
‘ఇంటి వద్దే పింఛను’ నామమాత్రమే!
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఆస్తవ్యస్తంగా మారింది. ఇంటిదగ్గరే పింఛన్ల పంపిణీ నామమాత్రమే అవుతోంది. జూన్ నెల పింఛన్ల పంపిణీ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టారు. పింఛనుదారుల ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో పంపిణీ చేసే అవకాశం కల్పించినప్పటికీ లబ్ధిదారులను ఒక్కచోటుకు చేర్చడం, లేకపోతే సచివాలయాల వద్దకు పిలిపించుకొని పంపిణీ చేయడం గమనార్హం. కర్నూలు జిల్లాలో 2,37,200 పింఛన్లు ఉండగా సాయంత్రం 6 గంటల సమయానికి 92.30 శాతం పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,13,377 పింఛన్లు ఉండగా 91.08 శాతం పంపిణీ పూర్తయింది. వివిధ కారణాలతో పింఛన్లు తీసుకోని వారు ఈనెల 2వ తేదీన తీసుకోవచ్చని డీఆర్డీఏ అధికారులు తెలిపారు.