breaking news
Arrangements Set
-
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఏర్పాట్లు పూర్తి
-
సీఎం జగన్ నెల్లూరు పర్యటన.. ఏర్పాట్లు పరిశీలన
-
రేపటి ఏపీ ఈఏపీ సెట్కు ఏర్పాట్లు పూర్తి
-
నిఘా నీడన నిమజ్జనం
-
గంగమ్మ ఒడిలోకి గణపతులు
-
పూరీ జగన్నాథ్ రధయాత్ర కు సర్వం సిద్ధం
-
పల్లెపై నిఘా
సాక్షి, జనగామ: క్షేత్రస్థాయి నుంచే నేరాలను తగ్గించేందుకు పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఘటన జరగక ముందే శాంతిభద్రతలను కాపాడితే ప్రజల్లో నమ్మకం కలుగుతుందనే లక్ష్యంతో పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక వైపు గ్రామ పోలీస్ అధికారుల (వీపీఓలు)ను అప్రమత్తం చేయడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించింది. గ్రామం యూనిట్గానే పోలీస్ శాఖ శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. జిల్లాలో 170 మంది వీపీఓలు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్జోన్లో ఉన్న జనగామ జిల్లాలోని 13 మండలాల్లో 170 మంది గ్రామ పోలీస్ అధికారులను నియమించారు. 13 మండలాల్లో 301 గ్రామపంచాయతీలు ఉండగా వాటికి పోలీస్ అధికారులను నియమించారు. గ్రామాల వారీగా నియమించిన పోలీస్ అధికారి సెల్నంబర్ గ్రామస్తులకు తెలిసే విధంగా ముఖ్య కూడళ్ల వద్ద వాల్ రైటింగ్ చేయించారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరిగినా ఆ గ్రామ పోలీస్ అధికారిని బాధ్యుడిని చేస్తారు. అసాంఘిక కార్యక్రమాలు, దొంగతనాలు, అపరిచిత వ్యక్తుల సంచారం వంటి విషయాలు గ్రామ పోలీస్ అధికారికి సమాచారం అందించే విధంగాగ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో సక్సెస్.. అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన దుండగులను పట్టుకోవడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఓ ప్రత్యేక సాధనంగా మారాయి. ఈ కారణంగా సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దాతల సహకారంతో సీసీ కెమెరాల కొనుగోలు, సొంత ఖర్చులతో ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహించింది. జిల్లా వ్యాప్తంగా దాతల సహకారంతో 1058 కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా నేను సైతం కార్యక్రమంలో భాగంగా 1580 సీసీ కెమెరాలను బ్యాంకులు, ముఖ్యమైన షాపుల్లో ఏర్పాటు చేశారు. గ్రామస్థాయి నుంచే ఫోకస్.. గ్రామ స్థాయి నుంచి అక్రమాలను నిర్మూలించడమే ధ్యేయంగా పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. దొంగతనాలు, పేకాట, మట్కా వంటి నేరాలను నియంత్రించడంపై దృష్టి సారించారు. గుట్కాలు, అంబర్, గంజాయి అక్రమ వ్యాపారం, నిల్వలను గుర్తించి అదుపుచేసే విధంగా వీపీఓలు, సీసీ కెమెరాలను వినియోగించనున్నారు. శాంతియుత వాతావరణంలో పల్లెల్లో ప్రశాంతత నెలకొల్పే విధంగా పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
సర్వం సిద్ధం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బెంచీలు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాల కల్పించిన అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు పోలీసుస్టేషన్లలో ప్రశ్నపత్రాలు ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలీసుస్టేషన్లకు చేరాయి. ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను ఉదయం కేంద్రాలకు తీసుకువెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ను కట్టడి చేసేందుకు రెవెన్యూ శాఖ ఉద్యోగులను సిట్టింగ్ స్వా్కడ్గా నియమిస్తున్నారు. గతంలో వీరిని సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రమే నియమించేవారు. కానీ ఈసారి అన్ని కేంద్రాల్లో నియమించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. పకడ్బందీ ఏర్పాట్లు గత విద్యాసంవత్సరంలో జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట పాఠశాలతో పాటు జిల్లాలోని పలు కేంద్రాల్లో ఇన్విజిలేటర్లే కాపీయింగ్ ప్రోత్సహించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలా జరగకుండా మాస్కాపీయింగ్ను పకడ్బందీగా నిర్మూలించేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 1,200 మంది ఇన్విజిలేటర్లను ఎంపిక చేయగా, 94 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 94 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు నియమించారు. అలాగే, 94 మంది సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులను నియమించిన అధికారులు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటుచేశా రు. ఐదుగురు విద్యాశాఖ అధికారులు, ఐదుగురు రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ఐదుగురు మం ది పోలీస్శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన స్క్వాడ్లు ముగ్గురు చొప్పున విడిపోయి తనిఖీ చేపడుతారు. కాపీయింగ్ జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత ఏదైనా పరీక్ష కేంద్రంలోని గదిలో మాస్ కాపీయింగ్ జరిగితే ఆ గది ఇన్విజిలేటర్లనే బాధ్యులను చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రంలో పరీక్ష ప్రారంభం కాగానే కాపీయింగ్ జరిగితే తమదే బాధ్యత అంటూ ఇన్విజిలేటర్ లేఖను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తప్పుపడుతున్నారు. విద్యార్థులు తెలిసీ తెలియక చేసే తప్పుకు తమను బాధ్యతలను సరైన పద్ధతి కాదని, ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు విద్యార్థులకు ఎలాంటి మానసికమైన ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. నిమిషం నిబంధన, సీసీ కెమెరాలు ఇతర ఏ విధ మైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూ స్తున్నాం. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కేంద్రంలో అవకతవకలు జరిగితే ఇన్విజిలేటర్లనే బాధ్యులుగా చేసే లా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఒక్కో గదికి కేటాయించే 25 మంది విద్యార్థులు ఒత్తిడి లోనుకాకుండా, మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్లపై ఉంది. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఎవరి గుర్తింపు లేకుండా హాల్టికెట్లు.... కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజు చెల్లించలేదనే కారణంగా హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తెలిసిం దే. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసు కున్న ప్రభుత్వం నేరుగా ఆన్లైన్ పద్ధతి లో హాల్టికెట్లు అందించే పద్ధతికి శ్రీకా రం చుట్టింది. హెచ్ఎం, ఇతర అధికారుల సంతకం లేకుండానే విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా తీసుకున్న హాల్టికెట్తో పరీక్షకు హాజరయ్యే వెసలుబాటు కల్పించారు. అంతేకాకుండా నిరుపేద విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు. హాల్టికెట్ చూపించి బస్సులో ప్రయాణించొచ్చు. కాగా, జి ల్లాలో కేవలం ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు తప్పనిసరికాకున్నా.. కెమెరా లు ఉన్న కేంద్రాల్లో విద్యార్థులు ఒత్తిడికి లోననవుతారని చెబుతున్నారు. మొత్తం పరీక్ష కేంద్రాలు 94 పరీక్ష రాయనున్న విద్యార్థులు 21,189 రెగ్యులర్ కేంద్రాలు 90 విద్యార్థులు 20,087 ప్రైవేట్ కేంద్రాలు 04 విద్యార్థులు 1,102 -
తెలంగాణ కుంభమేళాకు ప్రభుత్వం ఏర్పాట్లు