రాయచూరు రూరల్: నగరాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటి పోషించాలని కమిషనర్ జుబీన్ మోహపాత్రో పిలుపునిచ్చారు. రాయచూరు కార్పొరేషన్ భవనంలో మేయర్ నరసమ్మ అధ్యక్షతన బుధవరం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. జూన్ 5న నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన రహదారిలో కుడి ఏడమ వైపుల మొక్కలు నాటుతామని, నగరవాసులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఉప కమిషనర్ గురు సిద్దయ్య పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
రాయచూరు రూరల్: నగరంలో పౌర కార్మికుల సమస్యలపై స్పందిస్తామని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ హమీచ్చారు. గురువారం నగరసభ కార్యాలయం వద్ద అందోళన చేపట్టిన కార్మికులను ఎమ్మెల్యే కలిసి మాట్లాడారు. ప్రభుత్వం పౌర కార్మి కుల సర్వీసులు రెగ్యులర్ చేసిందన్నారు. జ్యోతి సంజీవినీ, కేజీఐడీ ఇతర సౌలభ్యాలు కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు.
గోవుల రక్షణకు చెక్పోస్టులు ఏర్పాటు చేయండి
రాయచూరు రూరల్: జిల్లాలో గోవుల రక్షణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని గోసేవా సంఘం కార్యదర్శి వినయ్ ిసింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గోవుల అక్రమ రవాణా జరుగుతోందని, దానిని నిలువరించేందుకు నగరంలోని నవోదయ, యరగేర, శక్తినగర. కల్లూర్ క్రాస్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. స్వప్న సింగ్, బాలప్ప, రాయరెడ్డి పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతి
హుబ్లీ: నగరంలోని నూల్వీక్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజాటౌన్ నివాసి ఆటో డ్రైవర్ నజీర్ అహమ్మద్ గురువారం మృతి చెందాడు. ఇతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. హుబ్లీ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రాజకాలువలను శుభ్రం చేయాలి
తుమకూరు: ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, వరదనీరు సక్రమంగా వెళ్లేలా నగరంలో రాజకాలువలను శుభ్రం చేయాలని నగర ఎమ్మెల్యే జ్యోతిగణేష్ జిల్లాధికారి శుభ కళ్యాణ్ను మనవి చేశారు. గురువారం జిల్లాధికారిని కలిసి నగరంలో ఉన్న అమాని చెరువు, చుట్టుపక్కలున్న గార్డెన్ రోడ్డు, దిబ్బూరు, ఎస్.మాల్ వెనుక భాగం, శిరా గేట్, ఈ ప్రాంతంలో వర్షాలు పడితే నీళ్లు ముంచెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. వర్షాలు పడటానికిముందే కాలువలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తీసేయాలి, మరమ్మత్తులు చేయించాలని కోరారు. నగరంలో అనేక లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు వస్తోందని, పరిష్కారం చేయాలని తెలిపారు.
బ్రేక్ ఫెయిలై ప్రమాదం
తాడిమర్రి: సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండల పరిధిలోని కేయన్ పాళ్యం వద్ద గురువారం ఓ కారు బ్రేక్ ఫెయిలై రాళ్ల కుప్పను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలు.. బెంగుళూరుకు చెందిన షరీఫ్, ఐదు మంది తమ బంధువులతో గూగూడు కుళ్లాయస్వామి దర్శనానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు వస్తూ తాడిమర్రికి రావడానికి బదులు దారి తప్పి చిల్లకొండయ్యపల్లికి గ్రామానికి వెళుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కేయన్ పాళ్యం వద్దకు రాగానే కారు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. దీంతో రోడ్డు పక్కన రాళ్ల కుప్పను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో వారికి స్పల్ప గాయాలయ్యాయి.

నగరంలో పచ్చదనం పెంచుదాం