ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ దుర్మరణం

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ దుర్మరణం

పెనుమంట్ర : మాముడూరు గ్రామంలోని సత్తెమ్మ తల్లి ఆలయం సమీపంలో రొయ్యల చెరువుల్లో మట్టి లెవెలింగ్‌ పనులు చేస్తుండగా ట్రాక్టర్‌ బోల్తా పడిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ బొక్క దుర్గాప్రసాద్‌ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మావుడూరు పంచాయతీ వార్డు మెంబర్‌ బొక్క రామకృష్ణ కుమారుడైన దుర్గాప్రసాద్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రొయ్యల చెరువులో మట్టి పనులు చేస్తూ ట్రాక్టర్‌ రివర్స్‌ చేస్తుండగా బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కొడుకు మృతితో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. దుర్గాప్రసాద్‌ మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పెనుమంట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement