బీడీవోకు ఘనంగా వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

బీడీవోకు ఘనంగా వీడ్కోలు

Jun 1 2025 12:46 AM | Updated on Jun 1 2025 12:46 AM

బీడీవ

బీడీవోకు ఘనంగా వీడ్కోలు

జయపురం.: జయపురం సబ్‌డివిజన్‌ కుంధ్ర సమితి బీడీవో కపిలేశ్వర తండి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు కుంధ్ర సమితి పాత్రికేయ సంఘం తరఫున ఘన వీడ్కోలు లభించింది. ఈ సందర్భణగా పాత్రికేయ సంఘ సలహాదారు కనూచరణ నాయిక్‌ మాట్లాడుతూ బీడీవో కుంధ్ర సమితి ఉన్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన కుంధ్ర బీడీవోగా వచ్చిన తరువాత సమితిలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అంతేకాకుండా పాత్రికేయులతో మంచి మిద్రునిగా ఉండే వారని, జర్నలిస్టుల సంఘ భవనానికి స్థలం కేటాయించటంలో ప్రధాన భూమిక నిర్వహించారన్నారు. ఆయన కృషివలన తహసీల్దార్‌ బినోద్‌ కుమార్‌ నాయిక్‌ స్థలం సమకూర్చారని వెల్లడించారు. ఆ స్థలంలో జర్నలిస్టు భవనం నిర్మాణాకిని ఇద్దరు అధికారులు సహకరించారని, బీడీవో తండిని కుంధ్ర సమితి పాత్రికేయులు ఎన్నడూ మరవలేరని అన్నారు. బీడీవోను ను సన్మానించిన వారిలో కనూచరణ నాయిక్‌తో పాటు సీనియర్‌ పాత్రికేయులు అక్షయ కుమార్‌ పట్నాయక్‌, జర్నలిస్టులు ఎన్‌.సంతోష్‌ కుమార్‌, రామ చంద్రనాయిక్‌, ఇంధ్ర పంగి, బాబుల హరిజన్‌, నిరంజన్‌ పాణి, సురేంద్ర సాగరియ,హరిహర కుమార్‌ పట్నాయిక్‌ మొదలగు వారున్నారు.

వైభవంగా శీతల షష్టి

పర్లాకిమిడి: స్థానిక రాజవీధి రామలింగేశ్వర ఆలయం (పొడుగు దేవాలయం)లో శనివారం సాయంత్రం శీతల షష్టి సందర్భంగా శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పర్లాకిమిడి పురవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని అర్చకులు దుర్గాప్రసాద్‌ దాస్‌ ఆధ్వర్యంలో జరిపారు. ఈ దేవ కార్యక్రమాన్ని ప్రముఖ వ్యాపారులు అంధవరపు బాలజీ, మల్లా శ్రీను దంపతులతో వేదపండితులు వనమాలి మాణిక్యశర్మ జరిపించారు. పొడుగు దేవాలయం ప్రధాన అర్చకులు దుర్గాబాబు, ఇతర అర్చకుల శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

బీడీవోకు ఘనంగా వీడ్కోలు 1
1/1

బీడీవోకు ఘనంగా వీడ్కోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement