చెస్‌ టోర్నీ విజేతగా ధృవేష్‌ | - | Sakshi
Sakshi News home page

చెస్‌ టోర్నీ విజేతగా ధృవేష్‌

Jun 2 2025 7:36 AM | Updated on Jun 2 2025 7:36 AM

చెస్‌ టోర్నీ  విజేతగా ధృవేష్‌

చెస్‌ టోర్నీ విజేతగా ధృవేష్‌

విజయవాడస్పోర్ట్స్‌: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల విన్నర్‌ ట్రోఫిని గుంటూరుకు చెందిన డి.ధృవేష్‌ కై వసం చేసుకున్నాడు. విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్‌పైన్‌ స్కూల్‌లో ఆదివారం రాష్ట్రస్థాయి చెస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ జరిగింది. చెస్‌ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా కృష్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌, స్కాట్స్‌పైన్‌ స్కూల్‌, ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఈ పోటీల్లో 178 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏడు రౌండ్లపాటు సాగిన ఈ పోటీల్లో గుంటూరుకు చెందిన ధృవేష్‌ విన్నర్‌గా నిలువగా, విజయవాడకు చెందిన పి.జయసాకేత్‌ రన్నర్‌ ట్రోఫీని అందుకున్నాడు. విజేతలకు చెస్‌ సీనియర్‌ కోచ్‌లు డి.లక్ష్మణరావు, జె.మల్లేశ్వరరావు, స్కూల్‌ ఫిజికల్‌ డైరక్టర్‌ ఎన్‌.శివ ట్రోఫీలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement