
దక్షిణ కాశీ.. హరిహరేశ్వరాలయం
బళ్లారి రూరల్ : శతాబ్దాల క్రితం శైవులు (శివభక్తులు) వైష్ణవుల (విష్టుభక్తులు) మధ్య అంతరాలు పెరిగి మేము గొప్ప అంటే మేముగొప్ప అని వాదులాడుకొనేవారు. అలాంటి వారికి మేమిద్దరం ఒక్కటేనన్న సందేశాన్ని ఇచ్చేలా దావణగెరె జిల్లా హరిహరలోని హరిహరేశ్వర ఆలయం తార్కాణంగా నిలిచింది. దక్షిణకాశీగా పేరొందిన హరహరేశ్వరాలయం తుంగభద్ర నదికి కుడివైపున వెలసింది. సువిశాల ప్రాంగణంలో హొయ్సళ శిల్పకళా నిర్మాణ శైలి ఉట్టిపడుతోంది. క్రీ.శ.1224 హొయ్సళ రాజు రెండో నరసింహ సేనాధిపతి పోళాల్వ నిర్మించాడు. ఉత్సంగి పాండ్యులు, విజయనగర పాలకులు ఽఈ ఆల యాన్ని అభివృద్ధి పరిచినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం పొడవుగా కాకుండా వెడల్పుగా నునుపైన 56 స్తంభాలతో చతురస్రాకారంతో నవరంగ మహామండపంలా ఉంటుంది. ఈ ఆలయంలో ఏకశిలలో పరమశివుడు, విష్ణుమూర్తి దర్శమిస్తారు. మూల విరాట్ హరిహరేశ్వరుడు కుడివైపున జపమాల, త్రిశూలంతో, ఎడమవైపు కిరీటం, పీతాంబరాలతో శంఖు, చక్రంతో స్వయంభువుగా వెలశాడు. ఆలయ ప్రాంగణంలోనే మహాలక్ష్మిద ఆలయం ఉంటుంది. గర్భగుడికి ఆనుకొని ఎడమ వైపున శివలింగం, ఎదురుగా బసవేశ్వర శిలలు ఉంటాయి. ఈ ఆలయంలో శైవ, వైష్ణవ ఆచారాలను పాటిస్తారు. ఆలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
గుహాసురుని సంహారానికి హరిహరుల అవతారం
స్కంధపురాణం ప్రకారం ఈ ప్రాంతంలో గుహాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో మహాశివుడు, విష్ణుమూర్తి వల్ల మరణం సంభవించకుండా వరం పొందాడు. అనంతరం దేవతలను, రుషులను, మానవులను బాధించేవాడు. హోమాలు, యగ్న యాగాలకు విఘ్నాలు కలిగించేవాడు. దీంతో దేవతలు, రుషులు విష్ణువును వేడుకొనగా శివుడు, నారాయణుడు కలసి హరిహరేశ్వరుడుగా అవతారమెత్తి గుహాసురున్ని సంహరించి ఇక్కడే కొలువు తీరారని స్థలపురాణం చెబుతోంది.
అద్భుత శిల్పకళా నైపుణ్యంతో
చతురస్రాకారంలో గుడి
ఒకే మూలవిరాట్టుగా భక్తులకు హరిహరుల దర్శనం
56 నునుపైన సుందర స్తంభాలతో
విరాజిల్లుతున్న వైనం

దక్షిణ కాశీ.. హరిహరేశ్వరాలయం

దక్షిణ కాశీ.. హరిహరేశ్వరాలయం

దక్షిణ కాశీ.. హరిహరేశ్వరాలయం

దక్షిణ కాశీ.. హరిహరేశ్వరాలయం

దక్షిణ కాశీ.. హరిహరేశ్వరాలయం