
క్యారం పోటీల్లో ప్రథమ స్థానం
సాక్షి,బళ్లారి: క్యారం బోర్డు ఆట ఎంతో ఉత్కంఠమైన ఆటగా చెప్పవచ్చు. పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉండి చక్కగా క్యారంస్ ఆడతారు. కాగా హైదరాబాద్ ప్రగతి నగర్లో సీనియర్ సిటిజన్స్ సంఘం ఏర్పాటు చేసిన క్యారం పోటీల సీనియర్స్ ఏ బృందంలో సంఘం శాశ్వత సభ్యుడు, జిల్లా సమాచార శాఖ విశ్రాంత డీడీ చంద్రకాంత్ ప్రథమ స్థానంలో నిలిచారు. చంద్రకాంత్ కేవలం 9.35 నిమిషాల్లో బోర్డులోని అన్ని 9 కాయిన్లను ప్యాకెట్లో వేసి విజయాన్ని అందుకున్నారు. సంఘం మరో సభ్యుడు టీవీ సీతారామారావు 10.35 నిమిషాలతో రెండో, కోటేశ్వరరావు 10.51 నిమిషాలతో మొత్తం కాయిన్లను ప్యాకెట్లోకి వేసి మూడో బహుమతి సాధించారు. జూనియర్స్ బీ.బృందంలో కేఎస్ఎల్ శాస్త్రి ప్రథమ, జే.నాగిరెడ్డి ద్వితీయ, సంఘం కార్యదర్శి ఈ.పుల్లయ్య తృతీయ బహుమతులను చేజిక్కించుకున్నారు. ఏ బృందంలో 14 మంది, బీ బృందంలో 15 మంది పాల్గొన్నారు. సంఘం సభ్యులు కామేశ్వరరావు, హరినాథ్ పోటీల నిర్వాహకులుగా వ్యవహరించగా, ఆ సంఘం అధ్యక్షుడు కామయ్య విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.