
యువకుడికి పోలీసుల కౌన్సెలింగ్
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలోని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అతడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, ప్రాణాలను రక్షించారు. కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఇంట్లోని వస్తువులను చిందర వందర చేయడంతో పాటు కుటుంబసభ్యులపై దాడికి దిగాడు.
గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కానిస్టేబుల్ విజయ్రావు డయల్ 100 ద్వారా సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్నాడు. వాటర్ ట్యాంక్ ఎక్కిన సన్నితో మాట్లాడుతూ కౌన్సెలింగ్ ఇచ్చాడు. సన్నీ షరతులకు అనుగుణంగా కుటుంబ సభ్యులను ఒప్పించి వాటర్ ట్యాంక్ దింపి అతని ప్రాణాలను రక్షించాడు. కానిస్టేబుల్ను కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, సీఐ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి అభినందించారు.