
ఎస్సీ వర్గీకరణకు నాయకులే అడ్డు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి ఆంజనేయ, మంత్రి ప్రియాంక ఖర్గే కారణమని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర ఆరోపించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ జాబితాలో కొరమ, కొరచ, బోవిలను తొలగించాలన్నారు. మల్లికార్జున ఖర్గే, ఆంజనేయ, ప్రియాంక ఖర్గే అంటరానితనం నిర్మూలనకు కృషి చేయకుండా అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలు వదులుతున్నారన్నారు. మాజీ మంత్రి ఆంజనేయ ఆది కర్ణాటక అని, మాదిగ అని ఎక్కడా ప్రస్తావన చేయలేదన్నారు. నాడు అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. బేడ జంగమలను ఎస్సీ జాబితాలో చేర్చడం తగదని కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి ఆంజనేయ, మంత్రి ప్రియాంక ఖర్గే ప్రకటనలను ఇవ్వడం మాని నిజమైన మాదిగలకు న్యాయం చేకూర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.
ఖర్గే, ఆంజనేయ అంబేడ్కర్
వ్యతిరేక వాదులు
ఎస్సీ జాబితా నుంచి కొరమ, కొరచ,
బోవి కులాలను తొలగించాలి
అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్
పార్టీనే కారణం
అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర