breaking news
Mamata Banerjee nephew
-
ఆచార్య పరిస్థితి విషమం: వైద్యులు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టిన దేబశిష్ ఆచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తామ్లక్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతడి తలకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. మరో మూడు చోట్ల కూడా అతడికి గాయాలున్నాయని చెప్పారు. అందరూ చూస్తుండగా అభిషేక్ చెంపచెళ్లు మనిపించాడు ఆచార్య. దీంతో కోపోద్రిక్తులైన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆచార్యను చావబాదారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లా చాందీపూర్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తనను చెంపదెబ్బ కొట్టిన దేబశిష్ ఆచార్యను క్షమిస్తున్నానని అభిషేక్ బెనర్జీ అన్నారు. అతడు త్వరగా కోలువాలని ఆకాంక్షిస్తున్నట్టు ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. -
మమత మేనల్లుడికి చెంపదెబ్బ
తామ్లక్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. పార్టీ కార్యకర్త ఒకరు ఆయన చెంప చెళ్లుమనిపించారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో చందీపూర్ లో ఆదివారం ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తుండగా హఠాత్తుగా వేదికపైకి వచ్చిన కార్యకర్త చెంపదెబ్బ కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పార్టీ కార్యకర్తలు అతడిని పట్టుకుని చితకొట్టారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ పార్టీ కార్యకర్తలకు చేసిందేమీ లేదన్న ఆగ్రహంతో అతడీ చర్యకు పాల్పడ్డాడు.