తగ్గిందేలే.. | - | Sakshi
Sakshi News home page

తగ్గిందేలే..

Oct 8 2025 6:23 AM | Updated on Oct 8 2025 6:23 AM

తగ్గి

తగ్గిందేలే..

బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 తగ్గిందేలే.. గుంటూరు మెడికల్‌: జీఎస్టీ 2.0 తగ్గింపు ప్రస్తుతం తారకమాత్రం అయింది. ఊరూవాడా భజాభజంత్రీలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. గొప్ప మార్పు అంటూ కూటమి ప్రభుత్వం ఊదరకొడుతోంది. మందులపై భారీ ప్రభావం అంటూ ప్రచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఔషధ విక్రయాలకు అతి పెద్ద మార్కెట్‌గా గుంటూరుకు పేరుంది. కానీ ఇప్పటి వరకు ఔషధాల ధరలు ఏమాత్రం తగ్గలేదు. ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0లో భాగంగా సెప్టెంబరు 22 నుంచే ధరల తగ్గింపు అమలులోకి వచ్చింది. అందులో భాగంగా కొన్ని మందులపై జీఎస్టీ పది శాతం, మరికొన్ని మందులపై ఐదు శాతం తగ్గింది. దసరాకు పలు కార్ల కంపెనీలు, ద్విచక్ర వాహనాల కంపెనీలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కంపెనీలు అధిక మొత్తంలో విక్రయాలు చేసినట్లు సమాచారం. కానీ ఔషధాల ధరలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సాధారణంగా హోల్‌ సేల్‌ మార్కెట్‌లో పోటీ వలన ఖాతాదారులకు కొంతమేర రాయితీ ఇస్తుంటారు. గుంటూరు నాజ్‌ సెంటర్‌, గుంటగ్రౌండ్‌ ఏరియాలోని హోల్‌సేల్‌ మందుల షాపుల విక్రయాల్లో ఈ మార్పు కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో సొంతంగా మందుల షాపులు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రం నయాపైసా కూడా రాయితీ ఇవ్వరు. జీఎస్టీ తగ్గింపు రోజుల్లోనైనా ఏమైనా మార్పు తీసుకొచ్చే అవకాశాలు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు తలుచుకుంటే చేయవచ్చు. కానీ తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. గుంటూరు జిల్లాలో 2200 మెడికల్‌ షాపులు, పల్నాడు జిల్లాలో 1200 మెడికల్‌ షాపులు ఉన్నాయి. ప్రతిరోజూ రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ప్రతినెలా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేసినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నారు తప్ప, షాపులకు వెళ్లి తనిఖీలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా యూనియన్‌ నాయకుల ద్వారా యూనియన్‌ కార్యాలయం ద్వారా నెలవారి మామూళ్లు తెప్పించుకుంటూ వారు ఓకే చెప్పిన షాపులకు అనుమతులు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

న్యూస్‌రీల్‌

తగ్గింపు ఇలా..

సెప్టెంబరు 22 నుంచి తగ్గింపు

రూ.కోట్లలో ఔషధాల విక్రయాలు

ఆస్పత్రుల షాపుల్లో మరీ దారుణం

పాత స్టాక్‌ ఉందంటూ..

సాధారణంగా మార్కెట్‌లో ఉన్న వస్తువులు ధరలు పెరిగాయంటూ వార్తా కథనాలు వెలువడగానే, తక్షణమే వ్యాపారులు పాత వస్తువులపై ఉన్న ఎమ్మార్పీ స్టిక్కర్లకు పెరిగిన ధరల స్టికర్లు అంటించి పాత వస్తువులకు కొత్త రేట్లతో అమ్మకాలు చేసి లాభాలు గడిస్తుంటారు. అదే వస్తువులకు రేట్లు తగ్గాయంటే పాత స్టాకు నిల్వ ఉన్నంత వరకు తగ్గించిన రేట్లు ప్రకారం కాకుండా పాత ఎమ్మార్పీ ప్రకారం అమ్మకాలు చేస్తూ ఆ విధంగా కూడా లాభాలు గడిస్తూనే ఉంటారు. జీఎస్టీ 2.0లో భాగంగా ప్రతిరోజూ వినియోగంలో ఉండే ఔషధాల ధరలు తగ్గించాల్సిన మందుల షాపుల నిర్వాహకులు పాత ఎమ్మార్పీతోనే వినియోగదారులకు అమ్ముతున్నారు.

పులిచింతల సమాచారం

మర్యాదపూర్వక కలయిక

జీఎస్టీ తగ్గింపుల్లో భాగంగా నిత్యం వినియోగించే 99 శాతం ఔషధాలపై ఎమ్మార్పీ కంటే 6.25 శాతం తగ్గింపు రేటుతో మందులు విక్రయించాల్సి ఉంది. రోజువారి వినియోగించే బీపీ, షుగర్‌, జ్వరం మాత్రలు, నొప్పుల మాత్రలు, దగ్గుమందులు ఉన్నాయి. ఇవే కాకుండా క్యాన్సర్‌కు వినియోగించే 33 రకాల మందులపై 11 శాతం జీఎస్టీ తగ్గింపు అమలులోకి వచ్చింది. గతంలో 12 శాతం ఉండే జీఎస్టీని జీరో చేశారు. ఇతర ఔషధాలపై 12 శాతం జీఎస్టీ ఉంటే, అది ఐదు శాతానికి వచ్చింది.

గుంటూరు
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025
ఏ మాత్రం

కేంద్రం ప్రభుత్వం ఔషధాలపై జీఎస్టీ తగ్గించినా.. ధరలు తగ్గించడం లేదని విమర్శలు

పట్టించుకోని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రజల జేబులకు చిల్లు

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 75,430 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 0,430 క్యూసెక్కులు వదులుతున్నారు.

నరసరావుపేటటౌన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయాధికారి సాయి కల్యాణ్‌ చక్రవర్తి ని పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

తగ్గిందేలే.. 1
1/7

తగ్గిందేలే..

తగ్గిందేలే.. 2
2/7

తగ్గిందేలే..

తగ్గిందేలే.. 3
3/7

తగ్గిందేలే..

తగ్గిందేలే.. 4
4/7

తగ్గిందేలే..

తగ్గిందేలే.. 5
5/7

తగ్గిందేలే..

తగ్గిందేలే.. 6
6/7

తగ్గిందేలే..

తగ్గిందేలే.. 7
7/7

తగ్గిందేలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement