breaking news
private management
-
బూమ్ బూమ్.. ఇన్ ఫ్రా..!
బలమైన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ఈ సదుపాయాలపైనే ఎన్నో పరిశ్రమల ఏర్పాటు ఆధారపడి ఉంటుంది. అందుకనే కేంద్ర సర్కారు మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించి భారీ ప్రణాళికలతో ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ)ను ప్రకటించింది. ఇందులో భాగంగా రహదారులు, రైల్వే, విద్యుత్ తదితర రంగాల్లోని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు నిర్వహణకు అప్పగించనుంది. తద్వారా 2024–25 నాటికి రూ.6 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ మొత్తాన్ని మౌలిక సదుపాయాల విస్తరణకే కేంద్రం ఖర్చు చేయనుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏల కారణంగా మౌలిక సుదుపాయాల ప్రాజెక్టులకు కొంత కాలం పాటు రుణ లభ్యత కఠినంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితుల్లోనూ మార్పు కనిపిస్తోంది. మౌలిక సదుపాయాలపై కేంద్రం, రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్న తరుణంలో ఈ రంగంలోని పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఓ సారి దృష్టి సారించొచ్చు. ఇన్ఫ్రా స్టాక్స్ దీర్ఘకాలం కోసం నేరుగా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంటే.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఎల్అండ్టీ: 2007 నవంబర్లో ఎల్అండ్టీ షేరు ధర రూ.972. గతేడాది మార్చిలో ఇదే షేరు రూ.815వరకు తగ్గగా.. ప్రస్తుతం రూ.1,740 సమీపంలో ఉంది. కొన్ని రంగాల్లోని షేర్లు ఇదే కాలంలో ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. కానీ, మౌలిక రంగ షేర్లు ఇప్పటికీ ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో ట్రేడ్ అవుతున్నాయి. నిర్మాణ, ఇంజనీరింగ్ రంగంలో ఎల్అండ్టీ దిగ్గజం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు, ఈ కంపెనీకి చెందిన సబ్సిడరీలు (మైండ్ట్రీ, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎల్అండ్టీ టెక్నాలజీస్) ఐటీ రంగంలో మెరుగ్గా రాణిస్తున్నాయి. ఇది కూడా అదనపు బలం. 2020–21 సంవత్సరం ఆదాయంలో మౌలిక రంగ వ్యాపార వాటా 45 శాతంగా ఉంది. రూ.3.2 లక్షల కోట్ల ఆర్డర్బుక్తో కంపెనీ పటిష్టంగా కనిపిస్తోంది. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: ప్రభుత్వ ప్రణాళికలతో ఎక్కువగా ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇది కూడా ఒకటి. వచ్చే రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల మేర రహదారుల విస్తరణను కేంద్రం చేపట్టనుంది. ఈ సంస్థకు రుణ భారం తక్కువగా ఉంది. 20 ఏళ్ల మంచి ట్రాక్ రికార్డు కూడా సొంతం. ఈక్విటీతో పోలిస్తే 1.37 రెట్ల రుణ భారం కలిగి ఉంది. ఆదాయం, నికర లాభాల్లో మంచి వృద్ధిని చూపిస్తోంది. రూ.12,095 కోట్ల విలువైన ఆర్డర్లు కంపెనీ చేతిలో ఉన్నాయి. ఆదాయంలో 20 శాతం వృద్ది నమోదు చేస్తామన్న అంచనాలను కంపెనీ ప్రకటించింది. ఎల్అండ్టీ మాదిరి వైవిధ్య వ్యాపారాలతో కూడిన కంపెనీ ఇది కాదు. కల్పతరు పవర్ట్రాన్స్మిషన్: విద్యుత్ సరఫరా, ఆయిల్ అండ్ గ్యాస్ పైపులైన్లు, రైల్వే, రహదారుల నిర్మాణంలోని కంపెనీ ఇది. ఆదాయాల్లోనూ మంచి వైవిధ్యం ఉంది. 2020–21 ఆదాయంలో 37 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి వచి్చంది. అప్రధాన ఆస్తులను విక్రయించడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికతో ఉంది. 2021 మార్చి నాటికి ఈక్విటీతో పోలిస్తే రుణభారం 0.66 రెట్లుగా ఉంది. కంపెనీ చేతిలో రూ.29,313 కోట్ల ఆర్డర్లు ఉండడంతో భవిష్యత్తు వ్యాపార వృద్ధికి చక్కని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫ్రా మ్యూచువల్ ఫండ్స్ నేరుగా స్టాక్స్లో పెట్టుబడులకు కనీస పరిజ్ఞానానికితోడు.. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్పులను పరిశీలించి, అవసరమైతే పెట్టుబడి నిర్ణయాలను సమీక్షించుకునే తీరిక కూడా ఉండాలి. అందుకే నేరుగా స్టాక్స్ అందరికీ అనుకూలం కాదు. తగినంత సమయం వెచి్చంచలేని వారు.. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టే ఇన్ఫ్రా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని మౌలిక రంగ కంపెనీల్లోనే పెడతాయి. ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్: ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తోంది. దేశ వృద్ధి పథంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంటుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్రా కంపెనీలే కాకుండా.. మెటీరియల్స్, ఇండ్రస్టియల్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో 61 శాతం ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేసి ఉంది. కనుక మార్కెట్ కరెక్షన్లలో నష్టాల రిస్క్ కొంత తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వైవిధ్యమైన పథకంగా దీన్ని చూడొచ్చు. 2009 సెపె్టంబర్లో పథకం మొదలు కాగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు వార్షిక రాబడులు 16 శాతానికి పైనే ఉన్నాయి. ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్: లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నిర్మాణం, సిమెంట్, ఇండ్రస్టియల్ ప్రొడక్ట్స్, విద్యుత్ కంపెనీల్లో ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. 2013 జనవరిలో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి వార్షిక సగటు రాబడులు 18.53 శాతంగా ఉన్నాయి. అయితే, ఏదో ఒక రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసే థీమ్యాటిక్ ఫండ్స్ (ఇన్ఫ్రా, ఫార్మా, ఐటీ.. ఇలా)లోరిస్క్ పాళ్లు ఎక్కువ. కనుక పెట్టుబడులకు తగినంత వైవిధ్యం ఉండేలా చూడాలి. వచ్చే ఐదేళ్ల కాలానికి ఇన్ఫ్రాలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఈ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. థీమ్యాటిక్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో సరైన సమయంలో వాటిని వెనక్కి తీసుకోవడమూ అంతే ముఖ్యం. ఇన్విట్లు పెట్టుబడిపై క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారు, కొంత రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లను ఎంపిక చేసుకోవచ్చు. ఇన్ఫ్రా కంపెనీలు ఏర్పాటు చేసే ప్రత్యేక పెట్టుబడుల వాహకాలే ఇని్వట్లు. కంపెనీలు తమ నిర్వహణలోని కొన్ని ప్రాజెక్టులను ఇని్వట్ కిందకు బదిలీ చేయడం ద్వారా నిధులను సమీకరించుకోవచ్చు. అలా సమకూరిన నిధులను అవి నూతన ప్రాజెక్టుల నిర్వహణ, రుణ భారం తగ్గించుకునేందుకు వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం ఇన్విట్లు 80% నిధులను ఆదాయాన్నిచ్చే ప్రాజెక్టుల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేయాలి. ఒక్కో యూనిట్ వారీ నికర మిగులు పంపిణీ ఆదాయం (ఎన్డీఎస్) నుంచి 90 శాతం వాటాదారులకు ప్రతీ త్రైమాసికానికి ఒక పర్యాయం పంపిణీ చేయాలి. అలా అని ప్రతీ క్వార్టర్కు కచి్చతంగా ఇంత చొప్పున వస్తుందని ముందే అంచనా వద్దు. స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అయిన ఇని్వట్లలో షేర్ల మాదిరే క్రయ, విక్రయాలు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. కంపెనీల వాటాలు షేర్ల రూపంలో ఉంటే.. ఇన్విట్లకు సంబంధించి యూనిట్లు ట్రేడవుతుంటాయి. కనుక షేర్ల మాదిరే, మూలధన లాభాలు, నష్టాలకు అవకాశం ఉంటుంది. డెట్, ఈక్విటీల కలయికగా (హైబ్రిడ్) దీన్ని చూడొచ్చు. ఇన్విట్ ఐపీవోల్లో కనీస పెట్టుబడి రూ.10,000–15,000. లిస్టింగ్ తర్వాత ఇంతకుముందు కనీసం 100 యూనిట్లను కొనుగోలు చేయడం, విక్రయించడమే సాధ్యమయ్యేది. ఇప్పుడు షేర్ మాదిరే ఒక్కో యూనిట్ చొప్పున కొనుగోలు చేసుకోవచ్చు. లిస్టింగ్లో ఇవీ... పవర్గ్రిడ్ ఇని్వట్, ఇండియా గ్రిడ్ ట్రస్ట్, ఐఆర్బీ ఇని్వట్ ఫండ్ లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో పవర్గ్రిడ్ ఇని్వట్ అన్నది పవర్గ్రిడ్ కార్పొరేషన్కు సంబం ధించినది. ఇండియాగ్రిడ్ ట్రస్ట్ను కేకేఆర్, స్టెరిలైట్ పవర్ ట్రాన్స్ మిషన్ స్పాన్సర్ చేస్తున్నాయి. . ఇండియాగ్రిడ్ ప్రతీ త్రైమాసికానికి ఒక్కో యూనిట్పై రూ.3ను పంపిణీ చేస్తోంది. ఐఆర్బీ ఇన్ఫ్రా నిర్వహణలోని ఇని్వట్ ఫండ్ పరిధిలో టోల్ ఆధారిత రహదారి ప్రాజెక్టులున్నాయి. రోడ్లపై వాహనాల రద్దీ ఆధారంగా ఐఆర్బీ ఇన్విట్ ఆదాయంలోనూ అస్థిరతలు ఉంటుంటాయి. ప్రతీ యూనిట్కు 2018–19లో ఎన్డీఎస్ 12.25గా ఉండగా, ఆ తర్వాతి రెండేళ్లలో రూ.10, రూ.8.5కు తగ్గడం గమనార్హం. కరోనా లాక్డౌన్ల ప్రభావం ఈ సంస్థ ఆదాయంపై పడింది. ఇండియా గ్రిడ్ ఆరంభం నుంచి ఏటా పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను అదనంగా చేర్చుకుంటూ వస్తోంది. దీంతో 2017–18లో రూ.448 కోట్ల ఆదాయం కాస్తా.. 2020–21 నాటికి రూ.1,675 కోట్లకు విస్తరించింది. భవిష్యత్తులో మరిన్ని ఇని్వట్లు కూడా ఐపీవోకు రానున్నాయి. లాభాలపై పన్ను.. ఇన్విట్లను కొనుగోలు చేసి, తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభం, నష్టాలు ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయి. ఇని్వట్ల నుంచి అందుకునే ఆదాయం వాటాదారుల వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎవరికి వారే తమ ఆదాయ పన్ను శ్లాబు ఆధారంగా ఈ మొత్తంపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. నూతన కన్సెషనల్ పన్ను విధానాన్ని ఇని్వట్ నిర్వహణలోని ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది. ఇన్విట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి లాభం వస్తుంది. అప్పుడు రూ.లక్షకు మించిన లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. మూడేళ్లలోపు లాభాలు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. వీటిపై 15 శాతం పన్ను ఉంటుంది. ఆయా అంశాలన్నింటిపై సమగ్ర అవగాహన కోసం నిపుణులను సంప్రదిస్తే మంచిది. 2005–08 మధ్యకాలంలో ఇన్ఫ్రా స్టాక్స్లో పెద్ద బూమ్ కనిపించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత తిరిగి మౌలిక సదుపాయాల కంపెనీల స్టాక్స్ పెద్దగా ర్యాలీ చేసింది లేదు. తలకుమించిన రుణ భారంతో కొన్ని కనుమరుగు అయిపోగా.. నాణ్యమైన కంపెనీలు గట్టిగా నిలబ డ్డాయి. వీటికితోడు ఇని్వట్ రూపంలో కొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి అదనంగా ఇన్ఫ్రా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్లు తమ రిస్క్, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షల ఆధారంగా అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టుకోవచ్చు. -
‘సగం పడకల’పై ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సగం (50 శాతం) పడకలను స్వాధీనం చేసుకొనే ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నెల 13న వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్తో జరిపిన చర్చల్లో సగం పడకల ను సర్కారుకు ఇవ్వడానికి ఆయా ఆసుపత్రు ల యాజమాన్యాలు అంగీకరించగా ఆ సగం పడకలను ఎలా కేటాయించాలి? వాటికెంత ఫీజు వసూలు చేయాలన్న దానిపై 14న ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరమే విధివిధానాలు ఖరారు చేసి ప్రకటిస్తామని అంతకుముందు రోజే మంత్రి ఈటల ప్రకటించారు. కానీ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే యాజమాన్యాలతో చర్చలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. దీనిపై శని, ఆదివారాల్లో సమావేశం జరుగుతుందని అందరూ భావించినా అలా జరగకపోగా ఇక వారితో చర్చలు ఉండబోవని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించినట్లుగా యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపితే వాటిని సీఎంకు నివేదించి తర్వాత విధివిధానాలు ఖరారు చేస్తామని అంటున్నాయి. ‘సీలింగ్’పై కార్పొరేట్ల తర్జనభర్జన... సగం పడకలను సర్కారుకు బదలాయిస్తే వాటికి ఎంత ఫీజులుండాలన్న దానిపైనే సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తర్జనభర్జన పడుతున్నాయి. పాత జీవో ప్రకారం రోజుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సాధారణ వార్డుల్లో కరోనా చికిత్సకు రూ. 4 వేలు, ఐసీయూలో రూ. 7,500, వెంటిలేటర్ అమరిస్తే రూ. 9 వేలు వసూలు చేయాలన్నది నిబంధన. పీపీఈ కిట్లు, మందులకు అదనంగా వసూలు చేసుకోవచ్చని జీవోలో సర్కారు చెప్పింది. దీన్నే అలుసుగా తీసుకొని యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేశాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందుకే డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఈ ఫీజుతో సంబంధం లేకుండా అన్నీ కలిపి ఫీజు సీలింగ్ ప్రతిపాదనను సర్కారు తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం 14 రోజులకు కలిపి కరోనా చికిత్సకు సాధారణ వార్డులో రూ. లక్ష, ఆక్సిజన్ వార్డులో రూ. 2 లక్షలు, ఐసీయూ వార్డులో రూ. 3–4 లక్షలను సీలింగ్ ఫీజుగా పేర్కొంటూ సర్కారు ప్రతిపాదించింది. ఐసీయూలో ఉన్నప్పుడు బాధితుడిని ఒక్కోసారి రెండు, మూడు రోజులు అదనం గా ఉంచాల్సి రావొచ్చు. అత్యవసర, ఖరీదైన మందులు వాడాల్సి రావొచ్చు. అలాగే ఎవరికైనా కిడ్నీలు ఫెయిలైనా, సీటీస్కాన్లు తీ యాల్సి వస్తే ఐసీయూకు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు సీలింగ్ను ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటి ప్రకారమే ప్రతిపాదన లు తీసుకొని రావాలని మేనేజ్మెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన సగం ఫీజుల్లో జోక్యం ఉండదు! సర్కారుకు అప్పగించే సగం పడకలపైనే తమ ఆధిపత్యం ఉంటుందని, సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలోని మిగిలిన సగం పడకలకు వసూలు చేసే ఫీజులతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ధనవంతులు ఆ ఫీజులను భరిస్తే తమకు అభ్యంతరం లేదని అంటున్నాయి. ప్రభుత్వానికి అప్పగించే పడకలను తామే నింపుతామని, వాటిని పేదలు, మధ్యతరగతికి చెందిన కరోనా బాధితులెవరికైనా కేటాయిస్తామని అధికారులు అంటున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ తయారు చేస్తామని, అందరికీ అందుబాటులో ఉండేలా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. యాప్లో ఎప్పటికప్పుడు సర్కారు అధీనంలోని కార్పొరేట్ కరోనా పడకల వివరాలు, ఖాళీలు అప్డేట్ చేస్తామని, ఆ మేరకు కసరత్తు జరుగుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. మేనేజ్మెంట్లలో మూడు ఆలోచనలు సర్కారు సూచించిన సీలింగ్ ప్రతిపాదనపై సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ యాజమాన్యాల్లో గందరగోళం నెలకొంది. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రకంగా ఆలోచిస్తోంది. అందులో మొదటిది ఏమిటంటే సర్కారు సీలింగ్ ప్రకారం యథావిధిగా ఆయా ఫీజులకు ఒప్పుకోవడం. దానికి షరతుగా తమ అధీనంలో ఉండే మిగిలిన సగం పడకల ఫీజుల్లో జోక్యం చేసుకోకూడదని సర్కారుకు చెప్పడం. వాటికి ఎంత వసూలు చేసుకున్నా సర్కారు వేలు పెట్టవద్దని స్పష్టం చేయడం. ఇక రెండోది ఒకవేళ మొదటి ప్రతిపాదన సరేననుకున్నా ఆచరణలోనూ, న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున ఫీజు సీలింగ్ను పెంచాలని ప్రతిపాదించడం. మూడో ఆలోచన ఏమిటంటే ప్రైవేటు ఆరోగ్య బీమా, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) వంటి వాటిని అమలు చేయాల్సి వస్తే బీమా పోను మిగిలిన సొమ్ము ఎవరు కడతారన్న దానిపైనా స్పష్టతకు రావడం. ఇవిగాక ఇంకా ఒకట్రెండు ఆలోచనలను కూడా యాజమాన్యా లు తెరపైకి తెస్తున్నాయి. తాము సోమ వారం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నా క సర్కారుకు ప్రతిపాదనలు ఇవ్వడంతో పాటు నేరుగా మీడియా సమావేశం ఏర్పా టు చేసి ప్రకటిస్తామని ఒక సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ యజమాని తెలిపారు. -
ఇక నుంచి అపోలో సేవ
– ప్రైవేట్ సంస్థ చేతిలోకి అర్బన్ ఆరోగ్య కేంద్రాలు – త్వరలోనే వైద్య సేవలు ప్రారంభం – కేంద్రాలకు తుది మెరుగులు – వైద్య సేవల్లో తేడా వస్తే బిల్లుల్లో కోతలే అనంతపురం మెడికల్ : ‘ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేస్తాం’ అంటూనే వైద్య ఆరోగ్యశాఖలోని ఒక్కో విభాగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు ‘మెడాల్’ చేతుల్లోకి వెళ్లిపోగా..104 వాహన సేవలు కూడా ‘పిరమిల్ స్వాస్థ్య’ ఆధీనంలోకి మళ్లాయి. తాజాగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు సైతం ‘అపోలో’ సంస్థకు కట్టబెట్టారు. ఈ కేంద్రాలను త్వరలోనే ప్రారంభించేందుకు సదరు సంస్థ సన్నాహాలు చేస్తోంది. వైద్య పరికరాలు, వసతులు సమకూర్చుకునే పనిలో పడింది. జిల్లాలో 19 అర్బన్ హెల్త్ సెంటర్లు జిల్లాలో 19 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అనంతపురంలో హమాలీకాలనీ, నాయక్నగర్, మంగళవారి కాలనీ, ఇందిరాగాంధీ నగర్, నీరుగంటి వీధి, తాడిపత్రి పట్టణంలోని శ్రీనివాసనగర్, టైలర్స్ కాలనీ, గుత్తిలోని బీసీ కాలనీ, గుంతకల్లులోని అంబేద్కర్ నగర్, భాగ్యనగర్, ధర్మవరంలోని శివానగర్, కొత్తపేట, దుర్గానగర్, లక్ష్మీచెన్నకేశవపురం, కదిరిలోని నిజాంవలి కాలనీ, హిందూపురంలోని లక్ష్మీపురం, బోయపేట, ఇందిరానగర్, శ్రీనివాస నగర్లో యూహెచ్సీలు ఉన్నాయి. ఇన్నాళ్లూ ఇవి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచేవి. ఏడాదికోసారి రెన్యూవల్ చేస్తుండగా ఈ ఏడాది ‘అపోలో’ సంస్థకు కట్టబెట్టారు. సేవల్లో తేడా వస్తే బిల్లుల్లో కోత ఒక్కో ఆస్పత్రికి గాను అపోలో సంస్థకు నెలకు రూ.3.92 లక్షల మేర నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం చెల్లించనుంది. సేవలకు సంబంధించి ఎక్కడైనా రోగులకు అసౌకర్యం కలిగితే వారికిచ్చే సొమ్ములో ప్రభుత్వం కోత విధిస్తుంది. ఒక రోజులో ఓ షిప్ట్లో సేవలకు అంతరాయం కలిగితే ఆ రోజు పూర్తి చెల్లించే మొత్తాన్ని నిలిపివేస్తారు. రోజులో రెండు విడతల్లో అంతరాయం కలిగితే నెల చెల్లింపులో 10 శాతం, అదే నెలలో మూడు రోజులకైతే 20 శాతం, అంతకంటే ఎక్కువ అయితే 50 శాతం చొప్పున చెల్లింపుల్లో కోత విధించనున్నారు. ఇదే నిబంధన టెలీ మెడిసిన్ సేవల విషయంలోనూ వర్తిస్తుంది. నెలలో మూడు కంటే ఎక్కువ రోజులు అంతరాయం చొప్పున ఏడాదిలో మూడు సార్లు జరిగితే ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేస్తుంది. 28 రకాల వైద్య పరీక్షలు ఈ–యూపీహెచ్సీల్లో దాదాపు 28 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన వ్యక్తులకు శస్త్ర చికిత్సలను ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించనున్నారు. వైద్య పరీక్షల్లో రక్తం, ప్లేట్లెట్, బ్లడ్ గ్రూప్, గర్భ నిర్ధారణతో పాటు బయోకెమిస్ట్రీ పరీక్షలు చేస్తారు. రక్తంలో చక్కెర, బైల్రూబిన్, హెచ్ఐవీ, ఉమ్మి, రక్తంలో యూరియా, ఆల్కేలేన్ పాస్ఫేట్, టోటల్ ప్రొటీన్లు, కొలెస్ట్రాల్ తదితర పరీక్షలు ఇక్కడే నిర్వహించనున్నారు. ఒక్కో చోట ఫిజీషియన్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇద్దరు స్టాఫ్ నర్సులను నియమించనున్నారు. ఇలా ప్రతి పది వేల మందికి ఓ ఫీల్డ్ ఏఎన్ఎం ఉంటారు.