breaking news
Jethwani Kadambari Case
-
చంద్రబాబు ఆడించిన గేమ్ ఇదేనా..? CID ఛార్జ్ షీట్ లో సంచలనం
-
జిందాల్ ని కూడా వదలని జత్వానీ.. బయటపడ్డ కూటమి కుట్రలు
-
జత్వానీ కేసులో బాబు సర్కార్ కుట్రలు బట్టబయలు
సాక్షి, విజయవాడ: జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రులు రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే, జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని సీఐడీ తేల్చింది. జత్వానీపై నమోదైన కేసులో సిఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని.. బెదిరించి పెద్ద ఎత్తుల డబ్బులు వసూలు చేసినట్టు సీఐడీ నిర్థారించింది. కుక్కల విద్యాసాగర్ నుండి డబ్బులు గుంజినట్టు వెల్లడించింది.1.31 కోట్లు బ్లాక్ మెయిల్ చేసి లాగేసిందని.. బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా సీఐడీ నిర్ధారించింది. గతంలో పారిశ్రామిక వేత్త జిందాల్ని బ్లాక్ మెయిల్ చేసిన జత్వానీని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెనకేసుకొచ్చారు. జత్వానీని ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించిన ప్రభుత్వం.. స్టార్ హోటళ్లు, ఫ్లైట్లు, ప్రోటోకాల్తో జత్వానీని ట్రీట్ చేసింది. దుర్గ గుడిలో ప్రోటోకాల్ దర్శనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయించింది.జత్వానీ కేసు పేరుతో ఐపీఎస్ అధికారులపై కక్ష సాధించిన ప్రభుత్వం.. డీజీ పీఎస్ ఆర్ ఆంజనేయులు, సీపీ క్రాంతిరాణా టాటాలపై కేసులు పెట్టి.. సస్పెన్షన్ చేసింది. డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావులపైన కూడా కేసులు పెట్టి సస్పెన్షన్ చేసింది. జత్వానీ పేరుతో పోలీస్ అధికారులను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇప్పుడు జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేలింది. సాక్షాత్తూ హోంమంత్రి అనిత దగ్గరుండి కేసు పెట్టించిన సంగతి తెలిసిందే. జత్వానీని వీఐపీలా ట్రీట్ చేసి కూటమి నేతలు అభాసుపాలయ్యారు. -
జెత్వాని కేసులో ఇద్దరు IPSలకు ఊరట
-
జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు: పీఎస్ఆర్ స్వీయ వాదనలు
విజయవాడ, సాక్షి: ముంబై నటి జత్వానీ కాదంబరి కేసుతో తనకేం సంబంధం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) అన్నారు. బుధవారం ఉదయం ఆయన్ని సీఐడీ పోలీసు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ కోసం వాదనలు జరగ్గా.. తన కేసులో తానే పీఎస్ఆర్ వాదనలు వినిపించారు.ముంబయి నటి జెత్వానీ కాదంబరిని వేధించారంటూ ఏపీ సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. జత్వానీ కేసులో ఏం జరిగిందనేది జడ్జి ముందు స్వయంగా వాదనలు వినిపించారు. తన పాత్ర లేకపోయినా కేసు పెట్టారని వాదించారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్గా మారారు. 164 స్టేట్ మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారు అని జడ్జి ముందు పీఎస్ఆర్ వాపోయారు. అయితే వాదనలు ముగిసిన అనంతరం పీఎస్ఆర్కు సీఐడీ కోర్టు వచ్చే నెల 7వ తేదీదాకా రిమాండ్ విధించారు. దీంతో విజయవాడ సబ్ జైలుకు ఆయన్ని తరలించనున్నారు.ఇదీ చదవండి: పీఎస్ఆర్ అరెస్ట్పై వైఎస్ జగన్ ఏమన్నారంటే..


