
మోసానికి ప్రతిరూపం చంద్రబాబు
పట్నంబజారు: మోసానికి నిలువెత్తు ప్రతిరూపం ఏదైనా ఉంది అంటే.. అది చంద్రబాబే. ప్రజలను నమ్మించి.. వంచించటం ఆయనకు కొత్త ఏమీ కాదు. ఎన్నికల సమయంలో నోటికి వచ్చినట్లు హామీలు గుప్పించి... తీరా గెలిచిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. అధికారం కోసం ఎంతటి దుర్మార్గానికి వెనకాడని వ్యక్తి చంద్రబాబు. కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ అంటూ అన్ని విధాలుగా ప్రజలను మోసం చేశారు. ఏడాది పాలన అంతా వంచన జరిగిన క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలి. చంద్రబాబు మోసాలను ఎండగట్టేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– షేక్ నూరిఫాతిమా,
వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు
కూటమిది
మోసపు పాలన
పొన్నూరు: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వం పనితీరుకు నిరసనగా బుధవారం పొన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. ఉదయం 10 గంటలకు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించనున్నాం. తహసీల్దారు కార్యాలయం వరకు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందిస్తాం. నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలి.
– అంబటి మురళీకృష్ణ,
పొన్నూరు నియోజకవర్గ
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త

మోసానికి ప్రతిరూపం చంద్రబాబు