breaking news
Guwahati Police
-
అది క్లాత్ కాదు.. చిరుతపులి
గువాహటి: ఓ లేడీస్ హాస్టల్లో ప్రవేశించిన చిరుతపులి భయాందోళనలను సృష్టించింది. గువహటిలోని హెంగ్రాబరీ ప్రాంతంలో లేడిస్ హాస్టల్లోకి చిరుతపులి ప్రవేశించడంతో స్థానికంగా అలజడి రేగింది. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు అస్సోం రాష్ట్రంలోని జూ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను బంధించారు. హస్టల్ వార్డెన్ మౌసుమి బోర సమాచారం మేరకు సోఫా కింద ఏదో క్లాత్ ఉందని తీయడానికి ప్రయత్నించగా అది క్లాత్ కాదని కూృరమృగమని తెలిసింది. వెంటనే బోరాతో సహా హాస్టల్లో ఉంటున్న మరో 15మంది పైకి వెళ్లిపోయి రూమ్ డోర్ వేసుకోని ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. చదవండి: (రాజీవ్ గాంధీ విగ్రహానికి మసి పూశారు) ట్రాంక్విలైజర్ గన్తో అస్సోం జూ అధికారులు, వైల్డ్ లైఫ్ టెర్రిటోరియల్ డివిజన్ అధికారులు పోలీసులతో కలిసి హాస్టల్కు చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటలసేపు కష్టపడి చిరుత పులిని బంధించి జూ కి తరలించారు. చిరుతపులికి గాయాలు అయ్యాయేమో చూసి అడవిలో వదిలుతామన్నారు. దీనిలో భాగంగా చిరుతకు మైక్రోచిప్ని అమర్చుతామని అధికారులు తెలిపారు. అధికారుల మరోక విజయవంతమైన ఆపరేషన్ చేశారని, హాస్టల్లో ప్రవేశించిన ఒక చిరుతపులిని ఎలాంటి హానీ జరగకుండా రెస్క్యూ చేశారని అస్సోం అటవీ శాఖ మంత్రి పరిమల్ శుక్లాబైద్య ట్వీట్ చేశారు. ఈ విజయం అస్సోం జూ అధికారులదని ఆయన కొనియాడారు. (చదవండి: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే నిర్వాకం) -
అరుదైన బంగారు బల్లికి అంత రేటా..!
గువాహటి: మనం కనివినీ ఎరుగనంత విలువ చేసే ఓ అరుదైన జాతి బల్లిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత అరుదుగా కనిపించే కోట్ల రూపాయల విలువ చేసే బంగారు బల్లిని గుర్తుతెలియని వ్యక్తి అక్రమ రవాణా చేస్తూ అసోం పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అరుదైన జాతి బల్లిని రవాణా చేస్తున్న వ్యక్తి కదలికపై అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు గువాహటి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే గువాహటి రైల్వే స్టేషన్కు చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న లగేజీని పరిశీలించగా అందులో ఓ అరుదైన జాతి బంగారు బల్లి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. అతడికి ఏ ముఠాతో సంబంధాలున్నాయి, మరే ఇతర జాతి జీవులను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బల్లులకు ఈ స్థాయిలో కోట్ల విలువ ఉంటుందానని స్థానికలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి సమాచారంతో పాటు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.