breaking news
temples demolition
-
ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోంది : బీజేపీ
ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం విజయవాడ: ‘ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోంది. అభివృద్ధి పేరుతో విజయవాడలోని దేవాలయాలు, మసీదులు కూల్చి టాయిలెట్లు కడుతున్నారు’ అంటూ బీజేపీ ఏపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విజయవాడలో కూల్చివేసిన దేవాలయాలతో పాటు గోశాల ప్రాంతాన్ని గురువారం వారు సందర్శించారు. అనంతరం దేవాలయాలను పునఃనిర్మించాలని కోరుతూ హిందూ ధర్మ పరిషత్ నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కూల్చిన దేవాలయాలను వెంటనే పునఃనిర్మించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాలు, మసీదులు, గోశాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూల్చివేసిన చోటే వాటిని తిరిగి నిర్మిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక లేకుండా పనులు చేయడం వల్లే ఘాట్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు వస్తున్నాయని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాల న్నారు. -
'ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోందా'
-
బ్లాక్ టికెట్లు అమ్ముకుని.. ఎంపీ అయ్యారు!
విజయవాడ నుంచి హైదరాబాద్కు నడిచే బస్సుల టికెట్లను బ్లాక్లో అమ్ముకుని కేశినేని నాని సంపద కూడగట్టుకున్నారని, దాంతోనే ఆయన ఎంపీ అయ్యారని విజయవాడకు చెందిన శివస్వామి మండిపడ్డారు. జీవితంలో ఇక ఎన్నడూ నాని గెలిచే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆలయాల కూల్చివేతలకు నిరసనగా విజయవాడలో హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సభలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. తనకు నిన్నటి నుంచి అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, విజయవాడ వీధుల్లో ఎలా తిరుగుతావో చూస్తామని అంటున్నారని.. తాను ప్రాణత్యాగానికి సైతం ఎప్పుడో సిద్ధమని చెప్పారు. తనను దొంగ స్వామి అంటూ నాని పిచ్చి తుగ్లక్లా మాట్లాడుతున్నారని, ఆలయ నిర్మాణాలలో తాను వెనకేసుకుంటున్నట్లు ఆయన ఆరోపించారని, అవన్నీ నిరాధారమని చెప్పారు. తన పూర్వీకులు స్వాతంత్ర్య సమర యోధులైనా, విజయవాడలో ఎక్కడా ఒక్క గజం స్థలం కూడా తీసుకోలేదని.. అలాగే తన బ్యాంకు ఖాతాలో కూడా ఎప్పుడూ 3వేల రూపాయలకు మించి ఉండవని.. అలాంటిది తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడ ద్వారపాలకుడిని తీసేశారని, ఇది అత్యంత దారుణమని చెప్పారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు గాయపరిచారని, తమ గుండెలు బద్దలయ్యాయని అన్నారు. మసీదు తొలగించడానికి 4 నెలల సమయం ఇచ్చారు.. హిందూ దేవాలయానికి 4 రోజులు కూడా ఇవ్వలేదని.. కేవలం ఒక్కరోజు సమయమే ఇచ్చారని చెప్పారు. మన సీఎం, మన పాలకులు అని చెప్పుకొంటున్నాం.. గానీ కడుపు చించుకుంటే కాళ్లమీద పడినట్లు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణప్రతిష్ఠ చేసిన ఆలయాలను దారుణంగా కూల్చేశారని అన్నారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా ఆలయాలను కూల్చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారని... కానీ అక్కడ దానికి ముందుగానే స్థానిక పీఠాధిపతుల నుంచి మఠాధిపతులు, ఇతరులు అందరినీ పిలిపించి, వాళ్లతో చర్చించారని.. శాస్త్రోక్తంగా తొలగింపు పనులు చేపట్టడంతో పాటు వేరేచోట ఆలయనిర్మాణానికి భూమి, నిధులు అన్నీ ఇచ్చారని చెప్పారు. అక్కడ కూడా, ముందుగా ఆలయ వర్గాలనే గోడ కూల్చివేత మొదలుపెట్టమని చెప్పి.. ఆ తర్వాత వాళ్ల ఆధ్వర్యంలోనే ఆలయ తొలగింపు పనులు చేపట్టారని, ఇక్కడ మాత్రం మంచీ చెడూ చూడకుండా రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా ఆలయాలు కూల్చేసి విగ్రహాలను మునిసిపల్ ఆఫీసులలో పారేశారని మండిపడ్డారు. ఆలయాలతో ఆలయాలతో వ్యాపారాలు చేశామా.. ఆలయాల పేరుతో వ్యాపారం చేస్తున్నామని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని.. ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయడానికి ముందుగా మీరు ఆలయానికి వెళ్లి ఆ పత్రాలతో పూజలు చేయించడం లేదా.. అది వ్యాపార ప్రయోజనం అనిపించలేదా అని శివస్వామి ఘాటుగా ప్రశ్నించారు. ఆ మంత్రి తక్షణమే సాధుపరిషత్కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
ధార్మిక సభలో ఉద్రిక్తత.. మధ్యలో వెళ్లిపోయిన మంత్రి
హిందూ ధార్మిక సభలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అడ్డదిడ్డంగా విగ్రహాలు కూల్చేసిన చంద్రబాబు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆలయాలు, విగ్రహాల కూల్చివేతపై విజయవాడలో సోమవారం సాయంత్రం భారీ నిరసన సభ నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు పలు పీఠాల అధిపతులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నిరసన సభకు విజయవాడ నగరవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభలో ముందుగా మంత్రి కామినేని శ్రీనివాస్ నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడిన కాసేపటికే భక్తులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కలెక్టర్, కమిషనర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో సభ మధ్యలోనే కామినేని శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజులతో పాటు దేవాదయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కూడా పాల్గొన్నారు.