4న శ్రీగురు చిరంతప్ప స్వాముల వర్ధంతి | - | Sakshi
Sakshi News home page

4న శ్రీగురు చిరంతప్ప స్వాముల వర్ధంతి

Jun 2 2025 1:53 AM | Updated on Jun 2 2025 1:53 AM

4న శ్

4న శ్రీగురు చిరంతప్ప స్వాముల వర్ధంతి

బళ్లారిటౌన్‌: నగరంలోని బసవభవన్‌లో ఈ నెల 4న శ్రీగురు చిరంతప్ప స్వాముల 21వ స్మరణోత్సవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమ్మరచేడు మఠం కళ్యాణ స్వామీజీ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపేందుకు వివిధ సమితులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు రేణుకాచార్య, బసవణ్ణ, స్వాముల చిత్రపటాలను శ్రీకనకదుర్గమ్మ దేవస్థానం నుంచి బసవభవన్‌ వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 వివిధ మఠాల స్వాములు పాల్గొంటారని తెలిపారు. ఇందులో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరం, పుస్తక ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా నగరంలో వివిధ రంగాల్లో సమాజ సేవ చేసిన 11 మంది సాధకులను అవార్డులు ఇచ్చి సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు 30 మందికి పైగా వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో శంభులింగ స్వామి, జంగమ హొసళ్లి స్వామి, నేతలు పంచాక్షరప్ప, జయప్రకాశ, మెట్రి మృత్యుంజయ, బీఎం స్వామి, గంగావతి వీరేష్‌, రాజన్న, నందీష్‌, దుర్గేష్‌, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌జీఎంలో ఎయిర్‌ బ్లాస్ట్‌తో కార్మికుడి దుర్మరణం

రాయచూరు రూరల్‌: జిల్లాలోని హట్టి బంగారు గనుల(హెచ్‌జీఎం) కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు ఎయిర్‌ బ్లాస్ట్‌ కావడంతో దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం విధులు నిర్వహిస్తున్న సమయంలో ఽశరణ బసవ(35) అనే కార్మికుడిపైకి 28 అడుగుల్లో ఎయిర్‌ బ్లాస్ట్‌ కావడంతో రాళ్లు ఎగిరి ఆయనపై పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలతో శరణ బసవ మరణించగా, మరొక కార్మికుడు గాయాల పాలు కావడంతో లింగసూగూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు.

ఉచిత కంప్యూటర్‌ శిక్షణకు అర్జీల ఆహ్వానం

హొసపేటె: 2025–26వ సంవత్సరంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, డిప్లొమాతో సహా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన లేదా అనుత్తీర్ణులైన పురుష, మహిళా విద్యార్థులకు మరియమ్మనహళ్లిలోని ప్రభుత్వ పరికరాల శిక్షణా కేంద్రం(జీటీటీసీ)లో రెండు నెలల పాటు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ అందించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు, ప్రిన్సిపాల్‌, గవర్నమెంట్‌ టూల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, హొసపేటె అనే చిరునామాలో లేదా 9845416198, 8722999929 నంబరులో సంప్రదించాలని జీటీటీసీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సైక్లింగ్‌ జాతాకు శ్రీకారం

రాయచూరు రూరల్‌: నగరంలో సైకిలింగ్‌ జాతాకు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య శ్రీకారం చుట్టారు. ఆదివారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ప్రపంచ సైకిల్‌ దినోత్సవం సందర్భంగా సైకిల్‌ తొక్కి పచ్చజెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. నాడు పూర్వీకులు నడిచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారన్నారు. నేటి ఆధునిక యుగంలో నడకను విస్మరించి అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సైకిల్‌ తొక్కడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతాలో బసవరాజ్‌, రవి, చెన్నబసవనగౌడ, విశ్వనాథ్‌, జయప్రకాష్‌, శరణే గౌడ, నాగరాజ్‌, సందీప్‌, పవన్‌, సకలేష్‌, విజయ, రాఘవేంద్ర, గురురాజ్‌, వెంకటేష్‌లున్నారు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణకు

దరఖాస్తుల ఆహ్వానం

హొసపేటె: ఎస్‌సీఎస్‌పీ, టీఎస్‌పీ పథకాల కింద షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభ్యర్థుల నుంచి పర్యాటక, ఆతిథ్య రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం పర్యాటక శాఖ దరఖాస్తులను ఆహ్వానించిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రభులింగ ఎస్‌.తళకేరి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 2వ తేదీ నుంచి విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని కమలాపుర లోటస్‌ మహల్‌ సమీపంలోని పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి దరఖాస్తు ఫాంను పొంది, భర్తీ చేసి ఈనెల 9వ తేదీలోగా అదే కార్యాలయంలో సమర్పించాలి. శిక్షణ పొందుతున్న అభ్యర్థి వయస్సు కనీసం 20– 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ సర్వీస్‌ స్టీవార్డ్‌ శిక్షణ కాలం 4 నెలలు ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మల్టీ క్యుసిన్‌ కుక్‌ శిక్షణ కాలం 5 నెలలు ఉంటుంది. అభ్యర్థి 8వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. రూమ్‌ అటెండెంట్‌ శిక్షణ కాలం 4 నెలలు ఉంటుంది. అభ్యర్థులు ఐదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని వివరాలకు విజయనగర జిల్లా హొసపేటె తాలూకా కమలాపురలోని లోటస్‌ మహల్‌ సమీపంలోని పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయంలో లేదా 08394–295640 నెంబర్‌లో సంప్రదించవచ్చని ప్రకటనలో తెలిపారు.

4న శ్రీగురు చిరంతప్ప స్వాముల వర్ధంతి 1
1/1

4న శ్రీగురు చిరంతప్ప స్వాముల వర్ధంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement