్ బిల్లులపై రీయంబర్స్మెంట్ను ప్రవేశపెట్టడం గురించి తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే House Rent Allowance శాతం తగ్గించడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, మరో భేటీలో ఈ అంశంపై స్పష్టత రావొచ్చని చెప్తున్నారు. ఆపై సిద్ధం చేసిన డ్రాఫ్ట్ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. తద్వారా ట్యాక్స్ చట్టాలకు అవసరమైన సవరణలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ మేరకు బడ్జెట్-2022లో ఈ విషయాల్ని పొందుపరుస్తారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. అంత సమయం లేకపోవడంతో జరిగేది కష్టమేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇబ్బందులు లేకుండా చూడండి ఇదిలా ఉంటే జనవరి 13న భారత్కు చెందిన కొన్ని కంపెనీల హెచ్ఆర్ హెడ్స్, సీఈవోలతో కార్మిక మంతత్రిత్వ శాఖ భేటీ జరిపింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. ఉపాధి కల్పనను పెంపొందించడం, శ్రామిక శక్తి యొక్క భవిష్యత్తు నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు వర్క్ఫ్రమ్ హోం విధి విధానాలపై చర్చ జరిగిందని సమాచారం. యజమానులు- ఉద్యోగుల మధ్య వివాదాల పరిష్కారం, ఏర్పడబోయే ఇబ్బందుల్ని తొలగించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ కోసం ‘‘సమగ్ర’’ నియమాలు, నిబంధనలను రూపొందించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదివరకే.. గత ఏడాది జనవరిలో ప్రభుత్వం స్టాండింగ్ ఆర్డర్ ద్వారా సర్వీస్సెక్టార్కి ఇంటి నుండి పనిని లాంఛనప్రాయంగా చేసింది. యజమానులు మరియు ఉద్యోగులు పని గంటలు మరియు ఇతర సేవా పరిస్థితులపై పరస్పరం నిర్ణయించుకునేలా చేసింది. అయితే కరోనా పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు అన్ని రంగాలకు సమగ్ర అధికారిక నిర్మాణాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వం తన ప్రీ-బడ్జెట్ మెమోరాండమ్లో పని నుండి ఇంటి ఖర్చులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని సిఫారసు చేసింది. ‘‘ఫర్నీచర్/ఇతర సెటప్ ఛార్జీల కోసం అయ్యే ఖర్చులు ప్రత్యేకంగా మినహాయింపొచ్చు’’ అని ICAI సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా యొక్క ప్రీ-బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ 2022 నివేదిక ఉద్యోగుల కోసం ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్’’ ఖర్చులపై మరిన్ని తగ్గింపులను సూచించింది. ‘‘ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ఉద్యోగులు వ్యాపారాలలో ఇంటి నుండి పని చేస్తున్నారు’’’అని అకౌంటింగ్ విభాగం పేర్కొంది, ఉద్యోగులకు అదనంగా రూ. 50,000 WFH భత్యాన్ని సిఫార్సు చేసింది. మరోవైపు పరిశ్రమల సంస్థ నాస్కామ్.. వర్క్ఫ్రమ్ హోంకు మద్దతుగా ప్రభుత్వం లేబర్ చట్టాల్లో చేయగల ఆరు చర్యలను సిఫార్సు చేసింది. పని గంటలు, షిఫ్ట్ సమయాలను మార్చేయడం లాంటి కార్మిక చట్టాలలో మార్పుల్ని నాస్కామ్ పేర్కొంది. అంతేకాదు ఉద్యోగులు చేసే ఖర్చుల నుండి ఆదాయపు పన్ను చట్టాలలో మార్పులను సిఫార్సు చేసింది. ప్రధానంగా ఇంటి నుండి పనిని వ్యాపార ఖర్చులుగా పరిగణించాలని సూచించింది. నాస్కామ్ సమర్పించిన సిఫార్సుల నివేదికను కిందటి ఏడాది మే నెలలోనే.. పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వ అధికారుల చర్చించి.. ఆపై ఆ నివేదికను కార్మిక మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు పంపారు. చదవండి: ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం! -
బాబోయ్.. వద్దు!
కడప అగ్రికల్చర్ : జిల్లాలోని గోడౌన్లలో ఎరువులు నిండుగా ఉన్నాయని, మళ్లీ కంపెనీల నుంచి ఎరువులు తెప్పించవద్దని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు డి ఠాగూర్ నాయక్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నూతన కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో వివిధ ఎరువుల కంపెనీల ప్రతినిధులు, గోడౌన్ల మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ఖరీఫ్ అవసరాల నిమిత్తం 92 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 41 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని అన్నారు. కేసీ కెనాల్కు నీరు వచ్చే వరకు ఎరువులు తెప్పించవద్దని ఖరాఖండిగా చెబుతున్నామన్నారు. ఈనెలలో కేసీకి నీరు రావచ్చనే సూచనలు ఉన్నట్లు ఉన్నాయన్నారు. అన్ని గోడౌన్లలో ఎరువులు నిల్వ ఉన్నాయని, ఎక్కువ నిల్వ చేయడానికి గోడౌన్లలో అడుగు కూడా స్థలం లేదన్నారు. గోడౌన్లలో స్టాక్ వారీగా, డీలర్ల వారీగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. నగేష్ గోడౌన్లో రాష్ట్ర వ్యవసాయశాఖలోని విజిలెన్స్ కమిటీ వచ్చి తనిఖీలు నిర్వహించగా స్టాక్ వారీగా రికార్డులు సక్రమంగా లేకపోవడంతోఎరువుల సరఫరాను నిలుపుదల చేశారన్నారు. ఏడీలు నరసింహారెడ్డి, జయరాణి, జేడీ కార్యాలయ టెక్నికల్ ఏఓ ప్రభాకరరెడ్డి, కడప ఏఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.